'కోట్లు ఖర్చుపెట్టి.. లోకేష్ ఏం సాధించాడు' | Laxmiparvathi criticising AP CM Chandrababu at NTR ghat | Sakshi
Sakshi News home page

Published Thu, May 28 2015 10:28 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు సేకరించానని చెబుతున్నా.. అందులో 17 వేల ఎకరాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement