కొత్త నోట్ల సప్లై వారికి పెంచండి: ఆర్బీఐ | RBI advises banks to increase cash supply to villages | Sakshi

Jan 4 2017 5:42 PM | Updated on Mar 21 2024 9:55 AM

పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల సరఫరాను గ్రామాలకు పెంచాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. దూర ప్రాంతాలకు సప్లై చేసే కరెన్సీ నోట్లపై కరెన్సీ చెస్ట్లు(నోట్లను భద్రపరిచే స్థలం) రోజువారీ రిపోర్టు చేయాలని పేర్కొంది. అవసరానికి తగ్గ నోట్ల సరఫరా గ్రామాలకు చేయడం లేదని గుర్తించిన సెంట్రల్ బ్యాంకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కనీసం 40 శాతం బ్యాంకు నోట్లను గ్రామాలకు సరఫరా చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరాల మేరకు ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement