Telugu Desam MP
-
'పుష్ప 2'పై టీడీపీ ఎంపీ వివాదాస్పద పోస్ట్
నంద్యాల(రూరల్): టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ని ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) 'ఎక్స్' (ట్విటర్)లో ఆదివారం వివాదాస్పద పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ప్రచారంలా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు నంద్యాలను సందర్శించినప్పుడు మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ 'పుష్ప 2' కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?)వెటకారం ధ్వనించేలా ఉన్న ఈ ట్వీట్ కింద అల్లు అర్జున్ అభిమానులు విమర్శలు, కామెంట్లు చేశారు. దీంతో సరైన సమాధానం చెప్పుకోలేక ఆమె ఆ పోస్ట్ను తొలగించారు. కాగా, గత ఎన్నికల ముందు నంద్యాల నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
గెటవుట్.. జేసీ దివాకర్రెడ్డి చిందులు
సాక్షి, అనంతపురం: బెదిరింపు రాజకీయాలతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రోజంతా పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించారు. తనకు అలవాటైన విద్యను ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్లో మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ రచ్చ కెక్కారు. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చారు. పార్టీ విప్ జారీ చేసినా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లబోనంటూ నిన్నటి నుంచి ఊదరగొట్టారు. కానీ ఈరోజు సాయంత్రానికి ప్లేటు ఫిరాయించారు. రేపు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని, అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని ముక్తాయించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం లేదని చిర్రుబుర్రులాడారు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఓ మీడియా ప్రతినిధిని ‘గేటవుట్’ అంటూ కసిరారు. పనిలో పనిగా మరో ‘డ్రామా’కు తెరతీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాజీనామాపై తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. రోజంతా రాజకీయ డ్రామా... రెండో రోజూ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా జేసీ దివాకర్రెడ్డి తనదైన శైలిలో నాటకాన్ని రక్తి కట్టించారు. టీడీపీలో తన మాట చెల్లుబాటు కానందున పార్లమెంట్కు హాజరుకాబోనని లీకులు వదిలారు. సొంత పార్టీలో తన ప్రత్యర్థి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు ఈ సందర్భాన్ని బాగా వాడుకున్నారు. జేసీని బుజ్జగించేందుకు ప్రభాకర్ చౌదరిని తన దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. వీరిద్దరి సమావేశం ముగియగానే జేసీ పట్టుసడలించారు. మరోవైపు అనంతపురంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై విడుదల చేయడంతో జేసీ పూర్తిగా దిగివచ్చారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడంతో రేపు పార్లమెంట్కు హాజరవుతానని ప్రకటించారు. అయితే రాజీనామా అస్త్రంతో రాజకీయ డ్రామాను ఆయన కొనసాగించడం కొసమెరుపు. -
అవిశ్వాసంపై చర్చ.. ఎంపీ జేసీ డుమ్మా!
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్ మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు. వేంకటేశ్వరుడిని ‘వెంకన్న చౌదరి’గా పేర్కొన్న వీడియో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దీంతో టీడీపీ ఇరకాటంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ శుక్రవారం మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని అన్నారు. టంగ్ స్లిప్ సహజమే!: ‘‘రాజమండ్రిలో ఒక మీటింగ్లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను. అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాను. ఎందుకంటే అసలు నాకు కులాల మీద నమ్మకమే ఉండదు. అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతాను? టంగ్ స్లిప్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. ‘టంగ్ స్లిప్ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..’ అని దేవుడికి దండం పెట్టుకున్నా’’ అంటూ మురళీమోహన్ వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగింది?: బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఓటమికిగల కారణాలను విశ్లేషించారు. ఆ క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ ఏకంగా దేవుడికి కులాన్ని అంటగట్టేశారు. మురళీమోహన్ వ్యాఖ్యలు పెనుదుమారం రేగడంతో టీడీపీ ఇరాకటంలో పడింది. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు మురళీమోహన్ మరో వీడియోను పోస్ట్ చేశారు. -
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బాబు మోసం చేశారు..: టీడీపీ ఎంపీ
-
బాబు మోసం చేశారు.. ఏవిధంగానో మీకు తెలుసు: టీడీపీ ఎంపీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ‘‘చంద్రబాబునాయుడు గారు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారో మీకు తెలుసు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి ప్రజలంతా ఒకతాటిపైకి రావాలి’’ ఈ మాటలన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతో కాదు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు సెంటర్లో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాగంటి బాబు.. చంద్రబాబు మోసం చేస్తున్నారని ఊగిపోయారు. మోదీని విమర్శిస్తున్నాను అనే ఉద్దేశంలో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న నాయకులతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమైనా మాగంటి బాబు నిజాలే చెప్పారని అక్కడికి వచ్చిన వారు అనుకున్నారు. ఏలూరులో కూడా ఓ ‘పప్పు’ బ్యాచ్ తయారయిందని సెటైర్లు వేసుకోవడం కనిపించింది. -
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
-
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని నగరాని కి చెందిన రామకృష్ణన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో నివసించే సి.కె.రామకృష్ణన్ 1992 నుంచి అమెరికా లో ఉంటున్నారు. ఆయన భార్య సుజాత రామకృష్ణన్ అక్కడే ఉండేవారు. 2014లో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. మాజీ ఎంపీ నామా తరచూ వారి ఇంటికి వస్తుండేవారు. 2017లో తరచూ తన భార్య సుజాతతో ఫోన్లో మాట్లాడేవాడని రామకృష్ణన్ తెలిపారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే భార్య గత అక్టోబర్లో ఫోన్ చేసి నామా, ఆయన తమ్ముడు నామా సీతయ్య తనను బెదిరిస్తున్నారని, భయంగా ఉందంటూ ఫోన్ చేయడంతో ధైర్యం చెప్పానన్నారు. అప్పుడే సుజాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు పెట్టిందన్నారు. ఇటీవల వేధింపులు తీవ్రతరం 2 రోజుల క్రితం తాను హైదరాబాద్కు వచ్చానని, మానసిక వేదనతో బాధపడుతున్న భార్య సుజాతను ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు నామాతో 2013 నుంచి వివాహేతర సంబంధం ఉందంటూ విషయాన్ని బయట పెట్టిందన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా ఒత్తిడి తెస్తున్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తమ్ముడు సీతయ్య కూడా గత కొంత కాలంగా తనను బెదిరిస్తున్నాడని ఆమె వెల్లడించారన్నారు. ఈ మేరకు రామకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నామా నాగేశ్వర్రావు, సీతయ్యపై ఐపీసీ సెక్షన్లు 497, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్లమెంట్ ఆవరణలో ఎంపీ శివప్రసాద్ బుర్రకధ
-
నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..
సాక్షి, అమరావతి : పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఎంపీలకు సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తానని, వాళ్లకన్నా ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తుచేయాలని చెప్పుకొచ్చారు. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన తనపై నిందలు వేస్తారా అని నిలదీయండని ఉద్భోదించారు. చిన్న మచ్చ కూడా లేని మా నేతపై మీ దాడి ఏంటని ప్రశ్నించండని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఎదురు దాడి చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని, మనల్ని విమర్శించనంత వరకూ అంశాలవారీగానే ముందుకు పోదామన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగతంగా పోతే మనం కూడా వ్యక్తిగత దాడికి వెనుకాడరాదని సూచించారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమని విలువలు వల్లించారు. బీజేపీ నేతలు అప్పుడే మనకు కాంగ్రెస్తో పొత్తు అని ప్రచారం చేస్తున్నారని గతంలో ఎన్నడూ లేని విదంగా ఆ పార్టీలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చిందన్నారు. -
‘పవన్ వ్యాఖ్యలపై స్పందించను’
సాక్షి, న్యూఢిల్లీ: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర తాజా మాజీమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి నిరాకరించారు. చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను అవినీతిప్రదేశ్గా మార్చారని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నాయకులు విఫలమయ్యారని, కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తాను మాట్లాడబోనని సుజనా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. తన ప్రసంగ పాఠానికి ఎన్నో సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల ద్వారా కదలిక వస్తుందనుకున్నామని, కానీ బీజేపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావడం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సుజనా చౌదరి చెప్పారు. కాగా, చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పదవికి సుజనా చౌదరి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎంపీ కొత్త పల్లవి
సాక్షి, చిత్తూరు: తమ పార్టీ నాయకుడైన సీఎం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్ శివప్రసాద్ ఆరోపించారు. శనివారం చిత్తూరు గాంధీ సర్కిలో ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలక కొట్టి శబ్దం చేస్తు కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబు రాష్ట్రం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అణిగిమనిగి ఉన్నారని చెప్పారు. తమ నాయకుడితో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి చివరకు మిగిలేది బోడి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకు సంవత్సరం పాటు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తమ నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. -
జేఎఫ్సీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు
-
ఎంపీ రాయపాటి కూమారుడి డ్రైవర్ ఆత్మహత్యయత్నం
-
టీడీపీ ఎంపీలు మోదీకి ఊడిగం చేస్తున్నారు
-
ధైర్యం ఉంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయండి
-
‘ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయి’
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ ఎంపీలపై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు వేసే నాటకాలకు అవార్డులు ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయని ఎద్దేవా చేశారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలంటే టీడీపీ ఎంపీలకు, మంత్రులకు భయమన్నారు. ఆస్కార్ అవార్డులు ఇద్దామంటే నాటకాలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వరని అపహాస్యమాడారు. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో అధికారుల ముందు కాదని, ధైర్యం ఉంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ముందు చేయాలని సూచించారు. ధైర్యం కావాలంటే ఓ సారి గదిలోకి వెళ్లి ఎన్టీఆర్ చిత్ర పటం చూడాలన్నారు. చంద్రబాబు నాయుడికి దిక్కుమాలిన సలహదారులు దొరికారని వ్యాఖ్యానించారు -
టీడీపీపీ భేటీకి కేంద్ర మంత్రి అశోక్ డుమ్మా
సాక్షి, అమరావతి : అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవంటూ సీఎం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ రాకపోవడం వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్దికాలంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్ పార్టీతో, చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన టీడీపీపీ సమావేశానికి ఆయన గైర్హాజరవడం గమనార్హం. కాగా, చైనా పర్యటనకు వెళ్లిన అశోక్ శనివారం రాత్రే రావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీపై మండిపడ్డ టీడీపీ ఎంపీ
సాక్షి, అమరావతి: బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న టీడీపీ వర్క్షాప్లో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ ది ఎంత పాపముందో బీజేపీది కూడా అంతే ఉందన్నారు. ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేదని అన్నారు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని వెళ్లి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రాజధానికి రూ.30 వేల కోట్లు అడిగితే రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర విద్యా సంస్థలకు రూ.11, 600 కోట్ల భూములు ఇస్తే వాటికి రూ.150 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇది చివరి బడ్జెట్.. ఇప్పుడు రాకపోతే మళ్లీ నిధులు ఇచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్కు ఎలాంటి బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా అలాగే బుద్ధి చెబుతారని అవంతి అన్నారు. ఈయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని చెప్పారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడనని, దీనిపై ఎంతవరకైనా వెళ్లానని స్పష్టం చేశారు. కాగా, అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధులు రావని, అలాగని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడబోనని చెప్పారు. ఎంతవరకు అయినా వెళ్తానని వ్యాఖ్యానించారు. -
చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్ ఫైబర్ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం. ఇదీ ప్రాజెక్టు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్ ఫైబర్గ్రౌండ్(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది. చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం చైనాకు చెందిన ఎస్బీజీ అనే కంపెనీ వీటికి టెండర్ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు. రెండు అర్హతలు తప్పనిసరి... అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్లో ఇన్కార్పోరేట్ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు. అనుమతించాల్సిందే... టెండర్ కట్టబెట్టాల్సిందే ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్కోలో ఆసక్తికరంగా మారింది. -
టీడీపీ ఎంపీ కార్యాలయంలో జూదం
-
పేకాటడెన్గా టీడీపీ ఎంపీ ఆఫీస్
-
వెలిగొండ పనులు టీడీపీ ఎంపీకి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఇష్టానుసారంగా మార్చి వేస్తోంది. ఇటీవలే రూ.91.15 కోట్ల కొల్లంవాగు హెడ్రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి చెందిన ఆర్కె ఇన్ఫ్రాకు కట్టబెట్టిన సర్కారు తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని టన్నెల్–1, 2 పరిధిలోని పనులను సైతం కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. టన్నెల్–1 పనులను కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించనున్నారు. టన్నెల్–2 పనులను కోస్తా ప్రాంతానికి చెందిన మెగా కన్స్ట్రక్షన్స్కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పనుల కేటాయింపుకు సంబంధించిన తంతు నేడో.. రేపో..ముగియనుంది. ఇప్పటికే ఒకమారు అంచనాలను పెంచుకొని పనులు వేగవంతం చేయని ప్రభుత్వం టన్నెల్–1,2 పనుల అంచనాలను మరోమారు భారీగా పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. పనుల అప్పగింతకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో పెద్దలకు కోట్లాది రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు టన్నెల్–1 పనులను ప్రసాద్, షూ, సబీర్ జాయింట్ వెంచర్ చేస్తుండగా కోస్టల్ కంపెనీ టన్నెల్–2 పనులను చేస్తోంది. టన్నెల్–1 పనులు 18.820 కిలోమీటర్ల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 14.755 కి.మీ మాత్రమే చేశారు. ఇక టన్నెల్–2 పనులు 18.838 కి.మీకు గాను ఇప్పటి వరకూ 10.72 కి.మీ మాత్రమే చేశారు. టన్నెల్–2 పనులు పూర్తిగా ఆగాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే పనులు చేయలేని పరిస్థితి నెలకొందని పాత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకూ రూ.50 కోట్లమేర పాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పాతరేట్లు గిట్టుబాటు కావడం లేదని, రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోని సర్కార్ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచి పనులను అధికార పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. పనులు అధికార పార్టీకి చెందిన ఎంపీ, మరికొందరికి అప్పగించేందుకు ఇరిగేషన్ కీలక అధికారి కీలకపాత్ర పోషించగా కిందిస్థాయి అధికారులు సైతం ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. తొలుత పనులు అప్పగించిన కాంట్రాక్టర్లకు నిధులిచ్చి పనులు వేగంగా వేయించడంలో శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం దానిని గాలికొదిలింది. అవే పనులను మరోమారు కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి కోట్లు కొల్లగొట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు స్వాధీనం చేసుకున్న కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో అందిన కాడికి దండుకొని ఆ తర్వాత పనులు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కొల్లంవాగు హెడ్రెగ్యులేటర్ పనులను సైతం జులైలో అధికార పార్టీ నేతకు అప్పగించినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం గమనార్హం. వెలిగొండ టన్నెల్–1 పనితో పాటు కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనిని పూర్తి చేసి తొలుత 2017 నాటికే నీళ్లిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి 2018 డిసెంబర్కు నీళ్లిస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. పనుల తీరు ఇలాగే కొనసాగితే మొదటి దశ పనులు ఏడాదిలో పూర్తి కావడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
నేనో అట్టర్ఫ్లాప్ ఎంపీని
నా మనస్సాక్షి అదే చెబుతోంది – ప్రజలకు ఏమీ చేయలేకపోయా.. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా – ఈ నెల 25 లేదా 26న నేరుగా స్పీకర్కు రాజీనామా అందజేస్తా – దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులు మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు అలంకారప్రాయమే – ప్రధాని, ముఖ్యమంత్రికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది – అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేసీ దివాకర్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25 లేదా 26న స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన తెలిపారు. అనంతపురంలోని తన స్వగృహంలో గురువారం జేసీ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుంది. నేను ఫెయిల్డ్ ఎంపీ అని నా మనస్సాక్షి చెబుతోంది. నేను అట్టర్ఫ్లాప్ ఎంపీని! నేను ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఎంపీగా కొనసాగాలి? అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నా! రాజకీయాల నుంచే తప్పుకోవాలని మొదట భావించా! అయితే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్నా! నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి నేను ఫెయిల్ అయ్యా! 9 నెలలుగా ప్రజలకు ఉపయోపడకుండా, వారికి ఏమీ చేయకుండా ఉండటం ఇదే తొలిసారి! ఫెయిల్ అయిన తర్వాత పదవిలో కొనసాగడం న్యాయం కాదు. రాజీనామా చేద్దామని స్పీకర్తో మాట్లాడేందుకు ప్రయత్నించా.. అందుబాటులోకి రాలేదు. అందుకే నేనే నేరుగా ఢిల్లీకి వెళ్లి స్పీకర్ను కలిసి రాజీనామా చేస్తా! నా కంటే బలమైన శక్తులు పనిచేస్తున్నాయని అనుమానం నాకు వచ్చింది. అవి ఏంటో మీకు(అధిష్టానానికి) నేను చెప్పాలా? ఇప్పటికే చాలాసార్లు వారితో ఈ విషయాలు చర్చించా! అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఆ బలమైన శక్తి ఏదో తెలుసుకోవాలి. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకారప్రాయమే!: ‘ఈ దేశంలో ఇద్దరే మంత్రులు ఉన్నారు. ఒకరు ప్రధాని, మరొకరు ముఖ్యమంత్రి. ఎంపీలు, ఎమ్మెల్యే అలంకారప్రాయమే. నరేంద్రమోదీ మంచి పనిచేస్తే ప్రతిపక్షంలో ఉన్నవారు శభాశ్ అనే పరిస్థితి లేదు. అలాగే విపక్షంలో ఉన్న సోనియా, మన్మోహన్ ఏదైనా సూచన చెబితే పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో అధికారపక్షం లేదు. ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు నేరుగా ఎన్నికలు నర్విహించాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మాకొద్దు. 40 ఏళ్లు చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా ఈ మాటలు చెబుతున్నా. ఈ పదవులకు బై..బై.. పార్లమెంట్కు ఓ నమస్కారం! అరువుకొచ్చిన గాంధీలతో దేశానికి నష్టం వాటిల్లుతోంది. వీరు దేశాన్ని వదిలి మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వారి పని వారు చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితుల్లో మరో పార్టీలోకి మారాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను అనంతపురం, తాడిపత్రిలో ఒక రైలు నిలపలేకపోతున్నా. ఇక ఎంపీగా నేను ఏం చేయగలను. తాడిపత్రికి తాగు, సాగునీరు రప్పించుకోలేకపోతున్నా. అందుకే తప్పు ఒప్పుకుంటున్నా. కేజ్రీవాల్ను చూసి ఇక్కడి నాయకులు ఆచరించాల్సిన అంశాలున్నాయి. ప్రజలకు ఒక మేసేజ్ ఇచ్చి దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అలాంటి మార్పులు ఇక్కడా జరగాలి. నీటి పారుదల శాఖను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండకూడదు. ఇది మంచిది కాదు.’ అన్నారు. తాను లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోంటే రాజీనామా వ్యవహారంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. -
ఎందుకు పడతాం!
విజయవాడలో టీడీపీ ఎంపీ కేసీనేని నాని నడిరోడ్డుపై సీనియర్ ఐపీఎస్ అధికారిని నిలదీసి... ఆయన గన్మన్పై చేయిచేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. అంతలా కాకున్నా... విజయనగరంలో కేంద్ర మంత్రి ఏకంగా అధికారుల సమీక్షలో ఎన్హెచ్ఏఐ సూపరింటెండెంట్ ఇంజినీర్పై విరుచుకుపడ్డారు. అయితే ఈసారి ఆ అధికారి మౌనంగా ఉండలేదు. తిరిగి అంతే దీటుగా సమాధానమిచ్చి... అందరినీ ఆశ్చర్యపరిచారు. తప్పు చేయనపుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటూ తెగేసి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండతో అధికారులపై విరుచుకుపడితే సహించలేరనడానికి విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరం సాక్షిగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనకు సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు, జాతీయ రహదారుల శాఖ అధికారికి మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో సహా అనేక మంది అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో వారి సంవాదం ప్రభుత్వాధికారుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టింది. అంతేకాదు కొన్ని విషయాలు కేంద్ర మంత్రికి తెలియకుండా ఆయన కోటరీలోని కొందరు దాచిపెడుతున్నారన్న విషయం రూఢీ అయ్యింది. అసలేం జరిగిందంటే... జిల్లాలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్, ఎస్పీ పాలరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంశాల వారీగా సమీక్షిస్తున్న మంత్రి పట్టణంలో రైల్వే శాఖ రూ.13.4 కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందంటూ జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్ఏఐ) సూపరింటెండెంట్ ఇంజినీర్ మనోహర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. తమకు ప్రతిపాదనలు తమకు అందలేదని అందితే నిర్మించడానికి, తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఆ విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మంత్రి అశోక్ గట్టిగా అడిగే సరికి అంతే తీవ్ర స్వరంతో ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని మీ ఓఎస్డీ అప్పలరాజుకు చెప్పామని ఆయన ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం మా తప్పు కాదని స్పష్టంచేశారు. ఓఎస్డీ నిర్వాకం వల్లే... నిజానికి రైల్వే అధికారులు సరైన క్రమంలో ప్రతిపాదనలు పంపించలేదనేది ఎన్హెచ్ఏఐ అధికారుల వాదన. ఆ విషయం తనకెందుకు చెప్పలేదనేది మంత్రి ఆగ్రహం. అయితే అసలు మూలం అప్పలరాజు దగ్గర ఉంది. తనకు అధికారులు చెప్పిన ఏ విషయాన్నీ ఆయన మంత్రికి తెలియపరచడంలేదు. విషయం తెలియక, ఎందుకు జాప్యం జరుగుతుందో అర్ధం కాక అశోక్ గజపతి తొమ్మిది జిల్లాల అధికారిని నలుగురిలో నిలదీశారు. మంత్రి వాదనకు తలవంచితే తమ వైపు తప్పున్నట్లు అంగీకరించినట్లవుతుందని భావించిన ఎస్ఈ ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకూ తన వాదనను బలంగానే వినిపించారు. ఇదే విషయాన్ని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు..మంత్రికి ఎదురు చెప్పాలనే ఉద్దేశం తనకు లేదని, అయితే చేయని తప్పుకు నలుగురిలో నిలదీస్తుంటే ఒప్పుకోలేకపోయానని ఎస్ఈ అన్నారు. రైల్వే శాఖ అధికారులు కాగితంపై మామూలుగా రాసేసి రూ.3.4 కోట్లు ఇమ్మంటున్నారని, పద్ధతి ప్రకారం అడిగితే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఓఎస్డీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. -
రంగంలోకి టీడీపీ అధిష్టానం.. జేసీతో మంతనాలు
విశాఖపట్నం: జాతీయ స్థాయిలో టీడీపీ పరువు పోయేలా వ్యవహరించిన ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదంపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ వివాదం వేడి తాకింది. గూండాలాగా వ్యవహరించిన ఓ ఎంపీ విషయంలో చంద్రబాబు ఇలాంటి వైఖరేనే అనుసరించేది.. అండదండలు అందించేది అని ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో నష్టనివారణ చర్యలకు పార్టీ దిగింది. ఇప్పటికే జేసీతో మరో ఎంపీ సీఎం రమేశ్ మంతనాలు జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేసును మరోదారిలో నీరుగార్చేందుకు టీడీపీ యత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా జేసీపై ఫిర్యాదు కూడా చేయలేదు. సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో జేసీని రక్షించేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన జేసీ దాడి విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో సొంతపార్టీ ఎంపీకి ఒక న్యాయం, ఇతర ఎంపీలకు మరో న్యాయమా అంటూ తీవ్ర విమర్శలు ఆయనపై వస్తున్నాయి. -
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం నిజంగా సిగ్గుచేటన్నారు. సెక్యూరిటీ నియమాలను జేసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా ప్రవర్తించాలని మాజీ డీజీసీఏ హితవు పలికారు. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్జెట్, గో ఎయిర్, జెట్ఎయిర్వేస్లు కూడా జేసీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్లేందుకు గురువారం ఉదయం దివాకర్రెడ్డి 7.30 గంటలకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్లోకిð వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55 గంటలకు బయలుదేరనుంది. అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కౌంటర్లో సిబ్బందిని అడగగా.. విమానం బయలుదేరే సమయానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు జారీ చేశామని, ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. తనకే రూల్స్ చెబుతారా అంటూ కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేయడంతో పాటు బోర్డింగ్ పాస్లు జారీచేసే మెషీన్ను టీడీపీ ఎంపీ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వీఐపీ లాంజ్లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. కేంద్ర మంత్రి విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్పాస్ ఇప్పించగా, ఇతర ప్రయాణికులకు అలాగే బోర్డింగ్ పాస్లు ఇవ్వవ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ గైక్వాడ్ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఏపీ రవాణా శాఖ అవినీతిమయం: కేశినేని
విజయవాడ: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఎంపీ కేశినేని నాని ఘాటుగా విమర్శించారు. రవాణా శాఖ మొత్తం అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ రద్దయిన బస్సులను రాష్ట్రంలో ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్ప్రదేశ్ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే.. రాష్ట్రంలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా జీవితంలో మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను బస్సుల వ్యాపారాన్ని విడిచిపెట్టానని స్పష్టం చేశారు. గతంలో తాను తిప్పిన బస్సుల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి లేవన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణాశాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అమరావతితో మాకు పనిలేదు’
రాయదుర్గం: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో మాటలు విసిరారు. 2019లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని సీఎం చంద్రబాబు సమక్షంలో కుండబద్దలు కొట్టారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివాకర్రెడ్డి మట్లాడుతూ... అమరావతితో తమకు పనిలేదని, త్వరగా పోలవరం పూర్తి చేయాలని అన్నారు. చంద్రబాబుకు దేవుడు కూడా సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాట ధరం రావడం లేదని, దళారుల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. చంద్రబాబు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని, దానికి అదనంగా నాలుగైదేళ్లు పడుతుందని గతంలో దివాకర్రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
-
మమ్మల్నే ఫీజు అడుగుతారా?
- టోల్ప్లాజాపై ఎంపీ నిమ్మల తనయుల వీరంగం - అనుచరులతో కలసి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం హిందూపురం అర్బన్/ చిలమత్తూరు/ బాగేపల్లి (కర్ణాటక): తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. అనుచరులతో కలిసి టోల్ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగులగొట్టారు. సోమవారం ఉదయం పది గంటలకు ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్ ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)లో, అతని స్నేహితులు ఫోర్డ్ కారు (ఏపీ02 ఈబీ 6777)లో కర్ణాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్ జిరాక్సు కాపీ చూపించారు. దాన్ని పరిశీలించిన సిబ్బంది.. ‘ఇది వ్యాలిడిటీ అయిపోయింది. ఈ పాస్ కేవలం పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ అనుమతి లేదు. అయినా ఎంపీ కుమారుడివి కావడంతో ఈసారి అనుమతిస్తున్నామ’ని చెప్పా రు. అయితే.. తన స్నేహితుల ఫోర్డ్ కారుకు కూడా అనుమతివ్వాలని అంబరీష్ పటు ్టబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. ‘ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తమాషా చేస్తున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. టోల్ప్లాజా సిబ్బంది వారించినా అతను వినలేదు. వారిపై శివాలెత్తుతూనే.. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్, ఇతర అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. కొంతసేపటికి కారులో శిరీష్తో పాటు ఏడుగురు అక్కడికి చేరుకుని టోల్ప్లాజాపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. రెండు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి బెంగళూరు వైపు వెళ్లిపోయారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారు బాగేపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. -
గూండాగిరి
- శ్రుతిమించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల ఆగడాలు - ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, దాడులు - బాగేపల్లి టోల్ప్లాజాలో నిమ్మల తనయుల వీరంగం - టోల్ఫీజు అడిగినందుకు సిబ్బందిపై దాడి - కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం - టోల్ప్లాజాపై దాడి చేయడం ఇది మూడోసారి హిందూపురం అర్బన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. ప్రజాప్రతినిధులు మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకు దౌర్జన్యాలు, దాడులకు దిగడం అలవాటుగా చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. న్యాయాన్యాయాలతో పనిలేకుండా వారిపై అమాంతం దాడులకు తెగబడుతున్నారు. సోమవారం టోల్ఫీజు అడిగారన్న కోపంతో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ తమ అనుచరులతో కలిసి కర్ణాటకలోని బాగేపల్లి టోల్ప్లాజాలో నానా బీభత్సం సృష్టించారు. సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా అక్కడి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతపురం–బెంగళూరు మార్గంలోని 44వ జాతీయ రహదారిలో ఉన్న టోల్ప్లాజాల వద్ద టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగడం ఇదేమీ కొత్త కాదు. సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. టోల్ప్లాజాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు, కొందరు అధికారులు, ప్రముఖులకు మాత్రమే ఉచిత వాహన ప్రవేశ అనుమతి ఉంటుంది. మిగిలిన వారు తప్పనిసరిగా టోల్ఫీజు చెల్లించాలి. అయితే.. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు తమ వారి పాస్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. తమ వాహనాలను ఉచితంగా అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల గురించి టోల్ప్లాజా సిబ్బంది వారికి చెప్పినా..ఏమాత్రం వినకుండా గొడవకు దిగుతున్నారు. నిమ్మల కిష్టప్ప పెద్ద కుమారుడు అంబరీష్ కూడా ఇదేవిధంగా గొడవకు దిగాడు. అతని ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)ను టోల్ప్లాజా సిబ్బంది అనుమతించినప్పటికీ సంతృప్తి చెందకుండా.. అతని స్నేహితులు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు(ఏపీ02 ఈబీ 6777)ను కూడా ఉచితంగా అనుమతించాలని డిమాండ్ చేశాడు. వారు వినకపోవడంతో తన తమ్ముడు నిమ్మల శిరీష్, కొంతమంది అనుచరులను అక్కడికి పిలిపించుకుని.. అందరూ కలిసి టోల్ప్లాజాపై దాడి చేశారు. ఈ దాడిలో ప్లాజా ఉద్యోగి నటరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. టోల్ఫీజులు నమోదు చేసే కంప్యూటర్లు, పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాగేపల్లి పోలీసులు నిమ్మల కిష్టప్ప కుమారులతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నిమ్మల కుటుంబ సభ్యులు బాగేపల్లి టోల్ప్లాజాలో దౌర్జన్యానికి దిగడం ఇది మూడోసారి. దీంతో వారి పేరు వినగానే అక్కడి సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎంపీ సోదరుడు నిమ్మల చంద్రశేఖర్ టోల్ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరు చెప్పి తన వాహనాన్ని అనుమతించాలని కోరగా..అందుకు ప్లాజా సిబ్బంది నిరాకరించడంతో వివాదం తలెత్తింది. 2015 ఏప్రిల్ 5న ఎంపీ కుమారుడు అంబరీష్ కొత్తకారులో వస్తుండగా ప్లాజా సిబ్బంది నిలిపారు. దీనికి ఆగ్రహించిన ఎంపీ నిమ్మలకిష్టప్ప నేరుగా అక్కడి చేరుకుని సిబ్బందితో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనపై నిమ్మల కిష్టప్పతో పాటు మరికొందరిపై కేసు నమోదయ్యింది. అయితే.. అప్పటి ప్లాజా మేనేజర్ ఈ కేసును వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు ఎంపీ అనుచరుడు సుబ్బారెడ్డి కూడా ప్లాజా సిబ్బందితో గొడవ పడినట్లు సమాచారం. మూడోసారి కూడా నిమ్మల కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని కర్ణాటక పోలీసులు, టోల్ప్లాజా నిర్వాహకులు సీరియస్గా తీసుకున్నారు. ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులై ఉండి.. ఇలా దాడులు చేయడం సరికాదని చిక్బళ్లాపూర్ (కర్ణాటక) ఎస్పీ కార్తీక్రెడ్డి హితవుచెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యులు గూండాల్లో ప్రవర్తిస్తున్నారంటూ టోల్ప్లాజా డైరెక్టర్ ఉదయ్కుమార్సింగ్ కాస్తంత కఠినంగానే మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని, కొందరు రాజకీయ నేతల కారణంగా తమకు భద్రత కరువైందని టోల్ప్లాజా సిబ్బంది వాపోయారు. తనపై ఎంపీ తనయులు దాడి చేయడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని నటరాజ్ అనే ఉద్యోగి తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎంపీ కిష్టప్ప కుమారులపై కేసు నమోదు
-
టీడీపీ నేతల గూండాగిరిపై హైకోర్టు దృష్టి
- రవాణా శాఖ కమిషనర్పై దాడి వ్యవహారం.. - ‘సాక్షి’ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన న్యాయస్థానం - మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు 25 నుంచి విచారణ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల గూండాగిరిపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా తదితరులు దూషిస్తూ బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణించింది. టీడీపీ నేతల బరి తెగింపుపై ‘సాక్షి’లో గత నెల 26న ‘ఐపీఎస్పై గూండాగిరీ’ శీర్షికతో ప్రచురిత మైన కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్లతో పాటు కేశినేని నాని, బొండా ఉమా తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ‘సాక్షి’ కథనాన్ని చదివి తీవ్ర ఆవేదనకు గురైన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు టీడీపీ నేతల దౌర్జన్యకాండను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. తన ఆవేదనను రెండు పేజీల లేఖలో పొందుపరిచి ఏసీజే ముందుంచారు. దానిని టేకెన్ అప్ పిటిషన్గా పరిగణించాలని కోరారు. దానిని పరిశీలించిన ఏసీజే ఆ లేఖను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీకి నివేదించారు. ఈ వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాలి.. ముగ్గురు న్యాయమూర్తులు ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ వ్యవహారం పిల్గా పరిగణించాల్సినంతది కాదని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పిల్గా పరిగణించాలన్న న్యాయమూర్తుల్లో ఒకరు తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వ్యక్తం చేశారు. ‘ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సమాజంలో తమ పాత్ర ఏమిటన్న దానిపై ప్రస్తుత రాజకీయ కార్యనిర్వాహకులకు అవగాహన ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయ అవినీతి, అపరిమిత అధికారం వారి నినాదాలుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలి. తద్వారా వక్రమార్గంలో పయనించే రాజకీయ నాయకులకు గట్టి సందేశం పంపినట్లవుతుంద’న్నారు. పిల్గా అవసరం లేదన్న ఓ న్యాయమూర్తి.. ఇది కేవలం దౌర్జన్యం మాత్రమేనని చెప్పారు. మెజారిటీ అభిప్రాయం మేరకు దీనిని పిల్గా పరిగణిస్తున్నట్లు ఏసీజే పరిపాలనపరంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిజిస్ట్రీ ‘సాక్షి’ కథనాన్ని పిల్గా మలిచింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నలకు ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ దళితద ఎంపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దళిత మంత్రులతో తిట్టించడం దారుణమన్నారు. చంద్రబాబుకు శివప్రసాద్ స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని స్నేహితుడు ప్రశ్నించడం తప్పా అని భూమన అన్నారు. శివప్రసాద్తో పాటు బోండా ఉమ, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ప్రశ్నిస్తున్నారని,వారికి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబు నైజం, ఇవ్వాల్సింది షోకాజ్ నోటీసులు కాదని, వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేరని భూమన ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది ఒక్క లోకేశ్ బాబే అని ఆయన వ్యాఖ్యానించారు. -
మీడియాతో మాట్లాడొద్దు ప్లీజ్..
ఎంపీ శివప్రసాద్తో మంత్రులు సుజన, అమర్నాథ్రెడ్డి రాయబారం తిరుపతి తుడా: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయ సమాచారం. ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో శివప్రసాద్ ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు రేపో ఎల్లుండో తిరుపతి వస్తారని తెలిసింది. -
‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’
చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయంపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది, బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలు అడినందుకే తనపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని వాపోయారు. కాగా, శివప్రసాద్ కు సంఘీభావం తెలిపేందుకు దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్ చిత్తూరులో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివప్రసాద్ పై చర్యలు తప్పవని చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. -
‘మన ఎమ్మెల్యేలు దొంగలు’
కర్నూలు(టౌన్): ‘‘మంత్రిగారూ! మీకు.. మీ ముఖ్యమంత్రికి అమరావతిపై ఏమాత్రం అవగాహన లేదు’’ అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలుకు వచ్చిన మంత్రి నారాయణను ఆయన స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో కలిశారు. మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మధ్యలో కలుగజేసుకున్న జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతిలో ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వాలి. అయితే మన ఎమ్మెల్యేలు దొంగలు. ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుంటారు. వాటిని అమ్ముకోకుండా టైఅప్ చేసి అభివృద్ధి చేయాలి’’ అని ఆయన అన్నారు. అసలు మీ శాఖలో మున్సిపల్ సమస్యలను ఎక్కడ పట్టించుకుంటున్నారంటూ మంత్రి నారాయణను ఆయన ప్రశ్నించారు. మంత్రి స్పందిస్తూ.. ‘సార్.. సార్.. నాలుగు నెలలు అందుబాటులో లేను. ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాను.. సమస్యలు పరిష్కరిస్తాను’ అని జవాబిచ్చారు. -
దళితులకి న్యాయం జరగాలని కోరడం తప్పా?
-
ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై టీడీపీలో తర్జనభర్జన
అమరావతి: చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తర్జనభర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించలేకపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ సీనియర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులకు ఏం చేశామో చెప్పాలంటూ సీనియర్ నేతలకు సూచనలు ఇచ్చారు. అయితే ఎంపీ శివప్రసాద్ చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమీ లేవని సీనియర్లు...సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దళితులకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని సీనియర్లు తేల్చి చెప్పినా, శివప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచన చేయడం గమనార్హం. అంతేకాకుండా వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కనీసం స్కాలర్షిప్పుల్లో కోత పైనా చంద్రబాబు ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి : మంత్రివర్గ విస్తరణ అనంతరం జరుగుతున్న పరిణామాలతో పాటు, సొంత పార్టీ నేతల విమర్శలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారమిక్కడ పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. గత కొంతకాలంగా శివప్రసాధ్ అసంతృప్తిగా ఉన్నారని, దానికి భూ వ్యవహారమే కారణమని నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, లోక్సభ, అసెంబ్లీ స్పీకర్లను చేసిన ఘటన టీడీపీదే అని ... ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టి తనను లొంగదీసుకోవాలనుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్య్యానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. హధీరాం మఠం భూములు కావాలని శివప్రసాద్ సిఫార్సు చేసినట్లు ఆయన టెలీ కాన్ఫరెన్స్లో నేతలతో ప్రస్తావించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. -
రసకందాయంలో బెజవాడ రాజకీయం
-
రసకందాయంలో బెజవాడ రాజకీయం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే...ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేయడం చంద్రబాబు నాయుడు అలవాటు అయిన విషయం తెలిసిందే. దీంతో తనకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్... ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
‘అందుకే కేశినేని ట్రావెల్స్ మూసివేశారు’
తిరుపతి : టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు. బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, కేశినేని నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన ట్రావెల్స్ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కాగా ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీకా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్ బస్సులను ఇతర ట్రావెల్స్ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
-
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
విజయవాడ: బెజవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్మీట్ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కేశినేని నాని ప్రెస్ మీట్ను రద్దు చేసుకుని సీఎం నివాసానికి వెళ్లారు. కాగా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వ్యవహారంపై కేశినేని నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కేశినేని ట్రావెల్స్ను మూసివేసేందుకు నాని సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని మీడియాకు చెబుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై కేశినేని నాని ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. సీఎం దగ్గరకు వెళ్లినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ ట్రావెల్స్కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కోరారు
-
సీఎం పంచాయితీ చేయడం ఏంటి...చట్టం లేదా ?
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
కడప : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం జమ్మలమడుగులో హల్చల్ చేశారు. పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు. మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటుహక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్ బూత్లోకి అనుమతించారు. దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు కానీ పోలీసులు పట్టించుకోలేదు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గేందుకు అందినకాడికి ప్రలోభాలకు గురిచేస్తూ... లొంగిని వారిపై దౌర్జన్యాలకు అధికార పార్టీ తెరతీసింది. మరోవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను గాలికి వదిలేసి పలువురు మంత్రులు గత వారంగా జిల్లాల్లో తిష్ట వేసి, చక్రం తిప్పుతున్నారు. బలం లేని చోటుకూడా బలవంతంగా నెగ్గేలా కుతంత్రాలు చేస్తోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిబిరాలు పెట్టించి మరీ టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. -
215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్
మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ టెండర్లలో గోల్మాల్ టీడీపీ ఎంపీ ఒత్తిడితో పాత కాంట్రాక్టర్లపై వేటు.. అంచనాలు భారీగా పెంపు టెండర్ నోటిఫికేషన్ జారీ.. రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు రూ. 101 కోట్లు అంచనా వ్యయం... 509.15 కోట్లు పెంచిన వ్యయం... సాక్షి, అమరావతి: మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల్లో ఇద్దరు ఎంపీలతో కలిసి రూ.215 కోట్లు కొట్టేయడానికి ‘ముఖ్య’నేత పావులు కదుపుతు న్నారు. ‘ముఖ్య’నేత ఆదేశం మేరకు ఆయన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈ నెల 6న అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూళ్ల దాఖలు గడువు ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. 21న టెక్నికల్ బిడ్ తెరుస్తారు. 25న ప్రైస్ బిడ్ను తెరిచి రాజ్యసభ సభ్యుడి సంస్థలకు పనులు కట్టబెట్టడమే మిగిలి ఉంది. అనంతపురం జిల్లాలో మధ్య పెన్నార్ ప్రాజెక్టు దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులను 2007లో ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ (43వ ప్యాకేజీ) పనులను రూ.66.43 కోట్లకు ఈసీఐ–బీజేసీఎల్(జేవీ).. 40 కి.మీ. నుంచి 84 కి.మీ. వరకూ(44వ ప్యాకేజీ) పనులను రూ.50.45 కోట్లకు జీహెచ్ఆర్ఏ–కేఆర్సీసీ(జేవీ) చేజిక్కించుకున్నాయి. 43వ ప్యాకేజీలో రూ.8.15 కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.7.07 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 2010 తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీ కన్ను ఈ పనులపై పడింది. పనులు చేయడం లేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్లపై వేటు వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో 43, 44 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేశారు. వ్యూహాత్మకంగా అంచనా వ్యయం పెంపు 43వ ప్యాకేజీ కింద రూ.58.28 కోట్లు, 44వ ప్యాకేజీ కింద 43.38 కోట్లు వెరసి రూ.101.66 కోట్లు ఖర్చు చేస్తే ఆధు నికీకరణ పనులు పూర్తవుతాయి. కానీ. వీటి అంచనా వ్య యాన్ని భారీగా పెంచాలంటూ ‘ముఖ్య’నేతపై ఎంపీ ఒత్తి డి తెచ్చారు.కావాల్సిన వారికి కట్టబెట్టి, కమీ షన్లు దండు కునేలా వ్యూహం రచించారు. ఈ క్రమంలోనే రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని రూ.509.15 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 20న ఉత్తర్వులు ఇచ్చింది. భూసేకరణ మినహా మిగతా పనుల వ్యయం రూ.421.87 కోట్లు. ఈ పెంపునకు ఆర్థిక శాఖ ససేమిరా అనడంతో కొత్త వ్యూహానికి పదును పెట్టారు. తిరకాసు నిబంధనలు మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల టెం డర్లలో పెట్టిన నిబంధనలపై జలవనరుల శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలు ఇవీ.. టెండర్లలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు జాయింట్ వెంచర్గా ఏర్పడి షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదు. హా గత ఐదేళ్లలో బ్యాంకులకు రుణాల చెల్లింపులో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(అప్పు ను కట్టలేక అప్పు+వడ్డీని కలిపి కొత్తగా రుణం తీసుకు న్నట్లు చూపడం), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్(అప్పు కట్టకపోవడం వల్ల బ్యాంకులే కాంట్రాక్టు సంస్థలో వాటాలు తీసుకోవడం) వంటి వాటిని అమలు చేసిన సంస్థలు టెండర్లో పాల్గొనవచ్చు. హా 2006–07 నుంచి 2015–16 వరకూ ఏదో ఒక ఏడాది కనీసం 3,40,976 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 96,406 క్యూబిక్ మీటర్ల గట్ల నిర్మాణ పనులు, 1,50,992 చ.మీ.ల కాంక్రీట్ లైనింగ్ పనులు(పేవర్ అనే యంత్రంతో చేసినవి), 1,951 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లైనింగ్ పనులు, 13,052 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసిన సంస్థలే అర్హమైనవి. హా ఏడాదికి కనీసం రూ.50 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలి. బ్యాంకుల్లో రూ.17 కోట్ల నగదు నిల్వ ఉండాలి. హా గత పదేళ్లలో ఒక ఏడాది కనిష్టంగా రూ.33.90 కోట్ల విలువైన కాలువ లైనింగ్ పనులు చేసి ఉండాలి. నిబంధనలు ఒక్కరికే అనుకూలం రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులను జాయింట్ వెంచర్ సంస్థలే చేస్తున్నాయి. ఇటీవల పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులను బావర్–ఎల్అంట్టీ జియో(జేవీ) అనే జాయింట్ వెంచర్కు సబ్ కాంట్రాక్టు కింద కట్టబెట్టారు. కానీ, మధ్య పెన్నార్ ఆధునికీకరణ పనులకు జాయింట్ వెంచర్ సంస్థలకు అర్హత లేదన్నారు. ఇటీవల నిర్మాణ రంగం కుదేలవడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్), స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్(ఎస్డీఆర్)లను అమలు చేశాయి. కానీ, సీడీఆర్, ఎస్డీఆర్లను అమలు చేసిన సంస్థలను మధ్య పెన్నార్ ఆధునికీకరణ పనుల టెండర్లలో పాల్గొనడానికి అనర్హమైనవని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే ‘ముఖ్య’నేతకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడి సంస్థకు మాత్రమే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అంచనాల పెంపులో ఆంతర్యమిదే! రూ.58.28 కోట్లతో పూర్తయ్యే 43వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.237.23 కోట్లకు, రూ.43.38 కోట్లతో పూర్తయ్యే 44వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.184.64 కోట్లకు పెంచేశారు. గతంలో పోల్చితే స్టీల్, సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గాయి. డీజిల్, పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇసుక ఉచితంగా లభిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయంలో ఏమాత్రం మార్పు ఉండకూడదు. కానీ, రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.509.15 కోట్లతో టెండర్లు పిలవడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కాక ‘ముఖ్య’నేత, టీడీపీ ఎంపీలు కలిపి రూ.215 కోట్లకుపైగా పర్శంటేజీల రూపంలో పంచుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సంక్రాంతి వేడుకలో మాగంటి చిందులు
డ్యాన్సర్లతో కలసి స్టెప్పులేసిన ఎంపీ కైకలూరు: సంక్రాంతి పండుగ ముగింపు వేడుకలను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నాయకులకు, తన అనుయాయులకు సోమవారం రాత్రి పసందైన మందు–విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు అధికారులు సైతం హాజరయ్యారు. కోరుకున్నవారికి కోరుకున్న బ్రాండు మందును అందజేశారు. చేపల పులుసు, చికెన్, మటన్ వంటి మాంసాహారాలను వడ్డించారు. సినిమా పాటలకు యాంకర్లతో డ్యాన్సులు చేయించారు. ఎంపీ బాబు కూడా డ్యాన్సర్లతో కలసి స్టెప్పులు వేశారు. భోగి పండుగ మొదలు కైకలూరు స్వగృహంలో కోడిపందాలు వేయించిన మాగంటి.. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. -
డ్యాన్సర్లతో కలసి టీడీపీ ఎంపీ స్టెప్పులు
-
జేసీవి దిగజారుడు రాజకీయాలు
– వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గడికొండ సభలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు మించి అభివృద్ధి చేసే నాయకుడే లేరన్నట్లు , ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం జేసీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. బూట్లు నాకింటే ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని అంటున్న జేసీ.. మరి ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది చంద్రబాబు బూట్లు నాకారో చెప్పాలన్నారు. అలాగే ఏడోతరగతి పాస్ కాని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గద్వాల నుంచి వలస వచ్చిన జేసీ ..రాయలసీమ రెడ్ల గురించి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అన్ని నీటి ప్రాజెక్టులూ 75 శాతానికి పైగా పూర్తయ్యాయని, తక్కిన పనులు పూర్తి చేసి చంద్రబాబు తానేదో సాధించినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వందమంది చంద్రబాబులు వచ్చి పులివెందుల నియోజకవర్గంలో నిలబడినా కనీసం డిపాజిట్టు కూడా తెచ్చుకోలేరన్నారు. సమావేశంలో వైఎసాస్సార్సీపీ నాయకులు పసుపుల బాలకృష్ణారెడ్డి, బాలనరసింహారెడ్డి, ములకనూరు గోవిందు, రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
జేసీకి మతిస్థితిమితం లేదు
అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మతిస్థిమితం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి సభలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ప్రొటోకాల్ పాటించలేదన్నారు. స్వయంగా సీఎం జిల్లా నాయకులను పరిచయం చేయడం, అధ్యక్షత వహించడం, వ్యాఖ్యాతగా, ఉపన్యాసకుడిగా వ్యవహరించడం ఆయన నియంతృత్వ పోకడను గుర్తు చేస్తోందన్నారు. స్థానిక దళిత శాసనసభ్యుడు ఐజయ్య ప్రొటోకాల్ ప్రకారం అధ్యక్షత వహించాల్సి ఉందన్నారు. పైగా ఆయన మాట్లాడుతుంటే మైకు లాక్కోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు భయపడ్డారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను ప్రారంభించింది వైఎస్ అని గుర్తు చేశారు.జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో 80 ప్రాజెక్టులు ప్రారంభించి, కోటి ఎకరాలకు నీరు తీసుకురావాలని పరితపించిన మహా నేత వైఎస్ఆర్ అని అన్నారు.పోలవరం కుడికాలువ వైఎస్ హయాంలో 140 కిలో మీటర్లు తవ్వారన్నారు. హంద్రీ–నీవాలో మీ చరిత్ర ఏమిటో గుర్తు చేసుకోవాలని అన్నారు. రెండుసార్లు శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు కాలం గడిపారన్నారు. ప్రతిపక్షం మాట్లాడుతుంటే ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వికృత ఆనందం పొందారన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం ఆయన వయసుకు తగదని హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మాటలు అసహించుకునేలా ఉన్నాయన్నారు. వైఎస్ హయాంలో ప్రారంభమైన నీటి ప్రాజెక్టులను మిగులు పనులను ప్రారంభించి, తానే చేశానని సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకుని జేసీ మాట్లాడడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎంత దిగిజారిపోయారో అర్థమవుతుందన్నారు. జేసీకి మతిస్థిమితం లేదా? లేకుండా చంద్రబాబుతో పనులు చేయించుకునేందుకు ఇలా మాట్లాడారా? అనే అనుమానం వస్తోందన్నారు. ఆయన మాటలతో రెడ్డి కులస్తులే కాదు అన్ని కులాల వారూ బాధపడుతున్నారన్నారు. ఆయన మాటల వెనుక సీఎం ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా జేసీ తన మాటలను వెనక్కు తీసుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 70 ఏళ్ల వయసులో ఏం ఆశించి పార్టీ మారావని జేసీని ప్రశ్నించారు. సమావేశంలో మైనార్టీ విభాగం నాయకులు ముక్తియార్ పాల్గొన్నారు. జేసీ రాజకీయ వ్యభిచారి అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రాజకీయ వ్యభిచారి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు ధ్వజమెత్తారు. ఆయన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్లో జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల కోసం పని చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని జేసీ దివాకర్రెడ్డి మతిభ్రమించి, తన వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి వద్ద మెప్పుపొందేందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రఫీ, జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్శెట్టి, సుధీర్రెడ్డి, యుజవన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, నూర్బాషా, అనిల్, హరి, షారుఖాన్, యూపీ నాగిరెడ్డి, మార్కెట్మల్లి పాల్గొన్నారు. జేసీకి పిచ్చి ముదిరింది! పెనుకొండ : ఎంపీ జేసీ దివాకరరెడ్డికి పిచ్చి ముదిరిందని, ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు ఎలా ఎన్నికయ్యాడో అర్థం కాలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో కలసి పాల్గొన్న ఎంపీ జేసీ.. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనమన్నారు. గౌరవహోదాను మరచి, ప్రతిపక్షనేత జగన్పై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ముఖ్యమంత్రిని కాకాపట్టడానికేననిపిస్తోందన్నారు. అనంతపురంలో గతంలో ఇలానే మాట్లాడినప్పుడు మేధావులు, ప్రజలు, విద్యావంతులు జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారన్నారు. హోదాకు, వయసుకు తగ్గట్టుగా జేసీ వ్యవహరించాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జిల్లాలో సైతం జేసీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోవడంతో మానసిక సైకోగా మారాడని శంకరనారాయణ విమర్శించారు. సమావేశంలో బీసీసెల్ జిల్లా కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు. జేసీ రాజకీయాలకు పనికిరాడు అనంతపురం సెంట్రల్ : జేసీ దివాకర్రెడ్డికి వయస్సు మీద పడుతోంది..ఆయనకు అపార రాజకీయ అనుభవం ఉందని అంటుంటారుగానీ బహిరంగ సమావేశాల్లో ప్రతిపక్షనేతపై ఇలా వ్యాఖ్యానించడాన్ని ప్రజలు హర్షించరు అని పీసీసీ అధికార ప్రతినిధి రమణ అన్నారు.ఇటీవల కాలంలో జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాలకు పనికిరాడు అని అర్థమవుతోందన్నారు. ఎంపీ జేసీ దిష్టిబొమ్మ దహనం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం వద్ద సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వయసుమళ్లి, పిచ్చిముదిరి ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు భానుప్రకాష్రెడ్డి, క్రాంతి కిరణ్, జయచంద్రారెడ్డి, అమర్నాథ్, రాంబాబు, హేమంత్కుమార్, మహేంద్ర, శ్రీనివాసరెడ్డి, నాగేంద్ర, చార్లెస్, ప్రతాప్రెడ్డి, అశోక్రెడ్డి, లోకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ
విజయవాడ: పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ బురద కడిగేందుకు చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ బురద మాకు అంటుతోందని రాయపాటి వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు. నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాయపాటి.. ఈ సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనమంతా కాంగ్రెస్ వాళ్ల దగ్గరే ఉందని.. దాన్ని మార్చుకోలేకే వారు పార్లమెంట్ను అడ్డుకుంటున్నారని రాయపాటి విమర్శించారు. -
'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి'
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్ పగటి వేషాలు మానుకోవాలని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దుపై ఎంపీ శివప్రసాద్ నిరసన తెలపడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని... దొంగలకు మద్దతు పలుకుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు బ్యాంకులు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. కేంద్రంపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, స్వపక్షం అయినా విపక్షం అయినా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. నోట్ల రద్దు విషయంలో కమ్యునిస్టుల వైఖరి స్పష్టంగా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల డబ్బు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజకీయ పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ రైతు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. -
రేపు ఎంపీ జేసీ నిరసన దీక్ష
అనంతపురం న్యూసిటీ : పాతూరు తిలక్రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ జాప్యంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ నెల 21న నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరవధిక నిరసన దీక్ష చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుపడుతున్నారనే నేపథ్యంలో దీక్షకు సిద్ధమైనట్లు తెల్సింది. సీఎం విస్తరణ కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా ఆ ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నారని ఎంపీ గతంలోనే ఆరోపించారు. ఎంపీ దీక్ష చేపడుతుండడం నగరంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆందోళనలకు చేపడుతాం : ఇటీవల ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శస్త్ర చికిత్స చేయించుకున్నారని, నిరసన దీక్షలో ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అనంత నగరాభివృద్ధి వేదిక అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ నిరవధిక నిరసన దీక్షకు నగరాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలి
కేంద్ర మంత్రులకు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ కింద గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధిత పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాలకు దేవేందర్ గౌడ్ గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు చెరువులు, బావులలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. పలు ప్రాంతాలలో ఇప్పటికీ తాగు నీటి కోసం ప్రజలు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారన్నారు. కాబట్టి గ్రామాలలో మురికి నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలని దేవేందర్ గౌడ్ కోరారు. -
బాధ్యతలు విస్మరించిన ఎంపీ జేసీ
గుంతకల్లు : గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు కోసం కృషి చేయాల్సిన ఎంపీ దివాకర్రెడ్డి బాధ్యతలను విస్మరించి మురికి కాలువలు శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నం కావడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లులోని ఎఫ్సీఐ గోడౌన్ , హెచ్పీసీ డిపోలు మూడపడినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు విశాఖపట్నంలో సాధ్యం కాదని మరోచోట ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సముఖత చూపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. గుంతకల్లు రైల్వేజోన్ కేంద్రంగా పెట్టాలని ఎంపీ జేసీ.దివాకర్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మరిచి మేయర్ చేయాల్సిన పనిని ఎంపీ చేయడంమేంటని ఆయన ప్రశ్నించారు. రైల్వేజోన్ సాధనకు ఈ నెల 5 న రాజ్యసభ సభ్యుడు టీజీ. వెంకటేష్ను కలువనున్నామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లి రైల్వేజోన్ అంశంపై రాయలసీమలోని ఎంపీలందరికి నివేదిస్తామన్నారు. -
తేల్చుకుందాం రా..!
- అభివృద్ధి చేయాలని చూస్తే కర్రపెత్తనమా..? – మరువవంక శుభ్రం చేయిస్తా .. చేతనైతే రా..! – ఎమ్మెల్యే వైకుంఠంపై ఎంపీ జేసీ ఫైర్ అనంతపురం న్యూసిటీ : 'పందులను బయటకు పంపిస్తే కర్రపెత్తనమా..ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తే కర్రపెత్తనమా.. షాపుల నుంచి చెత్త వేయవద్దని చెబితే కర్రపెత్తనమా.. దోమలు వద్దురా అంటే కర్రపెత్తనమా, రోడ్లు వెడల్పు చేస్తామంటే కర్రపెత్తనమా.. బ్రిడ్జ్ కావాలంటే కర్రపెత్తనమా...రారా నీయబ్బా రేపు అక్కడ (మరువవంక) పని చేయిస్తా కర్రపెత్తనమో... మంచి పెత్తనమో తేలుస్తా' అంటూ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై పరోక్షంగా సవాల్ విసిరారు. మంగళవారం నగరంలోని జేసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'వాట్ ఈజ్ దిస్ ఎవరో ఒకరు నవ్వపెట్టుకుని ముందుకొచ్చాడు. కంపు తొలగిస్తామని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం అనే ఆలోచనే లేదు. పేదోళ్లను బాధపెట్టడమే తెలుసా? బ్రిడ్జ్ వద్ద రైటర్లకు రాంనగర్ పార్క్లో స్థలం కేటాయించాలని నిర్ణయించా. అందుకు మేయర్, కమిషనర్ అంగీకరించారు. ఎవరో బుద్ధిలేనోడు ఆరడుగుల స్థలం ఉంది వేసుకోవచ్చని చెప్పాడంట. కుక్క తోక వంకర అన్న తరహాలో సామాన్యులను బాధిస్తున్నారు. అసూయ ద్వేషాలు తప్ప మరొకటి చేయడం లేదు. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ విల్ ఆపరేట్. పేషంట్కు నొప్పి అంటే నేనేమి చేయలేను. నొప్పి భరించాల్సిందే. పందుల తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, రోడ్డు విస్తరణ చేసేటప్పు నొప్పి మామూలే. ముందుకు బాగుంటుంది. మరువ వంక పూడికతీతను బుధవారం నుంచి మొదలుపెట్టి దశలవారీగా శుభ్రం చేయిస్తా'. అంతకుముందు ప్లాస్టిక్ను వాడమని ముందుకొచ్చిన వ్యాపారస్తులను ఎంపీ అభినందించారు. మరువ వంకను పరిశీలించిన ఎంపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరువవంకను పరిశీలించారు. సంగమేశ్వర్ సర్కిల్, రాజా, రమణ థియేటర్, సూర్యనగర్ సర్కిల్, కృష్ణ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్ వరకు మరువవంక పూడికతీతపై అధికారులతో మాట్లాడారు. త్రివేణి థియేటర్ వద్ద మురుగు నిల్వ ఉండకూడదని అందుకేమి చేయాలని ఎస్ఈ సురేంద్రబాబు, ఈఈ రామ్మోహన్ రెడ్డిని ప్రశ్నించగా కల్వర్టు వేయించాలన్నారు. అందుకు ఎంపీ రూ కోటి అయినా ఇస్తానని పనులు మొదలుపెట్టాలన్నారు. -
నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్
గోరంట్ల : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అక్ర మ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించిన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి బాధిత రైతు మల్లేశప్ప పేరిట అడంగల్లో నమోదు చేయించారు. ‘ నిమ్మల భూ కిరికిరి’ శీర్షికన 15 వతేదీ సాక్షిలో వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే. అలాగే బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తమ వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. ఈ మేరకు ఆమె పంపిన నివేదిక ఆధారంగా మల్లేశప్ప పేరిట అడంగల్ ను య«థాస్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారని స్థానిక తహశీల్దార్ హసీనాసుల్తానా సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. -
పాక్తో యుద్ధం వద్దు
ప్రధానికి దేవేందర్ గౌడ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఆర్థికాభివృద్ధి పురోగమనంలో ఉన్న దశలో యుద్ధం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉడీ ఘటన, భారత సైన్యం మెరుపుదాడుల అనంతరం పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతోందని, మనం యుద్ధానికి సిద్ధపడకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని ఆయన ప్రధానిని కోరారు. -
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్నడూలేనంత అవినీతి, అక్రమాలు: ఎంపీ రాయపాటి వినుకొండ టౌన్ : తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నాయకుల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనంత అక్రమాలు, అవినీతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా చంద్రబాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్లలోనే ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. విశాఖకు ఏ విధంగా రైల్వే జోన్ వస్తుందని, వారి పోరాటం వృథా అవుతుందని చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. -
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు. పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు. వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తాం టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్షిప్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు. టీడీపీ నేతలతో రహస్య భేటీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం. -
'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా రాదని చెప్పిన తన మాటే నిజమైందన్నారు. రెయిన్ గన్స్తో పంటలను కాపాడటం ప్రయోగమేనన్నారు. -
విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్
విశాఖపట్టణం : విశాఖ ఎయిర్పోర్టులో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ హల్చల్ సృష్టించాడు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ను ఐడీ కార్డు చూపించాలని విశాఖ ఎయిర్పోర్టు సిబ్బంది అడిగారు. దీనిపై అవంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్నే ఐడీ కార్డు అడుగుతారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది మిన్నకుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెక్బౌన్స్ కేసులో టీడీపీ ఎంపీ కోడలు ఆరెస్ట్
-
ఆ ముగ్గురికి కులగజ్జి పట్టుకుంది
అనంతపురం : అనంతపుం జిల్లా టీడీపీ నాయకుల్లో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అనంతపురంలో ప్రబలిన విషజ్వరాలపై స్థానిక టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఆదివారం స్పందించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్కు కులగజ్జి పట్టుకుందని విమర్శించారు. అనంతలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని జేసీ దివాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే.. దానికి సైతం వారు అడ్డుపడ్డారని ఎంపీ జేసీ మండిపడ్డారు. -
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
-
హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
టీడీపీ ఎంపీ రాయపాటికి భారీ లబ్ధి చేకూర్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు * పోలవరం హెడ్వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481 కోట్లు పెంపు * 7న పోలవరం బాధ్యతలు రాష్ట్ర సర్కార్కు అప్పగించిన కేంద్రం * 24 గంటలు గడవక ముందే అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు * అంతా పక్కా ప్రణాళికతో నడిపించిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకు గానూ ఏపీ ప్రభుత్వ పెద్దలకు దక్కిన మొదటి ‘ప్యాకేజీ’ ఇది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేసేందుకు రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం హెడవర్క్స్ పనుల అంచనా వ్యయం రూ.4,717 కోట్లు కాగా, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.. రష్యా, ఒమన్లకు చెందిన జేఎస్సీ, యూఈఎస్లతో జట్టుకట్టి, 14.05 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,054 కోట్లకు పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేజిక్కించుకుంది. ఈ పనులు 60 నెలల్లో పూర్తి చేసేలా 2013, మార్చి 2న కాంట్రాక్టర్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నాడు తస్మదీయుడు.. నేడు అస్మదీయుడు అయితే పోలవరం హెడ్ వర్క్స్ పనులు చేసే సత్తా ట్రాన్స్ట్రాయ్కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ(స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) నివేదిక ఇచ్చింది. రాయపాటి అప్పట్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు. దీంతో పోలవరం హెడ్వర్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం రాయపాటి సైకిలెక్కారు. దీంతో చంద్రబాబుకు రాయపాటి సన్నిహితుడిగా మారిపోయారు. కేవలం ప్రాజెక్టులు పనులు కొట్టేసేందుకే ఎంపీ రాయపాటి రష్యా, ఒమన్ దేశాలకు చెందిన సంస్థల సహకారం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ సంస్థల చిరునామా కన్పించలేదు. 2015, అక్టోబర్ 10 వరకూ అంటే.. 32 నెలల్లో కేవలం రూ.232.42 కోట్ల విలువైన పనులే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) పదే పదే అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కాంట్రాక్టర్కు పనులు చేసే సత్తా లేదని, తక్షణమే తొలగించాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా సూచించింది. కానీ ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయపాటికి భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొట్టాలన్నది ఆ లేఖల ఎత్తుగడగా తెలుస్తోంది. ఏపీకి అప్పగించగానే దోపిడీపర్వం.. పనులు వేగవంతం చేయాలంటే తాజా(2015-16) ఎస్ఎస్ఆర్ మేరకు అంచనా వ్యయాన్ని పెంచాలని, హెడ్వర్క్స్ పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని, వారిని కూడా ప్రధాన కాంట్రాక్టరే ఎంచుకోవచ్చంటూ రాయపాటి సాంబశివరావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లమాలిన ప్రేమ కురిపించారు. ఆ మేరకు 2015, అక్టోబర్ 10న కేబినెట్తో ఆమోదముద్ర వేయించారు. సబ్ కాంట్రాక్టర్కు అప్పగించే సమయంలో ఒప్పందం చేసుకోవాలని, ‘ఎస్క్రో’ అకౌంట్ను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని కేబినెట్ షరతు విధించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంచనా వ్యయాన్ని పెంచుతూ పోలవరం ఈఎన్సీ ఏప్రిల్ 30న మొదటి సారి, ఆగస్టు 9న రెండో సారి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తొక్కిపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగానే వాటిపై ఆమోదముద్ర వేసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం హెడ్వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,767.83 కోట్లకు పెంచారు. ఇందులో 2015, అక్టోబర్ 10 వరకు పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.232.42 కోట్లు కాగా, మిగతా పనుల విలువ రూ.5,535.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హెడ్వర్క్స్ అంచనా వ్యయం ఒకేసారి రూ.1,481.41 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. -
హోదా తెస్తే పవన్కు అనుచరుడిగా మారతా
ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటే ఎంపీలంతా టీడీపీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడుస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ చేశారు. తామంతా ఏం చేయాలో, ఎలా చేయాలో చెబితే అలాగే నడుచుకుంటామన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హోదా తీసుకొస్తే పవన్కు అనుచరుడిగా మారిపోతానని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం స్పష్టమైన వైఖరితో రావాలని పవన్కు సూచించారు. అంతే కాని నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తమకు హిందీ రాకపోవచ్చు గానీ, ఇంగ్లిష్ వచ్చని అన్నారు. మూర్ఖపు కేంద్ర ప్రభుత్వం తమ మాట విననంత మాత్రాన తమని నిందించడం తగదన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామా చేసినా నరేంద్ర మోదీకి ఏమీ కాదని చెప్పారు. హోదా విషయంలో మోదీ పట్టుదలతో ఉన్నారు.. ఏపీ పట్ల వ్యతిరేకత స్పష్టంగా చూపిస్తున్నారని ఆరోపించారు. మోదీకి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరారు. దేశానికి ద్రోహం చేసింది గాంధీ, నెహ్రూలే: దేశానికి అత్యంత ద్రోహం చేసింది మహాత్మాగాంధీ, నెహ్రూయేనంటూ జేసీ దివాకర్రెడ్డి ఆరోపించారు. ప్రధానమైన తప్పిదం పాకిస్తాన్ను విభజించడానికి ఒప్పుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పవన్కు తిక్కైతే నాకు పిచ్చి'
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కల్యాణ్ కు తిక్క ఉంటే తనకు పిచ్చి ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి సభలో పవన్ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎంపీ.. జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'పవన్ ఏమంటాడు?.. మేం సార్.. సార్.. అని అడుక్కుంటున్నామా? మరి ప్రధాన మంత్రి గారిని 'సార్' అనకుంటే ఏమనాలి? ఎదుటివారికి నీతులు చెబుతున్న పవన్ తానేం చేస్తున్నాడు? ఆయనకు తిక్క ఉంటే నాకైతే పిచ్చి ఉంది' అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తుచేశారు. నీతులు వల్లించడం మాని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాడాలని పవన్ కల్యాణ్ కు సూచించారు. శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. టీడీపీ అధ్యక్షుణ్ని, పార్టీ విధానాలను కాకుండా కేవలం ఒకరిద్దరు ఎంపీలను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆ పార్టీ పార్లమెంటేరియన్లు గుర్రుగా ఉన్నారు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి.. పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, అసలు తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానం అని జనసేన అధినేతకు ఘాటుగా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. -
'హోదా తెస్తే పవన్కు అనుచరుడిగా మారతా'
-
మహిళల హక్కులు పరిరక్షించాలి
అనంతపురం టౌన్ : మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం అనంతపురం శివారులో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటైన ఉజ్వల హోంను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యాచారం, వేధింపులు, బాల్య వివాహాలు తదితర కారణాలతో ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల మహిళలకు అన్యాయం జరిగిన సంఘటనల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి బెయిల్ మంజూరు చేయకుండా సామాజికంగా వారికి శిక్ష విధించాలన్నారు. -
నేడు నన్నపనేని రాక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం అనంతపురానికి రానున్నారు. బంధువుల ఇంట జరగనున్న వివాహానికి విచ్చేస్తున్న ఆమె, శుక్రవారం మధ్యాహ్నం డీఎంఏ హాలులో జరిగే మహిళా సాధికారత సదస్సులో పాల్గొననున్నారు. ఆమెతో పాటు ఐసీడీఎస్ అధికారులు, మహిళలు కూడా సదస్సులో పాల్గొంటారు. -
'దేవుడికి, మోదీకి మాత్రమే తెలుసు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్రెడ్డి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందో ? లేదో ? తెలియదన్నారు. కానీ దేవుడికి, ప్రధాని మోదీకి మాత్రమే తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం అనంతపురంలో జేసీ దివాకర్రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ లబ్ది చేకూరుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. చంద్రబాబు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి... కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానితో చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు కూడా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తున్నారా ? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేసీ దివాకర్ రెడ్డి పై విధంగా స్పందించారు. -
'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'
-
'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'
విజయవాడ : బీజేపీతో టీడీపీ విడిపోవాల్సిందేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చినాటికి విడిపోతే మంచిదని ఆయన స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రధాన శత్రువుగా కనబడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకే హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. అందుకే రూల్స్ పేరు చెప్పి ఆ పార్టీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రధానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే రూల్స్ ఏమీ అడ్డంకి కాదని దివాకర్రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మోదీకి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేది చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు అని ఆయన చెప్పారు. అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది క్రితమే బీజేపీతో విడిపోవాలని చంద్రబాబుకు చెప్పానని జేసీ దివాకర్రెడ్డి గుర్తు చేశారు. -
'బీజేపీతో యుద్ధం చేయలేం'
న్యూఢిల్లీ : బీజేపీతో మేము యుద్ధం చేయలేమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ప్రత్యేక హోదా సాధించేంత బలం లేదని ఆయన తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు సభలో నేడు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుపై టీజీ వెంకటేష్ స్పందించారు. కె.వి.పి.రామచంద్రరరావు కేవలం పొలిటికల్ లద్ధి కోసం బిల్లు పెడితే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాం కలిపితే మద్దతిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాకు ఆమోదం తెలిపితేనే... జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామని బీజేపీపై ఎందుకు ఒత్తిడి చేయరు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. -
తోట నరసింహం పీఏపై లైంగిక వేధింపుల కేసు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఎ శర్మ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రాయుడు పాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసులు శర్మపై కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శర్మ స్నేహితుడి నివాసంలో తాను కొన్నాళ్లుగా అద్దెకు ఉంటున్నానని, ఆ ఇల్లు ఖాళీ చేయాలని శర్మ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్మ తనను రకరకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తూ స్పందించలేదని, తర్వాత కేసు నమోదు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసుపై మీడియాతో మాట్లాడేందుకు సర్పవరం పోలీసులు నిరాకరించారు. కాగా శర్మ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. తన సోదరి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని ఆయన తెలిపారు. -
తోట నరసింహం పీఏపై లైంగిక వేధింపుల కేసు
-
రాయపాటిపై ‘కన్నా’ కేసు విచారణ ప్రారంభం
గుంటూరు: తన పరువు ప్రతిష్టలకు భంగం కలింగించేలా పలు పత్రికలలో ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తూ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ నాలుగవ అదనపు జిల్లా కోర్టులో సోమవారం ప్రారంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అప్పటి రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలు ఉన్నారని అందులో గుంటూరుకు చెందిన మంత్రి ఉన్నారంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ కన్నా లక్ష్మీనారాయణ రూ. కోటి నష్టపరిహారం కోరుతూ తన న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డి ద్వారా లీగల్ నోటీసు ఇచ్చారు. అనంతరం కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సోమవారం ప్రారంభ మైంది. కన్నా లక్ష్మీనారాయణ తన సాక్ష్యాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టులో దాఖలు చేశారు. తన కేసు నిరూపణ కోసం కొన్ని డాక్యుమెంట్లు అఫిడవట్తో పాటు దాఖలు చేయగా వాటిలో పేపర్ కటింగ్లను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం న్యాయవాద కమిషనర్ను నియమించాలని కన్నా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది కోరగా అందుకు రాయపాటి సాంబశివరావు తరపు న్యాయవాది నీలం రామమోహనరావు అభ్యంతరం తెలిపారు. కమిషనర్ అవసరం లేదని ఈ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా కోర్టుహాల్లోనే జరగాలని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పిటీషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తానని కేసును న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. -
'కసి’నేని
ఎంపీ కేశినేని శ్రీనివాస్ అత్యుత్సాహం అడ్డగోలుగా దేవాలయాలు కూల్చివేత ప్రశ్నించే వారిపై ఎదురుదాడి, బెదిరింపులు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ పుష్కర పనులను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచిస్తే.. యాక్షన్లోకి దిగాల్సిన ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఓవరాక్షన్ చేశారు. అంతా సవ్యంగా నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. భక్తుల మనోభావాలను కాలరాస్తూ అభివృద్ధి ముసుగులో ఆలయాల కూల్చివేతతో ఆయన చెలరేగిపోయారు. అడ్డుకున్న వారిని కేసుల పేరిట బెదిరించారు. అరే ఎవర్రా... ఒరేయ్ సీఐ వీళందర్నీ లాగేయండి.. మీ ఓట్లు మాకు అక్కర్లేదు.. నేను ఇలాగే చేస్తాను.. ఎవరు అడ్డువస్తారో చూస్తాను... ఎక్కువ మాట్లాడితే జైలులో పెట్టిస్తాను... గోశాలను అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటారా...! లల్లూ ప్రసాద్ యాదవ్లాగా గడ్డి తినాలనుకుంటుంటే కుదరదు... గోశాలను తొలగించి తీరతాం.... సాక్షి, విజయవాడ : ఆలయాలను కూల్చివేయొద్దని కోరడానికి వెళ్లిన నగర ప్రముఖులు, గోశాల ప్రతినిధులను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ హుందా మరిచి మాట్లాడిన మాటలు ఇవీ... గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో పుష్కరాల పేరుతో 40 ఆలయాలను కూల్చివేసి, మరో 10 ఆలయాలను విజయవాడ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం వెనుక ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎ చూపిన అత్యుత్సాహంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఆలయాలను అర్ధరాత్రి వేళ పడగొట్టించమే కాకుండా.. కూల్చవద్దని కోరడానికి వెళ్లిన వారిని చులకన చేస్తూ గడ్డి తినడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేశినేని నాని ఎద్దేవా చేయడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పెత్తనం ఇచ్చారని... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంద్రకీలాద్రిని సందర్శించిన సమయంలో దుర్గగుడి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాలని ఎంపీ కేశినేనికి సూచించారు. దీంతో ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్లు, రోడ్లు విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ ఎంపీ కేశినేని సూచనలతో కలెక్టర్ బాబు.ఎ దగ్గరుండి ఆలయాలను కూల్చివేయించారు. ముఖ్యంగా నదీతీరంలోని సీతమ్మవారిపాదాలు, శనీశ్వరాలయం, భూగర్భ వినాయకుడి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా గుడిని ధ్వంసం చేయించారు. అర్ధరాత్రి వేళ గోశాల్లోకి పొక్లెయిన్లను పంపించి అక్కడి కృష్ణమందిరాన్ని, గోశాల భవనాలను ధ్వంసం చేయించారు. తొలుత ఒకటి రెండు చిన్నచిన్న ఆలయాలను కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి అంతగా ప్రతిఘటన ఎదురవకపోవడంతో ఎంపీ కేశినేని మరింత రెచ్చిపోయి ముఖ్య ఆలయాలను కూల్చివేయించారని టీడీడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గోశాలను కూల్చిన తరువాత వినాయకుడు గుడి కూల్చివేద్దామని భావించేసమయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో వెనక్కు తగ్గారు. చివరికి వినాయకుడి గుడిని కూల్చబోమంటూ కలెక్టర్ చేత వివరణ ఇప్పించారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తొలి నుంచీ వివాదాస్పదుడే! ఎంపీ కేశినేని నానిది తొలి నుంచి దుందుడుకు స్వభావమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని, ఖాళీ చేయమని కోరిన దాని యజమానితో విభేదించి పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. చివరకు ఇది వివాదాస్పదం కావడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఏకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయాలను కూల్చివేయడం... అడిగిన వారిపై కేసులు పెట్టిస్తామని బెదిరించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పర్యవసానంగా ఇప్పుడు ఎంపీ కేశినేని, కలెక్టర్ బాబు.ఎ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నగర వాసులు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి తీరును గర్హిస్తూ ముద్రించిన కరపత్రాలను నగరంలో జోరుగా పంపిణీచేస్తున్నారు. రాబోయే రోజల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని పలు హిందూ సంఘాలు నిర్ణయించుకున్నాయని సమాచారం. మార్వాడీలపైన అసహనం దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత విషయమై మాట్లాడటానికి ఎంపీ కార్యాలయానికి వెళ్లిన మార్వాడీ వ్యాపారులకు కేశినేని నాని నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ‘ఎంపీ గోకరాజు గంగరాజు వద్దకు వెళ్తున్నారు.. ఆయన మీకు న్యాయం చేస్తారా?’ అంటూ నాని ఎదురు దాడి చేయడంతో ఏమి చేయాలో తెలియక మార్వాడీ ముఖ్యులంతా మౌనంగా వెనుదిరిగారు. కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా ఎంపీ అసహనం ప్రదర్శించడం మార్వాడీ ల్లో చర్చనీయాశమైంది. -
టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ల సదస్సు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం పేరుతో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి తెర లేపింది. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం దాదాపు రూ. కోటి ఖర్చు చేస్తోంది. స్టార్ హోటల్లో వసతి, విమాన ఛార్జీలు, భోజన వసతులకు భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సును నగరంలోని ఏ1 ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేది. అయితే ఈ సారి నగరానికి దూరంగా ఉన్న ఓ టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై టీడీపీ ఎంపీ ఫంక్షన్ హాల్లోనే సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కోసమే నగరానికి దూరంగా ఉన్న ఫంక్షన్ హాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
బాబు మాటలకు చప్పట్లు కొట్టడం తెలుసా?
చిత్తూరు గ్రామీణం : 'పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు మేం ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును అడగండి' అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని బాలాత్రిపుర సుందరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్ తోపాటు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు పదవులు ఇవ్వాలని కొందరు ఎస్సీ నాయకులు శివ ప్రసాద్ను డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా.... చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన మాటలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు... మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు... పదవులు ఇవ్వడం మా వల్ల కాదు, ఇవ్వడం కుదరదండి.. మీరే వెళ్లి సీఎంను అడగండి అంటూ ఎంపీ.. ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు తేల్చి చెప్పేశారు. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని నాయకులను ఈ సందర్భంగా శివప్రసాద్ కోరారు. దీంతో ఆ పార్టీ ఎస్సీ నాయకులు శివప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ప్రశ్నలు అడిగే సరికి వద్దు అంటూ దండం పెట్టి అక్కడ నుంచి శివప్రసాద్ వెళ్లిపోయారు. -
టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై ఫిర్యాదు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నర్సింహంపై (జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ) నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్కు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మైనర్లు అయిన తమ పిల్లల ఫోటోలను అభ్యంతరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంపీతో పాటు మరో అయిదుగురిపైనా అతడు ఫిర్యాదు చేశాడు. మాధవపట్నంలోని ఓ భూవివాదంలో తమ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రవికుమార్ ఫిర్యాదుపై స్పందించిన నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇందుకు సంబంధించి ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ తోట నర్సింహం ఖండించారు. తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. -
'హోదా కోసం ఉద్యమాలు చేయం'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమాలు చేయమని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. శనివారం అనంతపురం జిల్లా పెనుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్నిఇరుకున పెట్టబోమని తేల్చి చెప్పారు. స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ హోదా రాకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధిస్తామన్నారు. -
ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. దీంతో ఆయనకు స్పల్ప గాయాలైనట్టు సమాచారం. గల్లా జయదేవ్ కు వెంటనే ప్రధమ చికిత్స అందించారు. గుంటూరు లో ఓ హోటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?
ఎటూ తేలని టీటీడీ ధర్మకర్తల మండలి భవితవ్యం జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం ప్రమాణస్వీకారం ప్రకారం మే ఒకటి వరకు కొనసాగే అవకాశం పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టీటీడీ చైర్మన్గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 1వ తేదీన చైర్మన్తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టీటీడీ, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి? టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
టీడీపీ ‘ఎంపీ’ రేసులో మీడియా అధిపతులు!
తెలుగుదేశం అధినేత బాబు వద్దకు పలుమార్గాల్లో రాయబారాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీకి విభిన్న కోణాల్లో సహకరిస్తున్నందున తమను తెలుగుదేశం తరఫున రాజ్యసభకు పంపాలని పలు టీవీ చానళ్లు, పత్రికల యజమానులు, ప్రతినిధులు, వారి బంధువులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరుతున్నారు. టీడీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించిన అనేక సందర్భాలను గుర్తుచేస్తుండటంతో పాటు తమ అర్హతల గురించి పార్టీలోని ఇతర ముఖ్య నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. తమకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో తెలుగుదేశానికి ఇంకెంతగా ఉపయోగపడతామనేది వివరించడానికి కూడా వారు పోటీపడుతున్నారనేది సమాచారం. పలువురు మీడియా అధిపతులు చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను బయట పెట్టగా ఆయన పరిశీలిస్తానని హామీనిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజ్యసభ సీటు తమకు కేటాయించాలని చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మరోసారి తనను రాజ్యసభకు పంపాలని ఆశిస్తుండటంతో పాటు భాజపా కూడా రాజ్యసభ సీటును కోరుతున్నట్లు తెలుస్తోంది. తమనూ ఏపీ కోటాలో రాజ్యసభకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని తెలంగాణకు చెందిన పలువురు నాయకులు చంద్రబాబును ఇదివరకే కలసి కోరారు. కష్టపడుతున్నాంగా.. కరుణించండి... పత్రిక-టీవీ చానల్ యజమాని ఒకరు టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని గట్టి ప్రచారం జరుగుతోంది. టీడీపీతో ఎంతో కాలంగా తనకు ఉన్న వ్యక్తిగత, సంస్థాగత సంబంధాల దృష్ట్యా రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయం సమీపిస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు ప్రణాళికలను ఆయనే అమలు చేస్తున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగా ఆయన తన పత్రిక, చానల్ ద్వారా ప్రతిపక్షపార్టీ ప్రజాప్రతి నిధుల గురించి ముందుగా పుకార్లు షికార్లు చేయించడం, ఆ తరువాత వారితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మంతనాలు, సమాలోచనలు జరపడం వంటివి చేస్తున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఫలానా వారు పార్టీని వీడుతున్నారంటూ ఉన్నవీ, లేనివీ ప్రచారం చేయడం ఓ పథకం ప్రకారం జరుగుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాలు, ప్రలోభాలు మొదలు ప్రతి అంశంలోనూ ఆ పత్రిక, చానల్ అధిపతి కీలకంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు బాహాటం గానే వ్యాఖ్యానిస్తున్నాయి. మరో చానల్ చైర్మన్ కూడా టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని సమాచారం. తమకు దేశ వ్యాప్తంగా ఉన్న చానల్ నెట్వర్క్ ద్వారా పార్టీ విస్తృతికి, ప్రభుత్వ విధానాల ప్రచారానికి సహ కరిస్తానని, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన సహకారం పలు సందర్భాల్లో అందించానని టీడీపీ పెద్దల వద్ద ఆయన చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పత్రికలు, టీవీ చానళ్ల పెద్దలు ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పార్టీకి దక్కేది మూడు రాజ్యసభ సీట్లే కాబట్టి చంద్రబాబు మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఎన్టీఆర్ భవన్ వర్గాల సమాచారం. ‘మీకోసం’ మేం.. మాకోసం మీరు.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ టీవీ చానల్ అధినేత టీడీపీ రాజ్యసభ అభ్యర్థిత్వానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దిమంది టీడీపీ నేతల ద్వారా ఇప్పటికే తన మనసులోని మాటను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు, చంద్రబాబు మీకోసం, బస్సుయాత్ర, పాదయాత్ర తదితర సమయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి వార్తలు కవర్ చేయించానని, పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సానుకూల కథనాలు ప్రసారం చేశానని ఆయన బాబుకు పార్టీ నేతలతో చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనాడు చైర్మన్ సీహెచ్. రామోజీరావు దగ్గరి బంధువు ఒకరు రాజ్యసభ సీటుకోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈయనకు చంద్రబాబుతో సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. -
ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు...
బీజేపీతో చెలిమిపై ఎంపీ జయదేవ్ మంగళగిరి : తాము వచ్చే సాధారణ ఎన్నికల వరకు బీజేపీతో కలిసే నడుస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ గృహాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడతల వారీగా నిధులు అందజేస్తూ సహకరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తుందని కేంద్రంపై నమ్మకం వుందన్నారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయలేదని పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్ను కలిసి తాము ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామో తెలియజేసి అనంతరం ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవి, పార్టీ నాయకులు చావలి ఉల్లయ్య, నందం అబద్ధయ్య, సంకా బాలాజీగుప్తా పాల్గొన్నారు. -
మళ్లీ అలిగిన మాగంటి
ఏలూరు : ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా అలక వహించారు. సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. గతంలోనూ ఇలాగే అలిగి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన్ను బతిమాలి తీసుకొచ్చేవారు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎం వేదికపైకి వచ్చిన తర్వాత కూడా మాగంటి బాబు వేదికపైకి రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. సభాధ్యక్ష బాధ్యతను పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు తీసుకుని కార్యక్రమాన్ని ముగించారు. సీఎంలో ఎందుకో నిస్తేజం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించేవారు. కానీ బుధవారం నాటి పర్యటనలో ఒకింత నిస్తేజంగా కనిపించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్దగా జనం లేకున్నా గంటకుపైగా మాట్లాడే చంద్రబాబు మండుటెండలో సైతం భారీగా జనాన్ని సమీకరించినప్పటికీ.. మొక్కుబడిగానే మాట్లాడి ముగించేయడం టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. -
'వెంకయ్య, చంద్రబాబు కావాలంటే పెంచుకోగలరు'
విజయవాడ : కుమారుడు లోకేష్ను మంత్రిని చేయడం ఆయన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇష్టమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడలో లోకేష్ కోసం తమ పదవులు త్యాగం చేస్తానంటూ ప్రకటిస్తున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై జేసీ స్పందించారు. లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామనడం అంతా మెహర్భానీ మాటలు అని జేసీ అభివర్ణించారు. కులసంఘం తీర్మానించిందని లోకేష్ను మంత్రిని చేయడం కాదని ఆయన అన్నారు. అయినా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు తెలుసునని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నియోజకవర్గాలను పెంచడానికి వీల్లేదన్నారు. కానీ కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు కావాలంటే పెంచుకోగలరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు కానీ.... ఎమ్మెల్యే సీట్లు మాత్రం పెంచగలరు అని జేసీ దివాకర్రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. -
కేంద్రానికి ఏరాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదు : వెంకయ్య
ఎంపీ దేవేందర్గౌడ్ ‘ఉద్యమబాట’ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ రాసిన ‘ఉద్యమబాట’ పుస్తకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదివి భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. బీసీల గళాన్ని రాష్ట్రంలో అందరికంటే గట్టిగా వినిపించిది దేవేందర్గౌడ్ అని చెప్పారు. కేంద్రానికి ఏ రాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ మన దేశంలో ్రపజాస్వామ్య విలువలు అంతంత మాత్రంగా ఉండడమే తనతో ఈ పుస్తకం రాయించిందని దేవేందర్ గౌడ్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన దేవేందర్ గౌడ్ ఆంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి తనదైన స్ధానాన్ని సంపాదించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో దేవేందర్గౌడ్ సఫలీకృతమయ్యారని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
'విభజన తర్వాత నేనెలాంటి భూములు కొనలేదు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానిలో టీడీపీ నేతల భూ దందాపై కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం న్యూఢిల్లీలో స్పందించారు. ఈ భూ దందాపై విచారణ హాస్యాస్పదం అని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విచారణ అవసరమా లేదా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారని అని చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నేనెలాంటి భూములు కొనలేదని బల్లగుద్ది మరీ సుజనా చౌదరి చెప్పారు. విమర్శల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్లో ప్రమాదం
గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం గుంటూరు జిల్లా పేరిచర్ల వద్ద ఆయన కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అయిదు వాహనాలు స్వల్వంగా ధ్వంసం అయ్యాయి. మేడికొండూరులో ఓ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది'
అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము తెచ్చిన ప్రాజెక్ట్లను పూర్తి చేయలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు అనంతపురం నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారిందన్నారు. నగరపాలక సంస్థలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు గుర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు. -
అనంతలో బయటపడ్డ టీడీపీ వర్గపోరు
-
అనంతలో మళ్లీ బయటపడ్డ టీడీపీ వర్గపోరు
అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరో బయటపడింది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేస్తామని స్థానిక ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పషం చేశారు. అయితే అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వి. ప్రభాకర్చౌదరి.... జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలో విభేదించారు. ప్రస్తుతం అనంతపురంలో రోడ్ల విస్తరణ అవసరం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఆ క్రమంలో ఇరువురి నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. -
టీడీపీ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం
నక్కపల్లి (విశాఖపట్నం) : కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఆదివారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్గేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎంపీ కాకినాడ నుంచి విశాఖ వెళుతుండగా వాహనం చినదొడ్డిగల్లు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పైకి ఎక్కింది. ముందు చక్రం విరిగిన వాహనం డివైడర్ మధ్యలో నిలిచిపోయింది. అరుుతే తోట ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తె లిసిన చినదొడ్డిగల్లు ఎంపీటీసీ సభ్యుడు వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ డెరైక్టర్ వెలగా సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎంపీని పరామర్శించారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నట్టు తెలిసింది. తోట స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భగవంతుని దయవల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానన్నారు. హైవే పోలీస్ సిబ్బంది క్రేన్ను రప్పించి వాహనాన్ని పక్కకు తొలగించారు. తర్వాత ఎంపీ మరో వాహనంలో విశాఖ వెళ్లారు. -
టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ
గుంటూరు : భవిష్యత్లో సీపీఐ నేతలతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో సీపీఐ నేతలకు ఎంపీ రాయపాటి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడారు. టీడీపీ - బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తుందని కానీ... నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతాలకు సాయం అందించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా రాయపాటి డిమాండ్ చేశారు. రైల్వే జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలనేదే తమ డిమాండ్ అని రాయపాటి సాంబశివరావు గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధిని కోరుతున్నట్లు రాయపాటి తెలిపారు. -
రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్
విశాఖపట్నం: తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు. గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా సౌత్సెంట్రల్, ఈస్ట్కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు. -
'నేను చచ్చినా చంద్రబాబు నాకు పదవి ఇవ్వరు'
బెళుగుప్ప(అనంతపురం): వివాదాస్పద వ్యాఖ్యలు అలవాటుగామారిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదేపని చేశారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకినని, కూలీ పనికి వెళ్లేవాళ్లు కూడా రోజుకు ఐదారు సార్లు టీ తాగుతున్నారని, అలాంటివారికి రూపాయికే కిలో బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తచేయలేరని, పోలవరం ప్రాజెక్టు గురించి పుట్టినప్పటినుంచి వింటున్నానని, అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదని జేసీ వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వరని, 'నేను చస్తేగానీ నాకు మంత్రి పదవి ఇవ్వరా?' అని చంద్రబాబుతో సరదాగా అన్నానని గుర్తుచేస్తూ.. తనకు అదృష్టం లేనందున మంత్రినికాలేకపోయానని, బాబుకు లక్ ఉంది కాబట్టే సీఎం అయ్యారని జేసీ చెప్పుకొచ్చారు. -
మాగంటి బాబుకి ఏమైంది?!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయాలంటూ ఏలూరు ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాగంటి బాబుకు మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాగంటి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకమైనా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచేవారికి, పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారికి, టీడీపీ నేతలు సూచించిన వారికే దక్కాలని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ వేర్వేరు ప్రకటనల్లో బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాగంటికి పిచ్చిముదిరి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేయాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్న మాగంటి బాబును ఏమనాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలను రాజకీయ పార్టీల వారీగా చీల్చి మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. హిందూమతాన్ని కించపరుస్తారా ఒక మతానికి చెందిన సమావేశానికి వెళ్లి హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం మాగంటి దిగజారుడు తనానికి నిదర్శనమని హిందూ ధర్మ రక్ష కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం విమర్శించారు. సోమవారం కొయ్యలగూడెం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాగంటి బాబు ‘హిందూ మతంలో గంటల శబ్దం, ప్రసాదం కోసం తోపులాటలు తప్ప ఆధ్యాత్మికత ఉండదు’ అన్న ఎంపీ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ‘మాగంటి బాబు కూడా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. మరి ఆయన కూడా ప్రసాదాలకే ఎగబడుతున్నారా’ అని ప్రశ్నించారు. పోలవరం ఎమ్మెల్యే వర్గీయుల్లోనూ అసహనం చీటికీ మాటికీ పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని మాగంటి విమర్శలు సంధిస్తుండటంపై టీడీపీలోనూ అసహనం వ్యక్తమవుతోంది. టీడీపీకే చెందిన శ్రీనివాస్ను పలచన చేస్తూ ఎంపీ వ్యాఖ్యలు చేస్తుండ టంపై పార్టీలోని దళిత, గిరిజన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొయ్యలగూడెంలో సోమవారం నాటి సభలోనూ మాగంటి మొడియంను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే నా సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చెప్పండి. ఆయన సంగతి నే చూసుకుంటా’ అన్నారు. దీనిపై టీడీపీ వర్గాల్లో అంతర్గతంగా జోరుగా చర్చ నడుస్తోంది. -
'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఎన్నారైల వ్యవహారాలను చూస్తున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ ద్వారా ఎన్నారై ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారని తెలిసింది. గతంలో సత్యానందంకి కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కూడా ఈ ఎన్నారై రంగంలోకి దిగారు. కానీ అది సాధ్యపడలేదని సమాచారం. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే సత్యానందంపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
చాందీని అవమానించారు!
లోక్సభలో కాంగ్రెస్ నిరసన; వాకౌట్ న్యూఢిల్లీ: పార్లమెంటులో సోమవారమూ నిరసనలు కొనసాగాయి. కేరళలో ప్రధాని మోదీ మంగళవారం పాల్గొనే మాజీ సీఎం ఆర్ శంకర్ విగ్రహావిష్కణకు సీఎం ఊమెన్ చాందీని రావొద్దంటూ ఆహ్వానాన్ని వెనక్కు తీసుకోవడంపై లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఢిల్లీలో రైల్వే శాఖ గుడిసెలను కూల్చడంపై ఆప్ ఎంపీలూ గొడవ చేశారు. దాంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను కాసేపు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభమయ్యాక జీరో అవర్లో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ చాందీ అంశాన్ని లేవనెత్తారు. శంకర్ విగ్రహావిష్కరణకు మోదీ హాజరవుతుండగా.. నిర్వాహకులైన ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం’ సంస్థచాందీని ఆహ్వానించి, తర్వాత రావద్దంటూ సూచించిందని మండిపడ్డారు. ఇందులో ప్రధాని లేదా పీఎంఓ హస్తం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి రాజ్నాథ్ అన్నారు. నిరసనను కొనసాగించిన కాంగ్రెస్.. ఆప్, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీలతో కలిసి వాకౌట్ చేసింది. పంజాబ్లో దళితులపై దాడలకు నిరసనగా రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. కాగా, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో కలసి పనిచేయడానికి ఉద్దేశించిన అణుశక్తి సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. తెలుగు భాషా ప్రచారానికి ప్రయత్నాలు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు. -
'సంక్షేమ పథకాలు శుద్ధ దండగ'
అనంతపురం : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ. 5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలన్నారు. ప్రభుత్వం కిలో బియ్యం రూ.1కే దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలకు అందిస్తోంది గానీ, ప్రతి ఒక్కరూ రూ. 5 పెట్టి టీ తాగుతున్నప్పుడు ... కేజీ బియ్యం మాత్రం రూపాయికే ఇవ్వడం ఎంతవరకు సబబని జేసీ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు శుద్ధ దండగ అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. రూపాయికి కిలో బియ్యం వల్ల ప్రజలు మరింత సోమరిపోతులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. బియ్యం పథకాన్ని ఎత్తేయాలని, మరింత ధర పెంచి.. ఆ అధిక ధరకే పేదలకు ఇవ్వాలని అనా్నరు. ఉచిత విద్యుత్ పథకం వల్ల రైతులకు విద్యుత్ విలువ తెలియడం లేదన్నారు. దీనికి కూడా మంగళం పాడి, రైతుల నుంచి సాధారణ ఫీజులు వసూలు చేయాలన్నారు. -
జేసీ దివాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది'
గుంటూరు: టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి బిహార్లో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో యమునా నది నీళ్లు, పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన విషయం తరెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అంతకుముందు ఇచ్చిన వరాలపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. -
'బాబు శాపగ్రస్తుడయ్యాడు..'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేంద్ర మంత్రి సుజనాచౌదరికి బాగా తెలుసునని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేవలం ప్యాకేజీ మాత్రమే వస్తుందన్న విషయంపై వీరిద్దరికీ స్పష్టత ఉందని చెప్పారు. దీనిపై రోజూ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు పట్టిసీమ నుంచి నీళ్లివ్వాలని చంద్రబాబు యత్నించారని, కానీ వరుణుడు సహకరించలేదన్నారు. ఈ విషయంలో ఒకరకంగా చంద్రబాబు శాపగ్రస్తుడని జేసీ వ్యాఖ్యానించారు. అయినా చెప్పినవన్నీ చేయడానికి చంద్రబాబేమైనా మహాత్ముడా, దేవుడా అని అన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా పాలన చేస్తే చంద్రబాబుకైనా, కేసీఆర్కైనా బిహార్గతే పడుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదని, అసలు ఆ పార్టీకి కేడర్ ఎక్కడుందని ప్రశ్నించారు. కొద్దో గొప్పో ఏమైనా బలపడే అవకాశం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. నరేంద్ర మోదీపై ప్రజలు అంచనాలకు మించి ఆశలు పెట్టుకున్నారని, అవి నెరవేరకపోయేసరికి బిహార్లో బీజేపీని చిత్తుగా ఓడించారని అన్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమంపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రజలు తిరస్కరించిన నాయకులే ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తున్నారని, తాను ఏనాడో రాయల తెలంగాణ అడిగానన్నారు. అదేగనుక ఇచ్చి ఉంటే శ్రీశైలం నీళ్లు కావాల్సినన్ని రాయలసీమకు వచ్చేవని చెప్పారు. నాడు ఎవరూ మాట్లాడకుండా ఈరోజు ఏదో రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పడం తగదన్నారు. అయినా ముఖ్యమంత్రులకు ఎక్కువ మంది నాయకులు భజన చేసి, చప్పట్లుకొట్టే వారే ఉన్నారుగానీ, కనీసం చెవిలోనైనా నిజాలు చెప్పే నాయకులు లేకపోవడం దురదృష్టమని జేసీ వ్యాఖ్యానించారు. -
'రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే.. '
-
భూ వివాదంలో టీడీపీ ఎంపీ
-
'జరగబోయేది మీరే చూస్తారు'
న్యూఢిల్లీ: టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా ఆ పార్టీ ఎంపీ గుండు సుధారాణి అడుగులు వేస్తున్నారు. బుధవారం ఆమె ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి, తెలంగాణ బిడ్డగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను కలిసినట్టు ఆమె తెలిపారు. వాటర్ గ్రిడ్ లాంటి పథకాలను అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపేందుకే కేసీఆర్ ను కలిశానని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, వాటి కోసం తాను పాకులాడడం లేదని ఆమె అన్నారు. టీడీపీలో తనకు అన్యాయం జరగలేదని, తనకు ఎవరూ వెన్నుపోటు పొడవలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. ' జరగబోయేదాన్ని మీరే చూస్తారు. బ్రాహ్మలకు తెలవకుండా పెళ్లైతే కాదు కదా' అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గురువారం టీఆర్ఎస్ పార్టీలో సుధారాణి చేరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
'జరగబోయేది మీరే చూస్తారు'
-
కారెక్కనున్న రాజ్యసభ ఎంపీ
-
లోకేష్పై జేసీ గరంగరం
-
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సాక్షిగా జేసీకి అవమానం
హైదరాబాద్: టీడీపీ యువనేత లోకేష్ను కలవడానికి వెళ్లిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తీవ్ర అవమానం జరిగింది. నియోజక వర్గ పనులకు సంబంధించి మంగళవారం లోకేష్ను కలవడానికి వెళ్లిన జేసీ.... ముందుగా చిన్నబాబు అపాయింట్మెంట్ తీసుకోలేదనే కారణంతో వెనుదిరగాల్సి వచ్చింది. లోకేష్ను కలవడానికి గంటసేపు వేచి చూసి చివరకు లోకేష్ బిజిగా ఉన్నారని పీఏ తెలపడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంగా పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. సీనియర్ నాయకులమైనా తమకు పార్టీలో ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ జేసీ ప్రశ్నించారు. సీఎం దగ్గరకు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా తాము వెళ్లిన సందర్బాలున్నాయని ఆయన గుర్తు చేశారు. సీనియర్లమైనా తమకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా లోకేష్ బాధితుల్లో ఒక్క జేసీనే కాదని... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఉన్నారనే పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే జేసీకి... లోకేష్ సమయం ఇవ్వకపోవడానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడుపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలే కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని జేసీ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అవుట్డేట్ నాయకుడని జేసీ మీడియా ముందు కుండబద్దల కొట్టినట్లు చెప్పటంతో...చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలో బాగంగానే లోకేష్ జేసీని కలవడానికి ఇష్టపడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. -
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
-
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాకినాడ: ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి, దీపావళి పేరుతో నీటిని, వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఏఎంజీ పాఠశాలలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో బడ్జెట్ లేనందున పండుగలను కంట్రోల్ చేద్దామని చెప్పారు. -
'హోదా వస్తుందంటే నాతో పాటు 10 మంది రెడీ'
హైదరాబాద్: అనంతపురం లోక్సభ సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జేసీ దివాకర్రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే నేను, మరో 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కి కోపం ఎక్కువ కాబట్టే లేటెస్ట్ నాయకుడయ్యారన్నారు. చంద్రబాబుకు కోపం తక్కువ కాబట్టే ఔట్ డేటెడ్ నాయకుడయ్యారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి బీహార్ కంటే ఎక్కువ ప్యాకేజీ వస్తుంది కానీ ప్రత్యేక హోదా మాత్రం రాదని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. -
బైకు పైనుంచి పడిన ఎంపీ గల్లా జయదేవ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్కు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో బైకు పైనుంచి పడి గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడి కోసం కొత్త బైకు కొని ట్రయల్స్ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎంపీ గల్లాకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెన్నెముకకు మాత్రమే గాయమైందని చెప్పారు. బైకు అదుపు తప్పడంతో ఆయన దాని మీద నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. పక్కన ఉన్న వారు వెంటనే గమనించి ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసి తక్షణమే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎంపీ గల్లా జయదేవ్.. టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు సమీప బంధువు. -
సీఎం రమేష్ వర్గానికి లైన్ క్లియర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం గుర్తింపు విషయంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వర్గానికి ఊరట లభించింది. ఒలింపిక్ సంఘాల గుర్తింపు వివాదంలో పురుషోత్తంనాయుడు వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. టీడీపీకే చెందిన మరో ఎంపీ గల్లా జయదేవ్ వర్గం తరపున పురుషోత్తం నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం పగ్గాల కోసం సీఎం రమేష్, గల్లా జయదేవ్ వర్గాలు పోటీపడిన సంగతి తెలిసిందే. తమదే నిజమైన ఎన్నికని ఇరు వర్గాలు ప్రకటించుకున్నాయి. తాజాగా హైకోర్టు పురుషోత్తంనాయుడి పిటిషన్ను తిరస్కరించడంతో రమేష్ వర్గానికి లైన్ క్లియరైంది. -
ఏపీని ఆర్థికంగా ఆదుకుంటాం:జైట్లీ
-
పట్టిసీమతో ‘సీమ’కు నీళ్లు రావు
టీడీపీ ఎంపీ జేసీ వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మించతలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు రావని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం దుర్వినియోగమేనని విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతి సంవత్సరం ఈ సమయానికి కృష్ణా నదిలో నీళ్లు ఉండేవి. ఈమారు నీళ్లు లేవు. దీని వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నది, కష్టపడుతున్నది రాయలసీమ. సీఎం రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారు. కానీ దీని వల్ల డెరైక్టుగా రాయలసీమకు నీళ్లు రావు. పట్టిసీమ వల్ల ఏమవుతుంది? విజయవాడ వద్ద కృష్ణా నదికి నీళ్లు ఇచ్చి.. అక్కడి పంటలు కాపాడి.. అక్కడ మిగిల్చిన నీళ్లను ఆ తరువాత శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇవ్వాలని ఆయన ఉద్దేశం. ఆయన కల ఫలిస్తుందా? లేదా? అన్న అనుమానం వస్తోంది. ఈరోజు కృష్ణా నదిలో శ్రీశైలానికి నీళ్లు రావాలంటే ఆల్మట్టి, నారాయణపూర్ నిండాలి. తరువాత గద్వాల వద్ద ఉన్న ప్రాజెక్టులు నిండాలి. ఇవన్నీ ఐదారేళ్ల క్రితం వచ్చిన ప్రాజెక్టులు. తొలుత ఎవరికి అవసరం ఉందో వారికివ్వాలి. ఆ పద్ధతి ఇప్పుడు కృష్ణానదిపై లేదు. కావేరి నదికి ఉంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే కృష్ణా బోర్డును ఆశ్రయించాలి. లేదంటే కేంద్రాన్ని సంప్రదించాలి. అవసరమైతే కొందరం ప్రయివేటు వ్యక్తులం సుప్రీం కోరుకెళ్లేందుకు సిద్ధం’ అని జేసీ పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు తెలుసు: జేసీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసునని అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇదే విషయం ఎంపీలు, ఎమ్మెల్యేలందరిని కూడా తెలుసునని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు రాష్ట్రానికి అదనపు ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలను మభ్య పెట్టవచ్చునని ఈ నాయకులు అనుకుంటున్నారు... కానీ వారికి అంతా తెలుసునని జేసీ దివాకర్రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఓ మాట... అధికారంలోని వచ్చిన తర్వాత ఓ మాట మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా బీజేపీపై జేసీ దివాకర్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై తాము ఎన్ని సార్లు అడిగినా ... దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్లు కేంద్రం వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల వాయిస్కు ఈ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశం చాలా మందికి అర్థం కాలేదని జేసీ దివాకర్రెడ్డి అన్నారు. నిజం చెప్పాలంటే నాకూ కూడా వంద శాతం తెలియదన్నారు. కానీ ఆబాలగోపాలం మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తోందని జేసీ దివాకర్రెడ్డి గుర్తు చేశారు. -
బట్టలూడదీసుకుని తిరగమంటారా?
-
చంద్రబాబుకు ముందే తెలుసు : జేసీ
-
'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'
ఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూపించడానికి ఇటువంటి ధర్నాలు పనికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా చేశారు. -
టీడీపీఎంపీల విమర్శలపై జనసేన కార్యకర్తల ధర్నా
-
సైన్యంపై చెత్తవాగుడు వాగిన టీడీపీ ఎంపీ
-
కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం
-
కేసీఆర్పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఆయన ప్రశంసించారు. మల్కాజ్గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మంచి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారన్నారు. మల్కాజ్గిరి ప్రాంతానికి ఆయన వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. -
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి:శివప్రసాద్
-
జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కేంద్రంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: 'మన దేశంలో ఎన్నికల నిర్వహణ వట్టి దండగ.. చట్ట సభలు వృథా.. ఈ ప్రజాస్వామ్య పద్ధతి మారాలి..' అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో 'ఆప్' దెబ్బకు బీజేపీ ఊడ్చుకు పోయిందంటూ ఘాటుగా విమర్శించారు. అనంతపురంలో తన స్వగృహంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తమలాంటి వారి సలహాలు పట్టించుకోకపోవటం వల్లనే ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన దృష్టిలో చట్ట సభలన్నీ వృథాగా మారిపోయాయని మండిపడ్డారు. కేంద్రం తమ మాట వినకపోతే ఇక ఎంపీ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానం రావాలని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణ కారణంగా అయిదేళ్లకోసారి కొన్ని వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని చెప్పారు. తామంతా వృథా అంటూ ఆయన.. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబును పొగిడారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన దారిలో నడిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్పై.. అనంతరం జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్పై దాడికి దిగారు. ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే రాహుల్, సోనియా, ప్రియాంక తదితరులు వెంటనే తప్పుకోవాలని సూచించారు. వీరు అసలైన గాంధీలు కాదని విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండాల్సిందని, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బును మిగుల్చుకునేందుకే ఆ పార్టీ నేతలు పోటీలోకి దింపారని ఆరోపించారు. -
మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ
బంజారాహిల్స్: రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతకులు దొంగిలించారంటూ రామ్మోహన్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్కుమార్రెడ్డి, డీఐ రాంబాబు ఆధ్వర్యంలో డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనా స్థలికి వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్తో పాటు ఏడుగురిని పోలీసులు విచారించారు. -
టీడీపీ ఎంపీపీ బెదిరిస్తున్నారు
అనంతపురం అర్బన్: తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరిస్తున్నాడని రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి మాదిగ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసుతో కలిసి బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ చేస్తున్న దౌర్జన్యం గురించి వివరించారు. గతంలో తాను ఒక విప్లవ పార్టీకి ఆకర్షితుడై దానిలో చేరానని, ఆ తర్వాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయానని నారాయణస్వామి మాదిగ తెలిపారు. అప్పట్లో నక్సల్స్ పునరావాసం కింద ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని ప్రకటించినా తనకు న్యాయం జరగలేదన్నారు. అయితే తమ పూర్వీకుల భూమి సర్వే 207 రెండో లెటర్లో ఉన్న 5.69 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తన భూమి గ్రామానికి సమీపాన ఉండడంతో ఆ భూమిని ఏలాగైనా సొంతం చేసుకోవాలని ఎంపీపీ తన పలుకుబడిని ఉపయోగించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే..జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, వాటికి వెంటనే స్థలాలు కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా యువసేన అధ్యక్షుడు వి.రమణ మాదిగ, రాష్ర్ట కో-కన్వీనర్ చిన్నపెద్దన్న మాదిగ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కాంట్రాక్టు వర్కర్లకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు అందలేదని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలు బండారు నాగేశ్వరరావు, సి.నారాయణ, కె.జోసఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వేతనాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలి : సకాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి సూచించారు. 15 రోజుల లో 50 శాతం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాల గృహ విద్యుత్ రాయితీ కింద జిల్లాలకు 2014-15లో రూ. 13.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ బి.ల క్ష్మీకాంతం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అందిన 2,055 ఫిర్యాదులలో 1,845 పరిష్కరించామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 210 పిటిషన్లను పది రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్లో 39, ఐసీడీఎస్లో 6, డీఆర్డీఏలో 7, డ్వామాలో 8, పోలీసుశాఖలో 48, ఎల్డీఎంలో 60, డీపీవో 3, ఆర్డబ్ల్యూఎస్ 7, వ్యవసాయశాఖలో 8 పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్యాద్రి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీ ఇంటిముందు 'క్యాష్' బైక్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యడు సి. మల్లారెడ్డి ఇంటిముందు అనుమానాస్పద బైక్ (నంబరు టీఎస్ 10 ఈఏ 5504) ప్రత్యక్షమైంది. ఈ వాహనంలో డబ్బులు ఉన్నాయి. ఈ బైక్ ఎంపీ వర్గీయులదేనని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు బైక్ను స్టేషన్కు తరలించారు. ఆదివారం కంటోన్మెంట్ పాలక ఎన్నికల సందర్భంగా ఈ బైక్ ఎంపీ ఇంటి ముందు ప్రత్యక్షం అవ్వడం గమనార్హం. -
'అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం'
కడప: మా ప్రభుత్వం అధికారంలో ఉంది... మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తానంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారు. శనివారం కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపీ సీఎం రమేష్ జెడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమళ్లు ప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో ఉండటానికి సీఎం రమేష్ అనర్హుడంటూ మినిట్స్లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రూలింగ్ చేయడానికి జెడ్పీ చైర్మన్కు అధికారం లేదని జిల్లా కలెక్టర్... సీఎం రమేష్ను వెనకేసుకు వచ్చారు. దీంతో వైఎస్ఆర్ జడ్పీటీసీ సభ్యులు జెడ్పీ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ క్రమంలో సీఎం రమేష్ ఆగ్రహంతో ఊగిపోతూ పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏపీకి... అలాగే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు తెలంగాణకు ఎంపికయ్యారు. సీఎం రమేష్ తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణకు చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ జెడ్పీ సమావేశానికి ఎలా హజరవుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. -
ఎస్పీపై మాగంటి బాబు హల్చల్
టీడీపీ కార్యకర్తల మనోభీష్టానికి అనుగుణంగా కోడిపందాల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలీసులకు వ్యతిరేకంగా తమ గళం విప్పినా ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాత్రం మరింత దూకుడుగా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఉంగుటూరు వచ్చిన సందర్భంలో కూడా జిల్లా ఎస్పీకి, ఎంపీ బాబుకు మధ్య మాటల అంతరం చోటు చేసుకుందన్న వాదనలు వినిపించాయి. సభావేదికపైకి ఎంపీతో ఉన్న వారిని అనుమతించే విషయంలో ఎస్పీ అభ్యంతరం చెప్పడంతో బాబు అలిగి కిందనే ఉండిపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు బతిమాలడంతో వేదికపైకి వెళ్లడం ఆ రోజు చోటుచేసుకున్నాయి. బహుశా అది దృష్టిలో పెట్టుకునే మాగంటి బాబు ఇప్పుడు కోడిపందాల విషయంలో ఎస్పీని టార్గెట్ చేశారని అంటున్నారు. లేదంటే మండల స్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా ఎస్పీకి వ్యతిరేకంగా బహిరంగ నినాదాలిచ్చే సాహసం చేయరన్న వాదనలున్నాయి. మాగంటి బాబు ప్రోద్బంలతోనే పోలీసులైపై టీడీపీ శ్రేణులు ఇలా రెచ్చిపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగానే మాగంటి తీరు కూడా ఉంది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు భేటీ అయినా మాగంటి బాబు మాత్రం రాలేదు. అప్పటివరకు అక్కడే ఉన్న ఆయన అధికారులతో భేటీకి ముందే ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఐజీ హరికుమార్కు ఫోన్ చేసి జిల్లా పోలీస్ యంత్రాంగం కోడిపందాలపై అతిగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాగంటి బాబు జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్రెడ్డి లక్ష్యంగానే కోడిపందాల కథ నడిపారన్న వాదనలు రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. -
టీడీపీ నాయకుల డైరెక్షన్.. కార్యకర్తల యాక్షన్
(సాక్షి ప్రతినిధి, ఏలూరు) : సంక్రాంతి రాకుండానే జిల్లాలో పోలీసులకు, టీడీపీ ప్రజాప్రతినిధులకు కోడిపందాలు వివాదం రాజేశాయి. కోడిపందాల నిర్వహణపై కట్టుదిట్టంగా తమదైన శైలిలో వ్యవహరిస్తోన్న పోలీసుల వైఖరితో ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో పోలీసులను టార్గెట్ చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. కోడిపందాలు ఆడకుండా చూడాలంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చేసిన ధర్నా వివాదాస్పదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కోడిపందాలు.. పండగ వేళ సంప్రదాయ ముసుగులో జరిగే ఈ కోడిపందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తుంటారంటే దీనికున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పండగ ముందు రోజు నుంచి మొదలయ్యే కోడిపందాల జోరు ఈసారి కొత్త సంవత్సరం రాకుండానే ఊపందుకుంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు గెలుచుకుని టీడీపీ అధికారంలోకి రావడంతో కార్యకర్తలు ప్రజాప్రతినిధుల భరోసాతో ముందస్తుగానే కోడిపందాలు ఆడటం ప్రారంభించారు. అయితే కోడిపందాలు, దానిపై బెట్టింగ్లతో చాలామంది తమ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న నేపథ్యంలో ఏలూరుకు చెందిన ఓ న్యాయవాది వేసిన పిల్పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కోడిపందాలకు అడ్డుకట్ట వేయాలని డీజీపీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ జూదంపై ఉక్కుపాదం మోపింది. జిల్లావ్యాప్తంగా కోడిపందాల నిర్వాహకులను గుర్తించే చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 300 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. మరోవైపు కోడిపందాల వల్ల జరిగే అనర్థాలపై భీమవరం విద్యార్థులు రూపొందించిన డాక్యుమెంటరీతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. బ్రహ్మయ్య అరెస్ట్ సాకుతో... సరిగ్గా ఇదే సమయంలో ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో 15 రోజులుగా రాత్రిపూట కోడిపందాలు నిర్వహిస్తోన్న విషయాన్ని పోలీసులు గుర్తించి రెండు రోజుల క్రితం దాడులు చేశారు. 17 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి రూ.4 లక్షల వరకూ నగదు, కార్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాల నిర్వాహకుడిగా గుర్తించిన టీడీపీ నేత, రామన్నగూడెం సహకార సంఘం అధ్యక్షుడు సుంకవల్లి బ్రహ్మయ్యపై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. దీంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్లు మంగళవారం నాటి జిల్లా విజిలెన్స్ సమీక్షా సమావేశానికి వచ్చిన ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు కలవపూడి శివ, గన్ని వీరాంజనేయులును ఘెరావ్ చేశారు. పోలీసులపై తమ అక్కసు వెళ్లగక్కేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు ఇదే అదనుగా కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలు ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా ఎస్పీ, పోలీసులే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ హైడ్రామా చివరికి ఎస్పీ మాట్లాడిన రెండే రెండు మాటలతో చప్పున చల్లారింది. ధర్నా అనంతరం కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రఘరామ్రెడ్డితో టీడీపీ ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎస్పీ బయటకు వచ్చి ద్వారకాతిరుమల ఎస్సై తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం.. కోడి పందాలకు సంబంధించిన అరెస్ట్లపై న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం.. అని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎస్సైని వీఆర్లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఏం ఒరిగింది? జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశాన్ని నాలుగున్నర గంటలు బహిష్కరించి నానాయాగీ చేసిన టీడీపీ నేతలకు ఏం ఒరిగిందంటే ఎవరి వద్దా సరైన సమాధానం లేదు. ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలతో జనం కొట్టుమిట్టాడుతుంటే బాధ్యత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సరదా కోసం ఆడే కోడిపందాల కోసం ఇలా రోడ్డెక్కడం విమర్శలపాలైంది. -
సొమ్ములున్నా..సంకల్పం సున్నా
‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్ అప్పట్లో తెలుగునాట బాగా క్లిక్ అయింది. ‘రాష్టం క్లిష్ట పరిస్థితిలో ఉంది’.. ఆర్నెళ్ల క్రితం అధికారంలోకొచ్చిన తెలుగుదేశం సర్కారు అనేక సందర్భాల్లో వల్లిస్తున్న మాట ఇది. పట్టణాల్లో వందరోజుల ప్రణాళిక నుంచి పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాల వరకూ సొమ్ములు విదల్చడానికి తటపటాయిస్తుండగా.. మరోపక్క ఆ పార్టీకే చెందిన జిల్లా ఎంపీలు ముగ్గురూ కేంద్రం ఇచ్చిన సొమ్ములతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపే తీరిక లేకుండా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘కోట్లు కుమ్మరించైనా మీరడిగిన పనులన్నీ చేసేస్తా’మని ఎన్నికల్లో బీరా లు పలికారు టీడీపీ ఎంపీ అభ్యర్థులు. అది నమ్మి జిల్లా జనం ఆ ముగ్గురు అభ్యర్థుల్నే పార్లమెంటుకు పంపించారు. వారు ఎన్నికై అప్పుడే ఆరు నెలలు గడిచింది. ఇప్పుడు నిధులు దండిగా ఉన్నా పనుల మాటటుంచి కనీసం ప్రతిపాదించేందుకు కూడా వారు పూనుకోవడం లేదు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కాకినాడ ఎంపీ తోట నరసింహానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ 2004 ఎన్నికల్లో ఓటమి చెందగా, 2014లో గెలుపొందారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు ఎన్నికల గోదాలో దిగిన తొలిసారే ప్రజలు పట్టంకట్టారు. ఈ ముగ్గురూ ఎంపీ బరిలోకి దిగిన నేపథ్యం ఏదైనా ప్రజలు మాత్రం వారిని ఆదరించారు. జనం రుణం తీర్చుకోవడానికి తమ, తమ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఎంపీలు అందుకు విరుద్ధంగా అలసత్వం వహిస్తున్నారని నియోజకవర్గాల ప్రజలు నిరసిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులకు చంద్రబాబు సర్కార్ కోతపెట్టడంతో ఎమ్మెల్యేలకంటూ నిధులు లే కుండా పోయాయి. కనీసం ఎంపీలకు కేం ద్రం ఇచ్చే స్థానిక అభివృద్ధి నిధుల (ఎంపీ ల్యాడ్స్)తోనైనా అభివృద్ధి పనులు చేపడతారనుకుంటే ముగ్గురు ఎంపీలకూ ఆ ధ్యాసే కరువైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలనామోదం లభించినా.. ఎంపీ లాడ్స్గా ఒక్కో ఎంపీకీ ఏడాదికి రూ.5 కోట్లు కేంద్రం విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా తొలి విడతగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలకూ రూ.2.50 కోట్ల వం తున నిధులకు పరిపాలనామోదం లభించింది. ఈ మేరకు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ మన ఎంపీలు ఎందుకనో ఆ నిధుల జోలికి పోవడం లేదు. వచ్చిన నిధులతో అభివృద్ధి పనుల్ని ప్రతిపాదించే తీరికా, ఓపికా ముగ్గురు ఎంపీలకూ లేదని జిల్లా ప్రజలు ఆక్షేపిస్త్తున్నారు. ఎంపీ లాడ్స్తో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, డ్రైన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు వీలుంటుంది. పనులకు ప్రతిపాదనలు ఇవ్వడమే తరువాయి అని, వాటిని ఆమోదించడం పెద్ద విషయం కాదని జిల్లా యంత్రాంగం చెబుతోంది. అయితే ప్రతి పాదనల కోసం నిరీక్షిస్తున్నా ఎంపీల నుం చి స్పందన లేదంటున్నారు. కాగా ముగ్గురు ఎంపీల్లో తోట నరసింహం రూ.2 లక్షల విలువైన ఉపకరణాలు వికలాంగులకు ఇవ్వాలని ప్రతిపాదించినా.. అనంతరం ఆ ఊసే మరిచారు. పోనీ.. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అయినా పనులు చేపట్టేందుకు చొరవ తీసుకున్నారా అదీ లే దని అధికారులు చెపుతున్నారు. ఇకనై నా.. ఎంపీలు అలసత్వాన్ని వీడి, పరిపాలనామోదం లభించిన ఎంపీ లాడ్స్కు ప్ర తిపాదనలు పంపి, ప్రజోపయోగకరమైన పనులను చేయిస్తే పదవికి సార్థకత, ఎన్నుకున్న వారి మన్నన దక్కుతాయి. -
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
-
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో తాము రాయల తెలంగాణ కోరామని... కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇవ్వలేదని టీడీపీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఓ వేళ రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే ... అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ... జానారెడ్డి సీఎం అయ్యేవారన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి జేసీ వచ్చారు. అసెంబ్లీ ఛాంబర్లోని పాత మిత్రుడు జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య అసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో ఉండదన్నారు. అందుకే టీడీపీలో తాను స్వేచ్ఛగా లేనన్నారు. ఎంపీ పదవి తనకు సరిపోదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓవర్ లోడ్ అయ్యిందని చెప్పారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఇప్పుడు బీజేపీ వేదిక అవుతోందని అన్నారు. ఇందిరా కన్నా మోడీ పవర్పుల్ పీఎం అని చెప్పారు. ఎన్నికల ముందు మోడీ వేరు... ప్రధాని పదవి చేపట్టాక మోడీ వేరని తెలిపారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు. టీడీపీ, టీఆర్ఎస్.... ఏ ప్రభుత్వంపైన అయిన ఏడాది తర్వాతే కామెంట్ చేయాలని జేసీ అభిప్రాయపడ్డారు. -
ఏ శాఖ అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తా: సుజనా
హైదరాబాద్: కేంద్రమంత్రిగా తనకు ఏ శాఖ బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తానని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు. కేంద్రమంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకుంటానన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుతో సుజనా చౌదరి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా మీకు కేంద్రమంత్రి పదవి వరించనుందని విలేకర్ల అడిగిన ప్రశ్నకు సుజనా పైవిధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని విధాల తోడ్పాటు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తనకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి విషయం వెల్లడించారని ఈ సందర్భంగా సుజనా వెల్లడించారు. సుజనా చౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లాలోని కంచికచర్ల. సుజనా చౌదరి బాల్యం అంతా హైదరాబాద్లో సాగింది. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయన తండ్రి యలమంచిలి జనార్దనరావు నీటిపారుదల శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహించారు. -
కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
ఎంపీ రాయపాటి సాంబశివరావు సాక్షి, తిరుమల : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, హుందాగా వ్యవహరించాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. సోమవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తి విషయంలో కేసీఆర్ పొంతనలేని మాటలు, చేష్టలతో ఆ రాష్ర్ట ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తన చేతకానితనంతో సమస్యను అధిగమించలేక పక్క రాష్ట్రాన్ని బాధ్యులను చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. రూ.16 వేల కోట్ల లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు సమర్థతతో వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. -
కేశినేని నాని వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలి
-
కేశినేని నాని వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలి
విజయవాడ : విజయవాడ పాత బస్టాండ్ సెంటర్లోని స్థలానికి సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఎంపీ కేశినేని కార్యాలయం వద్ద ప్రైవేట్ స్థలానికి సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో స్థల యజమాని బొమ్మదేవర వెంటక సుబ్బారావు 500 గజాల తన స్థలాన్ని కేశినేని నాని ఆక్రమించారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేశినేని నాని ఆ స్థలాన్ని వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సుబ్బారావు ఎన్నిసార్లు కోరినా...ఎంపీ స్పందించకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. సాయంత్రంలోగా స్థలాన్ని ఖాళీ చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశాడు. కాగా ఇదే విషయంపై స్థల యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశాడు.