తమిళనాడులో విజయవంతమైన అమ్మా క్యాంటిన్ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు తక్కువ ధరకు బ్రేక్ ఫాస్ట్, రెండు పూటలా భోజనం అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. 3 రూపాయలకు బ్రేక్ ఫాస్ట్, 5 రూపాయలకు భోజనం అందించాలని యోచిస్తున్నారు.