మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడటంతో వివాదం మొదలైంది. అయితే తర్వాత కాసేపటికి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూ శరం లేవని వ్యాఖ్యానించడంతో వివాదం కాస్తా తారస్థాయికి చేరుకుంది.