వైసీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు | mangalagiri mla alla ramakrishna reddy gets warning letter from sand mafia | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 24 2014 3:37 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డికి ఇసుకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఓ బెదిరింపు లేఖ ఆదివారం మంగళగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయానికి అందింది. దాంతో కార్యాలయ సిబ్బంది వెంటనే ఆ లేఖను ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత జోరందుకున్నాయి. దాంతో ఆ వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నడుంబిగించారు. అది ఇసుకు మాఫియా ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి బెదిరింపు లేఖ అందుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement