‘ఆక్రోశ్ దిన్‌‌’కు జేడీయూ దూరం | JD(U) decides to not be part of 'Akrosh Diwas' | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 27 2016 1:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నోట్ల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తలపడుతోన్న విపక్షపార్టీల కూటమికి మరో ఝలక్‌. నోట్ల రద్దు నిర్ణయాన్ని, అమలు తీరును వ్యతిరేకిస్తోన్న విపక్ష పార్టీలు కలిసి ఈ నెల 28న(సోమవారం) దేశవ్యాప్త బంద్‌‘ఆక్రోశ్‌ దిన్‌’ను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బంద్‌లో పాల్గొనబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించగా, తాజాగా నితీశ్‌ కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న జనతాదళ్‌ యునైటెడ్‌- జేడీయూ కూడా ‘ఆక్రోశ్‌‌’కు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు జేడీయూ కీలక నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన కార్యాలయం వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement