-
సీఎం నితీష్ కుమార్ జీ మీరెక్కడా? బీజేపీ ప్రచారంపై తేజస్వీ ప్రశ్నల వర్షం
బీహార్లో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ గయా, పూర్ణియాలో చేపట్టిన ర్యాలీలకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. సీఎం నితీష్ కుమార్జీ మీరెక్కడా? ఎన్నికల ర్యాలీలకు బీజేపీ ఆయనను ఎందుకు ఆహ్వానించడం లేదు? మంగళవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కూడా ఆయన ఎందుకు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని చేసిన ఆరోపణలపై తేజస్వీ యాదవ్ స్పందించారు. మోదీ మూడవసారి అధికారంలోకి రాగానే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కమలం నేతలే చెబుతున్నారు. వారిపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, యువతకు ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, నల్లధనాన్ని భారతదేశానికి వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నొక్కాణించారు. -
‘ఇక మాట్లాడింది చాలు’.. బహిరంగ సభలో సీఎం నితీష్కు అవమానం
పాట్నా : బీహార్లో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవాడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కూటమిలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరయ్యారు. అయితే ఈ సభలో సీఎం నితీష్ కుమార్కు సొంత పార్టీల నేతల నుంచి తీవ్ర అవమానం ఎదురైంది. నవాడాలో లోక్సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ భారీ బహిరంగ సభలో నితీష్ కుమార్ 25 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో నితీష్ కుమార్ పలు మార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. సీఎం నితీష్ ప్రసంగిస్తుండగా.. ఆ పార్టీల నేతలు తమవాచీలు చూసుకుంటూ.. మీ ప్రసంగం ఇంక చాలంటూ చేతులతో సంజ్ఞలు చేశారు. आज नीतीश जी ने तो 4000 पार का नारा लगा दिया। 🤣 pic.twitter.com/Sef6ACaSxo — Kanchana Yadav (@Kanchanyadav000) April 7, 2024 జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి వేదిక ముందు వరుసలో కూర్చొని తన గడియారాన్ని తనిఖీ చేస్తూ కదులుతూ కనిపించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రికి సైగలు చేసి, తన ప్రసంగాన్ని ముగించమని సైగలు చేశారు. పలువురు నాయకులు పోడియం వైపు అసహనంగా ఎదురుచూస్తూ కనిపించారు. This should go viral and everyone in Bihar should watch this Nitish Kumar had to touch Modi's feet and then do Pranam to him. This is what Chief Minister has reduced to? Stop treating someone like God. pic.twitter.com/6aH6UgR7CH — AmOxxicillin FC (@amoxcicillin1) April 7, 2024 దీంతో చేసేది లేక రెండు నిమిషాల తర్వాత తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ.. నితీష్ కుమార్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. ‘మీరు మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడడానికి ఏమీ మిగల లేదు’ అని అన్నారు. అంతే వెంటనే కృతజ్ఞతగా నితిష్ కుమార్ చిరునవ్వులు చిందిస్తూ మోదీ పాదాలు తాకారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బిహార్ సీఎం నితీష్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది. చదవండి: 'సందేశ్ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్ ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు. -
Bihar: నితీశ్ జోకులు.. ప్రధాని నవ్వులు
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్కుమార్ తన మాటలతో ప్రధాని మోదీని నవ్వించారు. రాష్ట్రంలోని ఔరంగాబాద్లో శనివారం జరిగిన రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ, నితీశ్కుమార్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ ‘ఇంతకుముందు మీరు వస్తే నేను మాయమయ్యేవాడిని. కానీ ఇప్పుడు మీతోనే ఉన్నాను. ఇక నేను అటు ఇటు వెళ్లను మీతోనే ఉంటానని మాటిస్తున్నాను’అని అనడంతో మోదీ నవ్వారు. బీజేపీ, జేడీయూ కలిసి పూర్తి ఐదేళ్లు లేకున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బిహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్తో సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలి పెట్టిన నితీశ్ ఎన్డీఏతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ తొలి పర్యటనకు వచ్చినపుడు నితీశ్కుమార్ తన మాటలతో పండించిన హాస్యం ఆసక్తికరంగా మారింది. #WATCH | Bihar CM Nitish Kumar says, "...You (PM Modi) had come earlier as well, 'par idhar hum gayab ho gaye the. Hum phir aapke saath hai.' I assure you that I will not go here and there. 'Hum rahenge aap hi ke saath'..." pic.twitter.com/itLbLBS5rg — ANI (@ANI) March 2, 2024 ఇదీ చదవండి.. వారణాసి నుంచే మళ్లీ మోదీ -
‘ఇక మీతోనే ఉంటా..’ ప్రధాని మోదీ నవ్వులు
పట్నా: తాను ఇక పార్టీలు మారబోనని బీజేపీ-ఎన్డీయే కూటమిలో ఉంటానని బిహార్ సీఎం నితీష్కుమార్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాటిచ్చారు. నితీష్ మాటలతో వేదికపై ఉన్న ప్రధాని మోదీ సహా పలువురు నేతలు పగలబడి నవ్వారు. బిహార్లోని ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. #WATCH | Bihar CM Nitish Kumar says, "...You (PM Modi) had come earlier as well, 'par idhar hum gayab ho gaye the. Hum phir aapke saath hai.' I assure you that I will not go here and there. 'Hum rahenge aap hi ke saath'..." pic.twitter.com/itLbLBS5rg — ANI (@ANI) March 2, 2024 ‘మీరు(మోదీ) త్వరగా వచ్చారు. లేకపోతే నేను పూర్తిగా మాయమయ్యేవాడిని. కానీ, నేను మీతో( మోదీ) ఉన్నా. నేను మీకు హామీ ఇస్తున్నా నేను ఏ కూటమిలోకి మారబోను. నేను మీతోనే ఉంటాను’ అని సీఎం నితీష్ కుమార్ అన్నారు. నితీష్ కుమార్.. బిహార్లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. జనవరిలోని నితీష్ కుమార్ బీజేపీ కూటమి మద్దతుతో తొమ్మిదోసారి సీఎం ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ బీహార్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక.. రూ. 4,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ బిహార్లో పర్యటించారు. -
ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్ కుమార్
పాట్నా: ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ -
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్కు బంధువుతో కలిసి బైక్పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్పై రెండు మోటార్సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్కుమార్కు బిహార్లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం విజయం
-
మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్
బిహార్లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. నితీష్ కుమార్పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అన్నారు. ఒక టర్మ్లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే.. ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. ‘నేను సీఎం నితీష్ కుమర్కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్) కొనసాగిస్తాడు. బిహార్లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు. నితీష్ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్లోని మహాఘట్బంధన్ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్. చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్
బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ సీఎం నితీష్కుమార్కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు బిహార్లో మొత్తం 243 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 122 శాసన సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్ నితీష్ కుమార్కు అనుకూలంగా ఓటేసిన ఐదుగురు విపక్ష సభ్యులు బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం నితీష్ కుమార్ నితీష్ కుమార్పై తేజస్వీ యాదవ్ ఘాటు విమర్శలు బీహార్లో ఏ ఒక్కరికీ నితీష్ కుమార్పై నమ్మకం లేదు నీతీష్ మళ్లీ జంప్ చేయరని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా? బిహార్ అసెంబ్లీ స్పీకర్పై నెగ్గిన అవిశ్వాసం అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు ప్రస్తుత బిహార్ స్పీకర్గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి నితీష్కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు బిహార్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. కొత్తగా కొలువుదీరిన జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్- బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఈ బల పరీక్షలో ఎన్డీయే సర్కార్ సులువుగా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాసం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 113 ఓట్లు వచ్చాయి. అయితే నితీష్కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయ్యడం గమనార్హం. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి ఉన్నారు. #WATCH | Bihar Governor Rajendra Arlekar addresses the State Assembly Floor Test of CM Nitish Kumar's government to prove their majority will be held today. pic.twitter.com/uE1jWBIdmr — ANI (@ANI) February 12, 2024 అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. BIG BREAKING: Tejashwi Yadav reaches the Bihar assembly for the floor test. The wait is over, 'Khela' begins now 🔥#BiharFloorTest pic.twitter.com/lVhoJ8qBqg — Ankit Mayank (@mr_mayank) February 12, 2024 బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని(ఆర్జేడీ నేత) తొలగించాలంటూ ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెంటనే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బల పరీక్ష జరగనుంది. #BiharFloorTest | Bihar CM and JDU national president #NitishKumar arrives at the #Bihar Assembly in Patna ahead of the floor test of his government today.#Bihar #JDU #BiharFloorTest #NitishKumar #BiharPoliticalCrisis #TejashwiYadav #तेजस्वी_ज़रूरी_है #Patna #ElvishYadav… pic.twitter.com/l2TjHuhzkJ — Neha Bisht (@neha_bisht12) February 12, 2024 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీ-జేడీయూ కూటమికీ 128 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 78, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 45, జితిన్ రామ్ మంఝీకి చెందిన ఆవామ్ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరు స్వతంత్ర్య ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 114 ఎమ్మెల్యేల బలం ఉంది. ఆర్జేడీ-79, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. చదవండి: Bihar Assembly Floor Test: నేడు బీహార్లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత? కాగా జనవరి 28న రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష 'మహాఘట్బంధన్'కు చెందిన 79 మంది శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో మకాం వేశారు. ఇటు కాంగ్రెస్కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు బిహార్కు బయలుదేరారు. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ను హౌస్ అరెస్టు చేశారని ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఆయన ఓటింగ్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
నేడు బీహార్లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?
2024, జనవరి 28.. లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్తో కూడిన మహాకూటమి ప్రభుత్వానికి ముగింపు పలికిన బీహార్ సీఎం నితీష్.. బీజేపీ మద్దతుతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపధ్యంలో నితీష్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నేడు బీహార్ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంది. దీనినే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు ఉండాలి. అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. జనవరి 28న మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు, ఆయనకు బీజేపీ మద్దతు లేదు. ఆయన పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్కు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన 78 మంది ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకి అందించింది. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
నితీష్ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్సింగ్ కుష్వాహ సూచించారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. -
బిహార్ స్పీకర్ రేసులో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
పట్నా: బిహార్లో బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి రాష్ట్ర స్పీకర్ పదవిపై బీజేపీ, జేడీయూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. బిహార్్ స్పీకర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుత స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధి బిహారీ స్థానంలో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ఐదుగురు స్పీకర్ పదవి కోసం పోటీపడటం గమనార్హం. బీజేపీ పార్టీలోని నందకిషోర్ యాదవ్, నితీష్ మిశ్రా, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి, సంజయ్ సరోగి, జానక్ సింగ్ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చేతిలో ఉందని చర్చ నడుస్తోంది. నందకిషోర్ యాదవ్: బీసీ సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ గతంలో పలు మంత్రి పదవులను స్వీకరించారు. ఆయన పట్నా సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మేధామిగా.. పార్లమెంటరీ ప్రొసిడింగ్స్పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. నితీష్ మిశ్రా: మాజీ సీఎం డా. జగన్నాథ్ మిశ్రా కుమారుడు. ఈయనకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్పై పట్టు ఉందనే గుర్తింపు ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నితీష్ మిశ్రా.. ఝంఝర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంజయ్ సరోగి: దర్బంగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగోతంది. మాస్ లీడర్గా పేరున్న ఈయన ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంజయ్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయన బనియా(వ్యాపార) సామాజకవర్గానికి చెందిన వ్యకి. బీజేపీకి ఈయన సమాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం గమనార్హం. జానక్ సింగ్: తారణ్య అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి. ఈయినకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ మంచి పట్టు ఉంది. రాజ్పుత్ వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ పదవి కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రేణు దేవి: మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి స్పీకర్ పదవిపై కన్నేశారు. వెనబడిన నోనియా సామాజికవర్గానికి చెందిన ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవిని కేటాయిస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇక.. ప్రస్తుత ఆర్జేడీ పార్టీకి చెందిన అవధ్ బిహారి ఇప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ పార్టీ అతనిపై అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ద్వారా స్పీకర్ పదవి కోల్పోతే.. బిహార్ చరిత్రలో స్పీకర్ పదవి కోల్పోయిన మొదటి వ్యక్తిగా అవధ్ బిహారి నిలుస్తారు. -
‘‘ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు’’
లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్పైకి వెళ్లిందని ప్రమోద్ అన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్ ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు. గత వారమే ఒక విషయమై ప్రమోద్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఇదీచదవండి.. ‘‘ఈవీఎంల గోల్మాల్లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’ -
మనం ఎందుకు పట్టించుకోం?
భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్ కుమార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్లతో లిబరల్స్ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్ కుమార్ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను. 2013 నుండి, నితీశ్ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్ యాదవ్తో, జనతాదళ్తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది. ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్ ఇలా అన్నారు: ‘‘మర్ జానా కబూల్ హై, ఉన్ కే సాథ్ జానా హమ్కో కభీ కబూల్ నహీ హై. యే అచ్ఛీ తరహ్ జాన్ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్లు ఇక చాలు. నితీశ్ కుమార్కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’ సరే, నితీశ్ కుమార్ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం. ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు. భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్ కుమార్ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్లో లిబరల్స్ అనేవాళ్లు కన్జర్వేటివ్ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్కుమార్లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
హైదరాబాద్ వేదికగా మరో క్యాంపు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)క్యాంపు రాజకీయం ముగియటంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రం జార్ఖండ్కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్ మరో రాష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికైంది. తాజాగా బిహార్ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్కు చేరుకుంది. బిహార్లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్లోని ఇబ్రహింపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్స్లో తెలంగాణ కాంగ్రెస్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది. #WATCH | Telangana: The 16 Congress MLAs reach Hyderabad. The floor test of the newly elected NDA government in Bihar is likely to happen on February 12. (Visuals from Hyderabad airport) pic.twitter.com/SELbKPBlPG — ANI (@ANI) February 4, 2024 ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి గుడ్బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి.. నితీష్ కుమార్ బిహార్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అప్రమత్తమై ఎమ్మెల్యేను హైదరాబాద్కు తరలించటం గమనార్హం. -
మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్లో సాగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ వైదోలిగన మరుసటి రోజే(సోమవారం) కిషన్గంజ్ నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్నియాలో రాహుల్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగింస్తూ.. తొలిసారి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరడంపై స్పందించారు. బిహార్లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని.. ఇకపై బిహార్కు నితీష్ అవసరం లేదని అన్నారు. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కకున్నారని మండిపడ్డారు. మహాఘట్ బంధన్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని చెప్పారు. మోదీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి కులగణన ఎంతో అవసరమన్న ఆయన భారత్లో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ఎవరీయన? ఇదిలా ఉండగా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకు హాజరైన నేపథ్యంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ సహా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు నేడు పూర్నియాలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ర్యాలీకి దూరంగా ఉన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం బీహార్లోని పూర్నియాలో రైతు సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓ ధాబాలో టీ తాగుతూ కొంతమంది బీహార్ నివాసితులతో మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా ఉన్నారు. आज एक ढाबे पर कुछ बिहार निवासियों से चाय के दौरान कई बातें हुईं।#BharatJodoNyayYatra pic.twitter.com/Nsug8YrW2Q — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 30, 2024 आज पूर्णिया में भारत जोड़ो न्याय यात्रा के दौरान @RahulGandhi ने स्थानीय किसानों के साथ काफ़ी देर तक बातचीत की। किसानों ने उन्हें अपने साथ हो रहे अन्याय से अवगत कराया। उन लोगों ने बताया कि वे बढ़ती इनपुट लागत, भूमि अधिग्रहण की ग़लत नीति और फसलों के लिए पर्याप्त MSP न मिलने से… pic.twitter.com/ptlK7ruBZZ — Jairam Ramesh (@Jairam_Ramesh) January 30, 2024 -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్చేశారు. బిహార్లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్భవన్కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్భవన్లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్బై చెప్పడానికి నితీశ్కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్లో నడుపుతున్న సర్కార్కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది. తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు. తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు. కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు. ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు. పోనీ ఆ డిమాండ్కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జ్లను సైతం నియమించేసింది. గత వారం బులంద్షహర్లో సభతో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్ను పలచన చేసింది. కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్లో బలం తగ్గుతున్న నితీశ్కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం. నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం. మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే! -
Bihar: కొత్త డిప్యూటీ సీఎం తలపాగ వెనుక ఆసక్తికర కథ
పాట్నా: బిహార్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్ ఒక శపథం చేశారు. నితీశ్ కుమార్ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్ తాజాగా బిహార్లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో మీడియా ప్రతినిధులు సామ్రాట్కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్ 2018లో నితీశ్కుమార్ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం. मुरेठा खोलने पर सम्राट बोले : मुरेठा के सम्मान में अगर मुझे अयोध्या जाकर सिर मुड़वाना पड़े तो मैं तैयार हूं#BiharCM #Bihar #BiharNews #BJP #SamratChaudhary @RJDforIndia @RohiniAcharya2 pic.twitter.com/bBOmAsDXiQ — FirstBiharJharkhand (@firstbiharnews) January 29, 2024 ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు -
ఎన్డీయే విజయావకాశాలపై పీకే కీలక వ్యాఖ్యలు
బిహార్లో నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జేడీయూ అధినేత నితీష్.. ఎన్డీఏ కూటమిలో చేరటంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నితీష్ బిహార్లోని మహాకూటమి నుంచి వైదొలిగి.. ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. బిహార్లో నీతిష్ కుమార్ తిరిగి మాళ్లీ ఎన్డీయేలో చేరటంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బిహార్లో మహా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ రాజకీయం జీవితంలో ఇదే చివరి ఇన్సింగ్స్ అన్నారు. రాజకీయాల్లో నితీష్ చాలా కపటంతో కూడిన వ్యక్తి అని మండిపడ్డారు. 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోష్యం చెప్పారు. నితీష్ ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా సరే.. ఆయన పార్టీ అంతం కావటం ఖాయమన్నారు. కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతారని అన్నారు. నితీష్ను బిహార్ ప్రజలు తిస్కరిస్తున్నారని.. అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నారని మండిపడ్డారు. బిహార్లో ఇండియా కూటమిని దెబ్బతీయటానికి బీజేపీ.. నితీష్ కుమార్తో ఎత్తుగడ వేసిందన్నారు. కానీ.. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా పార్లమెంట్లో ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధిస్తుందని అన్నారు. ఇక.. ఎన్డీయే కూటమిలో చేరిన నితీష్ కుమార్ 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు మళ్లీ బయటకు వస్తారని అన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లో ఎన్డీయేతో నితీష్కు విభేదాలు వస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం
పట్నా: బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు గుడ్బై చెప్పిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ హమాఘట్ బంధన్ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
తప్పక చదవండి
- ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement