గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పిటిషన్లకు సంబంధించి విచారణ సోమవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. హైదరాబాద్కు ప్రత్యేక అధికారి పాలన మంచిది కాదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని... ఎప్పుడు నిర్వహించేదీ తేదీలతో పూర్తిస్థాయి అఫిడవిట్ను వచ్చే వారం కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.
Published Mon, Feb 16 2015 4:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement