తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఎ శర్మ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రాయుడు పాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసులు శర్మపై కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.