Uttar Pradesh government
-
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
పుణ్యక్షేత్రాల ప్రయాగరాజ్
ప్రయాగరాజ్: మహా కుంభమేళాకు ఆతిథ్యమివ్వనున్న ప్రయాగరాజ్(Prayagraj) పుణ్యక్షేత్రాల నగరంగా కీర్తికెక్కింది. దాదాపు 1,400 సంవత్సరాలుగా చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల చైనాకు ఆకర్షణ నాటినుంచే బలంగా ఉందని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడవ శతాబ్దపు చైనీస్ యాత్రికుడు యాత్రికుడు జువాన్జాంగ్ తన రచనలలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది. హర్షవర్ధనరాజు పరిపాలనలో... చరిత్రలోకి వెళ్తే.. హ్యూయెన్ త్సాంగ్ అని కూడా పిలుచుకునే జువాన్జాంగ్ 16 ఏళ్ల పాటు భారతదేశంలోని (India) వివిధ ప్రాంతాలపై అధ్యయనం చేశారు. అందులో భాగంగా ప్రయాగరాజ్నూ సందర్శించారు. క్రీ.శ. 644లో హర్షవర్ధన రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాన్ని ఆయన ప్రశంసించారు. ధాన్యం సమృద్ధిగా ఉందని చాటి చెప్పారు. అలాగే అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్రాజ్ను ఆయన అభివర్ణించారు. ప్రయాగరాజ్, దాని పరిసరాల్లోని ప్రజలు ఎంతో వినయంగా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని, అంకితభావంతో నేర్చుకుంటున్నారని తన రచనల్లో వర్ణించారు. అందుకే ప్రయాగరాజ్కు ‘తీర్థరాజ్’ (అన్ని పుణ్యక్షేత్రాల రాజు) బిరుదును వచ్చిందని వాస్తవాన్ని పురావస్తు సర్వేలు, అధ్యయనాలు మరింత బలపరుస్తున్నాయి. ఆసక్తికర వర్ణణలు.. ప్రయాగరాజ్ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి జువాన్జాంగ్ ‘సి–యు–కి’పుస్తకంలో రాశారని పురావస్తుశాఖ పేర్కొంది. జువాన్జాంగ్ రచనలు పురాతన కాలంలో ప్రయాగరాజ్ గురించి ఆసక్తికరంగా వర్ణించాయి. ‘ప్రయాగ్రాజ్లో పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవాలు జరిగాయని, 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎందరో మహారాజులు, పాలకులు పాల్గొన్నారు. ఈ గొప్ప రాజ్యం యొక్క భూభాగం సుమారు 1,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంది.ప్రయాగ రాజ్ రెండు పవిత్ర నదులైన గంగా, యమునా మధ్య ఉంది.’అని జువాన్జాంగ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రస్తుతం కోట లోపల పాతాళపురి ఆలయం గురించి కూడా రాశారు. ఇక్కడ ఒకే నాణే న్ని సమర్పించడం, వెయ్యి నాణేలను దానం చేయడంతో సమానమని ప్రజలు నమ్ముతున్నారని లిఖించారు. ప్రయాగరాజ్లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసించే విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్లో మహా కుంభమేళా– 2025 (Maha Kumbh Mela 2025) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను పంచుకుంది. -
మహిళా జర్నలిస్ట్కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్చేశారు. అఖిలేశ్యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
యోగి సర్కార్పై సెటైరికల్ సాంగ్.. సింగర్కు నోటీసులు
ప్రముఖ భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
Toolika Rani: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!
సాహసగాథలు వింటే సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం చేస్తే మరిన్ని సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం ఏం ఇస్తుంది? ‘అంతులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు మనమేమిటో మనకు తెలియజేస్తుంది’ అంటుంది తులికారాణి. ఎన్నో ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించిన ఈ సాహసి సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళగా, ఇరాన్లోని మౌంట్ డమవండ్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది తులికారాణి. మీరట్లో చదువుకున్న రాణికి చిన్నప్పటి నుంచి సాహసగాథలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ఇండియన్ ఎయిర్ఫోర్స్పై ఆసక్తి కలిగేలా చేసింది. 2005లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరిన రాణి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ విభాగంలో, ఔట్డోర్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా పదిసంవత్సరాల పాటు పనిచేసింది. ఎయిర్ఫోర్స్ టీమ్లో భాగంగా పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మొదలైన ఆసక్తి ఆమెతో ఎన్నో సాహసాలు చేయించింది. భారతదేశం, నేపాల్. భూటాన్, ఇరాన్, రష్యా... మొదలైన దేశాల్లో ఇరవైనాలుగు ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించింది. ఝాన్సీ లక్షీభాయి పురస్కారంతో పాటు పదిహేడు అవార్డ్లు అందుకుంది. వాటిలో ‘గ్లోబల్ ఉమెన్’ అవార్డ్ కూడా ఒకటి. ‘సవాలును స్వీకరించడానికి ధైర్యం మాత్రమే కాదు అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. ప్రయాణంలో అవహేళనలు ఎదురు కావచ్చు. అయితే ఒక్క విజయం చాలు వాటికి సమాధానం చెప్పడానికి’ అంటుంది రాణి. తొలిసారిగా పర్వతారోహణకు ఉపక్రమించినప్పుడు ప్రోత్సహించే వారి కంటే ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ. కొందరైతే ‘అమ్మాయిలు పర్వతారోహణ చేయడం కష్టం’ అన్నారు. విమర్శలకు, అనుమానాలకు, అవహేళనలకు తన విజయాలతోనే గట్టి సమాధానం చెప్పింది రాణి. పుస్తకాలు చదవడం, తన సాహనయాత్రల గురించి ఆర్టికల్స్ రాయడం, ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ భావుకతతో కవిత్వం రాయడం రాణికి ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం అంటే ఇష్టం. తాజా విషయానికి వస్తే... తులికారాణిని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం జీ–20 బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. వారణాసిలో ఆరు, ఆగ్రాలో మూడు, లక్నోలో ఒకటి, గ్రేటర్ నోడియాలో ఒకటి...జీ–20కి సంబంధించిన రకరకాల సమావేశాలు జరుగుతాయి. వీటిలో నలభై దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కాలేజీ, యూనివర్శిటీలలో జరిగే కార్యక్రమాల్లో అంబాసిడర్ హోదాలో ΄ాల్గొననుంది రాణి. ‘జీ–20 బ్రాండ్ అంబాసిడర్గా నన్ను నియమించడం గర్వంగా ఉంది. నా బాధ్యతను మరింత పెంచింది. నిర్మాణాత్మక విషయాల గురించి యువతలో ఆసక్తి, అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది రాణి. రాణిలో మంచి వక్త, లోతైన విశ్లేషకురాలు కూడా ఉన్నారు. అడ్వెంచర్ స్టోర్ట్స్లో జెండర్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎందుకు ఉంది? ఔట్డోర్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో స్త్రీలు అడుగు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? పర్వతారోహణకు ఆర్థికబలం అనేది ఎంత ముఖ్యం... మొదలైన విషయాల గురించి రాణి అద్భుతంగా విశ్లేషిస్తుంది. ‘సాహసాలే కాదు సమాజసేవ కూడా’ అంటున్న తులికారాణికి అభినందనలు తెలియజేద్దాం. వృత్తం దాటి బయటికి రావాలి ఎప్పుడూ గిరిగీసుకొని ఉండకూడదు. ఈ విశాల ప్రపంచంలో మనం చేయడానికి ఎంతో ఉంది. చుట్టూ గీసుకున్న వృతాన్ని దాటి బయటి వస్తే అద్భుతప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? ఇకముందు ఏం చేయాలి? అనేది అవగాహనకు వస్తుంది. కొత్త శక్తి మనకు చేరువ అవుతుంది. – తులికారాణి -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
ఒవైసీ హత్యాయత్నం కేసు.. యూపీ సర్కార్కు నోటీసులు
ఢిల్లీ: ఎంఐఎం అధినేత, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఒవైసీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు ఇవాళ నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11న చేపట్టనుంది. హాపూర్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన కాన్వాయ్పై ఫిబ్రవరి 3వ తేదీన దాడి జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. అయితే దాడి నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యాయత్నానికి సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విస్ట్ -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
అయోధ్య భూకుంభకోణంపై దర్యాప్తు
లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్రమ కొనుగోళ్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసులో 2019లో చరిత్రాత్మక తీర్పు వెలువడిన మరు క్షణమే అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భూముల బలవంతపు కొనుగోళ్ల పర్వం ఊపందుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషన్ బంధువులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, డీఐజీ తదితరులు అయోధ్య సమీప స్థలాలను కొనుగోలు చేశారన్న వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రెవెన్యూ శాఖను ఆదేశించారని యూపీ అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సమాచార) నవనీత్ సెహగల్ చెప్పారు. మతం ముసుగులో హిందుత్వ వాదులు స్థలాలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రియాంక కుంభకోణంపై యూపీ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆలయం కోసం అధిక ధరలకు భూములు కొంటూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సుప్రీంకోర్టు సూమోటోగా కలగజేసుకుని న్యాయం చేయాలన్నారు. ఆలయం కోసం వేల కోట్ల విరాళాలిచ్చిన రామభక్తుల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఎస్పీ చీఫ్ మాయవతి సైతం డిమాండ్చేశారు. -
మాజీ జడ్జి ఆధ్వర్యంలోనే దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి ఘటనపై నియమించిన సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డు న్యాయమూర్తిని నియమించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లఖీమ్పూర్ ఖేరి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ధర్మాసనం సరైన వ్యక్తిగా భావించి ఎవరిని నియమించినా యూపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈ విషయంలో సదరు అధికారి సమర్థతే తప్ప, రాష్ట్రంతో సంబంధం లేదు’అని హరీశ్ సాల్వే ధర్మాసనానికి నివేదించారు. దీంతో న్యాయమూర్తి పేరును బుధవారం ఖరారు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు ప్రగతిని ఈ న్యాయమూర్తి రోజువారీ సమీక్షిస్తారని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలో దిగువ స్థాయి..సబ్ ఇన్స్పెక్టర్, డీఎస్పీలు అదికూడా లఖీమ్పూర్ ఖేరికి చెందిన అధికారులే ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. సిట్ను అప్గ్రేడ్ చేయాలని సూచించింది. యూపీ క్యాడర్లో సొంత రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా అందజేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్ను బదిలీ చేశారన్న పిటిషనర్ అభ్యర్థనపైనా పరిశీలన జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. పరిహారం దక్కని వారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునేలా చేస్తానని యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. -
Lakhimpur Kheri: అంతమందిలో 23 మందే ప్రత్యక్ష సాక్షులా?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి ఘటనకు సంబంధించి సాక్షులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొంటే ఘటనలో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులు మాత్రమే ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ ఉదంతంలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. లఖీమ్పూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. ఈనెల 3న లఖింపూర్ ఖేరి హింసాకాండలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన కేసులో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో సహా ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి) వేల మంది ఎదుట జరిగింది కదా? యూపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కరు మినహా మిగతా అందరినీ ఇంకా పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించగా .. స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్ తెలిపారు. వేలాది మంది రైతులు ర్యాలీలో ఉంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులా అని ధర్మాసనం ప్రశ్నించగా... పత్రికల్లో ప్రకటన ఇచ్చామని, ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయగా దాన్ని ల్యాబ్కు పంపామని సాల్వే తెలిపారు. సాక్షులకు రక్షణ కల్పించాలని, సీసీటీవీల ఏర్పాటు, ఇంటి వద్ద భద్రత కల్పించడం చేయాలని సీజేఐ ఆదేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించాలని ధర్మాసనం పేర్కొంది. ఘటనలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భర్త మృతి చెందారని, హంతకులు బహిరంగంగా తిరుగుతూ తనని బెదిరిస్తున్నారని రూబీ దేవి అనే మహిళ ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. దీనిపై ఏం చేశారని సీజేఐ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సాల్వే తెలిపారు. జర్నలిస్టు, రూబీ దేవి భర్త హత్యలపై వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది. -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్మోర్చా లఖీమ్పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
ఎంతమందిని అరెస్టు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్ను నియమించిందని తెలిపారు. రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి ‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు. ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లఖీమ్పూర్ ఖేరి: లఖీమ్పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్పూర్కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్పై ఎఫ్ఐఆర్ నమోదవడం తెల్సిందే. ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు లఖీమ్పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. -
లఖీమ్పూర్ హింస: సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా
న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీమ్పూర్ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా కమిషన్ వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో శుక్రవారంలోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్లోని కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Lakhimpur Kheri Violence: లఖీమ్పూర్ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖీమ్పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: ‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’ మరోవైపు లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 45 లక్షల విలువైన చెక్కును అందించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో లేడని చెప్పారు. -
అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు. నోటీసులకు భయపడం ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి. పోలీసులకు అమిత్ షా పరామర్శ జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. ఆ నాయకులు తమ పాస్పోర్ట్లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్లు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు. -
‘హాథ్రస్ కుటుంబాని’కి మూడంచెల భద్రత
న్యూఢిల్లీ: హాథ్రస్ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలియజేసింది. హాథ్రస్ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు.. 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాపలాగా ఉన్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకో రాదని పోలీసులకు ఆదేశాలిచ్చామని, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
నేను ఇందిరా గాంధీ మనువరాలిని..
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఉత్తర ప్రదేశ్ ప్రజల బాధ్యత ప్రజా సేవకురాలిగా నా కర్తవ్యం. వాస్తవాలను వారి ముందు ఉంచడం నా విధి. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. నేను కొంతమంది నాయకుల మాదిరి బీజేపీ చెప్పుకోలేని ప్రతినిధిని కాదు. ఇందిరాగాంధీ మనవరాలిని’ అంటూ ట్వీట్ చేశారు. (ప్రియాంకాకు కొత్తపేరు పెట్టిన బీజేపీ నేత) రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితోపాటు పలు అంశాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాన్పూర్లోని ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా పాజిటివ్గా తేలిందని ఆదివారం ప్రియాంక ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు, వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. (కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా పాజిటివ్ ) కరోనాతో ఆగ్రా ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది మరణించినట్లు ఓ వార్త క్లిప్ను జతచేస్తూ జూన్ 22న ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్పై స్పందించిన ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నరైన్ సింగ్ మంగళవారం ట్వీట్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని కోరారు. అయితే దీనిని పట్టించుకోని ప్రియాంక ఆగ్రాలో కోవిడ్ -19 మరణాల రేటు 6.8 శాతంగా ఉందని, ఇది ఢిల్లీ, ముంబై కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. (28 కోవిడ్ మరణాలు.. విచారణకు సీఎం ఆదేశం) -
అది ముస్లిం సంస్థల పనే
న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బయటివారి ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న ఇస్లామిక్ సంస్థలకు చెందిన ఆరుగురు పశ్చిమబెంగాల్ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ‘పౌర’ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్లో మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాజధాని లక్నోతోపాటు గొడవలు ఎక్కువగా చోటుచేసుకున్న మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్, బిజ్నోర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. కాగా, అల్లర్ల బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. బిజ్నోర్ జిల్లాలో అల్లర్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ‘పౌర’ చట్టానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అల్లర్ల కారకులను అరెస్ట్ చేశాం రాష్ట్రంలో అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆదివారం డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మీడియాకు తెలిపారు. హింసాత్మక ఘటనల వెనుక పశ్చిమబెంగాల్కు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తల హస్తం ఉందన్నారు. వీరు అక్రమ ఆయుధాలను వాడారని తెలిపారు. బెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన ఆరుగురు పీఎఫ్ఐకు చెందిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. జైపూర్లో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధ్వర్యంలో జైపూర్లో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఆదివారం ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, బిహార్, రాజస్తాన్, తమిళనాడు ల్లోనూ ఆందోళనలు ప్రశాంతంగా కొన సాగాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ఆదివారం దేశ రాజధానిలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపారు. తమ ప్రాంత స్థానిక ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని మరుగున పరిచేలా, ‘పౌర’ ఆందోళన లకు మతం రంగు పులిమారని వారు ఆరోపించారు. ‘మా అజెండాను వేరొకరు హైజాక్ చేయనివ్వం. మా ప్రజల తరపున మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాం’అని త్రిపుర రాచ కుటుంబ వారసుడు ప్రద్యోత్ దేవ్ వర్మన్ పేర్కొన్నారు. నాగపూర్లో అనుకూల ర్యాలీ నాగపూర్: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా ఆదివారం నాగపూర్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థ చేపట్టిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు ఎటువంటి అన్యాయం తలపెట్టదన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపబోదన్నారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం ముస్లింలు గ్రహించాలన్నారు. -
త్వరలో నిర్భయ దోషులకు ఉరి అమలు ?
లక్నో: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ దోషుల్ని ఉంచిన తీహార్ జైలు అధికారులు ఇద్దరు తలారుల్ని పంపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ తాము తలారుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గురువారం విలేకరులకు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయడానికి తలారులు లేరు. అందుకే అవసరమైతే అతి తక్కువ కాల వ్యవధిలో చెప్పినా తలారుల్ని పంపాలంటూ ఢిల్లీ జైళ్ల శాఖ నుంచి తమకు డిసెంబర్ 9న ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖ అందిందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ లేఖలో నిర్భయ దోషుల ఉరి ప్రస్తావన లేదు. తలారుల అవసరం ఉందని మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్, లక్నో జైళ్లలో మాత్రమే తలారులు ఉన్నారు. 17న అక్షయ్ రివ్యూ పిటిషన్పై విచారణ నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు 17న విచారణ జరపనుంది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అందరి ఆయుష్షు తగ్గిపోతోందని, ఇక ఉరి తియ్యడమెందుకని అక్షయ్ ఆ పిటిషన్లో ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 17, మధ్యాహ్నం ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే మిగిలిన దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్లను ఉరి తియ్యడానికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ బస్సులో నిర్భయను పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ‘ఉన్నావ్’ కన్నా ఘోరంగా చంపుతా! బాగ్పత్: ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కన్నా దారుణంగా చంపేస్తా’అని ఓ అత్యాచారం కేసులో నిందితుడు ఏకంగా బాధితురాలి ఇంటి గోడపై పోస్టర్ అతికించాడు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భయానికి గురైన బాధితురాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర తెలిపారు. తన గ్రామానికే చెందిన నిందితుడు సోహ్రాన్ సింగ్ తన ఇంటి గోడపై బెదిరింపు లేఖ అతికించినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు వివరించారు. గతేడాది ముఖర్జీనగర్లో బాధితురాలిని సోహ్రాన్ ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీసి బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు ఢిల్లీ కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో సోహ్రాన్ బుధవారమే బెయిల్పై బయటకు వచ్చాడు. -
పేరు జబ్బు
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి. మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక. ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు. అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి. మొగల్సరాయ్ని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి. మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు. మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం? మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో. -గొల్లపూడి మారుతీరావు -
ఉద్ధవ్ పర్యటనకు యూపీ బ్రేక్?
సాక్షి, ముంబై : శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈనెల 25న తలపెట్టిన అయోధ్య పర్యటనకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ వేసినట్లే కనిపిస్తోంది. పర్యటనకు అనుమతివ్వాలని చాలారోజుల క్రితమే యూపీ సీఎం ఆదిత్యానాథ్ను శివసేన పార్టీ నాయకులు కలసి విన్నవించినా ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. దీంతో ఉద్ధవ్ అయోధ్య పర్యటన వివాదాస్పదమయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శివసేన పార్టీ శ్రేణులు పూర్తిచేశాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా అనుమతివ్వలేదనే విషయం వెలుగులోకి రావడంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దసరా రోజునే ప్రకటన.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావస్తోంది. ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వాద ప్రతివాదనలు సుప్రీంలో కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ఉద్ధవ్ జోక్యం చేసుకుని ఈ నెల 25న అయోధ్య పర్యటనకు వెళ్లనున్నట్లు శివాజీపార్క్ మైదానంలో విజయదశమి రోజున జరిగిన దసరా మేళావాలో ప్రకటించారు. రామ మందిరం నిర్మాణానికి ఇటుక పేరుస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రకారం ఈ నెల 24న మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరడానికి అవసరమైన ఏర్పట్లన్నీ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పర్యటనను విజయంవంతం చేయడానికి పార్టీ శ్రేణులు శక్తినంత కూడగడుతున్నాయి. శివసేన నాయకులు కూడా తమ ప్రతిష్టను ఫణంగా పెట్టి ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కావాలనే చేస్తోంది.. ఉద్ధవ్ తలపెట్టిన అయోధ్య పర్యటన ఒకవేళ విజయవంతమైతే వచ్చే ఎన్నికల్లో శివసేనకు మంచి ఫలితాలు వస్తాయని, ఇది బీజేపీకి మింగుడు పడటం లేదని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లో యూపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించే అవకాశాలున్నాయనే దీమాతో శివసేన నాయకులున్నారు. ఇప్పటికే శివసేన సీనియర్ నాయకుడు అనీల్ దేశాయ్ అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటున్నారు. 24వ తేదీ సాయంత్రం ఉద్ధవ్ అయోధ్య చేరుకున్న తరువాత ఆయన చేతుల మీదుగా సరయూ నదీ తీరం వద్ద పూజలు చేయనున్నారు. అక్కడే మహా హారతీ నిర్వహిస్తారు. ఈ తంతు సుప్రీం కోర్టు నిఘాలో ఉంటుంది. 25న రామ జన్మభూమి స్థలాన్ని సందర్శిస్తారు. తరువాత బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్రం బయట ఉద్ధవ్ ఠాక్రే భారీ సభ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు అయోధ్య రామమందిరం విషయం బీజేపీ సీరియస్గా తీసుకోవడం, మరోవైపు రామమందిరం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ఉద్ధవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీం అనుమతిచ్చినా.. ఉద్ధవ్ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్ధేశంతో శివసేన ఎంపీ, పార్టీ ప్రతినిధి సంజయ్ రావుత్ రెండు వారాల కిందటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ పర్యటనకు సంబంధించిన అన్ని అనుమతులు జారీ చేస్తామని ఈ భేటీలో యోగి హామీ ఇచ్చారని శివసేన చెబుతోంది. కానీ, ఇప్పుడు కావాలనే కాలాయాపన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరయూ నదీ తీరంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ సుప్రీం కోర్టు అనుమితులిచ్చింది. కానీ, అయోధ్య నగర నిగం, జిల్లాధికారుల నుంచి ఆ పత్రాలు లభించలేదు. దీనిపై గత బుధవారమే నలుగురు ఎస్టాబ్లిష్మెంట్ కమిషనర్లతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ, ఆ సమావేశం ఇంతవరకు జరగకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనకు అధికారికంగా అనుమతి లభిస్తుందా..? లేదా..? అనే అంశం ఉత్కంఠగా మారింది. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్రాజ్గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్రాజ్గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్రాజ్ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
తాజ్మహల్ పరిరక్షణపై సుప్రీంకోర్టు సీరియస్
-
తాజ్మహల్ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్మహల్ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్మహల్ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
స్క్రిప్ట్ను పక్కాగా అమలు చేశారు : మాజీ సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన బంగ్లాలోని విలువైన వస్తువులు మాయమయ్యాయని ప్రభుత్వ అధికారులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఆయన స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తన పరువు తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మీడియాను తీసుకురావడానికి ముందే ముఖ్యమంత్రి ప్రత్యేక పరిరక్షణ విధుల అధికారి అభిషేక్ ఫోన్తో సహా తన బంగ్లాకు వెళ్లారన్నారు. మీడియా వచ్చిన తర్వాత ఇంటిలోని వస్తువులు మాయమయ్యాయంటూ ఫొటోలు తీయించడం ఆయన స్క్రిప్ట్లో భాగమేనన్నారు. మీడియా కూడా ఈ కుట్రలో ప్రభుత్వానికి సహకరించిందని ఆరోపించారు. తన సొంత డబ్బుతో కొన్న, తనకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఇంటి నుంచి తీసుకెళ్లానని అఖిలేశ్ తెలిపారు. కాగా అఖిలేశ్ యాదవ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ రామ్ నాయక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన అఖిలేశ్.. రామ్నాయక్ స్వతహాగా మంచి వ్యక్తి అని.. కాకపోతే అప్పుడప్పుడూ ఆరెస్సెస్ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఆయన వైఖరిని మారుస్తుందని వ్యాఖ్యానించారు. -
ఓట్ల కోసం అంబేడ్కర్ని ఏదైనా అంటారు..!!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో మార్పులు చేయడంపై ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో హిందువులు, దళితుల ఓట్లకు ఎర వేయడానికి బీజేపీ అవసరమనుకుంటే అంబేడ్కర్ రాముని భక్తుడని కూడా చెప్తుందని విమర్శించారు. ‘మా తాత భీంరావ్ రామ్జీ అంబేడ్కర్ అని సంతకం చేసేవాడని, అయితే ఎప్పుడు అలా పూర్తి పేరుతో వ్యవహరించేవారు కాద’ని ప్రకాశ్ తెలిపారు. మహారాష్ట్రలో మిడిల్ నేమ్గా తండ్రి పేరును వాడుకోవడం సంప్రదాయమని అన్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అంబేడ్కర్ పేరులో మార్పులు తేవాల్సిన అవసరమేముందని బీజీపీని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదేనని ఆరోపించారు. ఆయన పేరులో మార్పుకు సంబంధించి తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడం విచారకరమన్నారు. -
భీంరావ్ రామ్జీ అంబేడ్కర్
లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుకు ఆయన తండ్రి ‘రామ్జీ’ పేరును చేర్చాలని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అంబేడ్కర్ పేరున్న ప్రతిచోటా (రికార్డుల్లో) రామ్జీ పదాన్ని చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి (పరిపాలన) జితేంద్ర కుమార్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘అంబేడ్కర్ తండ్రి పేరు రామ్జీ. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వ్యక్తి పేరు, ఇంటిపేరుకు మధ్య తండ్రి పేరు ఉంటుంది. అందుకే భీంరావ్ రామ్జీ అంబేడ్కర్ అని రికార్డుల్లో మారుస్తున్నాం’ అని సెక్రటేరియట్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. కాగా, యోగి సర్కారు నిర్ణయాన్ని ఎస్పీ, బీఎస్పీ తీవ్రంగా విమర్శించాయి. ‘అంబేడ్కర్ పేరు మార్చటం ద్వారా లబ్ధిపొందాలని ప్రభుత్వం నీచమైన నాటకాలు ఆడుతోంది. స్వలాభం కోసం బీజేపీ.. అంబేడ్కర్ పేరును దుర్వినియోగం చేస్తోంది’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ‘గాంధీ పేరును మోహన్దాస్ కరంచంద్ గాంధీ అని, ప్రధాని పేరును నరేంద్ర దామోదర్దాస్ మోదీ అని ఎవరైనా పిలుస్తారా? అలాంటప్పుడు అంబేడ్కర్ పేరు మార్చటం ఎందుకు?’ అని మాయావతి ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరు మార్చటం కన్నా.. ఆయన చూపిన బాటలో బీజేపీ ప్రభుత్వం నడిస్తే బాగుంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. -
అంబేద్కర్ పేరు మార్చనున్న యోగి
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరో సంచలనానికి తెర తీశారు. ఏకంగా భారత రాజ్యంగ నిర్మాత పేరును ఆయన మార్చనున్నారు. అవును. డా. భీం రావ్ అంబేద్కర్గా ఉన్న పేరును ఇక మీదట ‘భీం రావ్ రామ్ జీ అంబేద్కర్’గా యోగి మార్చనున్నారు. యూపీ గవర్నర్ రాం నాయక్ సూచనల మేరకు అజయ్ సింగ్ బిస్త్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట అన్ని ప్రభుత్వ రికార్డుల్లో అంబేద్కర్ పేరు భీం రావ్ రామ్జీ అంబేద్కర్ గానే ఉండబోతుంది. ఈ అంశం మీద స్పందిస్తూ సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ప్రతినిధిని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించింది. ఎస్పీ పార్టీ నాయకుడు దీపక్ మిశ్రా మాట్లాడుతూ ‘అంబేద్కర్ను, ఆయన విధానాలను వ్యతిరేకించే బీజేపీ పార్టీ ఇప్పుడు ఆయన పేరును మార్చి తమ పార్టీ అంబేద్కర్కు వ్యతిరేకం కాదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది’ అని ఆరోపించారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అంబేద్కర్ను ఆయన అసలైన పూర్తి పేరుతో పిలవాలనే ఆయన తండ్రి పేరులోని రామ్జీని కూడా తీసుకుని చేర్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. -
యోగిపై సొంత మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో: తాజా ఉపఎన్నికల ఫలితాల నుంచి కోలుకోకముందే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మరో షాక్ తగిలింది. తన మంత్రివర్గంలోని సొంత మంత్రిపై ఆయన పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించడం లేదు. ఎల్లప్పుడూ వారికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. ప్రజాసంక్షేమం కన్నా గుళ్లూ గోపురాలపైనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కువ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదు’ అంటూ బీసీ సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ బాంబు పేల్చారు. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన రాజ్భర్ బీజేపీ మిత్రపక్షం కావడంతో యోగి మంత్రివర్గంలో చేరారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న యోగి సర్కారును ఇరకాటంలో పడేశాయి. భాగస్వామ్య పార్టీలంటే లెక్కలేదు.. రాజ్భర్ ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ...‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మేమే కారణం. అయినప్పటికీ మమ్మల్ని వారు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చాం. కానీ వారి వైఖరిలో మార్పు రాలేదని’ ఆరోపించారు. ‘మార్చి 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా మమ్మల్ని ఇంతవరకూ సంప్రదించలేదు. మా ఓటు కావాలా అని మేమే వెళ్లి వారిని అడగాలేమో’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయావకాశాలే ఎక్కువ.. మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి ఉన్న అసెంబ్లీ సీట్లు 324. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ గణాంకాల ప్రకారం పది సీట్లలో ఎనిమిదింటిలో సులభంగానే విజయం సాధించవచ్చు. తొమ్మిదో అభ్యర్థి కోసం ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు కూడా. బీజేపీ అభ్యర్థులు వీరే.. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థిత్వాన్నిఅధికార పార్టీ ఖరారు చేసింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్పాయ్, విజయ్పాల్ సింగ్ తోమర్, సకాల్ దీప్ రాజ్భర్, కంటా కర్దం, అనిల్ జైన్, హరనాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నరసింహారావు, అనిల్ కుమార్ అగర్వాల్ తదితరులు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. కాగా సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థిగా జయా బచ్చన్ను ఖరారు చేసింది. -
గోమూత్రంతో ఔషధాలు..
సాక్షి, లక్నో : గోమూత్రంతో ఔషధాల తయారీకి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వంటి పలు వ్యాధులకు గోమూత్రంతో ఎనమిది రకాల మందులను రూపొందించాలని తమ శాఖ సంసిద్ధమైందని ఆయుర్వేద విభాగ సంచాలకులు డాక్టర్ ఆర్ఆర్ చౌధరి తెలిపారు. గోమూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యితో ప్రైవేట్ యూనిట్స్తో కలిసి ఆయుర్వేదిక్ మందులు తయారుచేస్తామని చెప్పారు. ఆయుర్వేదలో భాగమైన గోమూత్రం పలు వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందన్నారు. పలు పరిశోధనల్లో గోమూత్ర ప్రయోజనాలపై సానుకూల ఫలితాలు వెలుగుచూశాయన్నారు. యూపీలోని ఎనిమిది ఆయుర్వేద కళాశాలలు, బోధనాసుపత్రులకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఆయా ఆస్పత్రులకు రోజూ పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారన్నారు. -
కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
సాక్షి, అలహాబాద్: యూపీ సీఎంగా యోగి ఆదిత్యా నాథ్ పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి జనవరి 2019లో జరిగే కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 2013 కుంభమేళా బడ్జెట్తో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా వెచ్చించనున్నారు. రూ 2500 కోట్లతో 16 శాఖల సమన్వయంతో దాదాపు 200కు పైగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయి. కుంభమేళాలో కేవలం పుణ్య స్నానాలు ఆచరించడమే కాక, యాత్రికులకు మెరుగైన ఆథ్యాత్మిక, ధార్మిక అనుభూతులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. యాత్రికులకు నడక ఇబ్బందులు తొలగించేందుకు ఈసారి షటిల్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని అలహాబాద్ కమిషనర్ అశిష కుమార్ గోయల్ చెప్పారు. కుంభమేళాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఉత్సవాలకు ఏడాది ముందుగానే మేళా ఇన్చార్జిగా బాద్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ అలహాబాద్లో కుంభమేళా పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.1648 కోట్లతో 199 ప్రాజెక్టులను ఆమోదించి పనులు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. కుంభ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా లైవ్ డాష్బోర్డులతో ఆన్లైన్ ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ. 500 కోట్లతో అలహాబాద్లో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. -
పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే..
లక్నో: కుల,మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారెజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కెబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా పెళ్లి రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా చేయాలని 2006లోనే సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా యూపీతో పాటు రెండు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలవుతోంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్-2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే రోజుకు రూ.10, ఆపై ఆలస్యం చేస్తే రూ.50ల చొప్పున పెరుగుతూ పోతుందని తెలిపింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ మీడియాకు తెలిపారు. కొంత మంది ముస్లింలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుల ఫోటోలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించిందని, ముస్లింల నిఖామలో ఫోటోలు లేకపోవచ్చు కానీ, ఆధార్ కార్టులాంటి వాటికి ఫోటోలున్నాయి కదా.. మ్యారెజ్ సర్టిఫికెట్ కూడా అలాంటిదేనని మంత్రి సిద్దార్థ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. -
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం
యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు లక్నో: ఉత్తరప్రదేశ్లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా మీడియాకు తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. మౌలానా జొహర్ అలీ ఎడ్యుకేషన్ పేరిట ట్రస్ట్ను ఏర్పాటు చేసిన అజాం ఖాన్.. వక్ఫ్ ఆస్తుల్ని దానికి మళ్లించారని రజా ఆరోపించారు. ఈ రెండు సంస్థల్లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లేఖ రాసినట్టు వెల్లడించారు. వక్ఫ్ బోర్డులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని మంత్రిని ప్రశ్నించగా... 1995 వక్ఫ్ బోర్డు చట్టం ఈ హక్కు కల్పిస్తోందని సమాధానమిచ్చారు. చట్టబద్ధంగానే తాము వ్యవహరించామని చెప్పారు. వక్ఫ్ బోర్డుల రద్దు ప్రక్రియ పూర్తైన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డులకు కొత్త పాలక మండలిని లేదా అధికారిని నియమిస్తామని తెలిపారు. -
సీఎం వస్తున్నారు.. స్నానం చేసిరండి
లఖ్నవూ: మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలో దారుణం జరిగింది. కులవ్యవస్థను రూపుమాపాలనే ప్రకటనలు కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అధికారులు మరో నిర్వాకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత వర్గాలను కలుస్తున్నారని తెలిసి అధికారులు, వారికి షాంపూలు, సోపులు ఇచ్చి ‘శుభ్రంగా స్నానం చేయండి’ అని ఆదేశించారట. వివరాల్లోకి వెళ్తే యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ గురువారం యూపీలోని కుషినగర్లో పర్యటించారు. కొద్దిసేపట్లో కుషినగర్కి చేరుకుంటారనగా జిల్లా అధికారులు స్థానికులైన ముషర్ వర్గానికి సబ్బులు, షాంపూలు అందించి ముఖ్యమంత్రిని కలిసే ముందు స్నానం చేసి రావాలని ఆదేశించారు. ముషర్ వర్గాన్ని అతి తక్కువ వర్గంగా భావిస్తారు. ఎలుకలను పట్టుకొని జీవిస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని తెలియగానే అప్పటికప్పుడు విద్యుద్దీపాలు, రోడ్లు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు.గతంలో కూడా బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్సాగర్ కుటుంబాన్ని యోగి కలవనున్నారని తెలిసి అప్పటికప్పుడు వారింట్లో సోఫా, ఏసీ, కార్పెట్లు ఏర్పటు చేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వాటన్నింటినీ వాటన్నింటిని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. -
శనివారం స్కూల్ బ్యాగ్లకు ‘సెలవు’
లక్నో : పాలనలో దూసుకెళుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బండెడు పుస్తకాలు వీపుకు తగిలించుకుని బడికి వెళ్లే విద్యార్థులకు యూపీ సర్కార్ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది తీపి కబురే. ప్రతి శనివారం ఇక స్కూల్ బ్యాగ్లకు విద్యార్థులు ’టాటా’ చెప్పనున్నారు. ప్రయిమరీ, సెకండరీ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి శనివారం ’నో బ్యాగ్ డే’ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు చదువును పక్కనపెట్టి.. విద్యార్థులకు కేవలం సంతోషకరమైన కార్యక్రమాలను మాత్రమే పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అలాగే ఈ విధానాన్ని కో ఎడ్యుకేషన్ స్కూళ్లలోనూ అమలు చేయనున్నారు. కాగా ఇకనుంచి జనాభా లెక్కలు, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
యోగి కేబినెట్ రెండో నిర్ణయం ఇదే
లక్నో: తమ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 2020నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకాన్ని 'అందరికీ విద్యుత్' అని పేర్కొంది. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత గత వారం తొలి కేబినెట్ సమావేశంలో రైతుల రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న యోగి ఆధిత్యనాథ్ మంగళవారం నాటి రెండో కేబినెట్ సమావేశంలో విద్యుత్ సమస్యపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉన్న గ్రామాలకు రోజుకు 18గంటలు, మండలాలకు, బుందేల్ఖండ్ ప్రాంతాలకు 20గంటలు నిర్విరామ విద్యుత్ను అందిస్తామని కేబినెట్ సమావేశం అనంతరం శ్రీకాంత్ శర్మ, సిద్దార్థ్నాథ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. అలాగే, జిల్లాలకు 24గంటలపాటు విద్యుత్ అందిస్తామని చెప్పారు. 2018నాటికి రాష్ట్రం అంతటా కూడా 24గంటల విద్యుత్ను అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు. ప్రస్తుతం పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా విద్యుత్ సమస్య ఏర్పడకుండా చూడాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారని తెలిపారు. ప్రతి ఇంట్లో, ప్రతి పేదవారి కుటుంబంలో, ప్రతి గ్రామంలో 2018నాటికి పూర్తిస్థాయి విద్యుత్ అందాలనేది బీజేపీ చీఫ్ అమిత్షా, సీఎం యోగి డ్రీమ్ అని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేయాలని యోగి ఆదేశించినట్లు వివరించారు. -
రూ.3కు బ్రేక్ఫాస్ట్.. రూ.5కు భోజనం!
-
రూ.3కు బ్రేక్ఫాస్ట్.. రూ.5కు భోజనం!
లక్నో: తమిళనాడులో విజయవంతమైన అమ్మా క్యాంటిన్ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు తక్కువ ధరకు బ్రేక్ ఫాస్ట్, రెండు పూటలా భోజనం అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. 3 రూపాయలకు బ్రేక్ ఫాస్ట్, 5 రూపాయలకు భోజనం అందించాలని యోచిస్తున్నారు. ఈ పథకానికి తుది మెరుగులు దిద్దే బాధ్యతను యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, సురేష్ ఖన్నాలకు అప్పగించారు. యూపీ రాజధాని లక్నోతో పాటు కాన్పూర్, ఘజియాబాద్, గోరఖ్పూర్లలో సబ్సిడీ క్యాంటీలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, 8 రూపాయలకు భోజనం అందిస్తున్నారు. -
'హిందూ రాజ్యం'పై సీఎం యోగి వ్యాఖ్యలు!
లక్నో: భారతదేశాన్ని 'హిందూ రాజ్యం'గా మార్చాలన్న భావనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మద్దతు పలికారు. ప్రజలకు, దేశానికి మేలు చేసేదిగా ఉన్నట్టయితే.. ఈ భావనలో ఎలాంటి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూత్వ అతివాద సంస్థగా ముద్రపడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారత్ను హిందూ రాజ్యంగా మార్చాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, 120 కోట్ల జనాభా, విభిన్న మతవిశ్వాసాలతో లౌకిక దేశంగా ఉన్న భారత్లో ఈ అంశం వివాదాన్ని రాజేసే అవకాశముంది. 'హిందూ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలన్న భావన తప్పేమీ కాదు. హిందూత్వమనేది మతం కాదు, ఉపాసన విధి కాదు, ఇది జీవన విధానం మాత్రమేనని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పేర్కొంది' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ దూరదర్శన్కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. 'హిందూ దేశం' ప్రజలకు మంచి జీవితాన్ని, ఆనందాన్ని ప్రసాదించేందుకు దోహదపడితే.. దానిని ఒప్పుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల విషయంలో బీజేపీ సీఎం యోగికి మద్దతుగా నిలిచింది. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. -
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్లకు నో!
-
ఈవీఎం ప్రొడక్షన్స్
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్లకు నో!
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్లకు నో!
లక్నో: ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల పాన్ మసాలా, గుట్కాలను నమలడం, పొగతాగడాన్ని యోగి నిషేధించడం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఇతర సిబ్బంది.. జీన్స్, టీ–షర్ట్లు వేసుకుని విధులకు హాజరవ్వరాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వస్త్రధారణ పద్ధతిగా, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు ఎలాగూ యూనిఫాం ఉంటుందనీ, ఉపాధ్యాయుల వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉంటే, విద్యార్థులు వారిని అనుసరిస్తారని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
యోగి సర్కారుపై మోదీ డేగకన్ను!
కొత్తగా కొలువుదీరిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిశితమైన నిఘా పెట్టి.. తన కనుసన్నలలో ఉంచుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తున్నదా? ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా అందే ఆదేశాల ఆధారంగానే యోగి ప్రభుత్వం నడుచుకోవాలని అనుకుంటున్నాదా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. యూపీ ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడానికి మోదీ ప్రభుత్వం అసాధారణరీతిలో సీనియర్ ఐఏఎస్ అధికారి నృపేంద్రమిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. పీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ అయిన మిశ్రా ఆదివారం సీఎం యోగితో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి, సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, ఆయన నిత్యం యోగితో భేటీ అయి.. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే ఓ కథనంలో తెలిపింది. యూపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తర్వాతే చేపట్టనున్నట్టు సమాచారం. -
యూపీ బీజేపీ సర్కారులో వారికి కూడా చాన్స్!
ఉత్తరప్రదేశ్లో ఏర్పడనున్న బీజేపీ సర్కారులో ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం లభించనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన, అత్యధిక జనాభా కలిగిన యూపీలో 403 స్థానాలకుగాను బీజేపీ 312 స్థానాలు గెలుపొంది.. బంపర్ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న ముస్లింలకు చేరువ కావాలని బీజేపీ భావిస్తున్నది. సంప్రదాయంగా ముస్లింలలో తమకు ఓటుబ్యాంకు లేకపోయినా.. ఆ వర్గానికి చెందిన వారిని ప్రభుత్వంలోకి తీసుకోవాలని యోచిస్తున్నది. ముస్లింలలో ముఖ్యంగా మహిళలు, యువత ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను అంగీకరించి.. తమవైపు మొగ్గుచూపారని కమలనాథులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ వంటి విషయాలతో ముస్లింలలో కొందరికి చేరువయ్యామన్న భావన కూడా వారిలో ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో గణనీయంగా ఉన్న ముస్లింలకు చేరువయ్యేందుకు వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎమ్మెల్యే లేకపోతే ఏమిటి.. ఎమ్మెల్సీ ఉంటారు. ప్రభుత్వంలో ముస్లిం ప్రాతినిధ్యం ఉండి తీరుతుంది' అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో పేర్కొన్నారు. యూపీలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలకు అవకాశముంటుందని ఆయన స్పష్టం చేశారు. -
‘మెజార్టీ ఖాయం.. విజయం మాదే’
న్యూఢిల్లీ: ‘యూపీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. రాజకీయ నిపుణులు కూడా ఇదే అంగీకరిస్తున్నారు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ‘ఈస్ట్రన్ ఉత్తరప్రదేశ్ మీదుగా బీజేపీ పవనాలు బలంగా రాష్ట్రమంతటా వీస్తున్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు వారణాసిలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీ జరిగిన తీరు, తరలివచ్చిన జనాలను చూస్తే బీజేపీకి ఎంత అనుకూలంగా ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ర్యాలీని ప్రారంభించిన మోదీ కాళ భైరవ ఆలయం వరకు కొనసాగించారు. -
గర్భిణిని చేతులతో మోసుకెళ్లిన మామ
-
గర్భిణిని చేతులతో మోసుకెళ్లిన మామ
ఉత్తరప్రదేశ్లో వైద్య ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు. ఒక వ్యక్తి నిండు గర్భంతో ఉన్న తన కోడలిని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ కూడా లేకపోవడంతో చేతులతో మోసుకుని ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది! ఈ ఘటన మీర్జాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయగా.. అప్పటికే బిడ్డ మరణించాడు, కాసేపటికే ఆ తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపించడం వల్లే ఇలా జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం.. ఆమెకు తాము అన్నిరకాలుగా మెరుగైన చికిత్సే చేశామంటున్నాయి. లాల్గంజ్ తాలూకా గెరురా గ్రామానికి చెందిన అన్షు పాండే (25)ను ఈనెల నాలుగోతేదీ రాత్రి అంబులెన్సులో మీర్జాపూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, దాదాపు ఐదు గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డాక్టర్ కూడా లేరని ఆమె మామ కపూర్చంద్ పాండే ఆరోపించారు. ఆమె బాగా నొప్పులు పడుతుండటంతో మర్నాటి ఉదయం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వాళ్లు మళ్లీ ప్రభుత్వాస్పత్రికే తీసుకెళ్లాలని సూచించారు. తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన తన కోడలిని చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు. తర్వాత కూడా చాలా సేపటివరకు వైద్యులు ఆమెను చూడలేదని ఆయన ఆరోపించారు. వృద్ధుడు తన కోడలిని చేతుల మీదుగా మోసుకుని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా?
ఆరు జిల్లాల్లో ప్రజలకు రక్షిత మంచినీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జల నిగమ్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. ప్రజల ప్రాణాలంటే వీసమెత్తు గౌరవం కూడా లేదా అని ప్రశ్నించింది. ముజఫర్నగర్, షామ్లి, మీరట్, బాఘ్పత్, ఘజియాబాద్, సహారన్పూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రజలకు నీళ్లు గానీ, కనీస ప్రాథమిక వైద్య సదుపాయాలు గానీ లేవని.. అయినా ఈ విషయంపై అదికారులు ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో గుర్తించేందుకు ఎలాంటి వైద్యపరీక్షలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పరీక్షలు ఏమీ చేయకుండా వాళ్ల అనారోగ్యాన్ని ఎలా నిర్ధారిస్తారని నిలదీసింది. ప్రజల ప్రాణాలంటే.. మీ టేబుల్ మీద ఉన్న ఫైళ్లలా చాలా సులభంగా తీసుకుంటున్నారని మండిపడింది. సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్ వ్యాఖ్యానించారు. బాఘ్పత్ జిల్లా ప్రధాన వైద్యాధికారిపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది. కలుషిత నీళ్లు తాగడం వల్ల ఆయా జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ''స్థానికుల రక్తనమూనాలు తీసుకుని వాటిని విశ్లేషించారా? ఎందుకు చేయలేదు? వాళ్లు మీ ఇంటికి వచ్చి రక్తనమూనాలు ఇవ్వరు. వారి వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీకుంది. అసలు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర జలవనరుల మండలిని సంప్రదించి, ఆరు జిల్లాల్లో శాస్త్రీయ విశ్లేషణ సాగించాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. ఈ మొత్తం విషయంపై అక్టోబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కలుషిత భూగర్భజలాలున్న బోర్లను వెంటనే తీసేయాలని తెలిపింది. బాఘ్పత్ జిల్లాలోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉండాల్సిన దానికంటే 4వేల రెట్లు ఎక్కువగా ఉందని పిటిషన్ దాఖలు చేసిన శాస్త్రవేత్త సీవీ సింగ్ తరఫు న్యాయవాది గౌరవ్ బన్సల్ తెలిపారు. దీనిపై యూపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఆయన బెంచి ముందు ఉంచారు. -
27న మంత్రివర్గ విస్తరణ
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 27న విస్తరించనున్నారు. నిజానికి ఎప్పటినుంచో అఖిలేష్ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారని కథనాలు వచ్చినా, గవర్నర్ రామ్ నాయక్ సమయం ఇచ్చిన తర్వాత చివరకు ఈనెల 27ను ముహూర్తంగా నిర్ణయించారు. సమాజ్వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు 25న సమావేశమై ఎవరెవరిని మంత్రులు చేయాలనే విషయమై ఓ నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా ఈ తరుణంలో కేబినెట్ విస్తరణ చేపట్టడం గమనార్హం. నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటికే ఆరుసార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు. గత సంవత్సరం అక్టోబర్ 31న ఐదుగురు కేబినెట్ మంత్రులు, 8 మంది సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 8 మంది సహాయ మంత్రులను కొత్తగా తీసుకున్నారు. లక్నో ఎమ్మెల్యేలు శారదా ప్రతాప్ శుక్లా, రవిదాస్ మెహరోత్రాలతో పాటు ముస్లింలను మంచి చేసుకోడానికి ఘజాలా లాహిరికి కూడా పదవి ఇవ్వచ్చని భావిస్తున్నారు. -
అది ఆవు మాంసం కాదు మేకమాంసమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. మహమ్మద్ అఖ్లాక్ ఇంట్లోని ఫ్రిడ్జ్లో ఉన్నది మేకమాంసమే కానీ ఆవు మాంసం కాదని పశువైద్యాధికారుల నివేదికలో తేలింది. ఆవుమాంసం కలిగి ఉన్నాడని ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్ నివాసంపై ఓ వర్గానికి చెందిన మూక దాడి చేసి.. ఆయనను కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని దాద్రి సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆవుమాంసం లేదని, తాము గోమాంసాన్ని భుజించలేనది చెప్తున్నా వినకుండా కోపోద్రిక్త మూకలు అఖ్లాక్ను, ఆయన కొడుకును ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అఖ్లాక్ కుటుంబం ఓ ఆవుదూడను కోసేసి.. దాని ఆహారాన్ని తిన్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోని మైకుల్లో వెలువడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 12మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసులు నమోదైన వారిలో స్థానిక బీజేపీ నేత కొడుకు కూడా ఉన్నాడు. అఖ్లాక్ నివాసంలో దొరికింది మేకమాంసమే కానీ ఆవుమాంసం కాదని యూపీ పశువైద్యశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. -
పెద్దమనసు చాటుకున్నఅమితాబ్
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే బిగ్ బీ అమితాబ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన కుటుంబానికి లభించే పెన్షన్ను వదులుకున్నాడు. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఖర్చు చేసే కార్యక్రమానికి బదిలీ చేయాల్సిందిగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ప్రకారం.. ప్రతిష్ఠాత్మకమైన యశ్ భారతి సమ్మాన్ అవార్డు పొందిన వారికి నెలకు 50 వేల రూపాయల పెన్షన్ను జీవిత కాలం అందించనుంది. ఈ పథకం కింద అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక్కొక్కరు నెలకి 50,000 రూపాయల పెన్షన్ను పొందడానికి అర్హులయ్యారు. అయితే ఈ డబ్బును పేదలకోసం ఖర్చు చేయాల్సిందిగా తను, తన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు లేఖ రాయనున్నట్లు అమితాబ్ వెల్లడించారు. -
ఇఖ్లాక్ హత్యపై కప్పదాటు
యూపీ సర్కారు నివేదికలో ప్రస్తావన లేని ‘బీఫ్’ దాద్రి(యూపీ): ఇఖ్లాక్ హత్యోదంతంపై ఉత్తరప్రదేశ్ హోంశాఖ కేంద్రానికి మంగళవారం నివేదికను పంపించింది. ఈ నివేదికలో ఎక్కడా ‘బీఫ్’ ప్రస్తావన స్పష్టంగా లేదు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ నివేదికలో హత్యోదంతాన్ని వివరిస్తూ ‘ఇఖ్లాక్, అతని కుమారుడిపై గుర్తు తెలియని కొంతమంది సెప్టెంబర్ 28రాత్రి వధించరాదని నిషేధం ఉన్న పశువును చంపి ఆ మాంసం తిన్నారన్న ధ్రువీకరణ కాని ఆరోపణలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇఖ్లాక్ మరణించారు. దీనిపై దాద్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ కొనసాగుతోంద’ ని పేర్కొన్నారు. నివేదికలో హత్యకు అవకాశాలున్నాయని భావిస్తున్న కారణాలు చెప్పలేదు. వ్యక్తి అనుమానాస్పద మృతి: కాగా దాద్రి తాలూకాలో మంగళవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇఖ్లాక్ను హత్య చేసిన బిషాదాలో 24ఏళ్ల జయప్రకాశ్ అనే యువకుడి మృతదేహం అతని ఇంట్లోనే లభించింది. ఇఖ్లా క్ కేసులో నిందితుల జాబితాలో పేరు లేకున్నా, తన కొడుకును పోలీసులు వేధించ టం వల్లే తల్లి ఓంవతి ఆరోపించింది. కాగా, తనను తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందు కు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు బిషాదాలో గ్రామస్థులతో మాట్లాడి న కేంద్రమంత్రి మహేశ్ శర్మపై యూపీ సర్కా రు కేసు నమోదు చేసింది. -
మదర్సాల్లో జాతీయ జెండాలు ఎగరేస్తున్నారా?
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మదర్సాలపై పలు వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో తాజాగా అలహాబాద్ హైకోర్టు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని విద్యా సంస్థల్లాగే మదర్సాల్లోనూ జాతీయ పండుగలప్పుడు జెండా ఎగరవేస్తున్నారా? ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇస్తున్నదా? అంటూ అలీగఢ్కు చెందిన అరుణ్ గౌర్ అనే వ్యక్తిని అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ యశ్వంత్ వర్మాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. మదర్సాలతోపాటు అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలు ఎగిరాయనే నిర్ధారణతోపాటు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. -
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచిత ల్యాపీలు
పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ.. ఇలా ఏ బోర్డులో చదివినా ప్రతిభావంతులైన 39,600 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ల్యాప్టాప్లలో సగం పదోతరగతి పాసైన వాళ్లకు, మరో సగం ఇంటర్ పాసైనవాళ్లకు ఇస్తారు. ఆయా బోర్డుల్లో వాళ్లు సాధించిన ఫలితాలను బట్టి వీటిని అందిస్తారు. అయితే ఇందులో 21 శాతం ఎస్సీ, ఎస్టీలకు, 20 శాతం మైనారిటీలకు ఇచ్చే కోటా కూడా కొనసాగుతుంది. 2012 ఎన్నికల మేనిఫెస్టోలోనే ల్యాప్టాప్లు, టాబ్లెట్లను ఉచితంగా ఇస్తామన్న హామీని సమాజ్వాదీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 15 లక్షల ల్యాప్టాప్లను అందించినా, ట్యాబ్ల జాడ మాత్రం ఎక్కడా లేదు. అలాగే 2012 తర్వాత మళ్లీ ల్యాప్టాప్లు ఇవ్వడం కూడా మళ్లీ ఇప్పుడే. -
'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'
లక్నో: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే ఉత్తప్రదేశ్ క్రీడాకారుల పంట పండనుంది. రానున్న ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని యూపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేతలకు రూ. 6 కోట్లు, వెండి పతకం గెలిచిన వారికి రూ. 4 కోట్లు, కంచు పతకం తెస్తే రూ. 2 కోట్లు ఇస్తామని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. 35వ జాతీయ జూనియర్ రౌలింగ్ చాంపియన్ షిప్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. యూపీ రౌలింగ్ అసోసియేషన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించి, సావనీర్ విడుదల చేశారు. -
మెట్రో విస్తరణకు పచ్చజెండా
నోయిడా: నగరంలో మెట్రో విస్తరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండు మెట్రో ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం అనుమతి మంజూరు చేశారు. దీంతో నగరంలో రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. నోయిడా సిటీ సెంటర్ నుంచి గ్రేటర్ నోయిడా వరకు 29.7 కిమీటర్లు(సెక్టార్ 32), మరొకటి సిటీ సెంటర్ నుంచి సెక్టార్ 62 వరకు 6.7 కిమీ వరకు నిర్మించనున్నారు. సిటీ సెంటర్-సెక్టార్ 62 అనుసంధానానికి రూ. 1.816 కోట్లు నోయిడా-గ్రేటర్ నోయిడా అనుసంధానానికి రూ. 5,064 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను కూడా 2017 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి... మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించాలంటూ నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ సీఈఓ రమారమణ్కు సూచించింది. కాగా ఈ రెండు దీర్ఘకాలిక ప్రాజెక్టుల పూర్తి చేయడానికి యూపీ ప్రభుత్వం ఢి ల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్సీ)ను సలహా సంస్థగా నియమించుకొంది. మరో మూడు నెలల్లో నోయిడా మెట్రో విస్తరణ పనులు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. బొటానికల్ గార్డెన్- కాళిందీకుంజ్ మెట్రో లింక్ కోసం సుమారు 3.9 కిమీ మార్గానికి రూ. 845 కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించిన సంగతి విదితమే. భాగస్వామ్య పద్ధతిలో.. అధికారుల లెక్కల ప్రకారం.. సిటీ సెంటర్-62 మార్గాన్ని యూపీ ప్రభుత్వం-కేంద్ర భాగస్వామ్యంలో అంటే 80-20 శాతం నిధులతో చేపట్టనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా మార్గాన్ని కూడా అదేవిధంగా చేపట్టన్నుట్లు అధికారులు పేర్కొన్నారు. -
మీరట్ అగ్నిప్రమాదం విచారణకు ఏక సభ్య కమిషన్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం మీరట్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఏకసభ్య కమిషన్ను నియమించింది. మాజీ న్యాయమూర్తి ఎస్.బీ సిన్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను న్యాయస్థానం ఏర్పాటు చేసింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని మీరట్ అగ్నిప్రమాదం ఘటనలో 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాద ఘటనపై 2015 జనవరి 31 లోగా కమిషన్ తన నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరోవైపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సర్కారుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సూచించింది. -
'అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి'
ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలు మృగ్యమైనాయిని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో ఆ అంశంపై చర్చకు మాయావతి పట్టుపట్టారు. ఆ అంశంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లిన మాయావతితోపాటు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభ వెల్లోకి దూసుకువచ్చి అఖిలేష్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను 10 నిముషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆగ్రహించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో ఇటీవల వరుస సామూహిక అత్యాచారాలు, బీజేపీ నాయకుడు హత్య నేపథ్యంలో యూపీలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆమె ఆరోపించారు. -
‘బదౌన్ దారుణం’పై సీబీఐ దర్యాప్తు
దళిత బాలికల గ్యాంగ్రేప్, హత్యలపై యూపీ ప్రభుత్వ నిర్ణయం మరో ఇద్దరు నిందితుల అరెస్ట్ దుండగులను బహిరంగంగా ఉరితీయాలన్న బాధిత కుటుంబాలు బదౌన్/లక్నో: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన బదౌన్ దళిత బాలికల గ్యాంగ్రేప్, హత్యల కేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాల డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ దారుణంపై సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క.. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లోని పోలీస్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్, పప్పూ, అవధేశ్ అనే సోదరులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఛత్రపాల్ అనే మరో కానిస్టేబుల్ను, పప్పూ, అవధేశ్ల సోదరుడు ఉర్వేశ్ను అదుపులోకి తీసుకున్నారు. పప్పూ, అవధేశ్, ఉర్వేశ్లపై హత్య, అత్యాచార నేరాల కింద, కానిస్టేబుళ్లపై నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బదౌన్ జిల్లా కాత్రాసదత్ గంజ్ గ్రామానికి చెందిన వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికలు గత నెల 27న అదృశ్యమై, మరుసటి రోజు విగతజీవులై మామిడిచెట్టుకు వేలాడుతూ కనిపించడం తెలిసిందే. వీరు హత్యకు ముందు అత్యాచారానికి గురయ్యారని పోస్ట్మార్టమ్లో తేలడం, బాధిత కుటుంబాలకు అఖిలేశ్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడమూ విదితమే. ‘నిర్భయ ఉదంతం కంటే దారుణం’ తమ పిల్లలను బలిగొన్న దుండగులను బహిరంగంగా ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ ఘోరం ఢిల్లీలో గ్యాంగ్రేప్కు గురై, చనిపోయిన నిర్భయ ఉదంతం కంటే దారుణమైందన్నాయి. తమకు నష్టపరిహారం వద్దని, న్యాయం కావాలని కోరాయి.‘అభం శుభం తెలియని మా చిన్నారుల ఉరిని లోకం చూసింది. దుండగులను కూడా అలాగే లోకం చూసేలా ఉరితీయాలి. మమ్మల్ని చంపుతామంటున్నారు. చంపనీయండి. కానీ ఆ రూ.5 లక్షల చెక్కును మాత్రం ముట్టను’ అని ఓ బాధిత బాలిక తండ్రి అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ పిల్లలు బతికేవారన్నారు. బాలికల కుటుంబాలకు రాహుల్ పరామర్శ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. డబ్బుతో తమ కుమార్తెల గౌరవాన్ని తిరిగి తెచ్చుకోలేమని బాధితులు ఆయనతో అన్నారు. ఈ ఘోరంలో పోలీసుల పాత్ర కూడా ఉంది కనుక తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించిన రాహుల్, స్త్రీల గౌరవానికి వెలకట్టలేర ని, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలను ఉరితీసిన ప్రాంతాన్ని చూశారు. గ్రామంలో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్నా పరువు పోతుందని చెప్పుకోలేకపోతున్నామని గ్రామస్తులు చెప్పారు. అఖిలేశ్వి హద్దుమీరిన వ్యాఖ్యలు: స్మృతీ ఇరానీ యూపీలో శాంతిభద్రతలు బాగున్నాయంటూ ప్రచారం చేయాలని సీఎం అఖిలేశ్ శుక్రవారం విలేకర్లతో చెప్పడంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు హద్దుమీరాయని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు అలా మాట్లాడకూడదని అన్నారు. కాగా, అఖిలేశ్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జావేద్ ఉస్మానీని తొలగించి, ఆయన స్థానంలో అలోక్ రంజన్ అనే ఐఏఎస్ను నియమించారు. దీనికి కారణమేంటో ప్రభుత్వం వెల్లడించలేదు. -
రాహుల్ నియోజవర్గానికి యూపీ ప్రభుత్వం భారీ నిధులు
అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించే లోక్సభ నియోజకవర్గం అమేథీపై సమాజ్వాదీ పార్టీ నేతత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. ఫైజాబాద్ డివిజన్లో ఉన్న జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా అమేథీకి అత్యధికంగా రూ. 236.92 కోట్లు అభివద్ధి పనులకోసం కేటాయించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జగత్రాజ్ త్రిపాఠీ వెల్లడించారు. 2014-15 వార్షిక జిల్లా ప్రణాళిక బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం ఈ నిధుల కేటాయించింది. ఫైజాబాద్ డివిజన్లోని ఇతర జిల్లాల్లో బారాబంకీకి రూ. 167 కోట్లు, ఫైజాబాద్కు 150 కోట్లు, సుల్తాన్పూర్కు 124 కోట్లు, అంబేద్కర్ నగర్కు 122 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. -
సీఎం కేజ్రీవాల్కు ‘జెడ్’ కేటగిరి భద్రత
లక్నో: ఢిల్లీ సరిహద్దులో ఉన్న ఘజియాబాద్లో నివాసముంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. భద్రత విషయంలో కేజ్రీవాల్ మొదటినుంచి తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం కౌశంబీలోని సీఎం నివాసానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం) ఎ.కె.గుప్తా, డీజీపీ రిజ్వాన్ అహ్మద్ కమిటీ నిర్ణయించినట్లు అదనపు డీజీపీ ఒ.పి.సింగ్ తెలిపారు. ఢిల్లీపోలీసులకు ఈ విషయమై సమాచారం పంపించామని, అలాగే ఘజియాబాద్ జిల్లా పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆయన చెప్పారు. గత బుధవారం కౌశంబీలోని ఆప్ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. -
మృగరాజు.. నవాబ్ షఫత్ అలీఖాన్
హైదరాబాద్: ఈ మృగరాజు పేరు నవాబ్ షఫత్ అలీఖాన్. మన హైదరాబాదీయే. దేశంలోనే పేరెన్నికగన్న లెసైన్డ్స్ వేటగాడు. జనావాసాల్లోకి చొరబడి మనుషుల్ని చంపే పెద్దపులులను మట్టుబెట్టడం ఈయన ప్రత్యేకత. ఇలా దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇప్పటిదాకా తొమ్మిది పులులను హతమార్చాడు. ప్రస్తుతం ఊటీలో ఓ పులి పని పట్టేందుకు వెళ్లాడు. ఇంతలోనే ఉత్తరప్రదేశ్ నుంచి పిలుపు వచ్చింది. మురాదాబాద్, సంభాల్ జిల్లాల్లో సంచరిస్తున్న ఓ పులి నెలరోజుల్లోనే ఆరుగురిని దారుణంగా చంపింది. దీంతో యూపీ సర్కారు ఈయనను సంప్రదించింది. ఊటీ పులి సంగతి చూసి ఉత్తరప్రదేశ్ వెళ్తానని చెబుతున్నాడు అలీఖాన్! -
యమునా ఎక్స్ప్రెస్ వేపై పోలీసు నిఘా
గ్రేటర్ నోయిడా: యమునా ఎక్స్ప్రెస్ వే పోలీసు నిఘాను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రహదారిలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం, అధిక వేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడటం, ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కేసు నమోదుచేసుకునే విషయంలో పోలీసుల మధ్య అంతరం రావడం తదితర అంశాలన్నింటినీ పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం అంకిత భావంతో పనిచేసే పోలీసు బృందాన్ని ఈ నెలాఖరులోగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ అధికారులు, హైవే అథారిటీ సభ్యుల మధ్య లక్నోలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు చొరవ తీసుకుంటోంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరులోగా హైవేపై పటిష్టమైన పోలీసు బృందం విధులు నిర్వర్తించే అవకాశముంది. తద్వారా వేలాది మంది ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుందని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ప్రెస్ వే అథారిటీస్ చైర్మన్ రమ రమణ్ తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో ఉన్న ఈ హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధిపై ఆయా ప్రాంత పోలీసుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలను నిలువరించి వ్యవస్థను సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పోలీసుల సంఖ్యను పెంచాలని తెలిపారు. అధికార పరిధి విషయంలో పోలీసుల మధ్య తలెత్తుతున్న విభేదాలకు చెక్ పెట్టేందుకు 165 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేను ప్రత్యేక జోన్ జిల్లాగా పరిగణించేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించే అవకాశముందని ఆయన వివరించారు. సర్కిల్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, ఇతర సిబ్బందితో ఉన్న పోలీసు బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ) సారథ్యం వహిస్తారని రమ రమణ్ తెలిపారు. ఒక్కసారి ప్రత్యేక జిల్లా జోన్గా ప్రకటిస్తే ఈ హై స్పీడ్ లింక్పై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న గౌతమ్ బుధ్ నగర్, బుల్దాన్సార్, మాతురా, హత్రాస్, అలీగఢ్, ఆగ్రా పోలీసులకు అధికారాలు ఉండవని చెప్పారు. సర్కిల్ అధికారుల నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను కోరామన్నారు. గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా వరకు మధ్యలో పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. అయితే హైవే వెంట విధులు నిర్వర్తించే పోలీసులకు గృహ వసతితో పాటు కార్యాలయ భవన సౌకర్యాలను కూడా కల్పిస్తామని తెలిపామన్నారు, ఈ ఎక్స్ప్రెస్వేపై తగిన సంఖ్యలో పోలీసులు లేకపోవడంతో వారి డిమాండ్ల సాధన కోసం రైతులు కూడా రహదారిపై ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునే సరికి ఆలస్యమవుతోందని, ఫలితంగా ప్రమాద నష్టం పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతోందని వివరించారు. ఈ రహదారిపై పోలీసులు లేకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వాహన చోదకులు 150, అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఒకవేళ పోలీసు సంఖ్యను పెంచితే సురక్షిత ప్రయాణం ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ‘ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులు ఈ హైవేపై పోలీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటకు 100 కిలోమీటర్ పోవాల్సినవారు అతివేగంతో వెళుతున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధి గురించి పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దీంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టాలంటే మంచి పోలీసులు నియమించడమే ఉత్తమ ఆలోచన అని’ ఒర్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అమిత్ గుప్తా అభిప్రాయపడ్డారు. -
యూపీ సర్కార్కు మానవ హక్కుల కమిషన్ నోటీసు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో చలి బారీన పడి బాలురు మరణాలు సంభవించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ముజాఫర్నగర్, షామ్లీలలో ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో 40 మంది బాలలు చలిబారీన పడి మరణించారన్న మీడియా వార్తలపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ శిబిరాల్లో బాధితుల మరణాల మీద వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, జిల్లా మేజిస్ట్రేట్కు నోటీసులిచ్చింది. -
నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్ ఎత్తివేత!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్ సస్పెన్షన్ను రద్దు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మీడియా ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆమె సస్పెన్షన్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్పై ఓ నిర్ణయం మాత్రం వెలువడనుందని పేర్కొంది. దుర్గాశక్తి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ను కలిసినట్లు మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. అఖిలేష్ సింగ్కు దుర్గాశక్తి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దుర్గాశక్తి సస్పెన్షన్పై అఖిలేష్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ కథనంలో అభిప్రాయపడింది. గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామంలో మసీద్కు సంబంధించిన గోడ కూల్చివేతకు దుర్గాశక్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడిందని ప్రభుత్వం చెబుతుంది. అయితే రాజకీయ నాయకులకు సంబంధించిన ఇసుక మాఫియాపై దుర్గాశక్తి ఉక్కుపాదంతో అణివేసింది. అందులోభాగంగానే దుర్గాశక్తిపై సస్పెన్షన్ వేటు వేశారని విమర్శకులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
'అఖిలేష్ ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య'
ఈ నెల 15న ఫతేపుర్ సిక్రిలో తమ పార్టీ తలపెట్టిన ర్యాలీకి అఖిలేష్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల భారతీయ జనతాపార్టీ శ్రేణులు శుక్రవారం లక్నోలో నిప్పులుకక్కుతున్నాయి. ర్యాలీని రద్దు చేయటం అఖిలేష్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాథక్ అభివర్ణించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆ ర్యాలీని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి అజాంఖాన్ నేతృత్వంలో అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ర్యాలీ నిర్వహించుకునే అవకాశం ఉందని, అలాంటిది ఏ కారణం లేకుండా తమ పార్టీ చేపట్టనున్న ర్యాలీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని పాథక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనారిటీలను బుజ్జగించే చర్యల్లో భాగంగానే ర్యాలీని రద్దు చేసినట్లు కనబడుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించేది లేదని గత అర్థరాత్రి అఖిలేష్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో బీజేపీ శ్రేణులు అఖిలేష్ ప్రభుత్వాం, అజాంఖాన్లకు వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా హురెత్తుతున్నాయి. అయితే బీజేపీ తలపెట్టిన ర్యాలీని అఖిలేష్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందే సరైన వివరణ ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ బాజపాయి ఇక్కడ డిమాండ్ చేశారు. ఆ ర్యాలీని విజయవంతం చేయడానికి గత నెలరోజులుగా భారతీయ జనతాపార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది. ఆ ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో బీజేపీ ముఖ్యనేత ఎల్.కే.అద్వానీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వరణ్ గాంధీలు ఆ సభలో ప్రసంగించనున్నారు.ముజఫర్నగర్లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణల్లో దాదాపు 44 మంది మరణించారు. మరో వెయ్యి మంది వరకు క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
దుర్గాశక్తిపై తాజాగా విచారణ
ససెప్షన్ వేటు పడిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అంశంపై తాజాగా విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ సర్కార్ గురువారం అర్థరాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆ అంశంపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఎం.శ్రీవాత్సవ విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు పేర్కొంది. ఆయన నేతృత్వంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందచేయాలని సూచించింది. దుర్గాశక్తి సస్పె న్షన్పై ఆమె ఇచ్చిన నివేదికపై అఖిలే సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ సర్కార్ తాజాగా ఆ ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ బుద్ధ నగర్లోని కదల్పూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న మసీద్ గోడను కూల్చివేసేందుకు ఆమె ఆదేశాలు జారీ చేయడాన్ని అఖిలేష్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఆమె జిల్లా మేజిస్ట్రేట్గా తీసుకున్న ఆ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని ఆ సర్కార్ అభిప్రాయపడ్డింది. దాంతో ఆమెపై ససెప్షన్ వేటు వేసింది. దుర్గాశక్తి నాగపాల్ను అఖిలేష్ సర్కార్ సస్పె న్షన్ చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
వీహెచ్పీ యాత్రపై వివాదం
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆగస్టు 25న అయోధ్యకు తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై వివాదం మొదలైంది. ఈ యాత్రపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకోవడంపై వీహెచ్పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తీవ్రంగా స్పందించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేసేందుకు బలప్రయోగానికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని యూపీ సర్కారును హెచ్చరించారు. ఒకవైపు, అయోధ్య యాత్రపై వీహెచ్పీకి బీజేపీ, ఆరెస్సెస్ బాసటగా నిలుస్తుండగా, మరోవైపు, కాంగ్రెస్, జేడీయూలు బీజేపీ, వీహెచ్పీలపై విమర్శలు సంధించాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ యూపీ వ్యవహారాల ఇన్చార్జిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సన్నిహితుడైన అమిత్ షాను నియమించిన నాటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ అన్నారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడటం, ఒక వర్గం ఓట్లను కూడగట్టుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలన్నదే బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహమని విమర్శించారు. యాత్రపై నిషేధాన్ని అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ అశోక్ సింఘాల్ యూపీ సర్కారును హెచ్చరించడాన్ని జేడీయూ తప్పుపట్టింది. ‘సింఘాల్ ఎవరు? హిందువులను ఆయనేమైనా గుత్తకు తీసుకున్నారా? ఈ వీహెచ్పీ ఏమిటి? హిందువులకు నేతృత్వం వహించే సంస్థగా వీహెచ్పీని ఎవరు ఆమోదిస్తారు?’ అంటూ జేడీయూ అధినేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కాగా, యాత్రపై నిషేధం విధించడం సబబు కాదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. మరోవైపు వీహెచ్పీ తలపెట్టిన యాత్రను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
దుర్గాశక్తి సస్పెన్షన్పై 12న విచారణ
న్యూఢిల్లీ: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి సస్పెన్షన్కు గురైన ఉత్తరప్రదేశ్ యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్పాల్ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానాన్ని చేరుకుంది. ఆమెపై చేపట్టిన అన్ని చర్యలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యం(పిల్)పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ఈనెల 12న విచారణ నిర్వహించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. దుర్గాశక్తికి వ్యతిరేకంగా యూపీ సర్కారు చేపట్టిన చర్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, అవి చెల్లవని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని కించపరచటమేనన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతపరమైన భవనాల నిర్మాణాన్ని నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించినందుకు దుర్గాశక్తి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, అత్యున్నత న్యాయస్థానం ఆమెను కాపాడాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. మీడియాది అత్యుత్సాహం: ఆజంఖాన్ దుర్గాశక్తి నాగ్పాల్ సస్పెన్షన్ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని యూపీ మంత్రి ఆజంఖాన్ మండిపడ్డారు. నాగ్పాల్ను దుర్గామాతలా ప్రచారంచేస్తూ ఎక్కువ చేసి చూపుతోందని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు లేకుండానే రాష్ట్రాన్ని నడుపుతామంటూ కొందరు అధికార ఎస్పీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించారు. దేశంలోని 125 కోట్ల జనాభాకు కేవలం వెయ్యి నుంచి రెండు వేల మంది ఐఏఎస్ అధికారులున్నారని...వారి బదులు ఇతరులు దేశా న్ని నడపలేరా? అని ప్రశ్నించారు. బ్రిటీష్కాలం నాటి సివిల్ సర్వీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని మరోమంత్రి శివ్పాల్సింగ్ యాదవ్ హెచ్చరించారు. మరోవైపు దుర్గాశక్తి సస్పెన్షన్ వేటును వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐపీఎస్ అధికారుల సం ఘం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్కు లేఖ రాసింది.