బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకుని వేరొకదానిపై ఖర్చుచేస్తే, అట్లాంటివి మాఫీ చేయడం కష్టం అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కామవరపుకోటలో మాట్లాడుతూ రైతుల అందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఇంటికి ఒక రుణానికి మాత్రంమే మాఫీ వర్తిస్తుందన్నారు. ఇతర ఖర్చుల నిమిత్తం బంగారు రుణాలు తీసుకుంటే అటువంటి వాటికి మాఫీ వర్తించడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో రుణమాఫీపై ఆయన స్పష్టత ఇవ్వలేకపోయారు. సమస్యలు ఉన్నాయి, సమయం పడుతుందని మాత్రం చెప్పారు.
Published Wed, Jul 16 2014 8:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement