ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ నోటీసులు జారీచేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. అక్కడ కూడా ఆయన తన సొంత పేరుతో కాకుండా.. వేరే రోగి పేరుతో చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రి యజమాని ఆయనకు సన్నిహిత మిత్రుడు కావడంతో, అక్కడే చేరారని అంటున్నారు. అయితే.. కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించడం లేదు. ఎవరికి వారు తమ ఆస్పత్రిలో చేరలేదనే చెబుతున్నారు.