పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని అరెస్టు చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గురువారం మృతురాలి చిత్రపటాలను పట్టుకుని.. నల్లబ్యాడ్జీలు ధరించి నగరంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి న్యాయం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.