వరుసగా కురుస్తోన్న కుండపోత వర్షాలతో రాష్ట్ర రాజధాని నగరం మళ్లీ అస్తవ్యస్తమైంది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో జనజీవనం స్తంభించింది. రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా శ్రీనగర్కాలనీలో 6.4 సెం.మీ., అమీర్పేటలో 5.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం పూర్తిగా నీటమునిగింది. దీంతో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలోకి వరదనీరు చేరడంతో ఇప్పటికే మ్యాచ్ను వీక్షించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులు నిరాశ చెందుతున్నారు.
నగరంలో మళ్లీ జడివాన
Published Fri, Oct 13 2017 7:04 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement