junior doctors
-
వెటర్నరీ జూడాలు.. తగ్గేదేలే!
సాక్షి, తిరుపతి సిటీ/చీపురుపల్లి/గన్నవరం: బ్యాచ్లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇంటర్న్షిప్ చేస్తున్న తాము కూడా మెడికోలతో సమానమేనని, వారికి ఇస్తున్నట్లుగానే తమకు రూ.25 వేలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా గరివిడి, ప్రొద్దుటూరు, గన్నవరంలలో ఫిబ్రవరి 3 నుంచి తరగతులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టిన బీవీఎస్ విద్యార్థులు, బుధవారం తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. హాస్టళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయం వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకునేలా చేసింది. హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటి, ఆకలి బాధల్లోకి నెట్టినా తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. వర్సిటీ దిగ్బంధం తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్క్యులర్కు అనుగుణంగా ఉదయం ఒక్కసారిగా విద్యార్థుల హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీలోకి అధికారులను, అధ్యాపకులను, ఉద్యోగులను ప్రవేశించకుండా దిగ్బంధం చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాగా బుధవారం రాత్రి తాజాగా వెటర్నరీ జూనియర్ డాక్టర్లతో అధికారులు, పోలీసులు జరిపిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విద్యార్థుల వసతి గృహాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సుముఖతను వ్యక్తం చేశారు. దీంతో వైద్య విద్యార్థులు వర్సిటీ దిగ్బంధ ఆందోళనను విరమించుకున్నారు. అయితే గౌరవ వేతనాన్ని పెంచేంతవరకూ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని వెటర్నరీ జూడాలు తేల్చిచెప్పడం గమనార్హం. ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి?కాగా, హాస్టల్ మూసివేస్తే తామంతా ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి.. అంటూ విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో ఉన్న యూనివర్సిటీ ప్రధాన గేటుకు అడ్డంగా బైఠాయించారు. యూనివర్సిటీలోకి అధ్యాపకులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్సిటీ అసోసియేట్ డీన్ ఎం.శ్రీనివాసరావు పలుమార్లు విద్యార్థులతో మాట్లాడగా 11 గంటలకు అధ్యాపకులు, సిబ్బందిని లోపలకు వెళ్లేందుకు అంగీకరించారు. ఖాళీ కంచాలు, గరిటెలతో వినూత్న నిరసన మరోవైపు కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం కళాశాల ప్రధాన గేట్లను మూసివేసి బోధన, బోధనేతర సిబ్బందిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. -
జూడాల సమ్మె విరమణ
కోల్కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కోల్కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్), మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్(ఎంఎస్ఎన్) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్కతా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్ యూనిట్.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్ కాలేజీ లేదా క్యాంపస్ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
ఫలించిన ‘దీదీ’ సెంటిమెంట్.. మమత ఇంటికి డాక్టర్లు
కోల్కతా: బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల చర్చల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. ఈ క్రమంలో జూడాల బృందంలో మమతతో చర్చించేందుకు కాసేపటి క్రితమే ఆమె ఇంటికి వెళ్లారు.కాగా, సీఎం మమతా శనివారం అనూహ్యంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడారు. తమకు న్యాయం కావాలి అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ క్రమంలో దీదీ..‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ సోదరిగా ఇక్కడికి వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఇదే సమయంలో వైద్యులతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/GMXiKWu1Zs— ANI (@ANI) September 14, 2024 అనంతరం, కొద్ది గంటల వ్యవధిలోనే సీఎం మమతా బెనర్జీతో చర్చలకు సిద్ధమేనని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ పంపించారు. వైద్యుల మెయిల్కు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. అనంతరం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. దీంతో, మమతతో చర్చించేందుకు వైద్యులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో వీరి సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. డాక్టర్ల డిమాండ్లను దీదీ ఒప్పుకుంటారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. #WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/XpD7KWrntt— ANI (@ANI) September 14, 2024ఇది కూడా చదవండి: భరతమాత బిడ్డకు విదేశీగడ్డపై అవమానం: ప్రధాని మోదీ -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
వాళ్లనెప్పుడూ బెదిరించలేదు: మమతా బెనర్జీ
కోల్కతా: తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమంలో చేసిన ప్రసంగంపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారామె. తాను డాక్టర్లను బెందిరించలేదని బీజేపీ ఆరోపణలకు సీఎం మమత కౌంటర్ ఇచ్చారు. ‘నేను వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. వారి ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసినవారిని నేను ఎప్పుడూ బెదిరించలేదు. నేను బెదింరించినట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు. అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించాను. నా ప్రసంగంలో ఉపయోగించిన పదాలు శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినవి అని స్పష్టం చేశాను. సాధువు సైతం కొన్ని సమయాల్లో స్వరం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరాలు, నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ ప్రస్తావన తీసుకొని మాట్లాడాను’ అని మమత స్పష్టం చేశారు.I detect a malicious disinformation campaign in some print, electronic and digital media which has been unleashed with reference to a speech that I made in our students' programme yesterday. Let me most emphatically clarify that I have not uttered a single word against the…— Mamata Banerjee (@MamataOfficial) August 29, 2024 అయితే బుధవారం సీఎం మమత బెనర్జీ తన ప్రసంగం డాక్టర్లను బెదిస్తున్నట్లు ఉందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ విద్యార్థి విభాగంలోని విద్యార్థుల పని కుట్రదారుల ముసుగు విప్పడం, వారిని భయపెట్టడమని సీఎం మమత అన్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యతో ఆమె నిరసన తెలిపే డాక్టర్లను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. -
ఆ తల్లితండ్రుల ఆవేదన ఎవరికీ కనపడటం లేదా
-
విధిలేక విధులు!
ఆధునిక సదుపాయాలతో వైద్య రంగం ఎంత పురోగమిస్తున్నా జూనియర్ వైద్యుల (జూడా) వెట్టి చాకిరీకి మాత్రం తెర పడటం లేదు. ప్రాణం పోసే వైద్యులు ఒత్తిడితో ప్రాణాపాయ పరిస్థితిల్లో కూరుకుపోతున్నారు. తమతో యంత్రాలకన్నా ఘోరంగా పని చేయిస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోల్కతాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన రెసిడెంట్ వైద్యురాలు 36 గంటలుగా నిరంతరాయంగా విధుల్లో ఉన్నట్టు వెల్లడైంది. – సాక్షి, అమరావతిప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులతో ఏకదాటిగా రెండు, మూడు రోజులు పనిచేయించడంతో పనిభారం, మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్, ఇతర యూజీ కోర్సుల విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ఎంసీ (జాతీయ మెడికల్ కౌన్సిల్) ఆధ్వర్యంలో నేషనల్ టాస్క్ఫోర్స్ ఫర్ మెంటల్ హెల్త్, వెల్ బీయింగ్ దేశవ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్, 5,337 మంది పీజీ వైద్య విద్యార్థులు, 7,035 మంది ఫ్యాకల్టీని ఆన్లైన్ సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. 28 శాతం మంది ఎంబీబీఎస్, 15 శాతం మంది పీజీ విద్యార్థులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో 16.2 శాతం మంది యూజీ, 31.2 శాతం మంది పీజీ విద్యార్థులు తమకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు తెలిపారు. 237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొనడం నివ్వెరపరుస్తోంది. సర్వేలో పాల్గొన్న పీజీ విద్యార్థుల్లో 45 శాతం మంది తాము వారానికి 60 గంటలకు పైగానే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది వారాంతపు సెలవు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. 9.7 శాతం మంది యూజీ, 18 శాతం పీజీ విద్యార్థులు ర్యాగింగ్ గురవుతున్నామన్నారు.ఎంఎన్సీ సూచనలివీ..» రెసిడెంట్ డాక్టర్లకు వారానికి 74 గంటల కంటే ఎక్కువ పని గంటలు వద్దు. వారాంతపు సెలవు ఇవ్వాలి. » వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడి, సమస్యలను అధిగమించేలా యోగా, క్రీడలు, ఇతర కార్యక్రమాలను కళాశాలలు నిర్వహించాలి. సంస్కరణలు చేపట్టాలి..ఎంబీబీఎస్తో సమానంగా పీజీ సీట్లు పెరుగుతున్నందున పీజీ వైద్యుల పని వేళలను కుదించాలి. 24 గంటల పాటు విధులు నిర్వహించిన జూడాలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి. – డాక్టర్ జయధీర్, అదనపు కార్యదర్శి, భారత ప్రభుత్వ వైద్యుల సంఘం వసతులు పెంచాలిఆర్జీకార్ ఘటన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఆస్పత్రుల సిబ్బందిలో 60 నుంచి 70% మహిళలే ఉన్నా తగిన మౌలిక సదుపాయాలు లేవు. సీసీ కెమెరాలు పెంచాలి. సిబ్బందిపై చిన్న ఘటన జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ ఉండాలి. – డాక్టర్ జాగృతి, జూనియర్ డాక్టర్, సిద్ధార్థ వైద్య కళాశాలదేశానికే దిశా నిర్దేశంహైదరాబాద్లోని ‘దిశ’ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి అసెంబ్లీలో ’దిశ’ బిల్లు ప్రవేశపెట్టి దేశానికే దిశా నిర్దేశం చేసింది. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి దేశమంతా ప్రశంసలు లభించాయి. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనల్లో కేసు దర్యాప్తు, విచారణ 21 రోజుల్లోపే పూర్తి చేసి దోషికి మరణదండన విధించేలా బిల్లు రూపొందించారు. సత్వర విచారణ, శిక్షలు విధించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ప్రత్యేకంగా తెచ్చి బాధితులు సమాచారం ఇచ్చిన పది నిముషాల్లోనే పోలీసులు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద డాక్టర్ల ధర్నా..
-
కదం తొక్కిన జూడాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. పలుచోట్ల విధులు బహిష్కరించారు. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన లైంగికదాడి, హత్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హత్యకు గురైన వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విచారణను సత్వరం పూర్తిచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సెంట్రల్ ప్రాటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆర్కేబీచ్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో వైద్య సంఘాలు, వైద్య సిబ్బంది, విద్యార్థి యూనియన్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. కర్నూలులో జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్విహార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసి, ర్యాలీగా మెడికల్ కాలేజిలోని ధర్నా శిబిరానికి చేరుకున్నారు. చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో పీజీ డాక్టర్లు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవల్ని బంద్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సిద్ధార్థ, నిమ్రా, పిన్నమనేని సిద్ధార్థ, ఎన్ఆర్ఐ, ఎయిమ్స్ మంగళగిరి వైద్య కళాశాలల జూనియర్ వైద్యులు, అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, మెడికల్ రిప్స్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ వంటి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మరణించిన వైద్యురాలి ఆత్మకు శాంతికలగాలంటూ కొవ్వొత్తులతో ఎంజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై స్కిట్స్ ప్రదర్శించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్యసేవలను, క్యాజువాలిటీ, లేబర్రూమ్, ఐసీయూల్లో విధులను బహిష్కరించారు. దీంతో అత్యవసర కేసులను మాత్రమే చేర్చుకున్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు వైద్యసేవలను నిలిపేశారు.రెండోరోజు శుక్రవారం కూడా జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు, మెడికల్ కళాశాల, పెద్దాస్పత్రి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. రాత్రి మరోసారి జీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ వైద్యులు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఒంగోలులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 24 గంటలు సాధారణ వైద్యసేవల బంద్ఆర్జీ కర్ ఘటనకు నిరసనగా ఐఎంఏ నిర్ణయం సాక్షి, అమరావతి: కోల్కతాలోని ఆర్జీ కర్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం వైద్యసేవల్ని బంద్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దీనికి వివిధ వైద్యసంఘాలు మద్దతుగా నిలిచాయి. దీంతో అన్ని ఆస్పత్రుల్లో శనివారం వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలను బహిష్కరిస్తున్నట్టు ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఫణిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై విచారణను వేగవంతంగా పూర్తిచేయాలని, ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోను వైద్యసిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం ప్రభుత్వాలు తీసుకునే చర్యల ఆధారంగా తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకాలని ఆయన కోరారు. మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువగా హింసకు గురవుతున్నారని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె.శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
కోల్కతా ఘటన: విజయవాడలో జూడాల సంఘీభావం (ఫొటోలు)
-
హామీలు ఇచ్చే వరకు ధర్నా ఆగదు..
-
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
భారీ వర్షంలోనూ జూడాల నిరసన
గాంధీఆస్పత్రి: కోల్కతాలో విధినిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో జూడాలు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. గురువారం సాయంత్రం భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెయ్యి మంది జూడాలు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్ ప్రధాన రహదారి, పద్మారావునగర్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
గాంధీలో జూడాల విధుల బహిష్కరణ
గాంధీ ఆస్పత్రి: కోల్కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యలకు నిరసనగా సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. బుధవారం అవుట్పేòÙంట్ విభాగ విధులను బహిష్కరించి, ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధానమైన 9 డి మాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇవీ డిమాండ్లు రెసిడెంట్, మహిళ, పురుష వైద్యులకు వేర్వేరు గా హైజెనిక్ డ్యూటీరూమ్లను ఏర్పాటు చే యాలని, డాక్టర్స్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ కమిటీ ఏ ర్పాటు, వైద్యులు, వైద్యవిద్యార్థులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో 24 గంటలూ సీసీ కెమె రాల పర్యవేక్షణ ఉండాలని, ఆస్పత్రి మెయిన్ ఎంట్రన్స్, అత్యవసర విభాగం, ఇతర ప్రదేశా ల్లో సెక్యూరిటీ గార్డులను నియమించి, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని, ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం నుంచి బాయ్స్ హస్టల్, ఇతర చీకటి ప్రదేశాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంతోపాటు హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను నిరోధించాలని, పీజీ హాస్టల్కు సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపర్చాలని కోరుతూ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పా లనాధికారులకు వి నతిపత్రం సమర్పించారు. జూడాల ఓపీ విధుల బహిష్కరణ ఫలితంగా వైద్యసేవల్లో జాప్యంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బుధవారం ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గురు వారం కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్ తెలిపారు. వైద్యులకు అండగా మేమున్నాం: మంత్రి సీతక్క కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం అత్యంత హేయమైన చర్య అని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించిన అనంతరం అక్కడ ఆందోళన చేస్తున్న జూడాల వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ వైద్యులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, హత్యాయత్నాలు జరగకుండా కఠినమైన చట్టాలను తేవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని హామీనిచ్చారు. -
స్టైపెండ్ పెంచకుంటే పోరుబాటే..
తిరుపతి సిటీ/లబ్బీపేట(విజయవాడతూర్పు) : వెటర్నరీ జూడాలకు స్టైఫండ్ పెంచకపోతే పోరుబాట తప్పదని వెటర్నరీ వర్సిటీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూనపూడి ఎజ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో శుక్రవారం జూడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా తమకు స్టైఫండ్ రూ.7 వేలే ఇస్తున్నారని.. అదీ సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వెటర్నరీ వర్సిటీల్లో రూ.23 వేలు ఇస్తున్నా.. తిరుపతి వర్సిటీలో మాత్రం పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ నిత్యావసరాలకు సరిపోవడం లేదని, వెంటనే రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వర్సిటీలో పాలన స్థంభించిపోయిందని, వర్సిటీకి పూర్తి స్థాయి వీసీ, రిజిస్ట్రార్లను నియమించాలని కోరారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువిస్తున్నామని, అప్పటికీ స్పందించకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ చెంగల్రాయులుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో జూడాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్నాయక్, జనరల్ సెక్రటరీ ఆకాష్ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. విజయవాడ జీజీహెచ్లో జూడాల నిరసనతమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన రవి కలుపుమందు తాగి మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సమయంలో మృతుడి బంధువులు, జూడాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు జూడాలపై దాడి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సమ్మె నోటీసు తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్ వద్దకు వెళ్లగా.. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని, సమ్మె నోటీసు తీసుకోనని చెప్పినట్లు జూడాలు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకు వందలాది మంది జూడాలు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ఆందోళనకు దిగారు.తమకు రక్షణ కల్పించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని జూడాలతో కలిసి సూపరింటెండెంట్ చాంబర్లో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
తెలంగాణలో జూడాల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జూడాలతో తాను రెండు సార్లు చర్చించానని తెలిపారు. వైద్య శాఖలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 8లో ఆరు డిమాండ్లకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.కాగా, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ యూనివర్శిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. -
TG: తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
జూనియర్ డాక్టర్ల సమ్మె
-
నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సమ్మె
-
TG: నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్పర్సన్ డాక్టర్ డి.శ్రీనా«థ్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. స్టైపెండ్లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. -
రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్లర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఏడు ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్జీ సాయిశ్రీహర్ష, ఐజక్ న్యూటన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భోజ న విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 24 నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఔట్ పేషెంట్, వార్డు సర్వీసులు, ఎలక్టివ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి. కార్యక్రమంలో టీ–జూడా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్లతోపాటు పీజీలు, హౌస్సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవీ డిమాండ్లు » ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా స్టైపెండ్ నిధులు విడుదల చేయాలి » సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు రూ.1.25 లక్షలు గౌరవ వేతనం చెల్లించాలి » ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి ళీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం కోటా తొలగించాలి ళీ నూతన మెడికల్ కాలేజీల్లో వసతిగృహాలు, రవాణా, పరిశోధనశాల సదుపాయాలు కల్పించాలి » బోధనాస్పత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ ఔట్పోస్టు బలోపేతం చేయాలి » సెక్యూరి టీ ఔట్పోస్టు లేనిచోట కొత్తగా ఏర్పాటు చేయాలి -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ డాకర్టకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనందించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్లో పెంపుదల ఉంటుందని వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44,075 నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524 నుంచి రూ.53,503కు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు పెంచింది. స్టైఫండ్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: విశాఖ కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్ -
జూడాల ఆందోళన విరమణ
గాంధీ ఆస్పత్రి: జీవో నంబర్ 155 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (జూడా) అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె నోటీసులను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య శాఖ మంత్రి హరీశ్రావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. మంత్రి హరీశ్రావు, వైద్య ఉన్నతాధికారులతో జూడాల సంఘ ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్లో నీట్లో ఇన్ సర్వీసు కోటా రిజర్వేషన్లు పెంచబోమని, ఎవరీకి నష్టం కలగకుండా సర్వీస్ వైద్యులు, జూనియర్ డాక్టర్స్కు సమాన ప్రతిపత్తి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూడాల సంఘ ప్రతినిధులు సాగర్, కార్తీక్, వివేక్, మణికిరణ్రెడ్డి తెలిపారు. పలు అంశాలపై పరిష్కారం కోసం మంత్రికి వినతిపత్రం అందించారు. -
నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్ 100 రూపాయల కోసం ఆక్సిజన్ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు -
ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
ఏపీ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు -
జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..విధుల్లోకి జూడాలు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా అత్యవసర, సాధారణ విధులను బహిష్కరించిన జూని యర్ డాక్టర్లు సమ్మె విరమించి గురువారం రాత్రి నుంచి విధుల్లో చేరారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో ఈనెల 26 నుంచి అత్యవసర, ఐసీయూ సేవలు మినహా విధులు బహిష్కరిం చిన సంగతి తెలిసిందే. స్టైపెండ్ పెంపు, హెల్త్కేర్ వర్కర్స్తో పాటు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో చికిత్స, పదిశాతం ప్రోత్సాహ కం, విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అనే నాలుగు డిమాం డ్లపై ఈనెల 10న సమ్మె నోటీసులు ఇవ్వగా... సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సైతం సమ్మె నోటీసు ఇచ్చి బుధవారం నుంచి విధులు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనలతో రంగంలోకి దిగిన వైద్య విద్య సంచాలకులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపినప్పటికీ లిఖితపూర్వక హామీ రాకపోవడంతో గురువారం కూడా సమ్మె కొనసాగించారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోవిడ్–19 అత్యవసర పరిస్థితుల్లో విధులు బహిష్కరించడం సరికాదనే కోణంలో జూని యర్ డాక్టర్ల సంఘం, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో బీఆర్కే భవన్లో వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ప్రత్యేకంగా చర్చ లు జరిపారు. ఇంటర్న్షిప్ డాక్టర్లతో పాటు జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ 15% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కూడా స్టైఫండ్ 15 శాతం పెంచుతున్నట్లు అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు కరోనా బారిన పడితే జూనియర్ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్సకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా విధినిర్వహణలో మరణించిన హెల్త్కేర్ వర్కర్స్ కుటుంబసభ్యులకు పరిహారం ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కరించగా... మిగతావాటిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు స్పష్టత రావడంతో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాసరి నవీన్, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మణికిరణ్రెడ్డి, సునయ్లు చెప్పారు. త్వరలో మిగతా డిమాండ్లు సైతం పరిష్కారమవుతాయని జూడాల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్–19 అత్యవసర సమయంలో రోగులకు వైద్య సేవలు అందించాలి్సన ఆవశ్యకత దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూడాలు గురువారం రాత్రి 9 గంటల నుంచి విధుల్లో చేరడంతో రెండ్రోజుల పాటు సాగిన సమ్మెకు తెరపడింది. స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు సీనియర్ రెసిడెంట్లకు ప్రస్తుతం నెలకు రూ.70వేల చొప్పున స్టైఫండ్ ఇస్తున్నారు. దీనిని 15 శాతం పెంచాలని ప్రభుత్వానికి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్ను రూ.80,500కు పెంచింది. ఈ మొత్తాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈÐ మేరకు వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. ఇలావుండగా ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిపొ్లమా, ఎండీఎస్ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులకు సైతం ప్రభుత్వం స్టైఫండ్ను 15 శాతం పెంచింది. ఇందుకు సంబంధించి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు కూడా ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. స్టైఫండ్ పెంపు ఇలా... కోర్సు ప్రస్తుత స్టైఫండ్ పెంచిన తర్వాత హౌస్ సర్జన్మెడికల్ 19,589 22,527 హౌస్సర్జన్డెంటల్ 19,589 22,527 పీజీ డిప్లొమాలో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 సూపర్ స్పెషాలిటీలో.. మొదటి సంవత్సరం 48,973 56,319 రెండో సంవత్సరం 51,422 59,135 మూడో సంవత్సరం 53,869 61,949 పీజీ డిగ్రీ అండ్ ఎండీఎస్లో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 మూడో సంవత్సరం 48,973 56,319 పెంపు జీవో విడుదల ఇంటర్నస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ, సీనియర్ రెసిడెంట్ల (ఎస్ఆర్)కు స్టైపెండ్ 15% పెంపు. 2021 జనవరి నుంచి పెంపు వర్తింపు. స్టైపెండ్ పెంపు జీవో విడుదల నిమ్స్లో పడకలకు ఓకే జూడాలు, వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్లో పడకలు కేటాయించి వైద్యసేవలు అందించేందుకు అంగీకారం. ఇవి సీఎం దృష్టికి.. కీలకమైన ఎక్స్గ్రేషియా అంశంతో పాటు ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టమైన హామీ. -
TS: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చెస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు జూడాలు డీఎంఈతో చర్చలు కొనసాగించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇక జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వెంటనే విధుల్లో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీలు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారీ డీఎంఈతో జూడాల చర్చలు జరగనున్నాయి. చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్ -
తెలంగాణ: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
-
చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సంఘంతో వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు డిమాండ్లపై చర్చించినా డైరెక్టర్ నుం చి స్పష్టమైన హామీ రాలేదని, దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడిం చింది. పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. స్టైఫండ్ పెంపుతోపాటు ప్రోత్సాహకాలు, కోవిడ్ విధుల్లో మరణిస్తే ఇచ్చే పరిహారం, కరోనాతో బాధపడుతున్న కుటుంబసభ్యులకు నిమ్స్లో ఉచిత చికి త్స వంటి అంశాలపై జూడాలు సమ్మెకు దిగారు. తొలిరోజు సమ్మెలో భాగంగా బుధవారం అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కాగా, మిగతా విధులను బహిష్కరించారు. ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ... ప్రస్తుత సమయంలో సమ్మె సరికాదని, జూడాల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుపుతూ చర్చలు జరపాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సైతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని ట్విట్టర్ ద్వారా విన్నవించారు. ఈ క్రమంలో బుధవారం సాయం త్రం వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంపు పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పినా లిఖితపూర్వక హామీ రాలేదు. డైరెక్టర్ రమేశ్రెడ్డి జూడాల హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం బయటకు వచ్చిన జూడాల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తా మని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. అయితే సీఎం, మంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాకపోవడంతో సమ్మె ను కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. సమ్మె సరికాదు.. ‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. చీటికీ మాటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, కరోనా పరిస్థితులను కూడా చూడకుండా విధులను బహిష్కరించడం సరికాదు’. – సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నాం... లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాం. మా హామీలు అమలు చేయడం కుదరదని రమేశ్రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాలేదు. –జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశాలు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని15 శాతం పెంచాలి. మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి ‘కోవిడ్’వైద్య సేవల్లో కొనసాగుతున్న విద్యార్థులకు సైతం సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలి. కోవిడ్ విధుల్లో మరణించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకుఎక్స్గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో, జూడాల కోరిక మేరకు సత్వరమే చెల్లించాలి. జూడాలకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్లో అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి. స్తంభించిన వైద్య సేవలు జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. సకాలంలో సేవలు అందక సాధారణ రోగులు ఇబ్బందిపడ్డారు. క్లిష్టమైన ఈ సమయంలో మందులు, ఆక్సిజన్ మానిటరింగ్ చేసే వైద్యులు లేక కోవిడ్ బాధితులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కింగ్కోఠి ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రోగుల బంధువులు మద్దతు పలికారు. ఇది సమయం కాదు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. –మంత్రి కేటీఆర్ చదవండి: జూడాల సమస్యలను పరిష్కరించాలి సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
జూడాల సమస్యలను పరిష్కరించాలి: ఇందిరాశోభన్
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లను తెలంగాణ సర్కార్ విస్మరించడం సరికాదని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జూడాలకు 10 శాతం ఇంటెన్సివ్ ఇస్తానన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందన్నారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరోనా బారిన పడ్డ జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వారి ఆరోగ్యానికే భద్రత లేకుండా ఎలా అని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుపై ఆరా తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజే వాళ్లని పిలిచి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూడాలను చర్చలకు ఆహ్వానించి.. సమ్మెను విరమింపజేయాలన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. చదవండి: ‘కేసీఆర్.. మీది గుండెనా.. బండనా..?: వైఎస్ షర్మిల సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది. చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు Etela Rajender: బీజేపీ వైపు ఈటల? -
తెలంగాణ సర్కార్కి జూడాల షాక్
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్కి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. డిమాండ్లు జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైరస్ తగ్గుతున్న వేళ తెలంగాణలో కరోనా తగ్గుమఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 28 వరకు కొవిడ్ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. అంతకు ముందే ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపే అవకాశం ఉంది. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
ఫుడ్ పాయిజన్: జూనియర్ డాక్టర్లకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్లో పుడ్ పాయిజన్ కారణంగా జూనియర్ డాక్టర్లు అస్వస్థతకు గురయ్యారు. ఇరవై మూడు మందికి పుడ్ పాయిజన్తో వాంతులు, విరోచానాలు కావడంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో నాసిరకం బోజనం తిని అస్వస్థత గురయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మెడికోలకు ప్రమాదం లేదని డాక్టర్ చెబుతున్నారు.. జూనియర్ వైద్యులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మెడికోలు చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ డెవిడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుడ్ పాయిజన్ కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థులు తిన్న ఆహారాన్ని ల్యాబ్ పంపించామని అన్నారు. నాణ్యత లోపాలు ఉంటే హస్టల్ నిర్వహకుల పై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. -
ఏపీ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు వర్తిస్తుంది. స్టైఫండ్ పెంపు వివరాలు.. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589, పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, ముడో ఏడాది రూ.48, 973 పెరగనుంది. అదే విధంగా పీజీ డిప్లొమా విద్యార్థులుకు మొదటి రూ.44,075, రెండో ఏడాది రూ.46524 పెంపు వర్తిస్తుంది. సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.48,973, రెండో ఏడాది రూ.51,422, మూడో ఏడాది రూ.53,899 పెరగనుంది. ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, మూడో ఏడాది రూ.48,973 పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
చుక్కేసి.. చిక్కేసిన జూడాలు
సాక్షి, సిటీబ్యూరో: మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్లోని వడోదరలో కొందరు జూనియర్ డాక్టర్లు మందు పార్టీ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వఘోడియా పోలీసులు దాడి చేసి మొత్తం 12 మంది జూనియర్ డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఓ హైదరాబాదీతో పాటు ఐదుగురు యువతులు ఉన్నట్లు వఘోడియా పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి వడోదర రూరల్ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గుజరాత్లో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలులో ఉంది. బయటి రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి సైతం అధీకృత లేఖ ఆధారంగా మాత్రమే పరిమితంగా మద్యం విక్రయిస్తారు. ఆ రాష్ట్రంలోని వడోదర రూరల్ పరిధిలో ఉన్న సుమన్దీన్ విద్యాపీఠ్Š‡తో పాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్దీప్ ఆస్పత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కొందరు సదరు ఆస్పత్రిలో పని చేసే జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. గుజరాత్లోని మీన్నగర్ ప్రాంతానికి చెందిన జైమన్ మెహతా, ఘట్లోడియా వాసి కిరణ్ మెహతా సైతం జూనియర్ డాక్టర్లుగా పని చేస్తున్నారు. తన సహచరులైన పది మందితో కలిసి మద్యం పార్టీ చేసుకోవాలని భావించారు. దీంతో ఆదివారం రాత్రి వడోదర రూరల్ పరిధిలోని ఆమోదర్ గ్రామంలో ఈ ద్వయం నివసించే శ్యామల్ కౌంటీలో ఉన్న హౌస్ నంబర్ 112 ఈ పార్టీకి వేదికైంది. ఇందులో ఐదుగురు యువతులు సహా 12 మంది జూనియర్ డాక్టర్లు మద్యం తాగుతున్నారు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వాళ్లు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దాడి చేసిన వఘోడియా పోలీసులు డజన్ మందినీ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ ఇంటి నుంచి దేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వాసులతో పాటు హైదరాబాద్కు చెందిన జూనియర్ డాక్టర్ కోషి జోసెఫ్ ఉన్నట్లు వఘోడియా ఎస్ఐ పి.పార్మర్ ప్రకటించారు. 12 మంది జూనియర్ డాక్టర్లను అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. -
విధుల్లోకి జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, బంధువులు దాడికి పాల్పడటంతో నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. తమ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ ఆస్పత్రి విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా... కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగుల బంధువులు తమపై దాడులకు దిగడం ఏమిటంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత అందించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయడంతోపాటు ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలనే డిమాండ్ను మంత్రికి వివరించారు. అలాగే సకల సౌకర్యాలున్న గాంధీ ఆస్పత్రిని కేవలం కరోనా చికిత్సకే పరిమితం చేయకుండా అన్ని రకాల రోగులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం పడకల సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేసినప్పటికీ 30% అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రిజర్వ్ స్టాఫ్ ఉంటేనే వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి ఉండదని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా చికిత్సలను గాంధీ తదితర ఆస్పత్రులకే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తే గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందని కోరారు. వైద్యులు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, ఇతరాలను జూనియర్ డాక్టర్ల సమ్మతితో కొనుగోలు చేయాలని సూచించారు. పక్షం రోజుల్లో రోడ్మ్యాప్... జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కరోనా అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆందోళన విరమించాలని సూచిస్తూనే వారి డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజుల్లో మార్గం చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చల తాలూకూ అంశాలను సీఎం కేసీఆర్కు వివరించిన తర్వాత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, ఈలోగా విధుల్లో చేరి వైద్యసేవలను ప్రారంభించాలని కోరారు. దీంతో సమ్మతించిన జూనియర్ డాక్టర్ల సంఘ ప్రతినిధులు విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. పక్షం రోజుల్లో పరిష్కారం చూపకుంటే మాత్రం మళ్లీ ఆందోళన చేపడతామని జూనియర్ డాక్టర్ల సంఘం పేర్కొంది. -
వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్!
సాక్షి, హైదరాబాద్ : వైద్యులపై దాడులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, వారి బంధువులు వైద్యులపై దాడి చేయ డంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగిన సం గతి తెలిసిందే. బుధవారం గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూని యర్ డాక్టర్లతో భేటీ అయి దాదాపు నాలుగు గంటల పాటు చర్చించినా ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జూడాల ప్రతినిధుల బృందంతో ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలతో పాటు డిమాండ్లను సాను కూలంగా విన్నారు. వైద్యులపై దాడులు పరిపాటిగా మారడంతో భద్రత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించింది. దీనిపై ఈటల స్పందిస్తూ.. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్(ఎస్పీఎఫ్)ను అందుబాటులో ఉంచుతామని వివరించినట్లు తెలిసింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల తాకిడి తీవ్రమైనందున ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికిత్సలకు అనుమతివ్వాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీపై తక్షణ చర్యలు చేపట్టి నియామకాలు పూర్తిచేయాలని డిమాండ్ చేయగా.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. జూనియర్ డాక్టర్లతో ప్రతి వారం చర్చలు జరపనున్నట్లు ఈటల మరోమారు స్పష్టం చేసినట్లు జూడాలు వెల్లడించారు. అయితే చర్చలకు సంబంధించి రాత్రి పొద్దుపోయే వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మూడో రోజుకు చేరిన ఆందోళన గాంధీఆస్పత్రి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి జూడాలు విధులు బహిష్కరించి చేపట్టిన ఆందోళన గురువారం మూడో రోజు కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. దీంతో కరోనా బాధితులకు అందే వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి పాలనా యంత్రాంగం తెలిపింది. క్వారంటైన్లో ఉన్న వైద్యులు, సిబ్బందిని తక్షణమే విధులకు హజరుకావాలని ఆదేశించినట్లు పేర్కొంది. -
మాకు రక్షణ ఏదీ?
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సుమారు ఆరుగంటల పాటు హైడ్రామా నడిచింది. తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూడాలు రోడ్డెక్కారు. ఆస్పత్రి ఎదుట సికింద్రాబాద్–ముషీరాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, వైద్యమంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రికి వచ్చి స్పష్టమైన, లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు ధర్నా విరమించేదిలేదని భీష్మించారు. ఈ కారణంగా ఆస్పత్రిలో వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరగడంతో కరోనా బాధితులు అసహనం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గాంధీలో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన కరోనా రోగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుమారుడు, మరో బంధువుతో కలసి వైద్యులు, సిబ్బందిపై ఇనుప చైర్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు జూడాలకు గాయాలు కాగా, భయభ్రాంతులకు గురైన జూడాలు మంగళవారం రాత్రే విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో జూడాలు, ఇంటర్నీస్, హౌస్ సర్జన్లు బుధవారం ఉదయం ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా కొనసాగించారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న తమ ప్రాణాలకే రక్షణ కరువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేశామని ధర్నా విరమించాలని పోలీసులు, ఆస్పత్రి యంత్రాంగం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ధర్నా అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించిన జూడాలు ముందస్తు పథకం ప్రకారం ఒక్కసారిగా బారికేడ్లను తొలగించి రోడ్డెక్కారు. ఈ క్రమంలో పోలీసులు, జూడాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు ఆరుగంటల పాటు రోడ్డుపై బైఠాయించిన జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల సమయంలో వైద్యమంత్రి కార్యాలయం నుంచి చర్చలకు రమ్మని కబురు అందినా, మంత్రే ఇక్కడకు రావాలని వారు పట్టుబట్టారు. తానే వస్తానని మంత్రి చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి రాకపోకలు సాగించే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జూడాల రాస్తారోకోను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాను అనుమతించలేదు. దూరం నుంచే ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనాకు మందు మీడియాను నియంత్రించడం కాదని జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటి? జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటనే అంశంపై చర్చ వైద్యవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. పారిశుధ్యలోపం, వార్డ్బాయ్స్, పేషెంట్ కేర్ టేకర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు తగినంతగా లేకపోవడమేనని భావిస్తున్నారు. ఏప్రిల్ 1న మర్కజ్ నుంచి వచ్చి కరోనా బారిన పడిన కుత్భుల్లాపూర్కు చెందిన వ్యక్తి (56) గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సదరు మృతుడు బాత్రూంకు వెళ్లి తిరిగివస్తూ కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి కూడా కర్వాన్కు చెందిన వ్యక్తి (55) కూడా సరిగ్గా అలాగే మృతి చెందాడు. ఈ రెండు ఘటనల్లో వైద్యులు, జూడాల నిర్లక్ష్యం లేదు. కాని దాడులు జరిగింది వైద్యులు, జూడాలపైనే. పారిశుధ్యం సరిగా ఉండి, తగినంత మంది షేషెంట్ కేర్ టేకర్లు, వార్డుబాయ్స్ ఉంటే పేషెంట్తోపాటు వెళ్లే వెసులబాటు ఉండేది. రోగి కిందపడి ప్రాణాలు పొగొట్టుకునే అవకాశం ఉండేది కాదని, ఇదంతా తమకు సంబంధం లేని విషయమని, దాడులు మాత్రం తమపైనే జరుగుతున్నాయని వైద్యులు, జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడిన ఇరువురి అరెస్ట్.. జూడాలపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడిన ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు (26), సమీప బంధువు (42)లపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ సెక్షన్ 3, తెలంగాణ మెడికేర్ యాక్ట్ సెక్షన్ 4తోపాటు ఐపీసీ 332, 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించామని అన్నారు. వైద్యులపై దాడులు దురదృష్టకరం: ఈటల సాక్షి, హైదరాబాద్: వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇలా త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో సహించం’అని అన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జూనియర్ డాక్టర్లతో చర్చించి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. హాస్పిటల్ డీసెంట్రలైజేషన్ అంశంపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. జూడాల కమిటీతో ప్రతి వారం గాంధీలోనే సమావేశమవుతానన్నారు. చర్యల తర్వాత జూడాలు ఆందోళన విరమించారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. చర్చలు విఫలం.. ఆందోళన కొనసాగింపు గాంధీ ఆస్పత్రి: చర్చలు సఫలం అయినట్లు, ఆందోళన విరమించినట్లు మంత్రి పేర్కొనగా, సమస్య పరిష్కారానికి మంత్రి ఈటలతో బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం అయినట్లు గాంధీ జూడా సంఘం ప్రతినిధులు లోహిత్, శశిధర్, వంశీ, హేమంత్ స్పష్టం చేశారు. సమస్యలు, డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారని, స్పష్టమైన హామీ లభించకపోవడంతో విధుల బహిష్కరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గురువారం ఉదయం మరోమారు అంతర్గత సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని జూడాల సంఘం ప్రతినిధులు తెలిపారు. జూడాల నిరసనలకు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
2 వ రోజుకు చేరుకున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన
-
ఫీజుల పెంపుపై జూడాలు ఆందోళన బాట..
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా ఫీజులు పెంచారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. 2017లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని.. పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నించారు. తక్షణమే జీవో 28 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గాంధీ నుంచి కరోనా అనుమానితులను తరలించాలి
-
జూడాల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ మెడికల్ కమిషన్ చట్టపై కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జూడాలు, ఐఎంఏ ప్రతినిధులు వైద్య సేవలు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆరోగ్యశ్రీ రోగులు మొదలు అనేక మంది రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సచివాలయంలో జూడాల నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్తో తాను జరిపిన చర్చల గురించి జూడాలకు వివరించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె విరమించుకున్నారని చెప్పారు. తెలంగాణలోనే సమ్మె చేయడం వల్ల రోగులకు ఇబ్బంది తప్ప ఏ ప్రయోజనం లేదని స్పష్టంచేశారు. సమ్మె విరమించాలని, ఎన్ఎంసీపై ఉన్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, సవరణలు చేసేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో చట్టమైంది. పార్లమెంట్ సమావేశాలు కూడా ముగియడంతో సమ్మె కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన జూడాలు వెనక్కు తగ్గారు. తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు జూడా అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయేందర్ ప్రకటించారు. శనివారం నుంచి విధులకు హాజరవుతామన్నారు. సెలవు రోజులైనా ఓపీ సేవలు చేస్తామన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న పరిణామాలపై మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. జూడాలతో చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అన్ని రకాల రోగాలకు వైద్యం చేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎన్నో స్పెషల్ కోర్సులు చేయాల్సి వస్తోందని, దీంతో వైద్య విద్యార్థులపై ఎంతో భారం పడుతోందన్నారు. -
జూనియర్ డాక్టర్ల మహాధర్నా
-
బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డులో జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ చేపట్టారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుప్రతుల్లో గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేవిధంగా ఎన్ఎంసీ బిల్లు ఉందని తెలిపారు. మేనేజ్మెంట్ కోటాలో 50 శాతం సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. బిల్లులోని లోపాలను సవరించాలి: నెల్లూరు: నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని కలెక్టరేట్ ముందు జూనియర్ డాక్టర్లు ధర్నానిర్వహించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఎన్ఎంసీ బిల్లులోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. తిరుపతి రుయా ఆసుప్రతిలో రోగుల పడిగాపులు: తిరుపతి: ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు సమ్మె చేపట్టడంతో తిరుపతి రుయా ఆసుప్రతిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బిల్లును వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రవేట్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. గురువారం వైద్య సేవలను నిలిపి వేశారు. జూడాలు సమ్మెకు దిగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. ఆర్థిక స్తోమత లేనివారు ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు కేంద్రానికి వ్యతిరేకంగా జూడాలు తమ నిరసన కొనసాగిస్తున్నారు -
జూడాల సమ్మెతో నిలిచిన అత్యవసర వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా నగరంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు (ఎన్ఎంసీ)కు వ్యతిరేకంగా జూడాలు దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జూనియర్ డాక్టర్ల రాస్తారోకో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అలిపిరిని వేదికగా చేసుకుని జూడాలు మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో భక్తులు, ప్రయాణికులు వారితో వాదులాడారు. చివరకు వైద్య విద్యార్థుల అరెస్టుతో ఆందోళనకు తెరపడింది. సాక్షి, తిరుపతి : ఇటీవల కేంద్రం ఆమోదించిన జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు సైతం ఆందోళన బాట పట్టడం విదితమే. ఐదు రోజులుగా బిల్లుకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన వైద్యవిద్యార్థులు ఆరో రోజు బుధవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో రుయా ఆస్పత్రిలో రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అలిపిరికి చేరుకుని మానవహారం, రాస్తారోకోకు దిగారు. వీరికి మద్దతుగా స్విమ్స్, శ్రీపద్మావతి వైద్య కళాశాల విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నేతలు రాస్తారోకోలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంతంలో తిరుమలకు రాకపోకలు సాగే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించింది. గంటల కొద్దీ వైద్య విద్యార్థులు రాస్తారోకో చేయడంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు ఇది సరైన వేదిక కాదని ఏఎస్పీ అనిల్కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ వారికి హితవు పలికారు. దీనిపై వైద్య విద్యార్థులు మాట్లాడుతూ విజయవాడలో జూడాలపై దాడి చేసినందుకు పోలీసుల తరఫున డీజీపీ సమాధానం చెప్పాలని, వైద్య శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, అరెస్టు చేసిన జూడాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు భక్తుల నిరీక్షణ వైద్య విద్యార్థుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీవారి భక్తుల్లో ఓపిక నశించింది. ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులను రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పారని వైద్య విద్యార్థులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీటీడీకి చెందిన ఉన్నతస్థాయి విజిలెన్స్ అధికారి ఒకరు వైద్య విద్యార్థిని బూటు కాలితో తన్నడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ అధికారిపైకి వైద్య విద్యార్థులు దూసుకొచ్చారు. ఇదే అదునుగా పోలీసులు వైద్య విద్యార్థులను పక్కకు లాగిపడేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ పరేడ్ గ్రౌండ్కు తరలించారు. ఆ తర్వాత ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. విద్యార్థులు–పోలీసులకు నడుమ తోపులాటలో ఓ వైద్య విద్యార్థి చేతికి తీవ్రగాయమైంది. దీంతో విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. నేడు వైద్య సేవలు బంద్ ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడంతో ఐఎంఏ, జూడాలు, వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యుల సంఘాలు ఈ బంద్లో పాల్గొననున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలను పూర్తిగా నిలిపేయనున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి తెలిపారు. అన్ని రకాల ఓపీలతో పాటు అత్యవసర సేవలను సైతం నిలిపేయనున్నట్లు చెప్పారు. ఎన్ఎంసీ బిల్లు వల్ల పేద, మధ్య తరగతి వారికి తీవ్ర నష్టం తప్పదని, అంతేకాకుండా ఈ బిల్లు వల్ల వైద్య విధానాలు పేదలకు మరింత భారంగా పరిణమించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై తిరుమలకు ధర్మారెడ్డి తిరుమల: జూనియర్ డాక్టర్ల నిరసనతో తిరుపతి నుంచి తిరుమలకు టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి ద్విచక్రవాహనంలో వెళ్లారు. నిరసన వల్ల అలిపిరిలోని గరుడ కూడలి వద్ద గంటపాటు రాకపోకలు స్తంభించాయి. అందులో ప్రత్యేకాధి కారి ధర్మారెడ్డి వాహనం కూడా నిలిచి పోయింది. దీంతో టీటీడీ ఉద్యోగికి చెందిన ద్విచక్రవాహనంపై ఆయన అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. -
జూడాల ఆందోళన ఉద్రిక్తం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ టీవీ రమణమూర్తి, డాక్టర్ మనోజ్ తదితరులు వన్టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. జూడాలను బూట్ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్కుమార్ గౌడ్ మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు ఎన్ఎమ్సీని రద్దు చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్తో కూడిన వినతిపత్రాలను జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డికి సమర్పించారు. అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్కుమార్ గౌడ్ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు తరలించారు. -
జూనియర్ డాక్టర్ని చెంపపై కొట్టిన డీసీపీ
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ జూనియర్ డాక్టర్పై డీసీపీ చేయి చేసుకోవడంతో కలకలం రేగింది. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటి ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలపై డీసీపీ హర్షవర్దన్ చేయి చేసుకున్నారు. ఒక జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని హర్షవర్దన్ చెంపపై కొట్టడంతో ఆగ్రహించిన జూడాలు డీసీపీ తీరుపై డీజీపీ సవాంగ్కు ఫిర్యాదు చేశారు. -
‘ఎన్ఎంసీ’ వద్దంటే వద్దు
సాక్షి, విజయవాడతూర్పు: నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. మూడో రోజు ఆదివారం కూడా ప్రభుత్వాస్పత్రిలో సాధారణ విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజు కొనసాగాయి. కాగా సాయంత్రం వందలాది మంది జూనియర్ వైద్యులు ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వాస్పత్రి నుంచి రమేష్ హాస్పిటల్ సిగ్నల్స్ వరకూ ర్యాలీ చేశారు. స్పెన్సర్ ఎదురుగా మానవహారంలా ఏర్పడి నినాదాలు చేశారు. బిల్లు ఉపసంహరించే వరకూ నిరసనలు.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ఉపసంహరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు తేల్చిచెప్పారు. వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గపు బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని నినదించారు. అంతేకాకుండా అనుభవం లేనివారికి వైద్యం చేసేందుకు లైసెన్స్ ఇస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం ఏమిటనీ వారు ప్రశ్నించారు. ఎన్ఎంసీ నియమ నిబంధనలు ఏమిటీ, ఏమి చేయబోతున్నారో కూడా చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బిల్లు ఆమోదించడం దేశ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమేనన్నారు. నేడు రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల విద్యార్థుల రాక కాగా ఎన్ఎంసీ బిల్లుపై వైద్య విద్యార్ధులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలకు చెందిన విద్యార్ధులు సోమవారం నగరానికి రానున్నారు. వారంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఆదివారం జూడాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఐఎంఏ నగర శాఖ కార్యదర్శి డాక్టర్ సీహెచ్ మనోజ్కుమార్ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ధనశేఖరన్, డాక్టర్ కౌశిక్లతో పాటు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వైద్యుల ఆందోళన తీవ్రరూపం
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రరూపందాల్చింది. గత రెండు రోజుల నుంచి ఓపీ సేవలు బంద్ చేసి నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులు తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి ఓపీ సహా అత్యవసర వైద్యసేవలను బహిష్కరించారు. దీంతో నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సుల్తాన్బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూనియర్ వైద్యులంతా సమ్మెకు దిగడంతో మధ్యాహ్నం జరగాల్సిన పలు చికిత్సలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా ఆస్పత్రిలో యాభైకిపైగా చికిత్సలు వాయిదా పడగా, గాంధీలో 40పైగా చికిత్సలు వాయిదా వేశారు. బోధనాసుపత్రుల్లో పని చేస్తున్న సీనియర్ వైద్యులందరికీ తాత్కాలికంగా సెలవులను రద్దు చేశారు. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల అత్య వసర విభాగాల్లో ఫ్యాకల్టీ వైద్యులే విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇన్పేషంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పట్టించుకునే వారే లేరు. నర్సులు, 108 సిబ్బందే పెద్దదిక్కుగా మారారు. నిమ్స్లో.. సోమాజిగూడ: నిమ్స్లో గురువారం కొంతమేరకు ఓపీసేవలు అందించారు. నిమ్స్ రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనను నిమ్స్ యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. వైద్యసేవలందిస్తూ నిరసనను తెలపవచ్చని, పూర్తిగా వైద్యులు ఆందోళన బాటపడితే ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఓ ప్రముఖ వైద్యుడు అన్నారు. శుక్రవారం కూడా ఆందోళన కొనసాగుతోందని నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గాంధీ ఆస్పత్రి.. గాంధీ ఆస్పత్రిలో సాధారణ విధులను మాత్రమే బహిష్కరించిన జూడాలు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జూడాల సంఘం నాయకులు డీఎంఈ రమేష్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్లను కలిసి నోటీసు అందించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలోనే సామూహిక నిరాహరదీక్షలు చేపట్టారు. అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రాణాపాయస్థితిలో ఇక్కడకు వచ్చిన రోగులకు వైద్యం అందకపోవడంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వెయ్యికి పైగా ఉన్న జూడాలు సాధారణ, అత్యసవర సేవలను బహిష్కరించడంతో 176 మంది వైద్యులు, మరో వంద మంది సర్వీసు పీజీలతో నెట్టుకొస్తున్నారు. మెదక్జిల్లా నార్సింగ్కు చెందిన శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడం, గాంధీలో వైద్య సేవల్లో జాప్యం జరగడంతో అతని కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు హటాత్తుగా ప్రకటించారని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. -
కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చి..
సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద భవన్ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు బుధవారం ఆస్పత్రి భవనం ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని అరెస్టు చేసే క్రమంలో ఓ విద్యార్థిని పట్ల మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా కానిస్టేబుళ్లు వారిని పక్కకు లాగేస్తుండగా..చార్మినార్ పీఎస్కు చెందిన కానిస్టేబుల్ పరమేష్ అదే కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థినిని కాళ్లతో తొక్కి...గోళ్లతో గిచ్చడంతో నొప్పి తాళలేక ఆమె బోరున విలపించింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం సొంత పూచీ కత్తుపై వదిలేశారు. పోలీసుల వైఖరిపై మహిళా సంఘాల నేతలు, ఆయుర్వేద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కానిస్టేబుళ్ల అత్యుత్సాహం తరలింపును నిలిపివేయాలని కోరుతూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఔట్పేషంట్ విభాగానికి శనివారం నుంచి తాళం వేసి నిరసన తెలుపుతుండటం, ఇదే సమయంలో మంగళవారం యునానీ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు ఆయుర్వేద ఆస్పత్రిలోకి చొరబడి, ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సిబ్బందిని బలవంతంగా బయటికి పంపడాన్ని నిరసిస్తూ బుధవారం ఆయుర్వేద వైద్య విద్యార్థులు చార్మినార్ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి అడ్డుకున్నారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుళ్లు సహా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ పరమేష్ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. దురుసుగా ప్రవర్తించిన పీసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తరలింపుపై వివాదం 1958లో 60 పడకల సామర్థ్యంతో చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అనంతరం దీనిని సామర్థ్యాన్ని వంద పడకలకు పెంచినప్పటికీ స్థలాభావం కారణంగా 75 పకడలతో కొనసాగుతోంది. ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగానికి రోజు సగటున 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2014లోనే ఈ భవనాన్ని ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అయితే అప్పుడు వైద్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరమ్మతుల పేరుతో ఇటీవల ఆస్పత్రిలోని పలు వార్డులను ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కేవలం పదిపడకల సామర్థ్యంతో ఓపీ సేవలను అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిని ఉద్దేశపూర్వకంగా తరలి స్తున్నారని, ఈ నిర్ణయంతో ఉద్యోగులే కాకుండా పాతబస్తీ రోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు, వైద్య విద్యార్థులు ఆరో పిస్తున్నారు. రాజకీయ రంగు ఆయుర్వేద ఆసుపత్రిని చార్మినార్ నుంచి తరలించాలని యునానీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా...ఆసుపత్రిని తరలిస్తే సహించేది లేదని మరోవైపు ఆయుర్వేద విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆయుర్వేద విద్యార్థులకు బీజేపీ నాయకులు డాక్టర్ భగవంత్రావు, టి.ఉమామహేంద్ర, పొన్న వెంకటరమణ , ఆలేజితేంద్ర, మెఘారాణి అగర్వాల్, ఉమేశ్ సింగానియా, ప్రవీణ్ బాగ్డీ, సురేందర్లు మద్దతు పలకగా, యునానీ వైద్య విద్యార్థులకు మజ్లీస్ నేతలు మద్దతు పలికారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మ ద్ఖాన్, పత్తర్గట్టి కార్పొరేటర్ సోహైల్ ఖాద్రీతో పాటు మరికొందరు నేతలు యునానీ ఆసుపత్రికి చేరుకొని సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ఆందోళన చేస్తున్న ఆయుర్వేద విద్యార్థులు సహా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉద్దేశపూర్వకంగా కాదు చార్మినార్: ఆయుర్వేద ఆసుపత్రిలో బుధవారం జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పురానీహవేలిలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఆయుర్వేద వైద్య విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం చార్మినార్లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారన్నారు. ఈ విషయం తెలియడంతో ఆయూష్ డైరెక్టర్ అలుగు వర్షిణి అక్కడికి వచ్చి వైద్య విద్యార్థులతో చర్చలు జరిపారన్నారు. ఆమె తిరిగి వెళుతుండగా కొందరు విద్యార్థినులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైద్య విద్యార్థినులను అక్కడినుంచి తొలగించే క్రమంలో కానిస్టేబుళ్లు వారిపట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ సరైంది కాదన్నారు. పోలీసులు ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించరని, పరిస్థితుల ప్రభావానికనుగుణంగా అనుకోని సంఘటనలు జరుగుతాయన్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న క్లీప్పింగ్లను వెంటనే తొలగించాలని విలేకరులను కోరారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.–డీసీపీ అంబర్ కిశోర్ ఝా -
నేడు బోధనాసుపత్రుల బంద్
-
నేడు బోధనాసుపత్రుల బంద్
సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ బిల్లు (ఎన్ఎంసీ)–2019కి వ్యతిరేకంగా తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకు 24 గంటలపాటు బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయా బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ను వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ మెడికల్ బిల్లు వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని జూడాలు పేర్కొంటున్న విషయం విదితమే. దీనిపై ఢిల్లీలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లోనూ జూడాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జూడాల సమ్మెకు సోషల్ మీడియా ఆజ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఇదే మరి! పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు గత నాలుగు రోజులుగా సమ్మె చేయడానికి కారణం ముస్లింలని, వారు దాడి చేయడం వల్ల నీల్ రతన్ సర్కార్ ఆస్పటల్ డాక్టర్ పరిబా ముఖోపాధ్యాయ్ కోమాలోకి వెళ్లారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. డాక్టర్ ముఖోపాధ్యాయ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా సేథ్ సుఖ్లాల్ కర్నాని మెమోరియల్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక పలువురు రోగులు మరణిస్తున్నారు. నీల్ రతన్ సర్కార్ ఆస్పత్రిలో మంగళవారం నాడు ఓ 75 ఏళ్ల వృద్ధుడు మరణించడంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆయన మరణించారని ఆరోపిస్తూ ఆయన బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్లు, అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. ఒక రోజు ఆ ఆస్పత్రికే పరిమితమైన జూనియర్ డాక్టర్ల సమ్మె రాజకీయం వల్ల రాష్ట్రమంతటా వ్యాపించి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. సమస్యను పరిష్కరించడంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెన ర్జీ అనసరించిన వైశరే ఈ పరిస్థితికి కారణం. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇలాంటిదే మరి. ముస్లిం వర్గానికి చెందిన వారు దాడిచేశారంటూ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ వ్యాఖ్యానించడం ద్వారా ఈ అంశాన్ని మొదట రాజకీయం చేశారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని, నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ మమతా బెనర్జీ హెచ్చరించి డాక్టర్లను రెచ్చగొట్టారు. బీజేపీ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ముస్లింలకు, ఇతర రోగులకు చికిత్స చేయవద్దు, ఒక్క బీజేపీకి చెందిన రోగులకే వైద్యం చేయాలన్నది వారి అభిమతం అంటూ మమతా బెనర్జీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. విధి నిర్వహణలో డాక్టర్లకు భద్రత కల్పించే విషయమై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా డాక్టర్లు సోమవారం నాడు సమ్మె చేయాలంటూ ‘ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ పిలుపునిచ్చే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. -
జూడాల ఆందోళన ఉధృతం
సుల్తాన్బజార్/గాంధీ ఆస్పత్రి: దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల వద్ద వైద్యులు, జూనియర్ డాక్టర్ల నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ఈఎన్టీ, కింగ్కోఠి, ఆసుపత్రుల్లో జూడాలు విధులను బహిష్కరించారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో కట్లుకట్టుకొని వినూత్న శైలిలో ఆందోళనలు చేశారు. జూడాల అధ్యక్షుడు అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జూడాల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం కొన్ని ఆసుపత్రుల్లో నామమాత్రం స్పెషల్ పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేసినప్పటికి వైద్యులపై దాడులు ఆగడం లేదన్నారు. కింగ్ కోఠి ఆస్పత్రిలో కూడా వైద్యులునిరసన వ్యక్తంచేశారు. ‘గాంధీ’లో వినూత్న నిరసన గాంధీఆస్పత్రి : వైద్యులు, వైద్యవిద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గాంధీ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమా లు చేపట్టారు. విధులను బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వైద్యులపై భౌతికదాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుడిపై కొంతమంది దాడి చేసి హత్య చేశారని, అక్కడి సీఎం మమతాబెనర్జీ రాజకీయ లబ్ధికోసం విషయాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. తెలంగాణతోపాటు నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్లబురుజు తదితర ఆస్పత్రుల్లో తరుచూ వైద్యులపై దాడులు జరుగుతు న్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. వైద్యసంఘాల ప్రతినిధులు డాక్టర్ పల్లం ప్రవీణ్, వసంత్కుమార్, అర్జున్, భూమేష్కుమార్, త్రిలోక్చందర్, లోహిత్, హర్ష, కీర్తి, చందులతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నిమ్స్లో... సోమాజిగూడ: నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. వైద్యులపై దాడులను అరికట్టాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రెసిడెంట్ వైద్యుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ కౌశిక్, నెఫ్రాలజీ విభాగం హెడ్ శ్రీభూషణ్ రాజు పాల్గొన్నారు. -
బెంగాల్లో 43 మంది వైద్యుల రాజీనామా
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం బెంగాల్ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 43 మంది వైద్యులు రాజీనామా చేశారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డాక్టర్లు సమ్మెను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి చెందిన 16 మంది వైద్యులు తమ రాజీనామాను ప్రభుత్వ ఆరోగ్యశాఖకు అందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా భాధ్యతలను నిర్వర్తించలేమని’ డాక్టర్లు లేఖలో పేర్కొన్నారు. వారితో పాటు డార్జిలింగ్లోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి చెందిన 27 మంది వైద్యులు శుక్రవారం రాజీనామాను సమర్పించారు. వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రముఖ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సాయిబాల్ ముఖర్జీ ,సూపరిండెంట్ కం. వైస్ ప్రిన్సిపాల్ సౌరభ్ ఛటోపద్యాయ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్( డీయంఈ) కి రాజీనామాను సమర్పించారు. అత్యవసర సేవలు మాత్రమే.. ఔట్ పేషెంట్ మరియు అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించాల్సిందిగా డీయంఈ ప్రొఫెసర్ డా. ప్రదీప్ కుమార్ డే అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, డైరెక్టర్లకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ప్రైవేటు ఆసుపత్రులలోనూ అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం ఉదయం నిల్ రతన్ సర్కార్ (ఎన్ఆర్ఎస్) మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సహా ఒకటి , రెండు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
డాక్టర్ల సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు
న్యూఢిలీ : పశ్చిమ బెంగాల్లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు ఒక్క రోజు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్లో నిమ్స్లో వైద్యులు నిరసనకు దిగగా.. ఢిల్లీ మెడికల్ అసోసిషేయన్ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు పాటు అన్ని వైద్య సేవలను నిలిపి వేయాలని పిలుపునిచ్చింది. దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్ వైద్యులు జంతర్ మంతర్ వద్దకు చేరి నిరసన చేపట్టారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో జూనియర్ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. వైద్యుల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘నా స్థానంలో మరొకరుంటే.. వేరేలా ఉండేది’
కోల్కతా : ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చల కోసం వెళ్లిన తనను వైద్యులు తిట్టి అవమానించారు అంటున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘అత్యవసర విభాగంలో సమ్మె చేస్తున్న వైద్యుల వద్దకు వెళ్లాను. వారు నాతో మాట్లాడారు కానీ వారు వాడిన పదజాలం సరిగా లేదు. నన్ను దూషించారు. నా స్థానంలో మరోకరుంటే.. ఇపాటికే వారి మీద చర్యలు తీసుకునే వారు. పరిస్థితి మరోలా ఉండేద’ని పేర్కొన్నారు. ‘వారు నన్ను వ్యతిరేకించినప్పటికి, దూషించినప్పటికి నేను వారిని క్షమిస్తున్నాను. ఎందుకంటే వారు నా కంటే చిన్నవారు. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరుతున్నాను’ అన్నారు. రాష్ట్రంలోని ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో ఓ రోగి మరణించడంతో.. మృతుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యుల మీద దాడి చేశారు. దాంతో విధి నిర్వహణలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందుకు సీనియర్లు కూడా మద్దతు తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా జూనియర్ డాక్టర్ల సమ్మెకు బీజేపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. -
మాకు రక్షణ కల్పించాలి : జూనియర్ డాక్టర్లు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె తారాస్థాయికి చేరుకుంది. నేడు సీనియర్ డాక్టర్లు కూడా వీరికి మద్దతు తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్కతా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకున్న ఓ వివాదం మూలాన జూనియర్ డాక్టర్లు మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు వైద్యుల మీద దాడి చేశారు. ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలంటూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఫలితంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పెషేంట్ విభాగం సేవలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. కానీ వైద్యులు తక్కువగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. ప్రైవేట్ ఆప్పత్రులు కూడా డాక్టర్ల సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికి వైద్యులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. -
జూనియర్లకే అందలం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైద్య ఆరోగ్యశాఖలో అనర్హులనే అందలం ఎక్కిస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.తాము చెప్పిన మాటను కాదనకుండా చేస్తారనే ఉన్నతాధికారుల ఆలోచనే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో) నియామకంలో ఈ తీరు కొనసాగుతోంది. అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ వారిని కాదని.. వారి కంటే తక్కువస్థాయి కలిగిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా తమకు ఇష్టం వచ్చిన జూనియర్ అధికారులను నియమించి..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సివిల్ సర్జన్ (సీఎస్) కేడర్ కలిగిన వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో)గా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారులు డిప్యూటీ సివిల్ సర్జన్ (డీసీఎస్)లను డీఎంఅండ్హెచ్వోలుగా నియమిస్తున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురంతో పాటు మరో 5 జిల్లాల్లో జూనియర్ అధికారులను అందలం ఎక్కించినట్టు తెలుస్తోంది. సీనియర్ అధికారులు కాస్తా డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలుగా ఉంటూ తమ జూనియర్ల కిందనే పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో జూనియర్లు తమకేమీ చెప్పేదంటూ డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖలో వ్యవహారం కాస్తా కట్టుతప్పుతోంది. దీంతో పరిపాలన పట్టుతప్పి....కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించలేని పరిస్థితి నెలకొంది. అన్నింటిలోనూ అదే తీరే...!: మాతా, శిశు మరణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలని మెడికల్ ఆఫీసర్లతో పాటు ఏఎన్ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎవరిస్తారనే అంశం కానీ... ఏ బడ్జెట్ నుంచి తీసుకోవాలనే విషయం కానీ స్పష్టంగా పేర్కొనలేదు. ఫలితంగా మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంల సొంత బడ్జెట్ నుంచి ఈ ఖర్చులను భరించాల్సి వస్తోంది. అదేవిధంగా గతంలో కూడా పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు కూడా బడ్జెట్ను కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో ఇందుకోసం బడ్జెట్ను కేటాయించినప్పటికీ జిల్లాలో మాత్రం నెలలు గడిచినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. వరుసగా ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఖర్చును వైద్య ఆరోగ్యశాఖ చెల్లించింది. మాతాశిశు మరణాలపై ఆడిట్ విషయంలో కూడా ఇప్పటివరకు మెడికల్ అధికారులకు, ఏఎన్ఎంలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది. -
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
-
‘గాంధీ’ డాక్టర్పై దాడి.. జూడాల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : ఓ డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చేపట్టిన ధర్నాఇంకా కొనసాగుతోంది. ఎమర్జెన్సీ తప్ప అన్ని విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సీతాఫల్మండి రవీంద్రనగర్కు చెందిన సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ జూనియర్ డాక్టర్పై దాడికి పాల్పడ్డారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చశారు. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి వెంబడి బైటాయించి ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలోనే శాంతి ర్యాలీ నిర్వహించారు. జడాల ఆందోళనతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వమే డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
రుయా ఆస్పత్రిలో రెండొ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె
-
రెండో రోజుకు చేరుకున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
-
జూడాల సమ్మెబాట
రుయా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లకు సహనం నశించింది. గత ఐదు నెలలుగా స్టైఫండ్ మంజూరు కాలేదని పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, రుయా సూపరింటెండెంట్లకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యలు అర్థం చేసుకుని లోపాలను సరిచేయాల్సిన ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విధిలేక సమ్మె బాటపట్టారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రుయా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డిని కలసి సమ్మె నోటీసు ఇచ్చారు. మంగళవారం సాధారణ సేవలకు కూడా వారు హాజరుకారు. 24 గంటల్లో అధికారులు స్పందించకుంటే బుధవారం అత్యవసర సేవలను కూడాబహిష్కరించనున్నారు. ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో 200 మంది జూనియర్ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరు నిత్యం ఓపీ మొదలుకుని క్యాజువాలిటీ, ఇతర విభాగాల్లో సేవలందిస్తున్నారు. రుయా ఆస్పత్రికి నిత్యం 1500 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఇన్ పేషెంట్లు 850 మందికి పైగా సేవలు పొందుతున్నారు. వీరందరికీ అవసరమైన వైద్య సేవలు అందిండచంలో జూనియర్ డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. రూ.1.58 కోట్ల బకాయి ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన జూనియర్ డాక్టర్లు 200 మంది రుయాలో సేవలు అందిస్తున్నారు. వీరికి నెలకు రూ.18,500 స్టైఫండ్ చొప్పున ఇవ్వాలి. హౌస్ సర్జన్లు ఆస్పత్రికి అందిస్తున్న సేవలకు ప్రభుత్వం స్టైఫండ్ను మంజూరు చేయడం ఆనవాయితీ. గత ఏడాది అక్టోబర్ నుంచి వీరికి స్టైఫండ్ మంజూరు కాలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1.58 కోట్ల బకాయి పడింది. పట్టించుకోని అధికారులు జూనియర్ డాక్టర్లకు ఐదు నెలలుగా స్టైఫండ్ అందకపోయినా కనీసం అధికారులు పట్టించుకోలేదు. జూడాల సమ్యలను అర్థం చేసుకుని లోపాలను సరిచేసి స్టైఫండ్ అందిచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా జూడాల స్టైఫండ్ ప్రతి ఏటా నిలిచిపోవడం సమ్మెకు దిగడం సర్వసాధారణంగా మారింది. సమ్మె నోటీసులు ఇచ్చిన వారిలో జూడాల నాయకులు ఉమేష్, క్రాంతి, చైతన్య, స్వరూప్, లిఖిత తదితరులు ఉన్నారు. ఐదు నెలలుగా భరించాం రుయా ఆస్పత్రికి వచ్చే పేద రోగులు ఇబ్బందులు పడకూడదని భావించాం. ఐదు నెలలుగా స్టైఫిండ్ అందకపోయినా భరించాం. కనీసం అధికారుల నుంచి స్పందన లేదు. ఇక విధిలేక సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రతి నెలా 6వ తేదీ లోపు స్టైఫండ్ను మంజూరు చేయాలి. అత్యవసర విభాగాన్ని పటిష్టం చేయాలి. క్యాజువాలిటీలో అత్యవసర మందులు, గ్లూకోజ్ స్ట్రిప్స్, బ్లడ్ ట్రాన్స్ప్యూజన్ సెట్, వాష్ రూం, ఎక్స్రే, సిటీ స్కాన్, వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.– డాక్టర్ వెంకటరమణ, అధ్యక్షుడు, ఏపీ జూడాల సంఘం, ఎస్వీ మెడికల్ కళాశాల శాఖ, తిరుపతి . -
ఫీజు కోటి.. జీతం పాతిక వేలు!
డాక్టర్ నరేందర్. 2017లో ఎంబీబీఎస్ చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో దాదాపు రూ.60 లక్షల వరకు డొనేషన్ చెల్లించి మరీ వైద్యవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇంత కష్టపడి ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. ఆసుపత్రిలో ఇస్తున్న వేతనం రూ.25 వేలు మాత్రమేనని ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ నరేష్. 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. రెండుసార్లు పీజీ రాసినా రాలేదు. తాజాగా మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీబీఎస్ డిగ్రీతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన పొందుతున్న వేతనం రూ.30 వేలు. లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకొని ప్రైవేటులో పీజీ చేసినా తర్వాత ఆ రుణం చెల్లించే స్థాయిలో వేతనం వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ అబ్దుల్లా 2015లో ఎంబీబీఎస్ చదివారు. ఎండీ కోసం చదువుతున్నారు. రెండుసార్లు పరీక్ష రాసినా రాలేదు. ప్రభుత్వం వైద్యుల నియామకాలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తనకు ఎంసెట్లో 2వేల ర్యాంకు వచ్చి కన్వీనర్ కోటాలో సీటు పొందినా.. ఇప్పుడు పెద్దగా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల ఆవేదన. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. బతుకుదెరువు సమస్యగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు రూ.50–60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎంబీబీఎస్ కోసం డొనేషన్ చెల్లించారు. ఫలితం ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇస్తున్న వేతనం ఈ స్థాయిలో దారుణంగా ఉండటంతో.. ఎందుకు వైద్యరంగాన్ని ఎంచుకున్నామా? అని అని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో డిమాండ్కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఎంబీబీఎస్ చదువు కోసం, డొనేషన్లు కట్టేందుకు అనేకమంది తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చారు. వాటిని తిరిగి వడ్డీలతో కలిపి చెల్లించేందుకు కూడా ఎంబీబీఎస్ చదువు పనికిరావడం లేదంటున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ.20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పీజీ సీట్లు రాక ఇబ్బందులు రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు మాత్రం సగం కూడా లేవు. ఇప్పుడు నీట్ ద్వారా నింపుతుండటంతో దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లున్నాయి. వీటికోసం గత నెల జరిగిన నీట్–2019 పరీక్షకు ఏకంగా 1.40 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు రాశారు. ఇంత పోటీని తట్టుకుని పీజీ సీటు కొట్టడం ఆషామాషీ కాదు. రాష్ట్రంలోని ఎంబీబీఎస్, పీజీ సీట్లను పోలిస్తే.. ప్రతీ ఏడాది దాదాపుగా 2వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పీజీ చేయలేకపోతున్నారు. వీరికితోడు చైనా, ఉక్రెయిన్, పిలిప్పీన్స్ తదితర దేశాల్లో చదివిన వారూ పోటీలో ఉంటున్నారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్లో కనీస గుర్తింపు ఉండడంలేదు. కేవలం ఎంబీబీఎస్తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయక తప్పని దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు లేవు ప్రైవేటులో పరిస్థితి ఇలాగుంటే ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే భర్తీలు లేవని ఎంబీబీఎస్ డాక్టర్లు అంటున్నారు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) 500 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2018లో 1,150 పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పీజీ సీటు రాక, ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక తాము చేసేదేమీ లేదంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే రూ.25 వేలు.. ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ‘ప్రతి పల్లెలో అంగన్వాడీ కేంద్రం ఉంది. పంచాయతీ కార్యాలయం ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్న క్లీనిక్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేలకు పైగా గ్రామాలుంటే.. కేవలం దాదాపు 700 పీహెచ్సీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్సీలను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఆ లెక్కలను ప్రభుత్వాలు మరిచిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్తో బతికేదెలా? ఎంబీబీఎస్ డాక్టర్లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేతనాలు ఘోరంగా ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు కాలేజీలో చదివినా ప్రయోజనం కనిపించడంలేదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోటి రూపాయల వరకు డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివించారు. చాలామంది కట్టిన ఫీజుకు వడ్డీలు కట్టుకోలేక.. బతకడానికి డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలా పోషించుకోవాలి? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, ఆరోగ్య ఖర్చులు ఎలా భరించాలి? ఒకవేళ గ్రామాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేయాలన్నా అనేకమంది అర్హత లేనివాళ్లు స్థానికంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని నియంత్రించడంలేదు. ఎంబీబీఎస్ డాక్టర్లకు వంద నిబంధనలున్నాయి. అర్హత లేని వైద్యులకు అలాంటివేమీ లేదు. తప్పు చేస్తే శిక్ష విధించడం లేదు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. – డాక్టర్ పీఎస్ విజయేందర్, అధ్యక్షుడు, టీఎస్ జూడా అవకాశాలు తక్కువ! కేవలం ఎంబీబీఎస్తో బయట అవకాశాల్లేని మాట వాస్తవమే. పైగా పీజీ మెడికల్ సీట్లు కూడా ఎంబీబీఎస్తో సమానంగా ఉండవు. కాబట్టి ఉన్న ఎంబీబీఎస్తోనే ముందుకు సాగాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ వేతనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అందరూ హైదరాబాద్లోనే ఉండాలన్న భావనే. దీంతో డిమాండ్ తగ్గి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తయినవారు గ్రామాలకు వెళ్లి ప్రాక్టీసు చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. కానీ చాలామంది తమ మైండ్సెట్ను మార్చుకోవడంలేదు. అందరూ నగరానికే పరిమితమైతే అవకాశాలు ఎలా వస్తాయి? – డాక్టర్ రమేష్రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు -
మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసేందుకు శిక్షణ
ఇండోర్: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు సాధారణంగా వారికి తప్ప ఎవరికీ అర్థం కావు. సామాన్య ప్రజలకైతే మరీ కష్టం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీ ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా రాసేందుకు వారికి ఒక సబ్జెక్టు నిపుణునితో చేతిరాతలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అర్థం కాని ప్రిస్క్రిప్షన్ల ద్వారా జూనియర్ డాక్టర్లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇండోర్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ (ఎమ్జీఎమ్) డిగ్రీ, పీజీ వైద్య విద్యార్థులకు ఈమేరకు శిక్షణ ఇవ్వనుంది. ఆదివారం ఎమ్జీఎమ్ డీన్ జ్యోతి బిందాల్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్లు రాయడంలో వారి చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జూనియర్ డాక్టర్లకు ఒక సబ్జెక్టు నిపుణునితో శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా వారు రాసే ప్రిస్క్రిప్షన్లను సులభంగా అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ వీసీ రవిశంకర్ శర్మ మాట్లాడుతూ ‘కొందరు డాక్టర్లు కేవలం 30 సెకన్లలోనే ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ రాయడానికి కనీసం మూడు నిమిషాలైనా తీసుకోవాలి. రోగుల లక్షణాలు, వ్యాధి, మందుల గురించి స్పష్టంగా రాయాలని డాక్టర్లకు సూచించాన’ని ఆయన తెలిపారు. ‘అందరి డాక్టర్ల చేతిరాత అందంగా ఉండకపోవచ్చు. కానీ ప్రిస్క్రిప్షన్లు కనీసం చదవడానికి వీలుండేలా రాయాలి’ అని అన్నారు. అర్థం కాకుండా రాయడం వల్ల రోగులు మందులు కొనుగోలు చేసేటపుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని సంఘటనల్లో డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక మెడికల్ ఇన్సూరెన్స్ పొందడంలో రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాగా, అస్పష్టమైన ప్రిస్క్రిప్షన్ల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాక్టర్లకు కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది. మందుల పేర్లను పెద్ద అక్షరాలతోనే స్పష్టంగా రాయాలని పేర్కొంది. -
జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె..
-
డాక్టర్ శిల్ప మృతి కేసు విచారణలో జాప్యం!
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. -
జూడాల మీడియా సమావేశాన్ని బహిష్కరించిన పాత్రికేయులు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ వార్డులో సోమవారం రోగి బంధువులతో జూనియర్ డాక్టర్ మధ్య జరిగిన వివాదంపై మంగళవారం జూనియర్ వైద్యులు ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేశ్ను కలిసి వివరించారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్కు తమ సమస్యలను వివరించడానికి జూనియర్ డాక్టర్లు వచ్చారు. అక్కడే ఉన్న పాత్రికేయుడు ఫొటో తీస్తుండగా జూనియర్ డాక్టర్లు సదరు జర్నలిస్టు ఫోన్ గుంజుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే పరిపాలనాధికారులు, వివిధ విభాగాధిపతులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అనంతరం ఇదే విషయాన్ని జూనియర్ డాక్టర్లు కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసి వివరించారు. సూపరింటెండెంట్కు సమస్యలు వివరిస్తున్న జూనియర్ డాక్టర్ల ఫొటోను చిత్రీకరిస్తున్న జర్నలిస్టు ఫోన్ను గుంజుకునే వ్యవహారాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల మీడియా సమావేశాన్ని పాత్రికేయులు బహిష్కరించారు. -
హైదరాబాద్ నిమ్స్లో అర్ధరాత్రి అలజడి
-
నిమ్స్లో యువ వైద్యుడు ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరాలు, నాడీ వ్యవస్థపై పట్టున్న వైద్యుడు శివతేజరెడ్డి ఆదివారం డాక్టర్స్ క్లబ్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోగులకు వైద్య పరంగా చికిత్స అందిస్తూనే.. సామాజిక స్పృహతో వారికి కావాల్సిన సహాయసహకారాలను శివతేజరెడ్డి అందించేవాడు. తన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అనేక సదుపాయాలను సైతం కల్పించాడు. అలాంటి వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడటంపై తోటి వైద్యులతో పాటు చికిత్స పొందుతున్న రోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే శివతేజరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. నెఫ్రాలజీ నుంచి న్యూరాలజీకి.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎఫ్సీఐ రిటైర్డ్ ఉద్యోగి పులగం అప్పిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు శివతేజరెడ్డి(31) ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, కింగ్జార్జ్ ఆస్పత్రిలో ఎండీ పూర్తి చేశాడు. విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(మిమ్స్)లో శివతేజరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తూనే సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివాడు. తిరుపతిలో నెఫ్రాలజీ విభాగంలో సీటు సంపాదించాడు. నెఫ్రాలజీ విభాగంలో 8 నెలలు పనిచేసిన తర్వాత సంతృప్తి చెందక.. మళ్లీ పరీక్ష రాసి నిమ్స్ న్యూరాలజీ విభాగంలో సీటు పొందాడు. రోగుల పరిస్థితి చూసి చలించిపోయి.. శివతేజరెడ్డి గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి వారం క్రితం వరకు బయటే ఉంటూ నిమ్స్లో విధులకు హాజరయ్యేవాడు. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోన అతడు.. తన వేతనం నుంచి రూ.40 వేలు చెల్లించి జిరాక్స్ మిషన్, జనరల్ వార్డులో ఉన్న రోగులకు గీజర్, ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహించే వైద్యులకు అవసరమైన స్లిప్పర్స్ను స్పాన్సర్ చేశాడు. రోగులకు వైద్య సేవలందిస్తూనే వారికి పలు రకాల సహాయసహకారాలు అందించేవాడు. తక్కువ కాలంలోనే సామాజిక స్పృహ ఉన్న వైద్యుడిగా గుర్తింపు పొందాడు. న్యూరాలజీ విభాగంలోని 24 మంది యువ వైద్యులకు చికిత్సలపరంగా ఎలాంటి అనుమానం వచ్చినా అతనే పరిష్కరించేవాడు. విధులు ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేవాడు. అయితే వారం రోజుల నుంచి శివతేజరెడ్డి ముభావంగా కనిపించినట్టు తోటి వైద్యులు చెపుతున్నారు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని.. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని డాక్టర్స్ క్లబ్లోని రూమ్ నంబర్ 307కు శివతేజరెడ్డి వెళ్లాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు అతను విధులకు హాజరు కావాల్సి ఉంది. ఎనిమిది గంటలైనా శివతేజ రాకపోవడం.. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో తోటి వైద్యుడికి అనుమానం వచ్చి రూమ్కు వచ్చాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో కిటికీ అద్దాలు తొలగించి చూడగా దుప్పటితో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతను ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ మృతుడు వాడిన గదిని, ఫోన్ను పరిశీలించారు. ఆదివారం ఉదయం 5.20 వరకు శివతేజరెడ్డి వాట్సాప్ చూసినట్లు ఉందని, 5.30 గంటల తర్వాతే అతను చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్థారించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివతేజరెడ్డి మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అమెరికా వెళ్లిన తల్లిదండ్రులు శివతేజరెడ్డి సోదరి అమెరికాలో ఉంటోంది. ఆమెకు నెలలు నిండటంతో తల్లిదండ్రులు గత జనవరిలో అమెరికా వెళ్లారు. వారు అమెరికా వెళ్లే ముందు శివతేజరెడ్డిని కలసి వెళ్లినట్లు వనస్థలిపురంలో ఉంటున్న అతని పిన్ని డాక్టర్ సరస్వతి మీడియాకు చెప్పారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో తమ ఇంటికి తరచు వచ్చే వాడని, ప్రేమ వ్యవహారాలు, ఇతర వ్యాపకాలు లేవన్నారు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పాల్సిందిగా కోరామని.. అయితే అలాంటిదేమీ లేదని, ఆస్పత్రిలో పని ఒత్తిడి అధికంగా ఉందని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెప్పాడని వివరించారు. శివతేజరెడ్డి తల్లిదండ్రులు అమెరికా నుంచి రావాల్సి ఉంది. శివతేజరెడ్డి మృతి వైద్య రంగానికి తీరని లోటని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కసిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ వెంకటపతి రాజు, డాక్టర్ సింధు పేర్కొన్నారు. -
వెనక్కి తగ్గం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తారని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ జీవోలు చెవిలో పువ్వులు అంటూ నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయిపడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవోను విడుదల చేసిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జూనియర్ వైద్యులను వంచిస్తుందన్నారు. నెల రోజుల నుంచి ఉపకార వేతనాలను పెంచాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా ఇప్పటివరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర కేసులను చూసేందుకు టీమ్ను సిద్ధం చేశామని చెప్పారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్ చేస్తుందని, నమోదు అయిన తరువాత సీనియర్ రెసిడెంట్స్గా గుర్తింపు పొందేందుకు మరో ఏడాది పనిచేయాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ సీనియర్ రెసిడెంట్స్ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్స్కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి భంగం కలిగి ప్రాణనష్టం జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, జూనియర్ వైద్యులది కాదని అన్నారు. అనంతరం కేజీహెచ్, జగదాంబ కూడలి, సరస్వతీపార్క్, డాబాగార్డెన్స్, జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
విశాఖలో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
కేఎంసీ విద్యార్థుల సత్తా చూపిస్తాం
కర్నూలు(హాస్పిటల్) : ఆందోళనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈనెల 6 నుంచి కర్నూలులో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకుని జూడాలతో చర్చలు జరిపారు. అవి ఫలవంతం కాకపోవడంతో గురువారం నుంచి జూడాలు మెరుపు సమ్మె ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు సమాలోచనలు జరిపారు. అనంతరం బయట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సహ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. 6 – 8 నెలలకోసారి ఉపకార వేతనాలు ఇస్తూ తమ సహనాన్ని ప్రతిసారీ పరీక్షిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు పెంచుకోవడంలో ఉన్న ఆసక్తి పేద రోగులకు వైద్యం చేస్తున్న తమ పట్ల లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పటికైనా స్పందించకపోతే అత్యవసర విధులను బహిష్కరిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. హామీలు నెరవేరలేదు మా డిమాండ్ల పరిష్కారం కోసం గత నెలలో సమ్మెలో వెళ్లేందుకు సిద్ధమై నోటీసులు ఇచ్చాం. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రి కామినేని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం కోసం హామీలిచ్చారు. 40 రోజులైనా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదు. – డాక్టర్ భార్గవ్, కేఎంసీ -
వైద్యసేవలపై సమ్మెట
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గురువారం సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందలేదు. ముఖ్యంగా కేజీహెచ్లో వైద్య సేవలు అందక రోగులు నానా పాట్లు పడ్డారు. వివిధ ఓపీల్లో వైద్యుల కోసం ఎదురుచూశారు. పలు విభాగాల వద్ద రోగులు బారులు తీరారు. చికిత్స కోసం నానా హైరానా పడాల్సి వచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. శనివారం లోపల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని జూడాలు స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూనిరవధిక సమ్మె తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల 14న సమ్మెకు పిలుపునిచ్చామని, చర్చిలకు పిలిచిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, రోజులు గడుస్తున్నా పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయి పడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవో విడుదల చేసిందని సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2010–11 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం దారుణమన్నారు. అత్యవసర సేవలకు ప్రత్యేక టీం ప్రస్తుతం ఔట్ పేషెంట్, వార్డుల్లో రోగులకు సేవలను నిలిపివేశామని, అత్యవసర కేసులను చూసేందుకు ప్రత్యేకం టీంను సిద్ధం చేశామని జూడాలు తెలిపారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్ చేస్తుందని, ఆ తరువాత మరో ఏడాది పనిచేస్తే సీనియర్ రెసిడెంట్స్గా గుర్తింపు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ ఇలా సీనియర్ రెసిడెంట్స్ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్స్కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్ల పరిష్కారానికి దిగిరాకపోతే శనివారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేజీహెచ్లో సుమారు 400 మంది జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. హక్కులతో పాటుబాధ్యతలూ గుర్తించాలి హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలి. జూనియర్ వైద్యులకు జనవరి నెల వరకూ ఉపకార వేతనాలు చెల్లించాం. 15 శాతం పెరిగిన ఉపకార వేతనాలతో పాటు బకాయిలకు సంబంధించి అవసరమైన జీవో విడుదల కాలేదు. మరో వారం రోజుల్లో ఈ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూనియర్ వైద్యులు వారం, పదిరోజుల పాటు సంయమనం పాటిస్తే బాగుంటుంది. ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేస్తే బకాయిలు చెల్లించవచ్చు. సమ్మె కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ పి.వి.సుధాకర్, ప్రిన్సిపాల్, ఆంధ్ర వైద్య కళాశాల -
నేటి నుంచి జూడాల సమ్మె
సాక్షి, విశాఖపట్నం: పేదల వైద్యం బంద్ కానుంది. పేద, మధ్య తరగతి రోగులను ఆదుకునే పెద్దాస్పత్రి సహా ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. మంగళవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తనుంది. తమ డిమాండ్లు పరిష్కరించనందుకు, జీతాలు/స్టైఫండ్ చెల్లించనందుకు నిరసనగా కొద్దిరోజుల నుంచి ఆందోళనలు చేపడుతున్న వీరు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టనున్నారు. మంగళవారం నుంచి ఆయా ఆస్పత్రుల్లో సేవలకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ నెల 9 వరకూ వేచి చూసి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అప్పట్నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. 900 మంది జూనియర్ వైద్యుల విధులకు దూరం ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోకి వచ్చే కేజీహెచ్తోపాటు విమ్స్, ప్రభుత్వ ఛాతి, ఊపిరితిత్తుల ఆస్పత్రి, మానసిక వైద్యశాల, చెవి, ముక్కు గొంతు (ఈఎన్టీ), రాణి చంద్రమణిదేవి (ఆర్సీడీ), ప్రాంతీయ కంటి ఆస్పత్రి (ఆర్ఈహెచ్), ఘోషా తదితర ఆస్పత్రుల్లో సుమారు 900 మంది జూనియర్ వైద్యులు (పోస్టు గ్రాడ్యుయేట్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు) విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్క కేజీహెచ్లోనే 600 మంది సేవలందిస్తుండగా, మిగిలిన వారు ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు వైద్యం అందిస్తుంటారు. వారి సూచనల మేరకు జూనియర్ డాక్టర్లు రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, సెలైన్లు ఎక్కించడం వంటి వైద్య సేవలు చూస్తారు. రోగులకు అందే వైద్యసేవల్లో జూనియర్ వైద్యులు కీలకపాత్ర పోషిస్తుంటారు. వీరు లేకపోతే ఎక్కడి వైద్య సేవలక్కడే నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఓపీ సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా సర్వీసు పీజీలు, అనాటమీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఉంటున్న 200 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అంటే దాదాపు ఐదోవంతు మందిని మాత్రమే సర్దుబాటుకు వీలవుతోంది. ముందుగా డిశ్చార్జి.. ముందుజాగ్రత్తగా కేజీహెచ్ అధికారులు అంతగా ప్రాణాపాయం లేదనుకున్న రోగులకు డిశ్చార్జి ఇచ్చేస్తున్నారు. అత్యవసర రోగులను తప్ప ఇతరులను చేర్చుకోవడం లేదు. సోమవారం నుంచే దీనిని అమలులోకి తెచ్చారు. ఉదాహరణకు కేజీహెచ్ భావనగర్ వార్డులో 40 పడకలకు గాను పురుష వార్డులో నలుగురు, స్త్రీల వార్డుల ఏడుగురు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ముగ్గురు, పిల్లల వార్డులో 10 మందిని పంపించేశారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 15 మందికి డిశ్చార్జి ఇవ్వనున్నారు. ఇలా మిగతా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ప్రాణాంతక రోగాలతో చికిత్స పొందుతున్న వారిని మినహా పలువురిని ఇంటికి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకే.. ఏళ్ల తరబడి తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందువల్లే సమ్మెకు దిగుతున్నట్టు జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించామని, కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నా స్పందించలేదని, దీంతో సమ్మె చేయక తప్పడం లేదని అంటున్నారు. ఐదు నెలల నుంచి స్టైపండ్, గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, ఏటా బడ్జెట్లో దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వెంటనే డిగ్రీలు జారీ చేసి రిజిస్ట్రేషన్లకు అనుమతించడం తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ముఖేష్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 9 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. సమ్మె మరింత తీవ్రతరం పాతపోస్టాఫీసు: జూనియర్ వైద్యుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం నుంచి కేజీహెచ్లో విధులు బహిష్కరిస్తాం. ఓపీ, వార్డుల సేవలను పూర్తిగా నిలిíపివేస్తాం. అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్యాజువాల్టీ కేసులను అటెండ్ అవుతాం. జూనియర్ వైద్యుల వేదనను అర్థం చేసుకోకుండా ప్రత్యేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. –ఏపీ జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రవైద్య కళాశాల సంఘం కార్యదర్శి డాక్టర్ గంగాధర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నాన్ క్లినికల్ (మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, పేథాలజీ, ఫిజియాలజీ, అనాటమీ తదితర విభాగాల్లోని 40 మందిని ఓపీ సేవలకు డెప్యుటేషన్ పంపాలని కోరాం. శస్త్రచికిత్సలు నిలిచిపోకుండా చూస్తాం. వార్డుల్లో రోగులకు సేవలకు అంతరాయం కలగకుండా నర్సులకు తాత్కాలికంగా లీవులు రద్దు చేస్తున్నాం. మార్చి, ఏప్రిల్ నెలల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున జూనియర్ వైద్యుల సమ్మె పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఈని కోరాం. సమ్మె దృష్ట్యా అత్యవసర వైద్య సేవలందించే వారినే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నాం. –డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
జీవో 465 రద్దు చేయాలని సమ్మె
గుంటూరు మెడికల్: ఆర్ఎంపీ, పీంఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ విడుదల చేసిన జీవో 465ను తక్షణం రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (అప్జూడ్) డిమాండ్ చేశాయి. శుక్రవారం గుంటూరులో రెండు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. గుంటూరు జీజీహెచ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు చేతపట్టుకుని, నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ల కిషోర్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ జయధీర్బాబు, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డాక్టర్..పేషెంట్..మధ్యలో పోలీస్
హైదరాబాద్: ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో పోలీసు పహార మధ్య వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నలుగురు జూనియర్ వైద్యులపై దాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం ఆసుపత్రిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం జూనియర్ డాక్టరుపై ఓ రోగి బంధువులు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సేవలను నిలిపివేయడంతో ఐపీ, ఓపీ, కులీకుత్భ్షా ఇలా అన్ని భవనాలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా తమకు రక్షణ కల్పించాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో చర్చలు సఫలమవడంతో బుధవారం జూడాలు సమ్మె విరమించి వైద్య సేవలు ప్రారంభించారు. -
రెండో రోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు తమ ఆందోళనను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. రోగి బంధువులు ఆదివారం రాత్రి ఓ జూనియర్ డాక్టర్పై దాడి చేశారంటూ జూనియర్ వైద్యులు సోమవారం ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో సోమవారం చర్చలు జరిపినప్పటికీ జూనియర్ డాక్టర్లు తమ పట్టు వదల్లేదు. దీంతో వారి డిమాండ్లపై కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురువారం వచ్చే అవకాశముండగా.. నివేదికలోని అంశాలను చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు. -
రిమ్స్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన
ఒంగోలు: స్థానిక రిమ్స్లో జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రిమ్స్కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు రాకపోవడంతో తమ చదువు పూర్తయినా నిరూపయోగంగా మిగిలిపోతున్నామంటూ జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా... జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మెడికోలు మద్దతు పలికి వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. -
కత్తిరించిన కాలుతో ఫోటోకు ఫోజు
మెక్సికో: దైవంగా భావించే వైద్య వృత్తికి ఇద్దరు జూనియర్ డాక్టర్లు కళంకం తెచ్చారు. సాధారణంగా వైద్య విద్యార్థులు ట్రైనింగ్ సమయంలో మానవ శరీరంలోని అవయవాల గురించి తెలుసుకోవడానికి మృతిచెందినవారి శరీరాలపై పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శిక్షణ సమయంలోనే ఇద్దరు జూనియర్ డాక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. మానవశరీరం నుంచి తొలగించిన భాగాలను చేతిలో పట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆ అవయవాలను పట్టుకొని నవ్వుతూ ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. అంతటితో ఆగకుండా తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ విషయం ఆనోట ఈ నోటపడి యూనివర్శిటీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరిని తొలగించారు. ఈ ఘటనపై తీవ్రవిమర్శలు రావడంతో న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. కరోలినా డోమిన్గజ్ గ్రేసియా(24) తన ట్విటర్ అకౌంట్లో శరీరం నుంచి కత్తిరించిన కాలు భాగాన్ని చేతిలో పట్టుకొని నవ్వుతూ ఫోటో దిగింది. ఈ ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా 'నా మొదటి కాలు నాన్నా. ఈ ఫోటో నిన్ను ఇబ్బంది పెడితే సారీ' అంటూ పోస్ట్ చేసింది. ఈ సంఘటనపై ఉత్తర మెక్సికోలోని మోన్టెర్రీ సోషల్ సెక్యూరిటీ చీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణమే వారు ప్రాక్టీస్ చేస్తున్న క్లినిక్ను వదిలిపెట్టి వెళ్లమని ఆదేశించారు. మరో ఫోటోలో కరోలినా కడుపు భాగానికి సంబంధించి ఓ అవయవాన్ని పట్టుకొని మరో ఫోటోలో కనిపించింది. ఈ శరీర అవయవాలు ఎవరివి, అనే విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహానికి సంబంధించి బంధువులు ఫిర్యాదు చేస్తే ఇద్దరు విద్యార్థినిలు ఆ కేసులో కూడా న్యాయ విచారణ ఎదుర్కోనే అవకాశం ఉంది. కాగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విద్యార్థినిలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించడం, సోషల్ మీడియా వాడకం విషయంలో జాగ్రత్తలు బోధించడంలో అధ్యాపకులు విఫలమయ్యారని యూనివర్సిటీ రీసెర్చర్ లూయీస్ ఆంటోనియోలోపేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జీజీహెచ్లో జూడాల ఆందోళన ఉధృతం
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసే వరకు ఆందోళన ఆపేది లేదన్న జూడాలు సాక్షి, గుంటూరు: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. శుక్రవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాని నినాదాలు చేశారు. మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మి జాడ వారం నుంచి తెలియకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతోంది. జూడాలు అత్యవసర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కూడా గంటపాటు వీరికి మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం నుంచి పారా మెడికల్ సిబ్బంది కూడా జూడాలకు మద్దతు తెలియజేస్తామనడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ ఎస్పీ చర్చలు: గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు వేర్వేరుగా జూడాలతో సమావేశమై చర్చలు జరిపారు. అయినా జూడాలు సమ్మె విరమించేది లేదని, అత్యవసర వైద్య సేవలకు సైతం హాజరుకాబోమని తేల్చి చెప్పారు. వారి ఆందోళనకు వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. -
ఆరని నిరసన జ్వాల
-
ఆరని నిరసన జ్వాల
* సంధ్యారాణి మృతికి కారణమైన ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని కొనసాగుతున్న ధర్నా * లేదంటే నిరసన కొనసాగిస్తాం * జూడాల సంఘం వెల్లడి * నగరంలో భారీ ర్యాలీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని అరెస్టు చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గురువారం మృతురాలి చిత్రపటాలను పట్టుకుని.. నల్లబ్యాడ్జీలు ధరించి నగరంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి న్యాయం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. గుంటూరు మెడికల్: డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని అరెస్టు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు(జూడా) స్పష్టం చేశారు. గురువారం డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పెట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి హిందూ కళాశాల మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తొలుత బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు సూపరింటెండెంట్ చాంబర్ వద్దే నేలపై బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ సుబ్బారావు జీజీహెచ్కు వచ్చి జూడాలతో మాట్లాడారు. తొలుత ఏర్పాటు చేసిన కమిటటీపై తమకు నమ్మకం లేదని జూడాలు చెప్పటంతతో ముగ్గురు సభ్యులతో హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, విజయవాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నెల్లూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి హైపవర్ కమిటీలో ఉన్నారని తెలిపారు. డీఎంఈ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని జూడాలు ప్రొఫెసరల్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలంతా లక్ష్మిపై ఫిర్యాదు... ఆసుపత్రిలో జూడాలు చేస్తున్న సమ్మెకు ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నేతలు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మద్దతుగా గంటసేపు నిరసన తెలిపారు. వీరు డాక్టర్ లక్ష్మిపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బహిరంగ విచారణలోనైనా ఆమెపై ఫిర్యాదు చేస్తామన్నారు. తదుపరి డీఎంఈ ఆస్పత్రి అధికారులు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పోలీస్ అధికారులతో చర్చించి వెళ్లిపోయారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్సీలు సరిత, సంతోష్ ఆస్పత్రికి వచ్చి జూడాలతో చర్చించారు. లక్ష్మిని తక్షణమే అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు. హైపవర్ కమిటీ విచారణ హైపవర్ కమిటీ సభ్యులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రొఫెసర్ లక్ష్మిపై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేశారు. వైద్యుల నుంచి రోగుల వరకు ఆస్పత్రిలో అందరితో మాట్లాడారు. 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తాం.. గురువారం అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలకు హాజరైన జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్ లక్ష్మిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే అత్యవసర వైద్య సేవలను నిలిపివేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
దుమ్మరేపిన గాంధీ కాలేజీ మెడికోలు
గాంధీ ఆస్పత్రి: హుషారైన డ్యాన్సులు, దుమ్మురేపే స్టెప్పులతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ మెడికోలు(జూనియర్ డాక్టర్లు) సందడి చేశారు. 2కే12 బ్యాచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కాలేజీ ఫెస్ట్ ప్రారంభోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వైద్యవిద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. 30వ తేదీ వరకు ఫెస్ట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
కొనసాగుతున్న జూడాల నిరసన
రిమ్స్లో జూడా(జూనియర్ డాక్టర్)లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం విధులు బహిష్కరించిన జూడాలు ఓపి విభాగం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ చీఫ్ అడ్వయిజర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ విధులు నిర్వర్తించే వైద్యులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోతోందన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కొరతతో వైద్యులకు భద్రత లేదని, రోగి బంధువులు పెద్దయెత్తున వచ్చి వైద్యుల విధులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది మద్యం తాగి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓపీ, ఎమర్జెన్సీ వార్డులో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను నియమించాలని అన్నారు. జూడాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూడాలు ప్రవీణ్, దీక్షిత్, స్వేచ్చా, తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ లో జూడాల ఆందోళన
ఆదిలాబాద్: రోగి బంధువులు తమపై దాడి చేశారంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి పురుగు మందు తాగిన ఓ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమించి ఆ వ్యక్తి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మృతికి వైద్యులే కారణమంటూ రోగి బంధువులు దాడికి దిగారు. దీనిని నిరసిస్తూ జూడాలు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. దాడికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో మాట్లాడి, ఆందోళనను విరమింపజేసేందుకు యత్నిస్తున్నారు. -
బెయిల్ ఇప్పించండి.. లేదా చనిపోనివ్వండి!
ప్రణబ్కు వ్యాపమ్ నిందితుల లేఖ భోపాల్: వ్యాపమ్ స్కాంలో అరెస్టయి గ్వాలియర్ జైలులో ఉన్న నిందితుల్లో 70 మంది వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు.. తమను బెయిలుపై విడుదల చేయాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. ‘విచారణ ఖైదీలుగా సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నాం. తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇది మాలో ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తోంది. మాతో పాటు ఇవే సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు బెయిలు పొందితే.. జూనియర్ వైద్యులమంతా జైలులోనే మగ్గిపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. తమ వైద్య విద్యాభ్యాసానికి సుదీర్ఘంగా అవరోధం కలగకుండా ఉండేలా చూసేందుకు తమకు బెయిల్ ఇప్పించాలని కోరారు. -
ఆత్మహత్యలకోసం మరో 70 మంది లేఖలు
భోపాల్: వ్యాపం కుంభకోణం కేసులో నిందితులైన మరో 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాశారు. తమకు బెయిలయినా ఇప్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని అందులో విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్లో జరిగిన మెడికల్ పరీక్షల్లో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారని, వేరేవారితో పరీక్షలు రాయించడం, అధికారులకు డబ్బులిచ్చి మాస్ కాపీయింగ్కు పాల్పడటంవంటి ఆరోపణలతో కేసులు పెట్టారు. ప్రస్తుతం గ్వాలియర్ జైల్లో ఉన్న వీరంతా తమను చాలా కాలం నుంచి విచారిస్తున్నారని, దీంతో తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఫలితంగా మానసికంగా సమాజ పరంగా తీవ్ర ఒత్తిడి నెలకొందని ఆవేదన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాష్ట్రపతికి కొంతమంది విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. -
40 మంది వైద్య విద్యార్థులు కూడా..
కరీంనగర్: నేపాల్ భూకంపంలో ఖట్మాండూకు 16 కిలోమీటర్ల దూరంలోని భరత్పూర్ కాళిదాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న 40 మంది తెలుగు రాష్ట్రాల జూనియర్ వైద్యులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కరీంనగర్ సమీపంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన సందీప్రెడ్డి ఉన్నాడు. సందీప్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భూకంపం వచ్చిన సమయంలో కళాశాల లోపలే ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు. తాను సురక్షితంగా ఉన్నానని, రాత్రి వరకు రోడ్డుపైనే ఉన్నామని సందీప్రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. విద్యార్థులంతా భరత్పూర్ సమీపంలోని ఓ ఆలయంలో తలదాచుకున్నట్టు తెలిపాడు. కాగా, తమ కుమారుడితోపాటు మిగతావారినీ క్షేమంగా స్వస్థలానికి రప్పించాలని సందీప్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. -
జూడాల వినతిపై కేసీఆర్ సానుకూల స్పందన
హైదరాబాద్: పీజీ అడ్మిషన్ల కోసం తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల(జూడాలు) వినతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆదివారం జూడాలు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మణ్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ ను కలిశారు. సమ్మె సమయంలో ప్రభుత్వం విజ్ఞప్తిని జూడాలు పెడచెవిన పెట్టిన సంగతిని కేసీఆర్ గుర్తు చేశారు. హైకోర్టు చెప్పినా.. భవిష్యత్తు పర్యవసనాలు ఆలోచించకుండా జూడాలు అప్పడు వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ భవిష్యత్తు చెడిపోకుండా విద్యాసంవత్సరాన్ని కాపాడాలని కేసీఆర్ ను జూడాలు వారు కోరారు.జూడాల పీజీ కోర్సులో ప్రవేశం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. -
చిక్కుల్లో జూనియర్ వైద్యులు
- సాయం చేయలేమని చేతులెత్తేసిన సర్కారు - ఈ ఏడాది పీజీ పరీక్షకూ అనర్హులే సాక్షి, హైదరాబాద్: పట్టువిడుపులు లేకుండా గతేడాది అరవై రెండు రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు చిక్కుల్లో పడ్డారు. హైకోర్టు వద్దని వారించినా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నా.. వైద్య ఆరోగ్య మంత్రి, అధికారులు చర్చలకు ఆహ్వానించినా.. పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడమే కాకుండా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పీజీ పరీక్షలకు కూడా అనర్హులు కానున్నారు. మానవతా దృక్పథంతో సమ్మె కాలానికి మినహాయింపునిచ్చి సకాలంలో హౌస్ సర్జన్ కోర్సును పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు జూడాలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య విద్య సంచాలకులు డి.శ్రీనివాస్, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్రెడ్డితో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. జూడాలకు వెసులుబాటు ఇచ్చే మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వీరికి సాయం చేసే పరిస్థితి లేదని న్యాయ శాఖ చేతులెత్తేసింది. కేబినేట్లో చర్చించి ప్రత్యేకంగా జీవో జారీ చేయటం ద్వారా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, ఇలా చేస్తే హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో జూనియర్ డాక్టర్లకు సాయం చేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని, తమ వైపు నుంచి ఏమీ చేసే పరిస్థితి లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మె చేసినంత కాలం కోర్సు పొడిగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో మార్చి 31న పూర్తి కావాల్సిన జూడాల హౌస్ సర్జన్ కోర్సు మే నెలాఖరుకు పూర్తవుతుంది. దీంతో పాటు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెడికల్ పీజీ పరీక్షకు వీరు అనర్హులవుతారని అధికారులు తెలిపారు. -
51కి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు
హైదరాబాద్: హైదరాబాద్ లో స్ స్వైన్ ఫ్లూ మరణాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా అమీర్ పేట్ కు చెందిన వ్యక్తి ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాడు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 51 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గాంధీ ఆస్పత్రిలోని ఇద్దరు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. -
గాంధీలో జూడాల ఆందోళన
హైదరాబాద్: మాస్కులు, మందుల కోసం జూనియర్ వైద్యులు గురువారం ఆందోళన బాట పట్టారు. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో... సిబ్బందికి ఎన్ 95 మాస్కులు సరఫరా చేయాలని, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోనకు దిగారు. దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాస్కులను అందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకిన విషయం తెలిసిందే. -
డాక్టర్లనూ వదలని స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ..ఈ పేరు చెబితే చాలు, ఇప్పటివరకు సామాన్య ప్రజలే వణికి పోయేవారు. ఇప్పుడు ఆ వంతు డాక్టర్లకు కూడా వచ్చింది. వ్యాధిని నివారించాల్సిన డాక్టర్లే ఇప్పుడు వ్యాధి బారిన పడ్డారు. దీనికి నిదర్శనమే ఈ ఉదంతం.. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకింది. ఎన్ 95 మాస్కులు సప్లై ఆగిపోయినందువల్లే స్వైన్ ఫ్లూ సోకిందని గురువారం ఉస్మానియా అస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. ఎన్95 మాస్కులను అన్ని వార్డుల్లో పనిచేసే జూడాలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
జూడాల కోర్సు రెండు నెలల పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల(జూడాల)కు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రెండు నెలలపాటు (62 రోజులు) చేసిన సమ్మె కాలా న్ని.. వారి కోర్సు కాలానికి కలుపుతూ ఉత్తర్వు లు ఇచ్చింది. సమ్మెను హాజరుగా గుర్తించకుండా.. కోర్సును రెండు నెలలపాటు పొడిగిం చడం పట్ల జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల హౌస్సర్జన్, పీజీ చదువుతున్న విద్యార్థులందరి కోర్సు కాలం రెండు నెలల పాటు పెరగనుంది. ‘జూడాల సమ్మెను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కోర్టులు కలుగజేసుకునేంత వరకు మా విన్నపాన్ని వారు పెడచెవిన పెట్టారు. అసలే కొత్త రాష్ట్రం.. అయినా చీటికీమాటికీ నెలల పాటు సమ్మె చేయ డం ఎక్కడా లేదు. అందుకే రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అనవసరంగా సమ్మె చేయడానికి వారు వెనకాడతారు’ అని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పొడిగింపు ఉన్నా కోర్సు పరీక్షలు రాసుకోవడానికి ఇబ్బంది ఉండదని పొడిగింపు కాలంలో జూడాలు వైద్య సేవలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది? రెండు నెలల పొడిగింపు వల్ల కోర్సు ఆలస్యంగా పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా హౌస్ సర్జన్ చేస్తున్న వారికి, పీజీ చివరి సంవత్సరం వారికి నష్టం జరుగుతుందని జూడా నేతలు పేర్కొంటున్నారు. పీజీ వచ్చే ఏడాది మే నెలలో పూర్తి కావాలి. ప్రభుత్వ నిర్ణయంతో జూలైలో పూర్తవుతుంది. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. పొడిగింపు వల్ల ఆ పరీక్షకు అర్హత కోల్పోతామన్న భయాందోళనలు జూడాల్లో వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్లో ఉన్న విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్ష రాయాలి. వారూ ప్రవేశ పరీక్ష రాయని పరిస్థితి రానుందని అంటున్నారు. పైగా ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటున్నందున సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, ప్రై వేటు కాలేజీ విద్యార్థులు ముందుకు వెళ్తారని.. తాము వెనుకబడే అవకాశం ఉందని జూడా నేతలు ఆందోళన చెందుతున్నారు. పీజీ చేస్తున్న మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా ఇదే పొడిగింపు వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, సమ్మె కాలాన్ని హాజరుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు జూడాల రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. సై ్టపెండ్ బకాయిలపై అస్పష్టత... జూడాల ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ డిమాండ్లకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు వెళ్లింది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోగానే జీవో వెలువడుతుంది. ప్రభుత్వం అంగీకరించినవాటిలో 15 శాతం సై ్టపెండ్ పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఎప్పటినుంచి దాన్ని వర్తింపజేస్తారన్న విషయంలో కొంత అస్పష్టత ఉన్నట్లు సమాచారం. సహజంగా ప్రతీ రెండేళ్లకోమారు సై ్టపెండ్ 15 శాతం పెంచాలి. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి 15 శాతం పెంపుతో సై ్టపెండ్ రావాలి. అప్పటినుంచి ఏరియర్స్ ఇవ్వాలి. అయితే.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే జూన్ నుంచే ఎరియర్స్ను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోలేనందున తాము స్పష్టంగా చెప్పలేమన్నారు. -
జూడాల నాలుగు డిమాండ్లకు సర్కారు ఓకే
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల (జూడాల)పై ప్రభుత్వం కరుణ చూపింది. వారి ఐదు కీలక డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. జూడాలతో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ శనివారం చర్చలు జరిపారు. అయితే ఏడాదిపాటు తప్పని సరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలన్న నిబంధనను తొలగించాలన్న డిమాండ్ను మాత్రం తిరస్కరించారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు అనంతరమే నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఉద్యోగుల విభజన పూర్తయ్యాక వాటిని భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, పీజీ చదివే వారికి స్టైపెండ్ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలన్న డిమాండ్ను, అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ను అంగీకరించింది. అలాగే బోధనాసుపత్రుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
ఏపీలో సమ్మె విరమించిన జూడాలు
విజయవాడ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో గురువారం గుంటూరు జిల్లా తెనాలిలో జూడాలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆ చర్చలు సఫలమైనాయి. దాంతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఏడాది రూరల్ సర్వీస్ నిబంధనను వ్యతిరేకిస్తూ జూడాలు నవంబర్ 3న సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జూడాలు... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అవి విఫలం కావడంతో గురువార మరో దఫా చర్చలు జరిపారు. -
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించం: కామినేని
విజయవాడ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జూడాల సమ్మెను ప్రజలెవ్వరూ హర్షించడం లేదని, వారు సమ్మె విరమించి చర్చలకు రావాలని కామినేని సూచించారు. కాగా గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె అయిదో రోజూ కొనసాగుతోంది. మరోవైపు మంత్రి కామినేని శ్రీనివాస్ వైఖరికి నిరసనగా నేటి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలకూ గైర్హాజరయ్యారు. -
రక్త సంతకం
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం పదో రోజు కూడా విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై జూడాలు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు. జూడాల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం - రక్తంతో సంతకాలు చేసిన వైద్య విద్యార్థులు కర్నూలు(హాస్పిటల్): సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని హైకోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యుల హక్కులను కాలరాస్తోందని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు నిరంజన్, వంశీ విహారి అన్నారు. సోమవారం స్థానిక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పదో రోజు కూడా జూడాలు విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై వైద్యులు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం జూడాలతో చర్చలు చేపట్టకపోవడం దారుణమన్నారు. నిర్బంధ వైద్య విద్య పేరిట జారీ చేసిన జీఓ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం నేతలు ప్రశాంత్, పవన్, విష్ణు, భాను ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు విధుల్లోకి జూడాలు
కోర్టు ఆదేశాలు, ప్రజా సంక్షేమం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు మెట్టుదిగి వచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లో చేరినట్లు ప్రకటించారు. అయితే, డిమాండ్ల సాధన కోసం ఇకపై కూడా పోరాడుతూనే ఉ ంటామని స్పష్టం చేశారు. జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో రోగులు, వారి బంధువులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. సమ్మెపై హైకోర్టు ఇచ్చిన గడువు ముగియటంతో జూనియర్ వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శనివారం మధ్యాహ్నం ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జూడాల కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, కో కన్వీనర్లు నాగార్జున, చైతన్య, వంశీ వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించి, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ నాగేశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జూడాలు స్వప్నిక, రిషిక, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జూడాల సమ్మె విరమణను స్వాగతిస్తున్నాం: టి.రాజయ్య జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరడాన్ని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య స్వాగతించారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్లు బాధ్యతను తెలుసుకోవడం శుభపరిణామం అని అన్నారు. జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. -
హైకోర్టు తీర్పు మాకు వర్తించదు: జూడాలు
ఏపీ జూనియర్ డాక్టర్ల వెల్లడి విజయవాడ: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మెపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ లోని జూడాలకే వర్తిస్తుందని, తమకు వర్తించదని ఏపీ జూడాల సంఘం నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుంచి ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. తమ డిమాండ్లపై వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తొలుత చర్చిద్దామన్నారని, రెండోసారి సీఎంని కలిసి చర్చిద్దామని చెప్పారని, మూడోసారి కలిసినప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుందామన్నారని, ఈ ప్రతిపాదనలో అర్థం లేదని జూడా నేతలు అన్నారు. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఎట్టకేలకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాలతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించుకున్నారు. దాంతో 64 రోజుల సమ్మెకు తెర పడింది. కోర్టు ఆదేశాలను గౌరమిస్తూ సమ్మెను విరమించినట్లు జూడాలు తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఇవాళ నుంచే విధులకు హాజరు కానున్నారు. జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా జూడాలు బహిష్కరించటంతో వైద్యం అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పేద రోగులపై చిత్తశుద్ధి ఉందా?
కర్నూలు(హాస్పిటల్) : పేద రోగుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జూనియర్ వైద్యులతో చర్చలు జరపాలని జూడాల సంఘం నేతలు నాగరాజు, ఆదిత్య, వినయ్, మౌనిక, వంశీవిహార్ తదితరులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏడవ రోజు హౌస్సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్ స్పెషలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి 107 జీవోతో శవయాత్ర నిర్వహించారు. ఈ శవయాత్ర గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, సర్జరీ విభాగం, సెంట్రల్ ల్యాబ్ మీదుగా క్యాజువాలిటీ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జూడా నేతలు మాట్లాడుతూ వైద్య వృత్తి పట్ల ఎంతో ఆసక్తితో వస్తే, ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. మూడు నెలలుగా తమ సమస్యను విన్నవిస్తున్నా పరిష్కరించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు హైకోర్టు స్పష్టంగా చెబుతున్నా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవడం లేదని పేర్కొన్నారు. -
జూడాలను పరోక్షంగా హెచ్చరించిన మంత్రి
విజయవాడ: చేపట్టిన సమ్మె వెంటనే విరమించాలని జూనియర్ డాక్టర్ల (జూడాలు)కు ఆంధప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు. లేకుంటే తెలంగాణలో మాదిరిగా హైకోర్టు తీర్పును బట్టి ఏపీలో కూడా చర్యలు తీసుకుంటామని ఆయన జూడాలను పరోక్షంగా హెచ్చరించారు. అయితే జూడాలు గురువారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏలూరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో జూడాలు చేపట్టిన సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది. -
ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేది లేదు
అనంతపురం రూరల్ : జీవో నంబర్ 107ను రద్దు చేయకపోతే సమ్మె ఉధృతం చేస్తామని జూడాలు స్పష్టం చేశారు. బుధవారం మెడికల్ కళాశాల నుంచి వైద్యులు, మెడికోలు ర్యాలీగా సప్తగిరి సర్కిల్కు బయలుదేరారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఉయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. తాము ఖైదీలం కాదని.. బానిసల్లా చూడొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ర్యాలీగా క్లాక్టవర్ వద్దకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసోసియేషన్ నేతలు డాక్టర్ సుదీప్, నీహారిక, సత్తీష్, నందిత మాట్లాడుతూ ప్రభుత్వం తమను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 2010 నుంచి తాము జీవోను రద్దు చేయమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడానికి సిద్ధమేనని, అయితే మౌలిక సదుపాయాలు, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా వేతనాలివ్వకుండా జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకపోతే అత్యవసర సేవల్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు కుష్బు, సౌమ్య, సులోచన పాల్గొన్నారు. జూడాల సమస్యలు తీర్చాలి అనంతపురం టవర్క్లాక్ : జూనియర్ డాక్టర్ల న్యాయమైన కోర్కెలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నరేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జాడాలకు సంఘీభావాన్ని ప్రకటించారు. -
అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోండి
తిరుపతి కార్పొరేషన్ : ఏప్రభుత్వం వచ్చినా జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తున్నారని, ఇప్పటికైనా అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోవాలని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఏపీ జూడాలు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జూడాలను ప్రభుత్వం చర్చలకు పిలవనందుకు నిరసనగా జూడాలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని, మానవహారంగా రుయా సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. కేరళలో జూనియర్ డాక్టర్లకు వేతనాలు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు. ఒక సంవత్సరం రూరల్ సర్వీసుకు గుర్తింపునిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తారని, మన రాష్ట్రంలో అలాంటి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పైగా ‘కంపల్సరి బాండెడ్ లేబర్ సర్వీస్’ పేరుతో వైద్య విద్యార్థులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. తమ ఉద్యమాన్ని పరీక్షిస్తే అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని వారు హెచ్చరించారు. సమ్మెకు పిలిస్తే ర్యాగింగ్ కేసులు? వైద్యవిద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లాలో సోమ, మంగళవారాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెను అడ్డుకోవడానికి తిరుపతి ఎస్వీ మెడికల్ కళాళాశాల ఉన్నతాధికారి తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమ్మెలో పాల్గొనవద్దంటూ ఆయన అన్ని విభాగాల హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. బుధవారం ఉదయం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను తన చాంబర్కు పిలుపించుకున్న సదరు ఉన్నతాధికారి సమ్మెకు వెళ్లకూడదని, వెళ్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. సమ్మెకు రావాలని సీనియర్లు పిలిస్తే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు చేయాలని వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ వైద్యులు సదరు ఉన్నతాధికారిని నిలదీసినట్టు సమాచారం. -
ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారం అయిదవ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని జూడాలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుధవారం విజయవాడ నగరంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట జూడాలు స్వచ్ఛభారత్ భారత్ నిర్వహించారు. ప్రభుత్వం పిలిస్తే తమ డిమాండ్లపై మరోసారి చర్చకు సిద్ధమని తెలిపారు. అయితే రాష్ట్రంలోని అత్యవసర సేవలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జూడాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వలేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థి ఏడాది పాటు గ్రామాల్లో పని చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జూడాలు సమ్మెకు దిగారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో జూడాలు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో జూడాలు సమ్మెకు దిగారు. -
జూడాల ఆందోళన.. జీవో కాపీల దహనం
తిరుపతి కార్పొరేషన్ : ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రతులను జూనియర్ డాక్టర్లు దాహనం చేశారు. జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మెలో భాగంగా రెండవ రోజైన మంగళవారం రుయాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. వీరికి సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు మద్దతు పలికారు. జూడాలు రుయా ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియం వరకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ పైలాన్ వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు 107 జీవో నెంబరును తగలబెట్టారు. జూడా ప్రధా న కార్యదర్శి ఇజాజ్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఉనికికే ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. రూరల్ సర్వీసుకు తాము ఎంత మా త్రమూ వ్యతిరేకం కాదని, అయితే తమ ను శాశ్వత వైద్యులుగా నియమిస్తే పేదలకు అంకిత భావంతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూరల్ సర్వీసు చేయాలంటే అక్కడ రెసిడెన్సీ, నెలనెలా సరైన వేతనాలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. మరి అవి ఏవీ ఏర్పాటు చేయకుండానే సర్వీసు చేయమంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇవి ఏవీ చేయనప్పుడు తమ చేత రూ.20 లక్షల బాండును ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. పైగా మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామ్యం గా ఉన్నాయని, ఉద్యమాలను హేళన చేస్తే జూడాల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఇప్పటికైనా మంత్రి వ్యాఖ్యలు వె నక్కి తీసుకోవాలని, లేకుంటే నేటి నుం చి అత్యవసర సేవలను బంద్ చేసేం దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. -
ఊపందుకున్నజూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె ఊపందుకుంది. మంత్రి కామినేని శ్రీని వాస్ వైఖరికి నిరసనగా బుధవారం నుంచి తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల కూ గైర్హాజరవుతామని జూడాల నాయకులు తెలి పారు. గుంటూరులో సీనియర్ రెసిడెంట్లు విధు లు బహిష్కరించారు. జూడాల సమ్మెతో వైద్య కళాశాలలు, వాటికి అనుబంధ పెద్దాసుపత్రులన్నింటిలో సాధారణ సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రభుత్వం, జూడాల మధ్య ఇప్పటివరకూ చర్చలు సఫలం కాలేదు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు చెయ్యకపోతే ఒప్పుకునేది లేద ని ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వ సర్వీసు చేయకపోతే భారతీయ వైద్యమండలిలో రిజిస్ట్రేషన్ ఆపేస్తామనడం నిబంధనలకు విరుద్ధమని జూడాలు చెబుతున్నారు. త్వరలోనే అత్యవసర సేవలు నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నామని వైద్యవిద్యా సంచాలకులు శాంతారావు జాడాలను కోరారు. కోర్టు తీర్పు వచ్చాక ఏం చేయాలన్నది ఆలోచిస్తామన్నారు. -
ఎక్కడి సేవలు అక్కడే బంద్
కాకినాడ క్రైం :ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైద్యం కోసం నిత్యం మూడు వేల మంది వచ్చే కాకినాడ ప్రభుత్వాస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో మంగళవారం ఎక్కడి సేవలు అక్కడే నిలిచిపోయాయి. జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె రెండో రోజైన మంగళవారం కొనసాగింది. జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు సుమారు 1500 మంది సమ్మెలో పాల్గొన్నారు. కరప గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఏడో నెల గర్భిణి కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి మంగళవారం వచ్చింది. సమ్మె కారణంగా ఆమెను శుక్రవారం రావాల్సిందిగా 11వ నంబరు ఓపీలోని వైద్య సిబ్బంది సూచించడంతో ఆమె దిగాలుగా వెనుదిరిగింది. ఇలా అనేకమంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆస్పత్రి అత్యవసర విభాగంలో మినహా అన్ని వార్డుల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా గైనిక్, ఆర్థోపెడిక్, మెడికల్, కార్డియాలజీ, ఊపిరితిత్తుల విభాగాలకు రోగులు వస్తుంటారు. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో వైద్య సేవలందించలేక వైద్యులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మినహా మిగిలిన వారిని చూసే దిక్కు లేకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వార్డుల్లోనూ.. జీజీహెచ్ గైనిక్ విభాగానికే ప్రతి రోజూ సుమారు 400 మంది గర్భిణులు వస్తుంటారు. 11వ నంబరు ఓపీలో వారి పరిస్థితి మంగళవారం దయనీయంగా మారింది. గంటల తరబడి వేచిఉన్నా.. వైద్యుల దగ్గరికి వెళ్లేసరికి ఁనీకు బాగానే ఉంది కదా, జూనియర్ డాక్టర్లు లేరు, శుక్రవారం రండి..రూ. అంటూ వెనక్కి పంపించేశారు. వివిధ సంఘటనల్లో ఎముకలు విరిగిన వారు ఆర్థోపెడిక్ విభాగానికి నిత్యం సుమారు 600 మంది వస్తుంటారు. వారికి ఓపీ విభాగంలో 20 మందికి పైబడి పీజీలు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. పీజీలు సమ్మెలో ఉండడంతో ఆ భారం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై పడింది. మెడికల్, కార్డియాలజీ, ఊపిరితిత్తులు, చిన్నపిల్లలు, ఈఎన్టీ, దంత, కంటివైద్య విభాగాల ఓపీల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రోగులను తగ్గించే ప్రయత్నం ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో సుమారు 1500 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. సమ్మె కారణంగా ఆ సంఖ్యను కూడా తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కొత్తవారిని జాయిన్ చేసుకోకపోగా, ఉన్నవారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆయా వార్డుల్లో 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండేది జూనియర్ వైద్యులే. ప్రొఫెసర్లు కేస్ షీట్లో రాసిన ప్రకారం వారికి వైద్యం అందించేది కూడా వీరే. కొన్ని రకాల స్కానింగ్లు కూడా జూనియర్ వైద్యులే చేస్తుంటారు. దీంతో ఇన్వెస్టిగేషన్స్, శస్త్రచికిత్సలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం సుమారు వంద శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ప్రస్తుతం అత్యవసర, గైనిక్ ఆపరేషన్ థియేటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన వాటిలో కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడ్డ జూడాలు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు మంగళవారం బాలాజీ చెరువు సెంటర్లో సుమారు అరగంట సేపు మానవహారం నిర్వహించారు. జీజీహెచ్ మెయిన్గేటు వద్ద ధర్నా నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా బాలాజీచెరువు సెంటర్కు చేరుకున్నారు. నల్లరిబ్బన్లతో చేతులు కట్టుకుని నిరసన తెలిపారు. -
పదునెక్కిన జూడాల పోరు
కర్నూలు హాస్పిటల్ : కర్నూలులో జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన పోరు పదునెక్కింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు మూడ్రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పోరు ఉధృతమవుతోంది. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తాము పోరాటాన్ని ఆపేది లేదని వారు ప్రకటించారు. అవసరమైతే అత్యవసర సేవలనూ బహిష్కరించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేయడంతో రోగులు వణికిపోతున్నారు. విధులను బహిష్కరించి.. కర్నూలు పెద్దాస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు సోమవారం విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆస్పత్రిలోని లెక్చర్ గ్యాలరీ నుంచి మొదలైన ర్యాలీ క్యాజువాలిటీ వరకు కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాల ప్రతినిధులు నిరంజన్, ప్రశాంత్, పవన్ హెచ్చరించారు. గ్రామీణ ప్రజారోగ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యులపై అనవసరమైన నిందలు మోపడం తగదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జూడాల కొరతను బూచీగా చూపిస్తూ జీవో 107ను జారీ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనంగా అభివర్ణించారు. వాస్తవానికి పల్లెల్లో వైద్యుల కొరత లేదని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో 1,168 స్పెషలిస్టు డాక్టర్ల అవసరం ఉండగా, ప్రభుత్వం 668 పోస్టులను మాత్రమే మంజూరు చేసిందన్నారు. వాటిలో 275 స్పెషలిస్టులను మాత్రమే నియమించిన ప్రభుత్వం, నేటికీ 893 స్పెషలిస్టుల అవసరం ఉన్నా ఖాళీలు భర్తీ చేయకుండా జూడాలపై దుష్ర్పచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మూడ్రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని నిందించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జరగబోవు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పెద్దాస్పత్రిలో అరకొర సేవలు జూడాల సమ్మె ఫలితంగా కర్నూలు పెద్దాస్పత్రిలోని రోగులకు అరకొరగా సేవలే అందుతున్నాయి. పీజీ, వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, రెసిడెంట్ స్పెషలిస్టులు సమ్మెలో భాగస్వాములు కావడంతో సమస్య జటిలంగా మారుతోంది. నాలుగైదు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు ఎక్కువ శాతం పీజీ, వైద్య, హౌస్ సర్జన్ల సేవలే అందుతున్నాయి. మూడ్రోజులుగా వారు సమ్మెబాట పట్టడంతో సోమవారం ఓపీ విభాగాల్లో రోగులకు వైద్యసేవలు నామమాత్రంగా అందాయి. సుదూర ప్రాంతల నుంచి వస్తున్న రోగులపై జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం పడుతోంది. -
డిమాండ్లు పరిష్కరిస్తేనే విధుల్లోకి
లబ్బీపేట : ‘అత్యవసర చికిత్సా విభాగానికి వస్తే నాడిని పరీక్షించేందుకు పల్స్ ఆక్సి మీటర్లు లేవు.. మధ్యాహ్నం 12 గంటలు దాటితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో ఉండదు... రాత్రి ఎనిమిది దాటితే సిటీ స్కానింగ్ ఉండదు.. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అంతే.. ముఖ్యమైన రక్త పరీక్షలు బయటకు పంపాలి. పరిస్థితి దయనీయంగా ఉంటే రోగులకు సేవలు ఎలా చేయాలి... చివరికి డెత్ డిక్లేర్ చేసేందుకు ఈసీజీ కూడా అందుబాటులో లేదు’ అని జూడాలు ఆవేశంగా ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కారు. మూడురోజులుగా సేవలు బహిష్కరించి సమ్మె చేస్తున్న జూడాలతో చర్చించేందుకు అకడమిక్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వెంకటేష్ సోమవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్లో సమావేశమయ్యారు. రోగులు ఇబ్బందులు పడుతుంది తమ వల్ల కాదని, ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లేనని జూడాలు పేర్కొన్నారు. ఒక దశలో జూడాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీఎంఈ సైతం వారి బాటలోనే మాట్లాడాల్సిన పరిస్థితి. చర్చా కార్యక్రమం ఇలా సాగింది.. జూడాలు : ప్రభుత్వాస్పత్రి వరస్ట్ కండీషన్లో ఉంది. కనీస సౌకర్యాలు లేక నిత్యం వందలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని నిత్యం చూస్తున్నాం. ఇక్కడే ఇలా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ఎలా పనిచేయాలి?. డీఎంఈ : ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధనాస్పత్రుల్లో 105 వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. జూడాలు : సార్.. వర్షం వచ్చిన రోజు మా కాలేజీకి రండి.. మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చేందుకు ప్రిన్సిపాల్ నావా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణం సంద్రంలా మారుతుంది. హాస్టల్లోకి పాములు సైతం వస్తున్నాయి డీఎంఈ : మురుగు సమస్య పరిష్కారానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఆర్కిటెక్చర్కూ చెప్పాం. మూడేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. సీనియర్ రెసిడెంట్స్ : నెలా నెలా జీతం ఇస్తామని కంపల్ సరీ సర్వీసు పేరుతో డిగ్రీలు రిజిస్ట్రేషన్లు సైతం నిలిపి మమ్మల్ని నియమించారు. ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు మా పరిస్థితి ఏమిటి? డీఎంఈ : రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున జీతాలు ఇవ్వలేకున్నాం. సీనియర్ రెసిడెంట్స్ : డబ్బులు లేనప్పుడు మాతో ఎందుకు పని చేయిస్తారు. మమ్మల్ని రిలీవ్ చేయండి. డబ్బులు ఉన్నప్పుడు పిలిస్తే మళ్లీ వచ్చి చేస్తాం. జూడాలు : కంపల్ సరీ సర్వీసులు వాలంటరీ సర్వీసుగా మార్చండి, స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొస్తాం. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో మా డిగ్రీలు రిజిస్ట్రేషన్ చేయండి? డీఎంఈ : అది ప్రభుత్వ విధానం. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. సర్టిఫికెట్లు ముందే రిజిస్ట్రేషన్ విషయం కూడా ప్రభుత్వం నిర్ణయించాలి. మా డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామంటూ జూడాలు చర్చలు ముగించారు. చర్చల్లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సూర్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ రమేష్కుమార్ పాల్గొన్నారు. -
జూడాలతో డీఎంఈ చర్చలు విఫలం
కొనసాగుతున్న సమ్మె సాక్షి, విజయవాడ బ్యూరో: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ఏపీ వైద్య విద్య డెరైక్టర్ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్ సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒక ఏడాది గ్రామీణ సర్వీసు తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో జూడాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటేశ్ సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో జూడాలతో సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత డీఎంఈ విలేకరులతో మాట్లాడారు. సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉందని, తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని జూడాలను కోరినట్లు చెప్పారు. జూడాలు కోరుతున్నట్లుగా వాలంటరీ సర్వీసుకు అవకాశం కల్పిస్తే ఒంగోలు, శ్రీకాకుళం వంటి కాలేజీలకు వెళ్లరని, తద్వారా అక్కడి ఆస్పత్రుల్లో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు కార్తీక్, క్రాంతికుమార్ విలేకరులకు తెలిపారు. మరోవైపు విజయవాడ సిద్ధార్థ, కాకినాడ రంగరాయ, కర్నూలు, తిరుపతి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూడాలు విధుల బహిష్కరణను కొనసాగించారు. విజయవాడ సిద్ధార్థ, తిరుపతి రుయా ఆస్పత్రుల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. -
సమ్మె బాటలో జూడాలు
నెల్లూరు (వైద్యం): తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న జూడాలు సోమవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్రావును ఆయన చాంబర్లో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పీజీ కోర్స్ పూర్తి చేసుకుని వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న తమ నుంచి రూ.20 లక్షల బాండ్ ష్యూరిటీని కోరడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. ఎక్కువగా మధ్య, పేద తరగతుల నుంచి ఈ స్థాయికి చేరుకున్న తమను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు. కానీ శాశ్వత వైద్యసేవ బాధ్యతలను ప్రభుత్వం తమకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల విడుదల చేసిన 1,024 ప్రభుత్వ వైద్యుల పోస్టులకు 12 వేల మంది డాక్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చాయంటే ప్రభుత్వ వైద్యులుగా ఎక్కడైనా సేవలందించడానికి తామంతా ఆసక్తి చూపుతున్నట్లు కాదా? అని వారు ప్రశ్నించారు. జూనియర్ డాక్టర్లుగా తమకు వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్య పరికరాలు, అధునాతన వైద్య విధాన ఎక్విప్మెంట్స్ అందుబాటులో లేక రోగి మరణిస్తే అందుకు తామే దాడులకు గురవుతున్నామని మండిపడ్డారు. 9 నెలలుగా జీతాల్లేవ్ జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న తమకు ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు అందలేదని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నించారు. తమ సమస్యలను సామరస్యంగా పరిశీలించి, పరిష్కరించకపోతే 48 గంటల తర్వాత మెరుపు సమ్మెకు దిగుతామని, అత్యవసర ైవె ద్య సేవలను సైతం బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ప్రిన్సిపల్ ప్రభాకర్రావు తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జూనియర్ డాక్టర్లు తెలియజేశారు. సమ్మెలో మహేష్, ధనుంజయ్రెడ్డి, అర్చన, భరత్, మస్తాన్, కరుణ్కుమార్ తదితర 42 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు.. డీఎస్ఆర్ ఆసుపత్రిలోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాము. జూడాల సమ్మె వల్ల ఏలాంటి ఇబ్బంది లేదు. రోగులకు అవసరమైన అత్యవసర సేవలతో సహా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశాము. -రవీంద్రనాథ్ ఠాగూరు, డీఎస్ఆర్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డీఎంఈ దృష్టికి తీసుకెళ్లా... జూనియర్ డాక్టర్ల సమస్యలను ఇప్పటికే డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లాం. జూడాల డిమాండ్లు న్యాయపరమైనవే. కొన్ని నెలలుగా స్టైఫండ్స్ రాని విషయం వాస్తవమే. -ప్రభాకర్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ -
జూనియర్ డాక్టర్ల సమ్మె బాట
తిరుపతి కార్పొరేషన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ముందుగా ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు రుయా ఆస్పత్రి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. రుయా ఆస్పత్రితో పాటు మెటర్నటీ హాస్పిటల్, ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పీజీ,యూజీ, హౌస్ సర్జన్లు క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీ, ఆర్ఐసీయూ విభాగాల్లో మినహా మిగిలిన వైద్య సేవలను బహిష్కరించారు. రుయా ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున జూడాలు గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానిది బ్లాక్మెయిలింగ్ ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ చేస్తోందన్నారు. పీజీలో ఏడాదిపాటు విధిగా గ్రామీణప్రాంతంలో పనిచేయాలనే నిబంధన పెడుతున్నారన్నారు. లేకుంటే నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల జామీనుతో కూడిన రూ.20 లక్షలు బాండ్ తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుపేదలు, గ్రామీణ ప్రాంతం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన తాము రూ.20 లక్షలు ఏ విధంగా బాండ్ ఇస్తారని నిలదీశారు. పోనీ గ్రామీణ ప్రాంతంలో వైద్యసేవలు చేయిస్తారా అంటే అదీ లేదన్నారు. కేవలం ఎంసీఐ వారికి కళాశాలలో సీట్ల సంఖ్యను చూపించుకునేందుకు తమను ఎరగా వాడుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. పీహెచ్సీల్లో పోస్టులు భర్తీ చేయండి గ్రామీణ ప్రాంతంలోని పీహెచ్సీలో పర్మినెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయకుండా, ఆ పోస్టుల్లో పేరుకు జూనియర్ డాక్టర్లను హౌస్సర్జన్లుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పర్మినెంట్ పోస్టులు కల్పిస్తే పల్లెకు పోవడానికి మామే సిద్ధం. మమ్మల్ని శాశ్వత ఉద్యోగానికి పంపడానికి మీకు దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏడాది పాటు వైద్య సేవలు చేయమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. పైగా ఆ హాస్పిటల్స్లో ఖాళీలను భర్తీచేస్తే వేతనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్వార్థం కోసం జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే అత్యవసర సేవలను కూడా స్తంభింప జేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జూడా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఇజాజ్, ఉపాధ్యక్షుడు నిఖిల్ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి నాగరాజు రాయల్, రామ్భూపాల్రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవో 107ను రద్దు చేయాలి
కర్నూలు(హాస్పిటల్): తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ వైద్యులు రెండో రోజు విధులను బహిష్కరించారు. జీవో 107ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి క్యాజువాలిటీ వరనకు జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూడా నేతలు ప్రశాంత్, పవన్, భానుప్రదీప్ తదితరులు మాట్లాడారు. జూనియర్ వైద్యులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. తమ సమస్యలను 2012, 2013 నుంచి వరుసగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్గా వ్యవహరిస్తుండటంతో న్యాయం జరుగుతుందని ఆశించామన్నారు. అయితే 107 జీవోను అమలు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేద రోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది వేలాది వైద్య విద్యార్థులు పట్టా పుచ్చుకుని బయటికి వస్తున్నా.. ప్రభుత్వం వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. తమ భవిష్యత్తు కోసమే సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం తక్షనం స్పందించి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తామని చెబుతున్నా ఎందుకు పెడచెవిన పెడుతుందో అర్థం కావడం లేదు. అంధకారంగా మారుతున్న మా భవిష్యత్తు కోసం రోడ్డెక్కాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. తాత్కాలికంగా వైద్యులతో సేవలు చేయించుకోకుండా, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. -డాక్టర్ ఉమాతేజస్వి ఆనాడు చంద్రబాబు వ్యతిరేకించారు రాష్ట్రంలో జూనియర్ వైద్యులపై నిర్బంధ వైద్యసేవ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. జూడాలకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిర్బంధ వైద్య సేవ చేయాలని జీవో 107ను జారీ చేయడం తగదు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం. - డాక్టర్ నిరంజన్ -
మొదలైన జూడాల సమ్మె
విజయవాడ, కర్నూలులో విధుల బహిష్కరణ సాక్షి, విజయవాడ బ్యూరో: డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడ, కర్నూలు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూని యర్ డాక్టర్లు(జూడా) శనివారం సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో సమ్మె చేస్తామని శుక్రవారం రాత్రి ప్రకటించిన జూడాల సంఘం అన్నట్లుగానే ఈ రెండుచోట్లా విధులు బహిష్కరించింది. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో జూడాలు విధులు బహిష్కరించికళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు వైద్య కళాశాలలోనూ జూడాలు విధులు బహిష్కరించి భారీ ర్యాలీ, ధర్నా చేశారు. విశాఖపట్నం కింగ్జార్జి, కాకినాడ రంగరాయ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతపురం, కర్నూలు, గుం టూరు, కడప వైద్య కళాశాలల్లో 24వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి మిగిలిన కళాశాలల్లోనూ సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ ప్రభుత్వం తరఫు నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలకు జూడాలు హాజరుకారని ఆయన స్పష్టం చేశారు. ఒక సంవత్సరం గ్రామీణ సర్వీసు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ సర్వీసుకు తాము వ్యతిరేకం కాదని అయితే అక్కడి ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకుండా తమను వైద్యం చేయమనడం సరికాదన్నారు. సమ్మెతో రోగులు అవస్థలు పడ్డారు. -
'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం'
గుంటూరు: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం గుంటూరులో కామినేని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... వాటిని అర్థం చేసుకోవాలని జూనియర్ డాక్టర్లకు కామినేని హితవు పలికారు. జూడాల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక ప్రబుత్వం తరఫున స్పందిస్తామని కామినేని చెప్పారు. -
ఏపీలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. సాధారణ సేవలు నిలిపేస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలన్న నిబంధనపై నిరసనగా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. కాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో నిన్న జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సంవత్సరం పాటు వైద్య సేవలందించాలనే నిబంధనను తొలగించాలని పట్టుపట్టారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దాంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. మరోవైపు తెలంగాణలోనూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమించాలని హైకోర్టు సూచించినా వారు తమ పట్టు వీడలేదు. -
ఏపీలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు
-
చర్చలకు పిలిచేంతవరకు సమ్మె కొనసాగింపు:జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని డీఎంఈ చెప్పారు. జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే తాము ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు తాము వెళతామని వారు చెప్పారు. -
'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి'
-
'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి'
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. జూడాల ఆందోళనపై హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఈ 48 గంటల్లో జూడాలపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. జూడాల ఆందోళన చట్ట వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామీణ సర్వీసు మినహా జూడాల మిగత అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో జూడాలు సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. అందుకోసం జీవో 107 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూడాలు అక్టోబర్ 1వ తేదీన సమ్మె బాట పట్టారు. నాటి నుంచి వారు నిరవధిక సమ్మెకు చేయడంతో... రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జూడాలు X సర్కార్!
నిరసన జెండాలు మోస్తున్నారు... న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకుపైగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదని కోర్టు మెట్లూ ఎక్కారు. విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన సర్కార్ పట్టుదలకు పోవడంతో సమస్య జటిలమవుతోంది. సమ్మె కారణంగా వైద్య సేవలందకపోవడంతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. ఎవరో ఒకరు మెట్టు దిగకపోతే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో తెలియని అయోమయం నెలకొంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం... - సాక్షి జర్నలిజం స్కూల్ విద్యార్థులు * వైద్య సేవలందక నలిగిపోతున్న పేదలు * నెల రోజులు దాటినా ఆగని జూడాల ఆందోళన * రూరల్లో ఖాళీల భర్తీ డిమాండ్పై దిగని మెట్టు * కఠిన చర్యలకు సిద్ధమవుతున్న సర్కార్! * బెదిరేది లేదంటున్న జూడాలు * కీలకం కానున్న హైకోర్టు తీర్పు నాటి జూడాల పోరాటానికి వైఎస్సార్ బాసట.. 2003 ప్రాంతంలో అప్పటి సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్ చార్జీలు విధించింది. వాటిని రద్దు చేయూలంటూ జూడాలు 2003 డిసెంబర్ 19 నుంచి 2004 జనవరి 29వరకు సుమారు 40 రోజులపాటు పోరాటం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీరి పోరాటానికి మద్దతు పలికారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ యూజర్ చార్జీలను రద్దు చేశారు. వైఎస్సార్ చలువ వల్లే నేటికి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతోంది. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్, జిప్వుర్లో జూనియర్ డాక్టర్లకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించాలని ప్రభుత్వాన్ని జూడాలు కోరుతున్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టి నెల రోజులు దాటినా వారి ఆందోళనకు పుల్స్టాప్ పడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది సర్వీసు చేయాలన్న నిబంధనను సడలించి ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరుతున్నారు. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని అడగడం లేదని, ఖాళీలను భర్తీ చేయూలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని జూడాలు చెబుతున్నారు. ఈ విషయంలో సర్కార్ సానుకూలంగా స్పందించక పోవడం వల్లే సమస్య జటిలంగా మారుతోందని జూడాలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా నియామకాలు చేపట్టకపోగా, జూడాలను డిబార్ చేసేందుకు సర్కార్ సిద్ధపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భావి భారత డాక్టర్లపై ఎస్మా ప్రయోగించడానికైనా వెనుకాడబోవుని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2012లో ఇచ్చిన వేతన పెంపు హామీని నెరవేర్చకుండా జూడాలకు ప్రమాద సంకేతాలు పంపుతోంది. ఇదిలావుంటే ‘వైద్య వృత్తి గువూస్తా ఉద్యోగం లాంటి ది కాదు, గౌరవప్రదమైనది. రాజకీయ విభేదాలతో నిరసనలు చేపడుతున్నారేమో ఆత్మపరిశీలన చేసుకోండి’ అని హైకోర్టు జూడాలనుద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ సర్కార్ జూడాల పట్ల కాస్త కఠిన వైఖరిని అవలంబించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధాన డిమాండ్లు.. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. 107 జీఓను రద్దు చేయూలి. తమతో చర్చించిన తర్వాతే కొత్త జీఓ తేవాలి. స్టైపెండ్ పెంపు. వైద్యులకు ప్రత్యేక రక్షణ సిబ్బంది. లైబ్రరీల అప్గ్రేడ్, గ్రామీణ ప్రాంతాల్లో నివాస వసతి. అసలు సమస్య ఇదే.. జూడాలను గ్రామీణ సర్వీసుల్లో శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే డిమాండే ప్రధానంగా మారింది. మిగతా డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిన సర్కార్ ఈ డిమాండ్పై మాత్రం మెట్టు దిగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి అభ్యంతరం లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ సేవలు అందించినందుకు తమకు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూ చిస్తున్నారు. ఏటా 600 మంది వైద్యులు గ్రామీణ సర్వీసుల నుంచి బయటికి వస్తున్నారని వారు చెబుతున్నారు. గత పదేళ్లలో రెండు సార్లు మాత్రమే నియామకాలు జరిగాయంటున్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా... జూడాలు 2012లో ఉద్యమించినప్పుడు వారికి అండగా నిలిచిన కేసీఆరే ఇప్పుడు సమ్మెను అణగదొక్కాలని ప్రయుత్నిస్తున్నారని జూడాల ఆరోపణ. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీని గద్దెనెక్కాక మాటవూర్చిందని వారంటున్నారు. ఏదిఏమైనా అటు జూడాలు, ఇటు సర్కార్ మెట్టుదిగక పోవడంతో వైద్య సేవలందక నిరుపేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలని పలువురు కోరుతున్నారు. డిమాండ్లు అంగీకరిస్తే సమ్మె విరమిస్తాం.. ‘రూరల్ సర్వీసు’ సవుస్యను పరిష్కరిస్తే భవి ష్యత్తులో సమ్మెలు చేయుం. జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న నెపంతో ప్రభుత్వం మా డిమాండ్ను అంగీకరించడం లేదు. 107 జీఓ రద్దు చే సి కొత్త జీఓ తీసుకురావాలి. ఈ జీఓలోని మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదు. - డా. శ్రీనివాస్, జూడాల సంఘం అధ్యక్షుడు అవగాహనకే సరిపోతుంది.. ఏడాదిలో మూడు నెలలు కౌన్సెలింగ్కు పోతే 8 నెలలు మాత్రమే సర్వీసు చేస్తున్నాం. స్థానికుల భాష, ఆరోగ్య పరిస్థితులను అవగాహన చేసుకోవడానికే ఆ సమయం సరిపోతోంది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిం చినపుడు మా డిమాండ్ తెలుసుకోకుండా సమ్మె విరమిస్తారా? లేదా అని వుంత్రి ప్రశ్నించారు. - మనోజ్, జూడా రూరల్ సర్వీస్కు వ్యతిరేకం కాదు.. 1,300 రూరల్ సర్వీసు పోస్టులకు 16వేల మంది ఆసక్తి చూపారంటే అర్థం చేసుకోండి. రూరల్ సర్వీసుకు మేం సిద్ధమే. శాశ్వత నియామకాలు చేపట్టాలి. డీఎంఈ వల్లే సమస్య జటిలం. సమ్మెను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ చూపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. - స్వప్నిక, జూడా ఉస్మానియా -
పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు
-
పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు
సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ డాక్టర్ల సమ్మె మొదలై బుధవారానికి 45 రోజులు నిండాయి. పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు మార్చి-ఏప్రిల్లో జరిగే పరీక్షకు అర్హులు కారు. వారికి కావాల్సిన హాజరుశాతం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజి్రస్ట్రార్కు రాస్తాం. దీనివల్ల 2 వేల మంది పీజీ విద్యార్థులు, 1500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు’ అని వైద్య విద్యా డెరైక్టర్ డాక్టర్ పి.శ్రీనివాస్ వివరించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులకు 1950 తర్వాత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో ఆస్పత్రికి కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా వైద్య పరికరాల కొనుగోలు కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొంటూ ప్రజా సేవలను విస్మరించిన జూనియర్ డాక్టర్లు తమ ‘డిసర్టేషన్’ ( థీసిస్ సమర్పించడం) మాత్రం పూర్తి చేశారని, కానీ, వారు సమ్మెలో కొనసాగుతున్నందున గైర్హాజరుగానే పరిగణించి వాటిని తిరస్కరిస్తున్నామని, ఇదే విషయాన్ని విశ్వవిద్యాలయానికి తెలియజేస్తామన్నారు. వివిధ వైద్య కళాశాలల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది జూడాలను వారి మాతృ కళాశాలలకు పంపిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని 3 వేల మంది వారి తల్లిదండ్రులకు లేఖలు రాశామని, 20 మంది మాత్రమే వచ్చారన్నారు. ఇప్పటికైనా అధికారికంగా సమ్మె విరమిస్తున్నట్లు రాసి ఇస్తే, ఎవరికీ నష్టం జరగకుండా చూసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరతానని డీఎంఈ తెలిపారు. ప్రజాధనంతో వైద్య విద్య అభ్యసిస్తున్న వారు, అదే ప్రజానీకానికి ఏడాదిపాటు సర్వీసు చేయాల్సిందేనని, ఒక్కో విద్యార్థిపై రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా ప్రభుత్వం వెచ్చిస్తోందని వివరించారు. ఎంసీఐ తనిఖీలు జరిగాయని, దీనికి కూడా జూడాలు సహకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన, త్వరలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. క్లోరోఫాంను అనస్థీషియగా గుర్తించిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదని, దేశంలో తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఘనత కూడా ఉస్మానియాకు ఉందన్నారు. అలాగే, దేశ ంలో తొలి గుండె మార్పిడి చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి రికార్డు సృష్టించిందని డీఎంఈ వివరించారు. ఈ ఆస్పత్రులకు కేటాయించిన బడ్జెట్ను మార్చినాటికి పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టి, అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని డీఎంఈ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
'విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు'
హైదరాబాద్: రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్ల (జూడాలు) పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రేపటిలోగా విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవని జూడాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పి.శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 75 శాతం హాజరు లేకుంటే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పని చేసే జూడాలకు కాలపరిమితిని రెండేళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పని చేసే నిబంధన ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని పి.శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
చిన్నపెండ్యాలలో జూనియర్ డాక్టర్లు
చిన్నపెండ్యాల (స్టేషన్ఘన్పూర్) : ‘పల్లె ప్రజల ఆరోగ్యం - జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో చలో పల్లె కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల పంచాయతీ ఆవరణలో మంగళవారం జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం ఉస్మానియా, ఎంజీఎం, గాంధీ ఆస్పత్రుల నుంచి 45 మంది డాక్టర్లు గ్రామానికి రాగా... శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య గౌడ్, ఉపసర్పంచ్ గుంపుల రవీందర్ రెడ్డి ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే స్థానికంగా ఉంటూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని మొదటిరోజు నుంచి చెబుతున్నామని, అయినా ప్రభుత్వం స్పందించకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలే ప్రభుత్వం అయినందున గ్రామాల్లోకి వచ్చి తమకు జరుగుతున్న అన్నాయాన్ని వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఆరోగ్య వ్యస్థకు జరిగే అన్నాయాన్ని ఎదుర్కోమని చెప్పేందుకే చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. -
పల్లె సేవలో జూనియర్లు
‘ పల్లె ప్రజల ఆరోగ్యం.. జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో రాష్ట్రంలోనే తొలిసారిగా జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో జఫర్గఢ్ మండలంలోని కూనూరులో సోమవారం చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులకు చెందిన 50మంది జూనియర్ వైద్యులు హాజరయ్యారు. - జఫర్గఢ్ -
జూడాల సమ్మె
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా వారు ఆందోళనకు పూ నుకోవడంతో అధికారులు కంగు తిన్నారు. ఈ అంశంపై డీఎంఈ తీవ్రంగా స్పందించి 46 మంది జూడాలను డెరైక్టరేట్కు సరెండర్ చేయించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ వరకు జూడాలు ర్యాలీగా వెళ్లి వైస్ ప్రిన్సిపాల్ రమాదేవికి సమ్మె నో టీసు అందించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడంలో పభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని నిరసన వ్యకం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మె విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సమ్మె చేయడం ఏమిటని వైద్యాధికారులను ప్రశ్నించారు. ‘సమ్మెలో ఎంత మంది పాల్గొన్నారు, సమ్మె నోటీసులో ఎంత మంది సంతకాలు చేశారు’ తదితర వివరాలతో తగిన నివేదిక పంపాలని, జూడాలను వెంటనే డెరైక్టరేట్కు సరెండర్ చేయాలని ఆదేశించారు. డీఎంఈ ఆదేశాలతో కళాశాల అధికారులు స్పందించి ఆగమేఘాలపై నివేదిక తయారు చేశారు. 46 మంది జూనియర్ డాక్టర్లు సంతకాలు చేసి, సమ్మెలో పాల్గొన్నారని తెలుపుతూ వారిని సరెండర్ చేస్తూ నివేదిక పంపించారు. ఈ విషయాన్ని వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి ధ్రువీకరించారు. కొంత కాలంగా గైర్హాజరు 109 మంది జూనియర్ డాక్టర్లు పీజీ విద్య కోసం అక్టోబర్లో మెడికల్ కళాశాలకు వచ్చారు. వీరిని పది విభాగాలకు కేటాయించారు. వైద్య సేవలు అందించాల్సింది పోయి వీరు నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. కొంతమంది స్థానికంగా, మరికొందరు వైద్యులు హైదరాబాద్లోని ప్రయీవేటు ఆస్పత్రులలో పని చేస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన అధికారులు జూనియర్ డాక్టర్ల హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు రావాలని గట్టిగా హెచ్చరించారు. దీంతో వారు విధులకు రావడం మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం, కళాశాలలో సౌకర్యాలు లేవని, సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు. అనంతరం అందుబాటులో లేకుండాపోయారు. తిరిగి గురువారం హైదరాబాద్లోని జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా సమ్మె నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. మరోవైపు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగడం పరిస్థితిని ఎటు తీసుకెళ్తేందో వేచి చూడాలి. -
జూడాల వినూత్న నిరసన
కవాడిగూడ: సమ్మె కొనసాగిస్తున్న జూడాలు బుధవారం వినూత్నరీతిలో నిరసనవ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పరీక్షిత్, కైలాష్పతి, సూర్యప్రభాత్, మహేందర్, గౌతమ్, రేష్మ, నిఖిల్లు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాస్క్ ధరించిన నిరసనకారునికి జూనియర్ డాక్టర్లు చెవి పరీక్షలు చేశారు. తమ సమస్యలు పట్టించుకోనందున ఇలా వినూత్నంగా నిరసనవ్యక్తం చేశారు. అనంతరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు డాక్టర్ క్రాంతి చైతన్యలు మాట్లాడుతూ గ్రామీణ సేవ చేసేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు సరైన రీతిలోస్పందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు నాగార్జున, అనిల్, భావ్య, స్వప్నిక, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
జూడాలపై చర్యలు తీసుకుంటా
-
జూడాలపై చర్యలు తీసుకుంటా
ఉపముఖ్యమంత్రి రాజయ్య సాక్షి, సంగారెడ్డి: కోర్టు మొట్టికాయవేసినా మొండిగా వ్యవహరిస్తున్న జూనియర్ డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖను వికేంద్రీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్యకళాశాల వార్షిక వేడుకలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. జూడాలు వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందజేయబోమని చెప్పటం దారుణమన్నారు. వైద్యులైన నా పిల్లలను గ్రామీణ ప్రాంతాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూడాల ఐదు డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవు: రాజయ్య
గ్రామాల్లో వైద్య సేవలు అందించకపోతే జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. జీవో నెంబర్ 1022 ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తన కొడుకు, కూతురు ఇద్దరూ కూడా వైద్యులేనని, వాళ్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని రాజయ్య చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పదని ఆయన అన్నారు. -
మంత్రి కామినేనితో జూడాల భేటి!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు(జూడాలు) సమావేశమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కామినేనికి జూడాలు విజ్క్షప్తి చేశారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపు సాయంత్రం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని జూడాలు తెలిపారు. సమస్యల పరిష్కరించాలని హెల్త్ సెక్రెటరీ, డీఎంఈ, మంత్రి సమక్షంలో జూడాలు చర్చలు జరుపనున్నారు. చర్చల తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని జూడాలు వెల్లడించారు. -
ఆస్పత్రులున్నాయి...డాక్టర్లే లేరు...
-
సమ్మె ఆపేది లేదు: జూడాలు
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్లు మీడియాతో మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొన్నారు. తమ సమ్మె వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని ఆరోపించడం సరికాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. వైద్యవిద్య ప్రైవేటీకరణ వల్లే: చుక్కా రామయ్య వైద్యం ప్రైవేటుపరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజామద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని వారికి సూచించారు. పేదరోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. జూడాల తల్లిదండ్రులకు నోటీసులు గత నెలరోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డిబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. ఈ మేరకు తమ కళాశాలలో చదువుతన్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే విధులకు హాజరు కావాలని, లేకుంటే డిబార్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు తమకు నోటీసులు అందినట్లు గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థుల తల్లితండ్రులు మీడియాకు తెలిపారు.