agitation
-
గిరిజన వర్సిటీకి భూములిస్తే మార్చేస్తారా?
కొత్తవలస: పోలీసు శిక్షణ కేంద్రం (గ్రేహౌండ్స్) పేరిట మరోసారి తమను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు ఆర్డీఓ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయించగా.. ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ జోడు రాములమ్మ అధ్యక్షతన తహసీల్దార్ బి.నీలకంఠరావు అప్పన్నదొరపాలెంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సభకు హాజరైన గిరిజనులు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పి తమ భూములను లాక్కున్నారని తెలిపారు. 2019లో ఎన్నో హామీలిచ్చారని, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. భూములిచ్చిన గిరిజనులను పోలీస్ బందోబస్తు మధ్య బంధించి పూజలు నిర్వహించారన్నారు. ఇప్పుడు అవే భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల్ని వివరిస్తూ గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సమయంలో గిరిజనులంతా ఒక్కటై తమను మళ్లీ మోసం చేయొద్దని నినదించారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 178 మంది గిరిజనులకు చెందిన 179 ఎకరాల్లోని జీడిమామిడి తోటలను ఏడు రకాల హామీలిచ్చి తీసుకుందని.. నేటికీ వాటి అమలు ఊసే లేదని నిలదీశారు. గ్రేహౌండ్స్ నిర్మాణానికి తమ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే తమ శవాలపై నిర్మాణాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ.. గిరిజనుల డిమాండ్లు రాసి ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మరోసారి గ్రామంలో సభ ఏర్పాటు చేస్తామని అప్పటిలోగా ఆలోచన చేసుకోవాలని సూచించారు. -
వంటనూనె తగ్గించండి.. వ్యాయామం చేయండి
సిల్వాస్సా: దేశంలో ఊబకాయ సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఖ్య అని చెప్పారు. ఒబేసిటీ అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఊబకాయ సమస్యను అధిగమించడానికి వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వంట నూనెల విని యోగం తగ్గించుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నిత్యం వ్యాయామం చేయాలని, శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించడానికి దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ షాపుల్లో ఔషధాలు కొనుగోలు చేయడం వల్ల మధ్య తరగతి ప్రజలు, పేదలకు ఇప్పటికే రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు. సిల్వాస్సా పట్టణం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.460 కోట్లతో నిర్మించిన ‘నమో హాస్పిటల్’ను ప్రారంభించారు.11 నుంచి మోదీ మారిషస్ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ నుంచి మారిషస్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుందని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గూలం ఆహా్వనం మేరకు మారిషస్ జాతీయ దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేసింది. రూ. 32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలో లెక్కించలేరుకాంగ్రెస్ను ఎద్దేవా చేసిన ప్రధాని మోదీసూరత్: చట్టసభల్లో సున్నా సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు రూ.32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్కించలేవని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ కింద పేదలకు ఇప్పటిదాకా రూ.32 లక్షల కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పెంచామని అన్నారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్లో ‘సంతృప్తస్థాయిలో ఆహార భద్రత’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను శనివారం పూర్తిగా మహిళలకే అప్పగించబోతున్నానని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతుల ఆందోళన
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో బెగాస్ కొరత కారణంగా క్రషింగ్ నిలిచిపోవడంతో చెరకు రైతులు గురువారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులు చెరకు బండ్లతో ఫ్యాక్టరీ గేటు ఎదుట రాస్తారోకో చేయడంతో చోడవరం–అనకాపల్లి రోడ్డుపై 3 గంటలకు పైగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో గత సీజన్కు సంబంధించి బెగాస్ కొంత ఉండటంతో యాజమాన్యం క్రషింగ్, కో జనరేషన్ ఒకేసారి ప్రారంభించింది. అయితే, పూర్తిస్థాయి క్రషింగ్కు అవసరమైనంత బెగాస్ సమకూర్చుకోకపోవడంతో క్రషింగ్కు తరుచూ అంతరాయం కలిగింది. బాయిలర్కు కావలసినంత బెగాస్ లేకపోవడంతో బుధవారం రాత్రి నుంచి క్రషింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మరోపక్క గేటు, కాటాల నుంచి పెద్ద ఎత్తున చెరకు సరఫరా అయింది. దూర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, టిల్లర్లతో రైతులు చెరకు తెచ్చారు. ఈ బళ్లన్నీ రెండు రోజులుగా ఫ్యాక్టరీ రెండు యార్డుల్లో, రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయాయి. తెచ్చిన చెరకు ఎక్కడిదక్కడ ఉండిపోవడంతో సహనం కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. చెరకు బళ్లను చోడవరం – అనకాపల్లి రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, పాడేరు, మాడుగుల ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడుని రైతుల వద్దకు తీసుకొచ్చారు. బెగాస్ కొరతవల్లే క్రషింగ్కు ఇబ్బంది కలిగిందని, వెంటనే క్రషింగ్ ప్రారంభిస్తామని ఎండీ చెప్పారు. ఇందుకు రైతులు అంగీకరించలేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సమస్యలు తలెత్తాయంటూ ఆయనపై తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎండీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసు అధికారులు వచ్చి రైతులను సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు సీపీఐ, సీపీఎం, చెరకు రైతు సంఘాలు మద్దతిచ్చాయి. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న పరిణామాలు, రైతుల ఆందోళనపై అనకాపల్లి ఆర్డీవో ఆయీషా విచారణ జరిపారు. క్రషింగ్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు. అనంతరం వరి ఊక, చెరకు బెగాస్ను సమకూర్చి బాయిలర్ను ప్రారంభించారు. దీంతో మధ్యాహ్నం నుంచి క్రషింగ్ ప్రారంభించారు. -
ఎన్నికల ‘మాయ’పై కాంగ్రెస్ చింత!
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన సాధారణ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు దాని నేతృత్వంలోని ఇండియా కూటమి విజయాలను అడ్డుకోవడంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కంట్లో నలుసులా మారుతుండటంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. పార్టీ జయాపజయాలను నిర్ణయించే ఓట్లను చీల్చడంలో బీఎస్పీ తన పాత్రను సమర్ధంగా పోషిస్తోందని, ఇది పరోక్షంగా అధికార బీజేపీ కూటమికి లబ్ధి చేకూరుస్తోందన్న వాదనను బలంగా తెరపైకి తెస్తోంది. బీఎస్పీతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీ సహా అనేక చోట్ల పనిచేస్తున్న ‘మాయ’ గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓట్లకు భారీ గండి కొట్టాలనే బలమైన లక్ష్యంగా సమాజ్వాదీతో ముందస్తు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, బీఎస్పీని సైతం కూటమిలోకి ఆహ్వానించింది. దీనికి మాయవతి అంగీకరించకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 80 లోక్సభ స్థానాలకు గానూ 33.8 శాతం ఓట్లతో ఎస్పీ 37, 9.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. రెండె పార్టీల ఓట్ల వాటా 43.3 ఓట్ల శాతం. ఇదే సమయంలో బీఎస్పీ ఒక్క సీటు గెలవలేకున్నా పారీ్టకి మాత్రం 9.39 శాతం ఓట్లు వచ్చాయి. కూటమిలో భాగస్వామిగా ఉండుంటే ఓట్ల శాతం 52 శాతానికి పైగా పెరిగి మరిన్ని సీట్లు గెలిచే వారమని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో 16 సీట్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని బీఎస్పీ అడ్డుకుంది. 16 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఓడిన మార్జిన్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అమ్రోహా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి డానిష్ అలీ 28 వేల ఓట్ల తేడాతో ఓడితే బీఎస్పీకి అక్కడ 1.20 లక్షల ఓట్లు వచ్చాయి. బాన్స్గౌవ్ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లతో ఓడితే బీఎస్పీకి 64వేల ఓట్లు వచ్చాయి. ఇదే మాదిరి చాలా స్థానాల్లో బీఎస్పీ కూటమి అభ్యర్థుల విజయాలకు గండికొట్టింది. యూపీలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టు పట్టు ఉంది. దీనికి తోడు కాన్షీరాం వారసత్వ పారీ్టగా హిందీ రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ప్రాబల్యం బలంగా ఉంది. దళితులు–ముస్లిం ఫార్ములాను ముందుపెట్టి గడిచిన రెండేళ్లలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, చత్తీస్గఢ్ వంటి రా్ర‹Ù్టరాల్లో పోటీ చేసి 2–4 శాతం ఓట్లను రాబట్టుకుంది. ఈ ఓట్లన్నీ పరోక్షంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఓటమికి కారణమయ్యాయి. మొన్నటి హరియాణా ఎన్నికల్లో బీఎస్పీ, ఐఎన్ఎల్డీ పారీ్టలు కలిసి పోటీచేసి ఏకంగా 5.96 శాతం ఓట్లను రాబట్టుకున్నాయి. ఇందులో బీఎస్పీకి 2 శాతం ఓట్లున్నాయి. ఈ ఓట్లే కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేశాయి. మధ్యప్రదేశ్లోనూ కచి్చతంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించినా 3.40 శాతం ఓట్లను రాబట్టుకున్న బీఎస్పీ కాంగ్రెస్ను భారీ దెబ్బకొట్టింది. ఈ ఏడాది నవబంర్లో జరిగే బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిధ్దమవుతోంది. గత ఎన్నికల్లో బిహార్లో 78 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ 1.5 శాతం ఓట్లను రాబట్టుకుంది. దానికి మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎం మరో 2శాతం ఓట్లు రాబట్టుకుంది. దీంతో ఓట్లు చీలి జేడీయూ, బీజేపీకి అధిక సీట్లు వచ్చేందుకు మద్దతిచి్చనట్లయింది. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ బీఎస్పీ తమకు ఇక్కట్లకు గురిచేస్తుండటం కాంగ్రెస్ పారీ్టకి తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ నేపథ్యంలోనే యూపీలో పర్యటిస్తున్న రాహుల్ బీఎస్పీ అధినేత్రి మాయవతి లక్ష్యంగా విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పనిచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని, అయితే మాయావతి తమతో కలిసి రాలేదన్నారు. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలు ఇప్పుడు మాయావతి ప్రభావాన్ని మరోమారు చర్చకు పెట్టాయి. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
నిలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీ
నిర్మల్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో రగిలిన ‘ఇథనాల్’ మంట చల్లారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు, గ్రామస్తులు రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.దిలావర్పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు తాత్కాలికంగా తమ పోరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. అంతకుముందు దిలావర్పూర్ మండల కేంద్రంలో ‘ఇథనాల్’ మంట రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. దిలావర్పూర్, గుండంపల్లిలో పొద్దున్నే పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండంపల్లిలో అరెస్టులు చేయడానికి వచ్చిన పోలీసులను భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అడ్డుకున్నారు. మరోసారి 61వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు గ్రామస్తులు గుమిగూడగా ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో వజ్ర వాహనంతోపాటు వచ్చిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలు ఉండటంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టారు. ఈలోగా కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. అయినప్పటికీ పోలీసులు లాఠీచార్జీ చేయకుండా సంయమనం పాటిస్తూ దిలావర్పూర్ నుంచి 2 కి.మీ. వెనక్కి వెళ్లిపోయారు. దీంతో దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం తదితర గ్రామాల ప్రజలు మళ్లీ ఎన్.హెచ్. 61పై బైఠాయించారు. పిల్లలతోపాటు మహిళలు తమ ఎదుట పురుగు మందుల డబ్బాలను పెట్టుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసుకున్నారు. ‘లగచర్ల’ ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తం ఇటీవల వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో చోటుచేసుకున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో దిలావర్పూర్ మండలంలో జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులు దాడి చేయొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి వెళ్లలేదు.అలాగే ఆందోళనకారులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించొచ్చన్న సమాచారంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని మధ్యాహ్నంలోగా ఖాళీ చేయించారు. జిల్లా కేంద్రంలోనే ఉన్న ఆర్డీవో కార్యాలయానికి ఏకంగా తాళం వేశారు. ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలకు విరామంఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన ప్రకటనతో ఆందోళనకారులు చల్లబడ్డారు. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షరి్మల ఆయా గ్రామాల రైతులు, పెద్దలతో సాయంత్రం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించేందుకు జిల్లా ఎస్పీ, పోలీసులు దిలావర్పూర్ మండల కేంద్రానికి చేరుకోగా ప్రజలు వారికి పూలతో స్వాగతం పలికారు. ‘ఎస్పీ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న యువకులందరినీ పోలీసులు తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టారు. -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్ల సిట్లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీస్స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్ఐ ఎస్కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్కళ్యాణ్లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు. నమ్మి ఓట్లు వేశాం ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ -
రోడ్డెక్కిన గ్రూప్–1 అభ్యర్థులు
చిక్కడపల్లి (హైదరాబాద్)/కరీంనగర్ టౌన్: మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని, జీఓ నంబర్ 29 రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ గ్రూప్–1 అభ్యర్థులు శుక్రవారం మరోసారి నిరసనలకు దిగారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహిస్తూ రావడంతో నగరంలోని అశోక్నగర్, గాం«దీనగర్, ఆంధ్రా కేఫ్, జవహర్నగర్లలో రోడ్లు కిక్కిరిసిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే అభ్యర్థులను అదుపు చేయడం వారికి కష్టతరంగా మారింది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు సీతయ్య, రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది లాఠీలకు పనిచెప్పారు.దీంతో విద్యార్థులు వీధుల్లోకి పరుగెత్తారు. పోలీసులు వారిని తరుముతూ వెళ్లి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. కొందరు అభ్యర్థులు సమీపంలోని దుకాణాలు, బేకరీల్లోకి, చాయ్ దుకాణాల్లోకి వెళ్లగా, పోలీసులు వాటిల్లోకి సైతం వెళ్లి బయటకు లాక్కొచ్చి పోలీస్స్టేషన్లకు తరలించారు. పరుగెత్తకుండా మొండికేసి బైఠాయించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జిపై గాం«దీనగర్లోని ఎస్బీఐ బ్యాంకు, ఆంధ్రాకేఫ్ సమీపంలో, ఆర్టీసీక్రాస్రోడ్డు, ఇందిరాపార్కు రోడ్డులో నిరుద్యోగ అభ్యర్థులు నిరసనకు దిగగా.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఇతర నేతలు మద్దతు పలికారు. అయితే పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగేవరకు పోరాడతా: బండి సంజయ్ గ్రూప్–1 పరీక్షల రీ షెడ్యూల్కు పట్టుపడుతున్న అభ్యర్థులకు కేంద్రమంత్రి బండిసంజయ్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం పలువురు గ్రూప్–1 అ భ్యర్థులు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవడంతో పాటు గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన తప్పిదాలను సవరించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని హెచ్చరించారు. పరీక్ష రీషెడ్యూల్ చేయాలి: డా.కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జీవో నంబర్ 29ని రద్దు చేయడంతో పాటు గ్రూప్–1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు.వాయిదా వేసేలా చూడండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అభ్యర్థుల వినతిగ్రూప్–1 మెయి న్స్ పరీక్షను వాయిదా వేసేలా, జీవో నంబర్ 29ను రద్దు చేసేలా చూ డాలని పలువురు అభ్యర్థులు శుక్రవారం గాం«దీనగర్లో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయంచేయా లని విజ్ఞప్తి చేశారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 ప్రశ్నపత్రాల లీకేజీల కా రణంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లాఠీచార్జ్ దారుణం: కేటీఆర్గ్రూప్– 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులు, గ్రూప్ –1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్నగర్కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచి్చన రాహుల్గాం«దీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత పత్తా లేకుండా పోవడం దుర్మార్గమన్నారు. -
అట్టుడికిన కామారెడ్డి
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పీఈటీపై ఫిర్యాదు చేసినా... పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
నేటి నుంచి పీహెచ్సీల్లో వైద్య సేవలు బంద్
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు. శనివారం నుంచి పీహెచ్సీల్లో అత్యవసర వైద్య సేవలు, మినహా మిగిలిన సేవలను అందించబోమని ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్సర్వీస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి చూపించలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపిన ప్రత్యామ్నాయాల్లో వేటినీ స్వీకరించకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని సంఘం తెలిపింది. ప్రభుత్వంలోకంటే ప్రైవేటులో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనడం శోచనీయమంది. ఈ క్రమంలో ఆదివారం చలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది. పీహెచ్సీ వైద్యులు కోల్పోతున్న మొత్తం సీట్లు 336336 సీట్లు నష్టపోతున్న వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్యను పెంచడం కోసం పీహెచ్సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్ వైద్యులను ఇన్సర్వీస్ కోటాలో పీజీ చేయించి, అనంతరం వారి సేవలను ఆస్పత్రుల్లో వినియోగిస్తుంటారు. కాగా, గత ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్లను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్సర్వీస్ కోటాను పెంచారు. -
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్బగాన్, ఈస్ట్బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్బాల్ మ్యాచ్ను కోల్కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు
బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు. ‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు. 22న సీఎల్పీ భేటీగవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాదించనున్న సింఘ్వీ, సిబల్ !మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
వైద్యుల భద్రతపై కమిటీ
న్యూఢిల్లీ: కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్ జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్కతాకు చేరుకుంది. దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి. -
తల్లడిల్లిన జన హృదయాలు
సాక్షి, అమరావతి/గన్నవరం: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని తెలిసి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల హృదయం తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్ను తమ కుటుంబ సభ్యుడిగా సమాదరించే వందలాది మంది ఒకసారి తమ నేతను చూడాలని తాపత్రయపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై విజయవాడలోని సింగ్నగర్ వద్ద హత్యాయత్నం జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. అయినా ఇంటికి వెళ్లిపోకుండా కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద రాత్రి బస చేసిన ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ను చూడాలని, పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచీ వస్తున్న జన ప్రవాహాన్ని పోలీసులు నిలువరించారు. గాయం తీవ్రత కారణంగా జగన్ ఎవరినీ కలిసే పరిస్థితుల్లో లేరని, ఈ ఒక్కరోజు ఆగితే బస్సుయాత్రలో మరలా ఆయన మీ ముందుకు వస్తారని నచ్చజెప్పి అందరినీ వెనక్కు పంపించారు. ‘జగనన్నా. నీకేం కాదన్నా. మేమంతా నీవెంటే ఉంటామన్నా. మీరు క్షేమంగా మా మధ్యకు రావాలన్నా. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నా’ అని నినాదాలు చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తూ వారంతా అక్కడి నుంచి తరలివెళ్లారు. బస ప్రాంతానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బస చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, విడదల రజని, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
ఎల్లో కల్లోలం
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ... సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం... టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్కు ఇవ్వడం చలుమోలు అశోక్గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్ నేత భాష్యం ప్రవీణ్కు కేటాయించడంతో అక్కడి ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అభ్యర్థులకు గడ్డు పరిస్థితి నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్ చాంద్బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రమేష్కుమార్రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. శ్రీకాకుళం ఆగని ఆందోళనలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు. మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు. -
రైతును మరిచి రాజకీయమా?
కాంగ్రెస్ ప్రభుత్వ ఖడ్గం మొదటి వేటు రైతన్న మీదనే పడ్డది. ఘనత వహించిన కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజా పాలనలో రైతన్నల బతుకులు గాలిలో దీపాలు అయిపోయినయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్నదాతల ఆక్రందనలు, ఆర్తనాదాలే వినిపిస్తున్నయి. మొన్నటి దాకా పొలాల్లో నీళ్లు పారితే, ఇప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నయి. మూడు నెలల్లోనే పరిస్థితి ఎందుకు తలకిందులైంది? బీఆర్ఎస్ పరిపాలనలో ఆత్మవిశ్వాసంతో మెరిసి పోయిన రైతన్నల ముఖాల్లో ఎందుకు ఇప్పుడు నిస్సహాయత, ఆందోళన కనిపిస్తున్నది? అటు ఎండిపోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయినపంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను చిత్తశుద్ధితో త్వరగా అమలు చేయాలి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు, కొద్దోగొప్పో పండిన పంట వడగండ్ల వానకు సర్వనాశనమై పోయిన ఘోష మరొకవైపు... రైతన్న బతుకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అయిపోయింది. వడ గండ్ల వాన దెబ్బకు రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నేల రాలిన పంటను చూసి రైతులు భోరుభోరున ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. అంత దుఃఖంలోనూ కేసీఆర్ ఉండగా, మా పరి స్థితి ఇంత అగాథంగా లేకుండేనని చెబుతూ మరి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఏమీ జరగనట్లుగానే ఎన్నికల ప్రచారాల్లో, రాజకీయ ప్రసంగాలను దట్టించి కొడుతున్నరు కాంగ్రెస్ పాలకులు. రైతు గుండె చీరుకపోయి విలవిల లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం పక్క పార్టీ నాయకుల చేరికల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సౌభాగ్యం లేని సర్కారు, పార్టీ గేట్లు ఎత్తి నాయకులను చేర్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీరు గతిలేక మహిళలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి అటువైపు తొంగి చూసిన పాపాన కూడా పోలేదు. పేగులు మెడలో వేసుకుంటా అనే రాక్షస వ్యాఖ్యలే తప్ప, పొలాలకు నీళ్లు మలుపుతా, ప్రజల గొంతు తడుపుతా అనే మానవీయ వ్యాఖ్యలు ఈ ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు. రైతులు విధిలేని పరిస్థితుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నరు. సాగునీళ్లు లేక,కరెంట్ సరిగా రాక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్న దీనస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ పల్లెల్లో మాయమైన బోరు బండ్లు మళ్లా దర్శనమిస్తున్నవి. పూడిక తీసే క్రేన్లకు గిరాకీ పెరిగింది. లో ఓల్టేజీ కరెంట్తో మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతు న్నయి. మోటారు వైండింగ్ మెకానిక్ల షాపులు కళకళలాడుతుంటే, మునుపటి కాంగ్రెస్ రాజ్యం మళ్లా కళ్లకు కడుతున్నది. బీఆర్ఎస్ పరి పాలనలో ఎండాకాలంలో సైతం చెరువు, చెక్ డ్యాంకులు మత్తళ్లుదుంకిన మంచిరోజులను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నరు. ఆ రోజు నిండుగా పారిన కాల్వలు ఈ రోజు ఎండిపోయి ఎక్కిరిస్తు న్నయి. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్తో రైతు ఇంట్ల కాలు మీద కాలేసుకొని కూర్చొన్నా పొలం పారింది. నేడు అర్ధరాత్రి కరెంట్ పెట్టేందుకు బాయి కాడికి పోవాల్సిన బాధ మళ్లా మొదలైంది. బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు నిరందిగ ఉన్నరు. ఇప్పుడు కరెంట్ కోత మల్లా ఒక సమస్యగా వ్యవసాయం వాకిట్లో నిలిచింది. బీఆర్ఎస్ పరిపాల నలో స్థిరపడ్డ వ్యవసాయం కాంగ్రెస్ పుణ్యమా అని మెల్లమెల్లగా చెదిరిపోతున్నది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం,కాంగ్రెస్ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల వ్యవధిలో 180 మంది రైతుల ఉసురు తీసింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని అంచనా వేసే పని కూడా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. అదే పనిగా బీఆర్ఎస్ వెంట పడితే, అప్పుడు సోయి తెచ్చుకొని అయిష్టంగానే ఎకరాకు రూ. 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని గాలి మాటలు చెబుతున్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారానికి రాగానే మాట మార్చారు. వంద రోజులు దాటినా రుణమాఫీ ఊసెత్తకుండా కాలం గడిపేస్తు న్నారు. నమ్మి రుణాలు తెచ్చుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు ఇచ్చే పెట్టుబడిని రూ. 15 వేలకు పెంచుతామని బడాయిలు చెప్పిన ప్రభుత్వం, పెంచడం మాట అటుంచి అసలు పెట్టుబడి సాయం ఇప్ప టికీ ఎంతోమంది ఖాతాల్లో జమ చేయనేలేదు. పెంచేదెప్పుడో చెప్పడం లేదు. రైతు బంధు సాయాన్ని కౌలు రైతులకు కూడా అంది స్తామని అబద్ధపు హామీలు గుప్పించారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, వాళ్లకు పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారో మార్గదర్శకాలు రూపొందించే పనికి కూడా పూనుకోవడం లేదు. ఇగ రైతులను, కౌలు రైతులను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీలను మాత్రం విడిచి పెడుతుందా? వాళ్లకు ఇచ్చిన హామీకి అదే గతి పట్టిచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వ్యవ సాయ కూలీలకు 12 వేలు అందించే పథకం ప్రారంభిస్తామని చెప్పి, ఆ పథకం అమలు గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. అంటే రైతు కూలీలకు ఇచ్చిన హామీకి కూడా ఎగనామం పెట్టిందనే అను మానాలకు తావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులే లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపర్చు తుంది. రాతపూర్వకంగా ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేకుండాపోతుంటే, పంట నష్టం పదివేలు ఇస్తాననే నోటి మాటకు విలువె క్కడిది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా అకాల వర్షాలతోపంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పంటలు దెబ్బతిన్న ఊర్లు పర్యటించారు. అప్పటికప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి, వేగంగా అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రయత్నమేది కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఒక చెడగొట్టు వాన లాంటిదని రైతులు మాట్లాడుకుంటున్నరు. సమైక్య పాలనలో విధ్వంసమైపోయిన తెలంగాణ వ్యవసా యాన్ని తిరిగి నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా చేసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపింది. భారీ రిజర్వాయర్లు నిర్మించి నిండుగా నింపింది. వాగుల్లోకి, వంకల్లోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు మిక్కుటంగా పెరిగినయి. దుక్కి దున్ని నాటిన నుంచి పంట కొనుగోళ్ల దాకా అడుగడుగునా రైతుకు అండగా నిలిచింది. రైతు బంధుతో పెట్టుబడికి పైకమిచ్చింది. పండిన పంటనంతా మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీన్ రివర్సై పోయింది.ఎండాకాలం రాకముందే చెరువులు ఎండిపోయినయి. భూగర్భ జలాలు పడిపోయినయి. బోర్లు ఎత్తి పోయినయి. రైతు బతుకు దిగ జారడం మొదలైంది. ఇదీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. మార్పు మార్పు అని చెప్పి రైతుల బతుకుల్లో మంట పెట్టిన్రు. రైతులు హాహాకారాలు చేస్తుంటే, భ్రష్ట రాజకీయాలతో పొద్దు పుచ్చడం ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని ప్రజలు గుర్తిస్తు న్నారు. ఆదిలోనే హంసపాదులా తయారైన విధానాన్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. అటు ఎండి పోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను త్వరగా అమలు చేయాలి. ధైర్యం కోల్పో తున్న రైతు గుండెల్లో భరోసాను నింపాలి. రాక్షస వ్యాఖ్యలు చేయడం మాని రైతులను రక్షించుకునే విధానాన్ని చేపట్టాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ మరొక మహోద్య మానికి శ్రీకారం చుట్టడం ఖాయం. - వ్యాసకర్త మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే -తన్నీరు హరీశ్ రావు -
స్వ‘ప్రజాగళం’తో కూటమి ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సీతంపేట(విశాఖ ఉత్తర): తెలుగుదేశం పార్టీలో సీట్ల మంటలు ఆరడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ఆ పార్టీ అట్టుడుకుతోంది. నియోజకవర్గాల్లోనే కాకుండా చంద్రబాబు ఇళ్ల వద్దకు కూడా వచ్చి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం ఉండవల్లి, హైదరాబాద్లలోని చంద్రబాబు ఇళ్ల వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన గళం విప్పారు కర్నూలు జిల్లా ఆలూరు సీటును కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె మద్దతుదారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఆలూరు సీటును బయట వ్యక్తులకు ఇస్తే అంగీకరించేది లేదని హెచ్చరించారు. బాబును కలిసి తమ ఆవేదనను తెలుపుతామని లోపలకు పంపాలని గొడవ చేశారు. పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో వారు సుజాతమ్మకే ఆలూరు సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఉండవల్లి నివాసం వద్ద కూడా కదిరి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని, ఐదేళ్లు ఆయన నియోజకవర్గంలోనే ఉండి పని చేశారని, ఇప్పుడు వేరే వారికి సీటు ఎలా ఇస్తారని నిలదీశారు. కదిరి అసెంబ్లీ సీటు ఇవ్వలేనప్పుడు హిందూపురం ఎంపీ స్థానమైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో కనీసం లోకేశ్ను కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొందరిని లోపలకు పంపించారు. ఆయన వారితో సరిగా మాట్లాడకుండానే తిప్పి పంపించివేశారు. లోకేశ్ను కలిసిన కోడెల శివరామ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేత కోడెల శివరామ్ ఉండవల్లిలో మంగళవారం టీడీపీ నేత లోకేశ్ను కలిశారు. ఆయనకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరించడంతో కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు పిలిచిన లోకేశ్ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఇస్తామని సముదాయించారు. అయితే శివరామ్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ♦ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. నేనే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్పై పలువురు జనసైనికులు, వీరమహిళలు మండిపడుతున్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాన్ని దహనం చేశారు. వంశీ వద్దంటూ నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. కార్పొరేటర్ మహ్మద్ సాధిక్కుగానీ, డాక్టర్ మూగి శ్రీనివాసరావులలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ♦ పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకేనని అధిష్టానం తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఆశావహులంతా ఒక్కటై తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా సమ్మతమేనని, బీజేపీకి మాత్రం సీటు వదలొద్దని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాబును కలవాలని విజయవాడ వెళ్లి అధినేత దర్శనభాగ్యం కోసం ఐదురోజులుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. ఇంకా సీటుపై సందిగ్ధం వీడకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ♦ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన బలప్రదర్శన చేస్తోంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కంటే తానే బలమైన అభ్యర్థినంటూ సీటు దక్కించుకోవడానికి జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువే ఓట్లు వచ్చాయని, తనకు మెరుగైన ఓట్లు వచ్చాయని ఉషాకిరణ్ వాదిస్తున్నారు. సీటు విషయం పునరాలోచించాలని పార్టీకి లేఖ రాశారు. -
నమ్మించి ముంచేశారు
సాక్షి, గుత్తి/పెద్దతిప్పసముద్రం/నిడదవోలు/పిఠాపురం/నెల్లూరు: నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్న చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇంతవరకు పార్టీని అంటిపెట్టుకున్న తాము అంటరానివారైపోయామని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నేతల అనుచరవర్గాలు దీన్ని జీర్ణించుకోలేక రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గుమ్మనూరుకు సీటిస్తే ఓడిస్తాం మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టీడీపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు గుత్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా నుంచి గాందీ, రాయల్, ఎన్టీఆర్ సర్కిళ్ల వరకు ర్యాలీ చేశారు. ‘గుమ్మనూరు వద్దు, జితేందర్ గౌడ్ ముద్దు’, ‘ఆలూరులో పనికి రాని చెత్త గుంతకల్లులో పనికి వస్తుందా’, ‘పేకాట, మద్యం గుమ్మనూరు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ... గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే సీటు ఇస్తే డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడిస్తామన్నారు. రౌడీ భావజాలమున్న గుమ్మనూరుకు సీటు ఇస్తే ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 35 సంవత్సరాల పాటు జితేందర్ గౌడ్ కుటుంబం టీడీపీకి సేవలు చేసిందని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి పేకాట నిర్వాహకుడు గుమ్మనూరుకు ఎలా సీటు కేటాయిస్తారని ప్ర శ్నించారు. టి.సదుంలో ఉద్రిక్తత అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో విభేధాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్కే అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైందని అనుకుంటున్న సమయంలో రాజకీయ అరంగేట్రానికి తెర లేపిన జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై పునరాలోచించి ప్రజాదరణ ఉన్న శంకర్కు టికెట్ కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఇటీవల రోడ్లెక్కి నిరసనలకు దిగారు. తాజాగా గురువారం టి.సదుంలో జయచంద్రారెడ్డి ఇంటింటా ప్రచారానికి రావడంతో ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి జయచంద్రారెడ్డి కారు అద్దాలను పగులగొట్టాడు. దీంతో కొంతసేపు గ్రామంలో ఘర్షణ నెలకొంది. ఎస్ఐ రవీంద్రబాబు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జయచంద్రారెడ్డి నిరాకరించారు. ఆయన వెంట ప్రచారం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆలయంలో పూజలు నిర్వహించి వెనుదిరిగారు. నిడదవోలులో ఆందోళన పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు నిడదవోలు టికెట్ కేటాయిస్తున్నారనే ప్రచారంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిడదవోలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిడదవోలు పట్టణం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా ప్లకార్డులతో పాదయాత్ర చేపట్టారు. గణేష్ చౌక్ సెంటర్, గణపతి సెంటర్ మీదుగా యర్నగూడెం రోడ్డులోని టీడీపీ పట్టణ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్థిల్లాలి, శేషారావు జిందాబాద్, నిడదవోలు గడ్డ – శేషారావు అడ్డా అంటూ నినదించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, నిడదవోలు టికెట్ శేషారావుకు కాకుండా బయటి వ్యక్తులకు ఎవరికిచ్చినా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కారింకి సాయిబాబు, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల టీడీపీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అతికాల శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. పిఠాపురంలో అసమ్మతి సమావేశం చంద్రబాబుకే క్లారిటీ లేదు.. ఇంక మా భవిష్యత్తుకేం గ్యారెంటీ ఇస్తాడు’ అంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ లేఖలను తగులబెట్టారు. తనకు టికెట్ నిరాకరించి, జనసేనకు కేటాయిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మకు సమాచారం అందడంతో.. టీడీపీ వర్గాలు గురువారం పిఠాపురంలో ఆందోళనకు దిగాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో వర్మకు టికెట్ నిరాకరించడంతో టీడీపీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలను సైతం పట్టుకునేది లేదని చెప్పారు. రాజీనామాలకు సంతకాలు సేకరించారు. వర్మ మాట్లాడుతూ ‘నేనేమన్నా నేరం చేశానా? నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేసిన సేవను గుర్తించి చంద్రబాబు తనకే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, పిఠాపురం వర్మ అడ్డా అని, దానిని వేరేవారికి కేటాయించడానికి ఎవరికీ హక్కు లేదని వ్యాఖ్యానించారు. కోవూరులో పోలంరెడ్డి కుటుంబం కుతకుత కోవూరు టికెట్ విషయంలో రెండు దశాబ్దాల కాలంగా టీడీపీని నమ్ముకున్న పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యండిచ్చారు. ఇటీవలే పార్టీ ఫిరాయించిన వేమిరెడ్డి కుటుంబానికి కోవూరు సీటు ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పోలంరెడ్డి వర్గం మండిపడుతోంది. నిన్నటి వరకు సీటు తనదేనంటూ పోలంరెడ్డి దినేష్రెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలారు. ఇటీవల పార్టీ అధినేత పర్యటనల సమయంలో చేతిచమురు కూడా వదిలించుకుంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కోవూరు సీటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖరారు చేస్తున్నట్లు లీకులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. మూడు సార్లు టీడీపీ తరుపున పోటీచేసి రెండుసార్లు విజయం సాధించారు. పోలంరెడ్డికి అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం తన రాజకీయ వారసుడిగా తనయుడు దినేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధిష్టానం కూడా దినేష్ రెడ్డిని ప్రోత్సహించింది. ఈ క్రమంలో సీటు విషయంలో చంద్రబాబు పేచీ పెట్టడంతో దినేష్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్థంలో పడింది. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంటూ పార్టీ ఫిరాయించిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కోవూరు సీటు ఖరారు చేస్తుండడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అందలం ఎక్కించడం వెనుక కేవలం డబ్బుమూటలే పనిచేస్తున్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. -
యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభం వెనక...
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడి దారీ విధానం వలన ఆ యా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందో ళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశా లతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గుర య్యారు. నేటి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈయూ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి – పంటలకు న్యాయమైన ధరలూ, వాటి విక్ర యాలూ! రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్దయెత్తున చౌకగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటు న్నాయి. ఆహార దిగుమతులతో పాటు ఈయూ పర్యావరణ నిబంధనలు రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4 శాతం సాగు భూమిని శాశ్వతంగా ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతే కాకుండా ప్రతి ఏడాదీ పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. సాగు అవసరాలకు విని యోగిస్తున్న పెట్రోల్, డీజిళ్లపై ఇస్తున్న సబ్సిడీ ఎత్తి వేయాలని ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందు తున్నారు. యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతాంగం తమ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతాయని స్పెయిన్ రైతాంగం భయపడుతున్నది. కొద్ది సంవత్సరాలుగా ఈయూ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్స్లో ‘వాల్’ నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన ‘గ్వాదల్ క్విలిర్’ నదిలో సాధారణ నీటిమట్టంలో నాలుగవ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్లో వ్యవసాయం విస్తృతంగా ఉండటంతో నీటి అవసరాలు ఎక్కు వగా ఉన్నాయి. ఇటలీ లోనూ నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి పాలకులు దిగుమతులు పెంచడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్లో 10 నుంచి 15 శాతం పొలాలపై ఒక బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండటంతో రైతులు దివాళా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈయూ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిర సిస్తూ ఈక్రింది డిమాండ్లకై రైతాంగం ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను ఈయూ అరికట్టాలి. ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలి. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపి వేయాలి. సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4 శాతం భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబంధనలు సడలించాలి. పెట్రోల్, డీజిళ్లపై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదు. నష్టపోయిన రైతులకు పరి హారం చెల్లించాలి వంటి అనేక డిమాండ్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10వేల మంది రైతులు సెంట్రల్ బెర్లిన్ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్ విండన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 2న ఉక్రెయిన్కు తాజాగా నిధులు మంజూరు చేయడానికి ఈయూ నాయకులు సమావేశం నిర్వహించగా బెల్జియం పార్లమెంట్ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియ చేశారు. గ్రీస్లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్లో నిరసన తెలుపు తున్న రైతులు ప్యారిస్ వెలుపల, లియోన్, టౌలేస్ నగరాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. యూరప్ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు మద్దతుగా 73 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కూ ఇతర దేశాల పాలకులకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఫలి తంగా యూరప్ వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ ఈయూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేశాయి. పెట్టుబడిదారీ వ్యవ సాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదనీ, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురౌతున్నాయనీ గ్రహించాలి. - వ్యాసకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ) ‘ 98859 83526 - బొల్లిముంతసాంబశివరావు -
లోక్సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్తో జోష్లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్రెడ్డి -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్లుగా కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
Russia: రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే
మాస్కో: మైనారిటీ ఉద్యమ నేత ఫెయిల్ అల్సినోవ్కు మద్దతుగా రష్యాలో వందల మంది ఆయన మద్దతు దారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాష్కోర్టోసాన్ ప్రాంతంలో అల్సినోవ్ కోసం భారీ సంఖ్యలో మద్దతుదారులు నిరసనకు దిగారు. వీరిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిరసనకారులు వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పోలీసులకు, నిరసనకారులకు వాగ్వాదం, తోపులాట జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్సినోవ్కు మద్దతుగా ఇది ఈ వారంలో ఆందోళకారులు చేసిన మూడవ నిరసన కావడం గమనార్హం. విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అల్సినోవ్కు ఇటీవలే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బాష్కిర్ మైనారిటీ వర్గానికి అల్సినోవ్ ఒక హీరో. వారి భాష, సంస్కృతి కోసం అల్సినోవ్ తీవ్ర ఉద్యమం చేశాడు. బాష్కిర్ వర్గం వారు పవిత్రంగా భావించే కొండపై మైనింగ్ జరగకుండా 2020లో ఉద్యమం నడిపి విజయవంతమయ్యాడు. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చిలో జరగనుండగా ఈ నిరసనలు జరుగుతుండటం గమనార్హం. In #Ufa, #Bashkortostan republic, #Russia, some 1,000 people joined a #protest rally in support of imprisoned activist Fail Alsynov; police are reportedly detaining protesters. pic.twitter.com/u0rn8HBchD — Alex Kokcharov (@AlexKokcharov) January 19, 2024 ఇదీచదవండి.. గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం
ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఇంధన కొరత.. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చట్టంలో మార్పులేంటి..? భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
మానవత్వం మేల్కొనేదెప్పుడు?
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్స్టాప్ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్టాప్లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్టాప్లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆరని అసంతృప్తి జ్వాలలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో టికెట్లు రాని అసంతృప్తుల ఆందోళనలు ఆగలేదు. తొలిజాబితా ప్రకంపనలు సోమవారం కూడా కొనసాగాయి. టికెట్లు ప్రకటించిన రోజున ఆదివారం హైదరాబాద్ వేదికగా గాందీభవన్కు పరిమితమైన ఆందోళనలు రెండోరోజు గన్పార్కు వరకు పాకా యి. గద్వాల టికెట్ ఆశించిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు కురువ విజయ్కుమార్ నేతృత్వంలో గన్పార్కు వద్ద నిరసన తెలిపారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇక, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, చార్మినార్ స్థానాలను ముస్లిం నాయకులను కేటాయించాలని కోరుతూ వరుసగా రెండోరోజు స్థానిక నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. కాగా, పార్టీ నేతలపై ఆర్థిక ఆరోపణలు చేసిన కురవ విజయ్కుమార్, గాం«దీభవన్ మెట్లపై ధర్నా చేసిన పాతబస్తీ నేత కలీమ్లను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నాగం వాట్ నెక్స్ట్ ఇక, నాగర్కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి స్థానిక కేడర్తో సమావేశమయ్యారు. మరోవైపు మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, బలరాం నాయక్, సురేశ్షెట్కార్, సిరిసిల్ల రాజయ్యలు మధుయాష్కీ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాతో పాటు ఇంకా ఖరారు కాని టికెట్ల వ్యవహారంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ఠాక్రే బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగారు. సోమవారం గాం«దీభవన్లోని వార్రూంలో ఆయన చాలా సేపు అసంతృప్తులతో మంతనాలు జరిపారు. ఉప్పల్తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించిన ఠాక్రే ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు నేతల సస్పెన్షన్... ఇక, కురువ విజయ్కుమార్, కలీమ్లను సస్పెండ్ చేయా లని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. సోమవారం గాం«దీభవన్లో సమావేశమైన కమిటీ టికెట్ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాందీభవన్ లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించి వేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలను సీరియస్గా పరిగణించింది. టికెట్ల విషయంలో పీసీసీ అధ్యక్షుడిని మాత్రమే బాధ్యుడిని చేయడం కక్షపూరిత చర్యగా భావించిన కమిటీ కురువ విజయ్ కుమార్ (గద్వాల), కలీమ్బాబా (బహదూర్పుర)లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ టార్గెట్గా ఆందోళనలు.. కాగా, అటు గాందీభవన్లో, ఇటు గన్పార్క్ వద్ద సోమవారం జరిగిన ఆందోళనల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కేంద్రబిందువు అయ్యారు. ఉస్మానియా విద్యార్థి నేత కురువ విజయ్కుమార్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు కేటాయించాల్సిన గద్వాల టికెట్ను రూ.10 కోట్ల నగదు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇప్పటివరకు పార్టీ లో 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. దీంతో పాటు గాం«దీభవన్లో పాతబస్తీ నేతల ఆందోళనలోనూ రేవంత్ను విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. 90 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉండే స్థానాలను హిందువులకు కేటాయించడమేంటని, పాతబస్తీలో ఎంఐఎంపై గట్టిగా పోటీ చేయాలన్న ఆసక్తి రేవంత్కు లేదంటూ çప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. ఇక, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తల పట్ల స్థానిక డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీ లో చేరుతున్నారన్న వార్తలు కూడా స్థానిక నాయకత్వంలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లున్న తొలి జాబితా విడుదల తర్వాతే ఇంతటి అసంతృప్తి వ్యక్తమయితే ఇక రెండో జాబితా విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
దళిత యువతిపై దాడి
జక్రాన్పల్లి: ప్రేమ పేరుతో దళిత యువతిని వేధించి, హత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జక్రాన్పల్లికి చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం రాత్రి ఆమెను బలవంతంగా తన బైక్పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో యువతి ప్రతిఘటించి బైక్పై నుంచి కిందకు దూకింది. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు మద్యం మత్తులో యువతిని కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. ఆమెను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గ్రామంలో ఆందోళన.. యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి దళిత సంఘాల ప్రతినిధులు, బాధిత యువతి కుటుంబ సభ్యులు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జక్రాన్పల్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. కెనడాకు మోదీ సూచన
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు. కెనడాలోని భారతీయుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలతో, మాదక ద్రవ్యాల ముఠాలతో, మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారితో తీవ్రవాద శక్తులు అంటకాగుతున్నాయని, ఈ పరిణామం కెనడా భద్రతకు సైతం ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ అవాంఛనీయ ధోరణికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడోకు సూచించారు. తీవ్రవాదులను ఏరిపారేయడానికి భారత్, కెనడా పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ, ట్రూడో ఆదివారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, కెనడాకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రంగాల్లో భారత్–కెనడా సంబంధాలపై ట్రూడోతో విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. చదవండి: మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు: ట్రూడో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. వాతావరణ మార్పులపై పోరాటం, ఆర్థిక ప్రగతి వంటి అంశాల్లో భారత్, కెనడా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కెనడాలో ఇటీవలి కాలంలో ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలు పెరగడంపై స్పందిస్తూ.. తమ దేశంలో హింసకు తావులేదని, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకొనే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఎవరో కొందరు వ్యక్తుల చర్యలను మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించడం సరైంది కాదన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో ఖలిస్తాన్ తీవ్రవాదం ప్రస్తావనకు వచ్చిందని వెల్లడించారు. భారత్, కెనడా మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్భవన్ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్భవన్కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్భవన్కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్భవన్ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్భవన్కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్భవన్కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పుడు రాజీనామా చెయ్యమంటే ఎలా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మే 4న జరిగిన మణిపూర్ అల్లర్లలో ఒక చీకటి అధ్యాయం వెలుగు రావడానికి చాలా ఆలస్యమైంది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఆనాటి వీడియో బయటకి రావడంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అందులోని అమానవీయ సంఘటన చూసి దేశమంతా నివ్వెరపోయింది. పార్లమెంటు సమావేశాలు మొదటిరోజే అట్టుడికింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యమేనని వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈ ఊహాగానాలన్నిటినీ ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రభుత్వ వర్గాలు ఈ డిమాండ్లపై స్పందిస్తూ అది ఒకప్పటి వీడియో అని ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి చాలా వరకు సర్దుకుంది శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చాయి. మణిపూర్ హోమ్ మంత్రి కుకీ తెగ వారితో చర్చించారని వారికి సత్వర న్యాయం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ వర్గం వారు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన రెండు నెలల క్రితమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి రాగానే మణిపూర్ ప్రభుత్వం, పోలీసు వర్గాలు అప్రమత్తమై వీడియో ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో -
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవో ఆర్టీ ప్రామాణికమా లేక మెమోనా?
సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జేపీఎస్ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ఆర్టీలో ఏముంది? జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు. జేపీఎస్లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. సీఎస్ దృష్టికి... ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి. -
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
మణిపూర్లో తక్షణమే శాంతి నెలకొనాలి
న్యూఢిల్లీ: మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక సంఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా విచారకరమని అన్నారు. భిన్న వర్గాల ప్రజలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న ఘన చరిత్ర మణిపూర్కు ఉందన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్రంలో అందరూ సహనం వహించాలని విజ్ఞప్తి చేశారు. హింసకు తక్షణమే తెరపడాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి తెలిపారు. మణిపూర్ హింసాకాండలో ఇప్పటిదాకా 100 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వేలాది మంది సొంత ఊళ్లను వదలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి -
కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’
కొచ్చిన్/బళ్లారి/న్యూఢిల్లీ: బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బలవంత మతమార్పిడికి గురై, ఐసిస్లో చేరిన కొందరు మహిళలే ఈ సినిమా ఇతివృత్తం. వారం క్రితం సినిమా ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచే వివాదం రేగుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం, విపుల్ షా నిర్మాతగా ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. కర్ణాటకలోని బళ్లారి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం. స్టేకు కేరళ హైకోర్టు నో ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. సినిమా ట్రయిలర్ ఒక వర్గానికి వ్యతిరేకంగా లేదని పేర్కొంది. ‘ది కేరళ స్టోరీ’లో కొన్ని అంశాలను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, కేరళ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నందున విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘సన్యాసులు, క్రిస్టియన్ పూజారులు, ఇతరులను కూడా చెడ్డవారిగా చూపించిన ఘటనలు సినిమాల్లో అనేకం ఉన్నాయి. కొందరు మతబోధకులను చెడుగా చూపారనే కారణంతో సినిమాను నిషేధించలేం’అని పేర్కొంది. -
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్స్ప్రింగ్(కున్గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
లద్దాఖ్లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్గా ఇస్తారు. కొత్త స్కీమ్లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్ఏలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్ఏ నేతలు పేర్కొన్నారు. ఈ నెల 20లోపు జీవో రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టిన వీఆర్ఏ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వీఆర్ఏల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతవరకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ వెల్లడించారు. చదవండి: వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్ -
Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్పై తమకు నమ్మకం ఉందన్నారు. చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
లోక్ సభలో విపక్షాల ఆందోళన
-
సికింద్రాబాద్లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!
ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు చేరుకున్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ స్టేషన్ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్ఫారమ్పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపు తప్పింది అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పారు. రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంతు ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన బీభత్సంగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్ఫారమ్ వరకు రణరంగంగా మారింది. అయోమయం ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు మరోవైపు వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్ యుద్దక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈస్టుకోస్టుకు నిప్పు స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఇక ఆందోళనకు అడ్డే లేకుండా పోయింది. అరగంట పాటు స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్ఫామ్పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్ప్రెస్కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్ కౌంటర్ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్ట్కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్ రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. అప్రమత్తం ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఫర్నీచర్ ధ్వంసం ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్ఫారమ్స్పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్పై ఉన్న కేఫ్టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్ఫారమ్పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు స్టేషన్ బయట కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యూఐ ప్రటకించింది. టియర్గ్యాస్ పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్కు చేరుకున్న ఫైర్ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఇద్దరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయ్. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత -
బాసర ట్రిపుల్ ఐటీలో ౩వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
-
