వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం ఉల్లెంకొండ సమీపంలో 44వ జాతీయరహదారి పై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డోన్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.