ఓవర్ టు.. ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో పక్షం రోజులుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘వరి పోరు’కు ఇక ఢిల్లీ వేదికకానుంది. గత నెల 21న సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొదలైన వరి పోరు కార్యాచరణ శుక్రవారం ఊరూరా నల్లజెండాల ఎగురవేతతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన తెలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడంతో..: ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర మంత్రుల బృందం కోరినా.. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ గత నెలలో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి. తిరిగి ఈ నెల 4 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వరకు.. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఊరూరా నల్లజెండాల ఎగురవేత, మోదీ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దేశ రాజధానిలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 3నే ఢిల్లీ వెళ్లారు. 12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యత పాటిస్తున్నాయి. మంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ దీక్షకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీక్షకు రావాల్సిందిగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 1,500 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీ దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. వీరంతా ఆదివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం 11వ తేదీ ఉదయం రాజధానికి వెళతారని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతల అనుచరులు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానాలు.. రైలు బోగీలు పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారి కోసం రెండు ప్రత్యేక విమానాలతో పాటు ప్రత్యేక రైలు బోగీలను బుక్ చేశారు. అయితే అధికారిక పనుల కారణంగా సుమారు అరడజను మంది మంత్రులు ఢిల్లీ దీక్షలో పాల్గొనబోవడం లేదని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే నేతల వివరాలు, వెంట వరి ధాన్యం తెస్తున్నారా.. తదితర వివరాలు సేకరిస్తోంది. -
జీతం కట్.. జాగ్రత్త!.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఈనెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళననలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన సర్క్యులర్ జారీచేశారు. అందులోని వివరాలు.. అఖిలభారత స్థాయిలోని కొన్ని వర్తక సంఘాలు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జాతీయస్థాయిలో ఈనెల 28, 29 తేదీల్లో పోరాటానికి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ పోరాటంలో రాష్ట్రంలోని కొన్ని గుర్తింపు పొందని సంఘాల సభ్యులు కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, పాల్గొనేలా ఇతర ఉద్యోగులను భయాందోళనలకు గురిచేయడం, ఆ పోరాటానికి మద్దతు పలికేలా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని ఆయన అన్నారు. దైనందిన ప్రభుత్వ కార్యాలయ విధులకు ఇబ్బంది కలిగించినా.. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలను అతిక్రమించినట్లు పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ఆ రెండు రోజుల్లో ఎవరైనా కార్యాలయానికి హాజరుకాకుంటే అనుమతి లేకుండా సెలవు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక “పనిచేయలేదు..జీతం లేదు’ అనే విధానం కింద ఆ రెండు రోజులు శాలరీ కట్ చేస్తామని చెప్పారు. 28, 29 తేదీల్లో మెడికల్ లీవు తప్ప మరేరకమైన సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని శాఖల అధిపతులు 28, 29 తేదీల్లో తమ కింది సిబ్బంది హాజరుపై ఉదయం 10.15 గంటల కల్లా నివేదికను సమర్పించాలని సూచించారు. చెన్నై సచివాలయంలోని అధికారులు సైతం ఉదయం 10.30 గంటలకల్లా హెచ్ఆర్ డిపార్టుమెంట్కు ఇదే నివేదికను అందజేయాలని ఆదేశించారు. -
రాళ్లు రువ్వి, టైర్లు కాల్చి: కోవిడ్ రూల్స్పై విద్యార్థుల కన్నెర్ర
పాట్నా: విద్యాలయాలను మూసివేస్తున్నారు కానీ బహిరంగ సభలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహణపై ఎలాంటి నిషేధం విధించారు అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకో రూల్.. మాకో రూలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై మండిపడుతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విద్యార్థులు, పోలీసులకు గాయాలు కాగా, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన బిహార్లోని ససారామ్ పట్టణంలో చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ససారామ్లోని అధికారులు, పోలీసులు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా గౌరక్షిణి ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు పంపించడంతో అవి మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే లాక్డౌన్తో చదువులు ఆగిపోయాయని మళ్లీ ఇప్పుడు మూసివేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో ససరామ్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. కోచింగ్ సెంటర్ల మూసివేత ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ను ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వెళ్లిపోవాలని విద్యార్థులను ఆదేశించినా వారు వెనుదిరగలేదు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు లేని నిషేధం మాకెందుకు? అని ప్రశ్నించారు. వారి కార్యక్రమాలకు బ్రేక్ వేయరు కానీ మా చదువులకు అడ్డంకి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బలగాలను రప్పించి విద్యార్థుల ఆందోళనను శాంతపర్చారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో 9 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. #Bihar : Violence broke out on the streets of #Sasaram after #students objected to officials closing the coaching centres to enforce #COVID19 measures. New #COVID restrictions in #Bihar government has ordered educational institutions to remain closed until April 11. pic.twitter.com/yAGQTMlZzs — Mojo Story (@themojostory) April 5, 2021 -
రైతుల ఫేస్బుక్, ఇన్స్టా బ్లాక్ : ఫేస్బుక్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులనిరసనోద్యమం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ ఆందోళనలను ఎప్పటికపుడు షేర్ చేస్తున్న ‘కిసాన్ ఏక్తా మోర్చా’ సోషల్ మీడియా ఖాతాను ఫేస్బుక్ బ్లాక్ చేయడం ఆందోళనకు దారితీసింది. ఉద్యమ వార్తలను ప్రజలకు అందిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఆదివారం బ్లాక్ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆన్లైన్ సెన్సార్షిప్పై వివాదం రాజుకుంది. ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్పై తాజాగా మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మూడు గంటల తరువాత ఆయా పేజీలు పునరుద్ధరించడటం గమనార్హం. 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తమ అధికారిక ఫేస్బుక్ పేజ్ను ఫేస్బుక్ సంస్థ తొలగించిందని కిసాన్ ఏక్తా మోర్చా ఆరోపించింది. సోషల్ మీడియా పేజీలను బ్లాక్ చేశారని రైతు నేతలు తెలిపారు. ఆదివారం రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే పేజ్ను బ్లాక్ చేశారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ దర్శన్ పాల్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోషల్ మీడియాలను బ్లాక్ చేయడం వింతగా ఉందని , దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఈ ఖాతాల వ్యవహారాలను చూస్తున్న బల్జిత్ సింగ్ మండిపడ్డారు. అయితే దీనిపై స్పందించిన ఫేస్బుక్ విచారం వ్యక్తం చేసింది. కిసాన్ ఏక్తా మోర్చా ఎఫ్బీ పేజీని పునరుద్ధరించాం, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫేస్బుక్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే పేజీని ఎందుకు బ్లాక్ చేసిందీ పేర్కొనలేదు. మరోవైపు రైతులు (నేడు)సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కుష్బూ అరెస్టు
-
సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు
సాక్షి, చెన్నై: సినీ నటి, బీజేపీ నేత కుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే అధినేత తిరుమావళవన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో చెన్నై నుండి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్లో మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల భద్రతకే ప్రాధాన్యత ఇస్తారని, తామూ ఆ మార్గంలోనే పయనిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది శక్తుల అకృత్యాలను సహించేది లేదని ఆమె ప్రకటించారు. Arrested.. been taken in police van. we will fight till our last breath for the dignity of women. H'ble PM @narendramodi ji has always spoken about the safety of women and we walk on his path. We will never bow down to the atrocities of few elements out there. BHARAT MATA KI JAI! pic.twitter.com/71CKjFewri — KhushbuSundar ❤️ (@khushsundar) October 27, 2020 -
25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు
అమృత్సర్ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పంజాబ్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనెల 25న పంజాబ్ షట్డౌన్కు 31 రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్సర్లో రైలు పట్టాలపై కూర్చుని రైల్ రోకో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అమృత్సర్తో పాటు ఫిరోజ్పూర్లోనూ రైతులు రైల్ రోకోలో పాల్గొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, బిల్లులకు అనుకూలంగా ఓటు వేసిన వారిని బాయ్కాట్ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. బర్నాలా, సంగ్రూర్లో భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. ఇక రైతుల ఆందోళనతో ప్రత్యేక రైళ్లను రైల్వేలు రద్దు చేశాయి. మూడు రోజుల పాటు 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేలు ప్రకటించాయి. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడంతో కనీస మద్దతు ధర వ్యవస్ధ కుప్పకూలుతుందని, బడా కార్పొరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందనే భయం పంజాబ్ రైతులను వెంటాడుతోంది. మరోవైపు వ్యవసాయ బిల్లులతో రైతాంగానికి మేలు జరుగుతుందని, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?! -
రణరంగంగా ఈశాన్య ఢిల్లీ
న్యూఢిల్లీ/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో మంగళవారం ఈశాన్య ఢిల్లీలో ఆందోళనకారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకమైంది. సీలంపూర్ జంక్షన్ వద్ద దాదాపు 3 వేల మందికి పైగా పాల్గొన్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీస్ ఔట్ పోస్ట్ను, పోలీసులకు చెందిన రెండు బైకులను, పలు బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, లాఠీచార్జ్లో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు నగరాలు, యూనివర్సిటీల్లో ఈ వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్ల్లో నిరసనల తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, ఇజ్రాయెల్ దేశాలు భారత్కు వెళ్తున్న తమ పౌరులు జాగ్రత్త పడాలంటూ ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. బెంగళూరులో నిరసన తెలుపుతున్న విద్యార్థిని రాష్ట్రాల్లో.. కేరళలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హర్తాళ్ జరపాలన్న 30 ఇస్లామిక్, రాజకీయ సంస్థల పిలుపు మేరకు వివిధ ప్రాంతాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజా రవాణా బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పోలీసులు దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతివ్వడంపై తమిళనాడులో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అధికార అన్నాడీఎంకేపై మండిపడ్డారు. దేశాన్ని అభివృద్ధి దిశగా కాకుండా, ముస్లింల హక్కులను కాలరాచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మండిపడ్డారు. చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించలేదని పశ్చిమబెంగాల్ సీఎం మమత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాన్ని ప్రయోగిస్తున్న జవాను విదేశాల్లో.. ప్రతిష్టాత్మక ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వర్సిటీల్లో విద్యార్థులు, పరిశోధకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికాలోని 40 వర్సిటీలకు చెందిన 400 మంది విద్యార్థులు జామియా విద్యార్థులకు సంఘీభావంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జామియా, ఏఎంయూల్లో పోలీసుల దౌర్జన్యం మానవహక్కుల ఉల్లంఘనేనని అందులో పేర్కొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో అధ్యాపకులు సైతం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫిన్లాండ్లోని ట్యాంపెర్ యూనివర్సిటీ విద్యార్థులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి భారతీయ ఎంబసీకి లేఖ రాశారు. రద్దు చేయించండి ప్రజా వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 12 విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కలిశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీతారాం ఏచూరి (సీపీఎం), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), రాంగోపాల్ యాదవ్(సమాజ్వాదీ) సహా సీపీఐ, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫెరెన్స్, ఐయూఎంఎల్ తదితర పార్టీల ప్రతినిధులు రాష్ట్రపతిని కలిశారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. దేశాన్ని విచ్ఛిన్నం చేసే చట్టం అది. ఈ చట్టంపై ఈశాన్యంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఆందోళనకారులపై పోలీసుల దౌర్జన్యం దారుణంగా ఉంది’ అని రాష్ట్రపతితో భేటీ అనంతరం సోనియా వ్యాఖ్యానించారు. అమలు చేస్తాం: అమిత్షా పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. చట్టంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఏమీ లేదని మంగళవారం ‘ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్’లో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ‘పౌరసత్వ చట్టంపై మరో ఆలోచన లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. ఈ చట్టం న్యాయ సమీక్షకు నిలవబోదన్న విపక్ష వాదనను కూడా ఆయన కొట్టేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలుండవని, అయితే, హింసకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన వీడీ సావర్కర్తో పోల్చుకునే స్థాయి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘పౌర’ ఆగ్రహం తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు సోమవారం నాటికి దేశవ్యాప్తమయ్యాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కోల్కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. బాధ్యతారహితంగా చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రానిదే ఈ హింసకు బాధ్యత అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అసాధారణంగా ప్రత్యర్థి పక్షాలు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నిరసనల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ, లక్నో, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల్లోని పలు వర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ విద్యార్థులు సైతం ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కోల్కతాలో మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగాల్లో ఎన్నార్సీ, సీఏఏలను అడ్డుకునేందుకు తన ప్రాణాలైనా ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో రహదారులు, రైల్వే లైన్లను ఆందోళనకారులు నిర్బంధించారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, లూటీలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జామియా వర్సిటీలో..: ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై ఆదివారం పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోమవారం వేలాది విద్యార్థినీ, విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. వర్సిటీ ముందున్న రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా పోలీసులు లోపలికి వచ్చి, విద్యార్థులపై లాఠీచార్జి చేసి, టియర్గ్యాస్ ప్రయోగించడాన్ని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు తీవ్రమైన చలిలో, చర్మాన్ని కోసేసే చలిగాలుల మధ్య షర్ట్ లేకుండా నిల్చుని నిరసన తెలిపారు. నిరసనకారులు జాతీయ పతాకాన్ని పట్టుకుని, మానవహారంగా నిలిచి, కేంద్రం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఆదివారం అదుపులోకి తీసుకున్న విద్యార్థుల్లో 50 మందిని సోమవారం పోలీసులు విడుదల చేశారు. ఆదివారం నాటి హింసపై దర్యాప్తు జరుపతామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు 4 డీటీసీ బస్సులు, 100 ప్రైవేటు వాహనాలు, 10 పోలీస్ బైకులు ధ్వంసం చేశారన్నారు. కాగా, జామియా వర్సిటీ వైస్ చాన్స్లర్ నజ్మా అఖ్తర్ కూడా విద్యార్థులకు మద్దతుగా మాట్లాడారు. నియంతృత్వంపై పోరాడుతాం: ప్రియాంక జామియా మిలియా విద్యార్థులకు సంఘీభావంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఇండియా గేట్ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని కేంద్రంపై ప్రియాంక మండిపడ్డారు. పౌరసత్వ చట్టం పరిణామాలపై రాష్ట్రపతి కోవింద్కు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ తెలిపాయి. ఇండియా గేట్ వద్ద ధర్నాకు దిగిన ప్రియాంక నిబంధనలకు లోబడే పౌరసత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ల నుంచి వచ్చే ముస్లిమేతర అక్రమ వలసదారులకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని నియమ నిబంధనలకు లోబడే పౌరసత్వ కల్పిస్తామని పేర్కొంది. ఇతర విశ్వవిద్యాలయాల్లో.. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంపై సోమవారం నిరసనలు చేపట్టారు. జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. లక్నోలోని నాడ్వా కాలేజీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్లోని మౌలానా నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఆదివారం అర్ధరాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు జామియా వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన జరిపారు. విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పూర్, మద్రాస్, బొంబాయి ఐఐటీల్లో, అహ్మదాబాద్ ఐఐఎం, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ల్లో తొలిసారి విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ముంబైలోని టిస్(టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్) విద్యార్థులు ‘ఢిల్లీ పోలీస్.. షేమ్ షేమ్’ అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థులు ఆందోళనల్లో భారీగా పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, కాసర్గఢ్, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు తరగతులను బహిష్కరిం చారు. ఆదివారం అలీగఢ్ వర్సిటీలో పోలీసులతో జరిగిన ఘర్షణలో దాదాపు 60 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. చాలా బాధగా ఉంది పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరగడం దురదృష్టకరమని, ఈ పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని చీల్చేందుకు కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలకు ప్రజలు బలికారాదని, వదంతులు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పలు ట్వీట్లు చేశారు. పౌరసత్వ చట్ట సవరణ కారణంగా భారతీయులకుగానీ, ఏ మతం వారికి కానీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. దీనిపై జరుగుతున్న ఉద్యమాలు పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని తన ట్వీట్ల ద్వారా శాంతి సందేశాలను పంపే ప్రయత్నం చేశారు. ఇది శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన సమయమని, అందరూ ఐకమత్యంతో సోదరభావంతో మెలగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
అనర్థదాయకం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న విధ్వంసం, పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యవాదులందరినీ కలవరపరుస్తున్నాయి. ఒక నగరమని కాదు, ఒక విశ్వవిద్యాలయమని కాదు... దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల ఈ చట్టంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతు న్నాయి. న్యూఢిల్లీ, లక్నో, వారణాసి, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం నగరాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలకు దిగినవారంతా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టం పౌరుల్ని మత ప్రాతిపదికన విభజిస్తోందని ఆరోపిస్తున్నవారితోపాటు తమ రాష్ట్రాల్లోకి అక్ర మంగా వలస వచ్చినవారిలో కొందరిని ఇక్కడే ఉంచడానికి ఈ చట్టం వీలు కల్పిస్తోందని ఈశాన్య రాష్ట్రాల పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులో శ్రీలంక తమిళ శరణార్థుల ప్రస్తావన లేక పోవడంతో తమిళనాడులో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ ఆందోళన ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఎన్డీఏ మిత్రపక్షాలు అసోం గణ పరిషత్(ఏజీపీ), జేడీ(యూ)లు కూడా ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ ఏజీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపింది. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసులపై దాడులు చేసి వారిని రక్తలు కారేలా కొట్టడం, దాన్ని నియంత్రించే పేరు మీద పోలీసులు దాడి చేయడం వంటి దృశ్యాలు చానెళ్లలో చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. విశ్వవిద్యాలయం వెలుపల జరిగిన విధ్వం సంపైనా, తమపై జరిగిన దాడులపైనా దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యతే. దాన్నెవరూ కాదనరు. కానీ ఆ పేరు మీద జామియాలోని లైబ్రరీపై, అక్కడి వాష్రూంపై దాడి చేసి దొరికినవారిని దొరికి నట్టు కొట్టి తీవ్రంగా గాయపర్చడం, విద్యార్థినులను సైతం కొట్టడం సరైన చర్య కాదు. ఈ ఆందోళన సాకుగా తీసుకుని సంఘ వ్యతిరేక శక్తులు విధ్వంసానికి దిగాయని జామియా విద్యార్థులు కూడా ఆరోపించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేయదల్చుకున్నాం తప్ప, హింసకు దిగే ఉద్దేశం లేదని వారు చెప్పారు. బహుశా సరైన చర్యలు తీసుకుని ఉంటే సోమవారంనాటికి ఈ ఉద్రిక్త వాతా వరణం ఎంతో కొంత సడలేది. కానీ అందుకు విరుద్ధంగా అది మరింత తీవ్ర రూపం దాల్చింది. జామియాలోనూ, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోనూ పోలీసులు దాడులు చేయడాన్ని నిర సిస్తూ దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు నిరసన లకు దిగారు. తాము ఎంతో సహనంతో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ జామియాలో ముగ్గురు విద్యార్థులకు తగిలిన బుల్లెట్ గాయాలకు కారకులు ఎవరు? ఉద్యమాల్లో అధిక సంఖ్యలో జనం పాల్గొంటున్నప్పుడు నిర్వాహకులకు వారిపై అదుపు ఉండదు. ఇది ఆసరా చేసుకుని సంఘ వ్యతిరేక శక్తులు ఆ ఉద్యమాలను పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రమాదాన్ని ఊహించబట్టే విశ్వవిద్యాలయం ఆవరణలోనే ఆందోళనలు నిర్వహించమని తాను విద్యార్థులకు సూచించానని జామియా మిలియా వైస్ చాన్సలర్ నజ్మా అఖ్తర్ చెబుతున్నారు. కారణం ఏమైనా విద్యార్థుల ఆందోళన రోడ్లపైకి వచ్చింది. కనీసం పోలీసులైనా విశ్వ విద్యాలయ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది అందులోకి ప్రవేశించి ఉంటే బాగుం డేది. అప్పుడు లైబ్రరీని ధ్వంసం చేశారని, వాష్రూంలోకి చొరబడి విద్యార్థులను గాయపరిచారని ఆరోపణలొచ్చేవి కాదు. ఏ సమస్యపైన అయినా ఆందోళన జరుగుతున్నప్పుడు వీలైనంతవరకూ ఉద్రిక్తతలు తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కానీ జామియాలో అందుకు విరుద్ధంగా జరి గింది. ఫలితంగా విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజీవ్గాంధీ హయాంలో అస్సాం విద్యార్థులు అక్రమ వలసలను అరికట్టాలని కోరుతూ 1985లో జరిపిన ఉద్యమాన్ని ఈ తరహాలోనే అణచడానికి ప్రయత్నించినప్పుడు అదెలా విస్తరించిందో పాలకులకు గుర్తుండే ఉంటుంది. గత వారమంతా ఉద్రిక్తంగా ఉన్న అస్సాం సోమవారానికి కాస్త ఉపశమించింది. గువాహటిలో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించగా, 29 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో కూడా ఆందోళన హింసాత్మకం అయింది. కేవలం వదంతులు నమ్మి జనం ఆందోళనకు దిగుతున్నారని, విపక్షాలు వారిని పక్కదోవపట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. కానీ ఈ చట్టం తీసుకొచ్చేముందు సమాజంలోని అన్ని వర్గాల వారితో చర్చించివుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ)ని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సైతం ఇప్పుడు కొత్త చట్టంపై ఇంత బలమైన వ్యతిరేకత ఎందుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పరాయి దేశాల నుంచి వచ్చినవారిలో కొందరికి పౌరసత్వం ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొస్తున్నారని, ఇది తమ భాష, సంస్కృతి వగై రాలపై బలమైన ప్రభావం చూపడమేకాక... తమ ఉపాధిని సైతం దెబ్బతీస్తుందని అస్సాం పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తలెత్తిన సందేహాలు నివృత్తి చేయడానికి బదులు ఎవరో కారకులని నిందించడం వల్ల ఉపయోగం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్ని ఉపశమింపజేయడానికి ఏం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ ‘ఇక్కడుండటం ఇష్టంలేనివాళ్లు ఉత్తర కొరియా పోవచ్చు’ అంటూ ట్వీట్ చేయడం బాధ్యతారాహిత్యం. ఇలాంటి నేతలను అదుపు చేయడంతోపాటు జరుగుతున్న ఆందోళనలపై దృష్టి పెట్టి, సందేహ నివృత్తి కోసం తగిన చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్రం గుర్తించాలి. ప్రశ్నించడం దానికదే నేరం కాదు. ప్రజాస్వామ్యానికి అది ఎంతో అవసరం కూడా. ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు ఉద్యమాలు బయల్దేరవు. అవి ఉగ్రరూపం దాల్చవు. -
దిద్దుబాటు చర్యలే కీలకం
హైదరాబాద్ శివార్లలో జరిగిన ‘దిశ’ ఘటనపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆగ్రహా వేశాలు, ఆందోళన వ్యక్తమయ్యాయి. చర్చ సందర్భంగా అన్ని పక్షాల సభ్యులూ నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేయడంతో పాటు, అత్యాచారానికి ఉరే ఏకైక శిక్షగా ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరారు. ఆ ఘటన వెలుగుచూసిన నాటి నుంచీ సమాజంలో భిన్న రంగాలకు చెందిన వారు చేస్తున్న డిమాండ్ వారి గళంలో ప్రతిఫలించింది. ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా నిరసనలు రగిల్చింది. వేలాదిమంది వీధుల్లోకొచ్చి నేరగాళ్లను వెను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని, సత్వరం కఠిన శిక్షలు పడితేనే ఇటువంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని డిమాండ్ చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఎన్నోచోట్ల ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి.నేరగాళ్ల క్రూరత్వం తీవ్రత సమాజం మొత్తాన్ని తల్లడిల్లజేస్తుంది. ఏడేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో నిర్భయను, ఆమె స్నేహితుణ్ణి మభ్యపెట్టి బస్సులో ఎక్కించుకున్న ఆరుగురు మృగాళ్లు పాశవికంగా ప్రవర్తించినప్పుడూ ఇదే తరహాలో దేశం మొత్తం భగ్గున మండింది. దాని పర్యవసానంగానే కఠినమైన నిబంధనలతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అలుపెరగకుండా చేసిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఆ కమిటీ నెలరోజుల్లోనే నివేదిక అందజేయగలిగింది. దోషులకు కఠిన శిక్షపడేలా చట్టాన్ని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ హామీ ఇచ్చారు. రాజ్య సభలో చర్చను ప్రారంభించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అందరూ దృష్టిపెట్టాలని అంటూనే చట్టం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని సరిగానే అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ సభ్యురాలు జయా బచ్చన్ అయితే అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలినవారిని కొట్టి చంపాలని డిమాండ్ చేసి సంచ లనం సృష్టించారు. జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం చట్టాలు లేకపోవడం వల్ల కాదనీ, వాటిని సక్రమంగా అమలు పరిచే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన సమస్య అని తెలిపింది. జస్టిస్ వర్మ కమిటీ ఒక్కటే కాదు... అంత క్రితం పలు సంఘాలు కూడా ఇదే మాట చెప్పాయి. వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పేరుకుపోయిన అలసత్వాన్నీ, ఉదాసీనతనూ పారదోలనంతకాలం ఎన్ని చట్టాలున్నా ఫలితం ఉండదని లా కమిషన్ నివేదిక సైతం 2000 సంవత్సరంలో హెచ్చరించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం చేసే నేరగాళ్లకు ఉరిశిక్ష విధించేలా 2018లో భారతీయ శిక్షాస్మృతిని సవరించారు. ఇది చరిత్రాత్మకమైనదని అందరూ ప్రశంసించారు. ఆ సవరణ ఫలితం నిరుడంతా కనబడింది. అత్యాచారం కేసుల్లో నేరగాళ్లకు 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా మరణశిక్షలు పడటం ఇదే తొలిసారని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. 2018లో అత్యాచారం కేసుల్ని విచారించిన దిగువ కోర్టులు మొత్తం 162మంది నిందితులకు మరణశిక్షలు విధించాయి. అంతక్రితం ఈ సంఖ్య 108. కింది కోర్టులు విధించే ఉరిశిక్షలను హైకోర్టులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2018లో 23మంది ఉరిని మాత్రమే హైకోర్టులు ఖరారు చేశాయి. 58 కేసుల్లో యావజ్జీవ శిక్షగా మార్చాయి. దాదాపు 25 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పునిచ్చాయి. సుప్రీంకోర్టు నిరుడు మొత్తం 12 కేసుల్లో అప్పీళ్లను విచారించింది. వీటిల్లో 2017నాటివి, అంతక్రితం కేసులూ కూడా ఉన్నాయి. 11 కేసుల్లో దోషులకు యావజ్జీవశిక్ష విధించింది. ఒక్క కేసులో మాత్రమే ముగ్గురు నేరగాళ్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అది నిర్భయ కేసు! వీరికి తక్షణం మరణశిక్ష అమలు చేయాలని దాఖలైన పిటిషన్ను నిరుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ హంతకులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది. వాస్తవానికి అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జేఎస్ కేహార్లతో పోలిస్తే ఈమధ్యనే రిటైరైన జస్టిస్ రంజన్ గొగోయ్ తన పదవీకాలంలో మరణశిక్షల కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ముగ్గురేసి న్యాయమూర్తు లుండే నాలుగు ధర్మాసనాలను ఇందుకోసం ఏర్పాటుచేశారు. ఈ ధర్మాసనాలు ఆరువారాలపాటు ప్రత్యేకించి ఈ కేసులను మాత్రమే విచారించాయి. ఒక నేరాన్ని మరణశిక్ష పరిధిలోకి తెస్తే ఇంత సుదీర్ఘ ప్రక్రియ సాగుతుంది. ఇప్పుడు పార్లమెంటులోనూ, వెలుపలా వెల్లువెత్తిన డిమాండ్ల పర్యవ సానంగా చట్టాన్ని మరింత కఠినం చేయడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గనుక ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎలాంటి సూచనలొస్తాయో చూడాలి. అయితే అంతకన్నా ముందు సమాజంలో అన్ని స్థాయిల్లోనూ పేరుకుపోయిన పురుషాధిక్య భావనను కూకటివేళ్లతో పెకిలించాలి. కుటుంబాలతో మొదలుపెట్టి వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అన్నిచోట్లా అంతర్లీనంగా ఉంటున్న ఈ చీడను వదలగొట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. ఇంట్లోనూ, బయటా మహిళల్ని గౌరవించడం విషయంలో సమాజం ఆలోచనను మార్చకుండా కఠిన చట్టాల వల్ల ఒరిగేదేమీ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. అత్యాచార కేసులు నమోదు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పింది. అసలు అత్యా చార కేసుల్ని విచారించే తీరు మారాలని సూచించింది. ఇలాంటి అంశాలన్నిటినీ సమగ్రంగా పరిశీ లించి దిద్దుబాటు చర్యలు తీసుకోనంతకాలం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వృధా అవుతాయని గుర్తించాలి. -
పేలుడు పదార్థాలు పెట్టి చంపేయండి
న్యూఢిల్లీ: లక్షల మంది పౌరుల ఆయుష్షును తగ్గించేస్తున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలు నిర్లిప్తంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెడుతూ ఢిల్లీ– ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులూ కారణమవు తున్నారని ఆక్షేపించింది. వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై తమకు నివేదికలు సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల సుప్రీంకోర్టు బెంచ్ రాష్ట్రాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మాగ్ టవర్ల నిర్మాణం చేపట్టే అంశంపై కేంద్రం 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘ప్రజలు ఇలా గ్యాస్ ఛాంబర్లలో ఎందుకు ఉంటున్నారు? బదులు పేలుడు పదార్థాలు పెట్టి వాళ్లందరినీ చంపేయండి’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనంపై తాము నిషేధం విధించినా ఈ ఏడాది దహనాలు మరింత పెరగడంపై పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను తప్పుపట్టింది. ‘దీన్ని ఇంకా సహించాలా? ఇది అంతర్యుద్ధం కంటే తీవ్రమైంది కాదా? కాలుష్యం కారణంగా లక్షలమంది పౌరుల ఆయుష్షు తగ్గిపోతోంది. వాళ్లను అలా వదిలేద్దామా?’ అని విమర్శించింది. -
తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6గంటలకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఇప్పటికి రాకపోవడంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు గాస్తు ఇబ్బందికి గురవుతున్నారు. కాగా మొత్తం 172 మంది ప్రయాణికులు స్పైస్ జెట్ విమానం రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విమానం రాకపోవడానికి సాంకేతిక కారణాలే కారణం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు. -
మా ఇబ్బందులు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. సమ్మె ప్రారంభమై 38 రోజులు జరుగుతున్నా, కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం దారుణమని నినదిస్తూ సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపేలా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆయనపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించటంతో సోమవారం ఉదయం నుంచి వారి ఇళ్ల ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో కార్మికులు వారి ఇళ్ల వద్దకు రాకుండా అడ్డుకోవటంతో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా ప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో అక్కడి సిబ్బందికి వినతి పత్రాలు ఇచ్చి వెళ్లారు. తమ ముట్టడికి స్పందించని ప్రజాప్రతినిధుల ఇళ్లముందు చావుడప్పు కొట్టనున్నట్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి ప్రకటించారు. సాయంత్రం హన్మకొండలోని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటిముందు కార్మికుల ఆధ్వర్యంలో చావుడప్పు వాయించే కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ముగ్గురు కోకన్వీనర్లు మంగళవారం ప్రారంభించాల్సిన నిరవధిక నిరశన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇందిరాపార్కు వద్ద దీన్ని చేపట్టాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. -
జడ్జీలపై కథనాలు బాధించాయి: జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల తీర్పులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై కాబోయే ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే(63) 18న బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో కొన్ని కథనాలు జడ్జీల తీర్పులను తప్పుపట్టడంతో ఆగకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటున్నాయి. అలాంటి వేధింపుల అనుభవం నాకు కూడా కలిగింది. న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలను పరువు నష్టం కింద కూడా భావించవచ్చు. అయితే, ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలియడం లేదు. ఏదైనా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా’అని వ్యాఖ్యానించారు. కేసుల విచారణ సకాలంలో జరగాలన్నారు. లేకుంటే నేరాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు దిగజారుతాయని పేర్కొన్నారు. -
పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం
సాక్షి, ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. ముంబైలోని నారిమన్ పాయింట్లోని బీజేపీ కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. కేవలం రూ.25 వేలతో తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ వందలాంది మంది బాధిత ఖాతాదారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతోఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా కృష్ణ అనే డిపాజిటర్ మాట్లాడుతూ అసలు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదనీ, తనకు డబ్బు తిరిగి కావాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఈ సొమ్మును తిరిగి సంపాదించుకోలేనంటూ ఆవేదన చెందారు. దీంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రికి రాత్రే తమ ఖాతాలను స్తంభింప చేస్తు పరిస్థితి ఏంటని ఆగ్రహంతో ప్రశ్నించారు. తామేమీ నేరం చేయకపోయినా తమ కష్టార్జితంకోసం భిక్షగాళ్లలా ప్రభుత్వాన్ని అర్థించాల్సి వస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. Mumbai: Depositors of Punjab & Maharashtra Cooperative (PMC) Bank protest outside BJP office, Nariman Point. Krishna, a depositor says, "I don't know what they're doing,don't care what they're doing,I want my money back.I won't be able to earn again whatever I've put in the bank" pic.twitter.com/n3tWtfr3mT — ANI (@ANI) October 10, 2019 -
‘సమస్యలపై ఫోన్ చేస్తే ఎప్పుడూ స్పందించరు’
సాక్షి, వికారాబాద్: ‘నేను చాలా సార్లు ఫోన్ చేశా, మీరు తీయడం లేదు, ఒక వేళ మీటింగ్లతో బిజీగా ఉంటే ఆ తర్వాతైనా ఫోన్ చేయొచ్చు కదా.. మీరు ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్కుమార్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. వివరాలిలా ఉన్నాయి.. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్తో సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిదులంటే చిన్నచూపు ఎందుకని నిలదీశారు. మీతో మాకు వ్యక్తిగత అవసరలేవీ లేవని, ఈ ప్రాంతం గురించి మీకు గానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గానీ పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు స్పందించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ తీయలేకపోతే తర్వాత చేసినా మార్యాద ఇచ్చిన వారవుతారన్నారు. పలు సమస్యలపై మాట్లాడేందుకు తాను చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదన్నారు. ఇది తమను అగౌరవపర్చినట్లేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సగం మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందలేదని, 50 శాతం రైతులకు రైతుబంధు అందలేదని తెలిపారు. జిల్లా అంటే మరుగుదొడ్లు నిర్మించడం, మొక్కలు నాటడమే కాదు, ప్రజల అవసరాలను తెలుసుకొని పాలన అందిస్తే మంచిదని ప్రసాద్కుమార్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, మండల అధికారులు ఎప్పుడు చూసినా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ వీసీ అంటూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. అధికారుల పనితీరుతో ఎంతో మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. -
అకాల వర్షాల బీభత్సం
న్యూఢిల్లీ/జైపూర్/భోపాల్/అహ్మదాబాద్: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను మంగళవారం రాత్రి భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో కలిపి 53 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడించారు. రాజస్తాన్, గుజరాత్ల్లో భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించిందన్నారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్లో 25 మంది, మధ్యప్రదేశ్లో 15 మంది, గుజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. గుజరాత్లో అకాల వర్షాలు, తద్వారా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి గుజరాత్లో మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేíషియా ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు చనిపోతే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ గురించి మాత్రమే పట్టించుకుంటున్నారనీ, ఆయన దేశానికి ప్రధానా లేక గుజరాత్కు మాత్రమేనా అని ప్రశ్నించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేస్తూ మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్ల్లోనూ చనిపోయిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాజస్తాన్ మరో రూ. 4 లక్షల సాయం.. వర్షాల వల్ల మరణించిన వారి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజస్తాన్ ప్రభుత్వం రూ. 4 లక్షలు, గుజరాత్ ప్రభుత్వం రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించాయి. రాజస్తాన్లో పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామనీ, కొన్ని పశువులు కూడా మరణించాయని అధికారులు చెప్పారు. పంట నష్టానికి కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే ఓం బిర్లా డిమాండ్ చేశారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు గుజరాత్లో భారీ వర్షాలకు గాలి దుమారం కూడా తోడైంది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది. హిమ్మత్నగర్ పట్టణంలో మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి కూడా దెబ్బతింది. పంట నష్టంపై సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. ప్రభావిత ప్రాంతాలకు చేతనైన సాయం చేస్తామని హోం మంత్రి రాజ్నాథ్ హామీనిచ్చారు. 24 గంటల్లో ఉత్తర భారతంలో వర్షాలు.. రానున్న 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం అంచనావేసింది. మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. వాయవ్య భారతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఆ విభాగం పేర్కొంది. వర్షాలపై రాజకీయాలొద్దు: మోదీ వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవించినా మోదీ గుజరాత్కు మాత్రమే సాయం చేస్తున్నారంటూ కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. అకాల వర్షాలపై రాజకీయాలు చేయవద్దని ఆయన పార్టీలను కోరారు. గుజరాత్లోని సబర్కాంఠా జిల్లాలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషాద సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విషాదంలో ఉన్నవారికి మనం సాయం చేయాలి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి’ అని అన్నారు. అస్సాంలో రైలుపట్టాలపై పడిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు -
బూత్ లెవల్ .. అంతా హడల్!
జిల్లాలో బీఎల్వోల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకపక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు .. మరో వైపు అధికారుల ఆదేశాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. సమావేశాలు.. విచారణల పేరుతో ఆర్థికంగానూ చితికిపోవాల్సి వస్తోంది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఛీదరింపులు.. అధికారుల చివాట్లతో మరింత ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాక్షి,పలమనేరు(చిత్తూరు) : రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో బూత్లెవల్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘానికి సంబంధించిన పనులు చేయాలనే గౌరవంతో విధులు నిర్వహిస్తున్న వీరికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదఫా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. వారిమాట విని ఏదేనీ తప్పుచేస్తే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. ఈమధ్య భారీగా వస్తున్న ఫామ్–7 క్లయిమ్ల విచారణ వీరికి తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో బీల్వోలే అత్యంతకీలకం ఎన్నికల నిర్వహణలో బీఎల్వోలే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఓటర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 6–క్లయిమ్ల స్వీకరణ, వీటిపై విచారణ, ప్రస్తుతం 7–క్లయిమ్ల స్వీకరణ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, వీటికి సంబంధించిన చెక్లిస్ట్, ఫామ్–13, 14 నోటీసుల జారీ వీటిపై విచారణలు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించడం, బూత్లెవల్లో సౌకర్యాలు, మార్పులు తదితరాలపై సమాచారాన్ని ఉన్నతాధికారుకు ఇస్తూ వారి ఆదేశాలను పాటించాలి. ఇందుకోసం అంగన్వాడీ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులను ఎంపిక చేశారు. వీరు వారిశాఖలతో పనిలేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బూత్లెవెల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు. అధికారపార్టీ ఒత్తిళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా ఈదఫా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు వీరిని తమదారిలోకి తెచ్చుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. నయానా, భయానా కాకుంటే పలు రకాల ప్రలోభాలకు గురిచేసి కొందరిని ఇప్పటికే వారి దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. గ్రామాల్లో అయితే అక్కడి అధికార పార్టీ నేతలు, సాధికార మిత్రలు వీరి వెంటే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి స్థానిక నేతల మాటలు వినకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయోనని కొందరు వారు చెప్పినట్టే చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పచ్చ నేతల నుంచి తనకు ఇలాంటి ఒత్తిళ్లున్నాయని వారు అధికారులకు చెప్పుకున్నా లాభం లేకుండా ఉంది. ఎందుకంటే అధికారులు సైతం నాయకుల మాట వినేవాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. ఈ విధుల్లోకి ఎందుకొచ్చామా..? అని బయటకు చెప్పుకోలేక బీఎల్వోలు లోలోన మదనపడేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో బీఎల్వోలు విచారణలో తప్పని తిప్పలు అర్హులైన ఓటర్లను సైతం కొందరు ఫామ్ –7 ద్వారా తొలగింపునకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యంతరాలు జిల్లాలో వేలల్లోనే ఉండడంతో వీటిని మళ్లీ విచారించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వీరు అవరసమైన ధ్రువపత్రాలను అడిగితే ఓటర్లు ఎన్నిసార్లు విచారిస్తారంటూ బీఎల్వోలను ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించి నేర్పుగా పనులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లపేరిట అధికారుల నుంచి ఆదేశాలు తప్పడం లేదు. వీరు మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ ఇంత కష్టపడినా బీఎల్వోలకు మూడు నెలలకు ఎన్నికల సంఘం నుంచి అందే గౌరవ వేతనం మూడు వేలు మాత్రమే. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ విధుల కారణంగా బీపీలు, షుగర్ లాంటి జబ్బులు వస్తున్నాయని వాపోతున్నారు. జిల్లా అధికారులు వీరికి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది. -
రాజస్థాన్ ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక
కరౌలీ : విద్యా, ఉద్యోగాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఎట్టకేలకు రాజస్థాన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుజ్జర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. గుజ్జర్లతో బహిరంగ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ధోల్పూర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై విచారణ జరపనున్నట్లు సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అయిదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించి ధర్నాకు దిగటంతో రైల్వేశాఖ... ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించింది. రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధుల బృందం నిన్న గుజ్జర్లతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనకారులు ఆగ్రా-మొరేనా రహదారి దిగ్భందించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ అమలు అవుతోంది. కాగా రిజర్వేషన్లు అమలు చేసేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గుజ్జర్ల ఆరక్షన్ సంఘర్షణ్ సమితి అధ్యక్షుడు కిరోరీ సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. తమ ఆందోళనలోకి సంఘ విద్రోక శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు భైంస్లా తన ఆందోళన విరమించాలంటూ ఆయన నివాసంలో రాజస్థాన్ సర్కార్ నోటీసులు అంటించింది. -
ఓ అమ్మ ఆవేదన
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ వీరుడి భార్య సౌందర్యవతి. యవ్వనవతి. అయినా సరే మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. పిల్లలతోనే జీవితమనుకుంది. అక్కడా ఇక్కడా కష్టపడి పని చేసుకుంటూ, వచ్చిన నాలుగు డబ్బులతో కొడుకును సాకుతూ వాడిని చదివిస్తోంది. కొడుక్కి అనుకోకుండా అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చింది. అమ్మను ఒప్పించి అమెరికా వెళ్ళిపోయాడు. బాగా చదువుకున్నాడు. అక్కడ ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఉండిపోయాడు. సుఖవంతమైన జీవితం సాగిస్తున్నాడు. అమ్మ ఎంత కష్టపడి పెంచిందో తెలుసుకున్న వాడిగా అతను క్రమం తప్పకుండా డబ్బులు పంపుతూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. పండగలూ, పబ్బాలూ వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ యువకుడు మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అమ్మను చూడాలని కూడా అనుకోలేదు. కొంతకాలానికి అమ్మ చనిపోయినట్టు అతనికి కబురందుతుంది. వెంటనే అతను ఇంటికి చేరుకుంటాడు. తన దగ్గరున్న డబ్బులతో భారీ ఎత్తున అమ్మకు అంత్యక్రియలు చేస్తాడు. శ్మశానవాటిక నుంటి ఇంటికి చేరుకుంటాడు. అమ్మ పడుకున్న గదిలో మంచం పక్కగా ఓ పెట్టె కనిపిస్తుంది. అదేమిటా అని తీసి చూస్తాడు. అంతే! ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తాడు. విషయం తెలుసుకున్న సమీప బంధువులు, ఇరుగుపొరుగువారు విస్తుపోతారు. తల్లి శవాన్ని చూసినా అంతగా చలించని అతను ఇప్పుడు ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. ఆ పెట్టెనిండా డబ్బులు కనిపిస్తాయి. అందులో ఓ చిన్న ఉత్తరం కనిపిస్తుంది. అందులో ఇలా రాసి ఉంది... ‘‘కుమారా, నువ్వు క్రమం తప్పకుండా డబ్బులు పంపుతూనే ఉన్నావు. కాదనను. కానీ మన ఇంటికి కావలసిన డబ్బులు నేను ఎలాగోలా సంపాదించుకుంటూనే ఉన్నాను. నువ్వు పంపిన దాంట్లో ఒక్క పైసా కూడా నేను ముట్టలేదు. అవన్నీ ఇందులోనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడెప్పుడు పంపావో తేదీలతో సహా రాసి ఉంచాను. డబ్బుల మాట అటుంచు. నేను నిన్ను చాలా చాలా మిస్సవుతూనే ఉన్నాను. నీ కోసం ఈ అమ్మ కళ్ళు ఎంతగా నిరీక్షించాయో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నువ్వు పంపిన డబ్బులన్నీ అలాగే ఉన్నాయి. నువ్వెప్పుడూ బాగుండాలి. నీకు ఏ అనారోగ్యం రాకూడదు. ఒకవేళ వస్తే ఈ డబ్బులన్నీ మందులకు వాడుకో. వీలుంటే అనాథాశ్రమాలకు ఇవ్వు. అంతేతప్ప దుబారా చేయకు. ఇవి నీ డబ్బులే. నీకిలా చెప్పకూడదు. వాటిని ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలుసు. నేను చెప్పక్కర్లేదు. కానీ ఓ తల్లిగా చెప్పాలనిపించి ఈ నాలుగు మాటలూ చెప్పాను... నీకిష్టమైనట్లే చెయ్యగలవు...’’ దీంతో అతనెందుకు ఏడుస్తున్నాడో అందరికీ తెలిసింది. – తలశిల మహిమ -
పీఈటీ అభ్యర్థుల ఆందోళన
-
విజయవాడలో పీఈటీ అభ్యర్థుల ఆందోళన
విజయవాడ: నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద పీఈటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 1056 పోస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడాన్ని పీఈటీ అభ్యర్థులు తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మంత్రి గంటా శ్రీనివాస రావు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. 1056 పోస్టులు భర్తీ చేయనపుడు, 20 వేల మందికి టెట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రభుత్వం 1056 పోస్టులు ప్రకటించకపోతే మాకు చావే శరణ్యమని అభ్యర్థులు వాపోయారు. -
రగులుతున్న మరాఠాల ఎద
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ముంబై నగరానికి మూడున్నర లక్షల మందితో మహా ర్యాలీని మరాఠాలు నిర్వహించి ఏడాది గడిచింది. 2019, ఆగస్టు 9వ తేదీన మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ప్రారంభమైన 58 మౌన, అహింసా ర్యాలీలు ముంబై నగరంలో మిళితమై అది మెఘా ర్యాలీగా మారింది. నాడు ఒక్క రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా రైతులకు పలు రాయితీలు కల్పించాలని, 2016లో 15 ఏళ్ల మరాఠా బాలికపై జరిగిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో సత్వర న్యాయం జరగాలని నాడు మరాఠాలు డిమాండ్ చేశారు. అత్యాచారం కేసును విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు 2017, నవంబర్లో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధించింది. లక్షలాది మంది మరాఠాలు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఈ రేప్ సంఘటన. ఈ సంఘటనలో దోషులు దళితులవడం వల్ల రిజర్వేషన్లతో వారు విర్రవీగుతున్నారన్న ఆక్రోశంతో మరాఠాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాల మాఫీకి చర్యలు చేపట్టింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీం కోర్టు నిర్దేశించిన నేపథ్యంలో అప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతం దాటడంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అయినప్పటికీ రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో మరాఠాలు తమ పోరాటానికి విరామం కల్పించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ముంబై హైకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్డు మార్గదర్శకాల మేరకు హైకోర్టు కూడా రిజర్వేషన్ల విషయమై ఏం చేయక పోవచ్చు. అయినప్పటికీ కోర్టు తీర్పు కోసం నిరీక్షిద్దామని, నవంబర్ నెల వరకు నిరీక్షించాల్సిందిగా మరాఠాలకు ఫడ్నవీస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎందుకోగానీ గత జూలై నెలలో మరాఠాలు రిజర్వేషన్లంటూ రెండో పర్యాయం రోడ్డుమీదకు వచ్చారు. గతంలోలాగా కాకుండా వారు ఈసారి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు. తాజాపోరులో భాగంగా 500 మంది మరాఠాలు గురువారం నాడు ముంబైలోని బంద్రా–కుర్లా కాంప్లెక్స్లోని సబర్బన్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు ప్రారంభించారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేసి ఏం లాభం అంటూ మీడియా కొందరిని ప్రశ్నించగా, తామేమి 50 శాతం మించి రిజర్వేషన్లు ఇమ్మని డిమాండ్ చేయడం లేమని, 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఇమ్మని కోరుతున్నామని వారు అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గిస్తే తమకు రిజర్వేషన్లు కల్పించవచ్చని వారు సూచిస్తున్నారు. మీడియా మాట్లాడించిన వారిలో 57 దత్తాత్రేయ్ థామ్కర్ ఒకరు. తన ఇద్దరి కూతుళ్లు ఇంజనీరింగ్ చదవుతున్నారని, వారి చదవుల కోసం రెండేళ్ల క్రితం 9 లక్షల రూపాయలు అప్పుచేశానని చెప్పారు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఆ అప్పును ఎలా తీర్చాలో కూడా ప్రస్తుతానికి తనకు తెలియదని అన్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఇదివరకు జౌళి మిల్లులో పనిచేసిన థామ్కర్ అది మూత పడడంతో రోజు కూలీగా మారారు. మరాఠాల సంప్రదాయం ప్రకారం మరాఠా మహిళలు భైఠాయింపునకు ముందు వరుసలో ప్రత్యేకంగా కూర్చున్నారు. వారిలో 45 ఏళ్ల ప్రేర్నా రాణె మీడియాతో మాట్లాడుతూ ‘నా పిల్లల చదువు పూర్తయింది. వచ్చేతరం పిల్లల రిజర్వేషన్ల కోసం పోరాటంలో పాల్గొంటున్నాను. మా సమాన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని అక్కడ బైఠాయించిన మరాఠాలందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. చదవండి: మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ? -
తొలిరోజే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. కొత్త సభ్యుల ప్రమాణం సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్ఎల్డీ) ప్రమాణం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. -
సీఆర్పీఎఫ్ జవాన్ ‘వాట్సాప్’ ఆవేదన
సాక్షి, ఒడిశా(డెంకాడ): జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న డెంకాడ మండలంలోని మోపాడకు చెందిన నాగేశ్వరరావు తనకు జరిగిన అన్యాయాన్ని వాట్సాప్ ద్వారా బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నాగేశ్వరరావు తండ్రి లక్ష్మణకు చెందిన భూమిని గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బంటుపల్ల మురళీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అడిగితే తన తండ్రిపై దాడులు చేశాడని నాగేశ్వరరావు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. అలాగే దాడిలో గాయపడిన తన తండ్రి ఫొటో కూడా వాట్సాప్లో పోస్టు చేసి అందరికీ పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. మురళికి రాజకీయ పలుకుబడి ఉండడంతో తమకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని కానిస్టేబుల్ నాగేశ్వరరావు వాపోయాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మర్యాదగా కేసు వాపస్ తీసుకో..లేదంటే మీ నాన్నను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. విషపూరిత కుట్రల నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలంటూ కోరుతున్నాడు. ఇదే విషయమై డెంకాడ హెచ్సీ అప్పారావు వివరణ కోరగా రెండు నెలల కిందట నాగేశ్వరరావు తండ్రి లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోపాడ ఎంపీటీసీ సభ్యుడు మురళీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. రెండు రోజుల కిందట చిన్నపాటి వివాదం ఏర్పడితే ఇరువురికి సర్దిచెప్పి పంపించామన్నారు. -
‘దోస్త్’ కుదరలేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థులు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్, ఎంవీఎస్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందారు. ‘దోస్ట్’ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో సీటు వచ్చిన తర్వాత చేరాలంటే ఖచ్చితంగా ఫీజు చెల్లించాలని కళాశాలల అధికారులు చెప్పడంతో ఇలా బ్యాంకు ముందు బారులు తీరారు. ప్రవేశం పొందేందుకు బుధవారం ఆఖరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో బ్యాంకు అధికారులు బయట నిలబెట్టి ఒక్కొక్కరిని లోపలకు పంపించారు. సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రవేశాల సమయంలో ఇచ్చిన సమాచారం.. ఇప్పుడు చెబుతున్న మాటలకుపొంతన లేకుండా పోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదేకాకుండా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్న అపోహపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులను కలవరానికి గురి చేస్తోంది. ఫలితంగా తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయినా ఇంకా పలువురు విద్యా ర్థులు రిపోర్ట్ చేయకపోగా.. ప్రభుత్వ కళాశాలలో చేరేం దుకు ఫీజు చెల్లించాలన్న ప్రచారంతో బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తుండడం గమనార్హం. మొత్తం 90 కళాశాలలు పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 90 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటల్లో కలిపి 34,555 సీట్లు ఉండగా, మొదటి దశ కింద ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 8,128 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఇందులో ఇప్పటివరకు కేవలం 5,636 మందే సీటు వచ్చిన కళాశాలల్లో రిపోర్టు చేశారు. రిపోర్టు చేసే గడువు ముగిసినా ఇంకా 2,492 మంది విద్యార్థులు చేరలేదు. వీరికి కళాశాల మార్చుకునేందుకు కానీ రెండో కౌన్సిలింగ్ సీటు కేటాయించే పరిస్థితి కానీ లేదు. ఖచ్చితంగా సీటు కేటాయించిన కళాశాలలోనే ప్రవేశం పొందాల్సి ఉన్నా గడువు ముగిసినా స్పందన రాలేదు. అయితే, చాలా మంది విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చిన వారు కళాశాలలో చేరే రోజే ఫీజు చెల్లించాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పలువురు అప్పు చేసి మరీ ప్రవేశాలు పొందగా.. మరికొందరు దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులా ? జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 21 ఉండగా సాదారణంగా చాలా మంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు కోరుకుంటారు. ఇదేవిధంగా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వ కళాశాల అంటే ఫీజు చెల్లించాల్సిన అవసరముండదని భావించారు. కానీ సీట్లు వచ్చిన విద్యార్థులు సాధారణ కోర్సులైతే రూ.2,500, సెల్ప్ పైనాన్స్ కోర్సులైతే రూ.4,875 ఖచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వ కళాశాలల అధికారులు హుకూం జారీ చేస్తున్నారు. అయితే, దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో వెబ్సైట్లో ఈ నిబంధన లేకపోగా ఇప్పుడూ లేదని కొందరు చెబుతున్నారు. కానీ కొన్ని కళాశాలల ఉద్యోగులు ఫీజు తప్పనిసరి అని చెబుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. చాలామంది విద్యార్థులు అప్పు చేసి ఫీజు కట్టగా.. మరికొందరు ప్రవేశాలకు దూరంగా ఉండిపోయారు. మొదటి దశలో ప్రభుత్వ కళాశాల్లోనే అధికంగా సీట్లు కేటాయించినా 2,492 మంది కళాశాలల్లో చేరకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కాగా, యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి.. అందులో ఎందరు విద్యార్థులకు సీట్లు కేటాయించాలి.. ఎంత ఫీజు నిర్ధారించాలనే అంశాలను ప్రభుత్వం యూనివర్సిటీల పరిధి నుండి తొలగించింది. ఈక్రమంలో చాలా వరకు కోర్సులు, ఫీజుల వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి. దరఖాస్తుకు రూ.600 దోస్ట్ ద్వారా దరఖాస్తులో భాగంగా రిజిస్ట్రేషన్కు రూ.200 గా నిర్ణయించిన ప్రభుత్వం, రెండో దశలో దాన్ని రూ.400 కు పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు మీ సేవ సెంటర్లకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇక జిరాక్స్లు, ఇతరత్రా ఖర్చులకు కలిపి ఇది రూ.600 కు చేరుతోంది. తద్వారా విద్యార్థులకు దరఖాస్తు దశ నుంచే ఆర్థిక భారం వెంటాడుతుండగా.. ఇప్పుడు ప్రవేశాల సమయంలో ఫీజు కట్టాలన్న ప్రచారం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. కళాశాల్లో చేరాల్సిందే... మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించిన కళాశాలల్లో ఖచ్చితంగా చేరాలన్న నిబంధన ఉంది. అయితే ఏవైనా ఇబ్బందులు కారణంగా మొదటి దశలో ప్రవేశం పొందకపోతే ఇతర కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు సమయంలో ఐదు నుండి పది కళాశాలను ఎంపిక చేసుకోగా దూరంగా ఉన్న కళాశాలలో సీటు వస్తే.. ఇతర కళాశాలకు మార్చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తద్వారా విద్యార్థులు కేటాయించిన కళాశాలల్లోనే ప్రవేశం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి ప్రాధాన్యత కింద ఏదైనా ప్రైవేట్ కళాశాలలో సీటు కోరుకున్నా... దూరంగా ఉన్న ప్రైవేట్ కళాశాలల్లోనే సీటు వచ్చిందని పలువురు వాపోతున్నారు. -
తీరని అగ్రిగోల్డ్ బాధితుల వ్యధ
-
సీబీఎస్ఈ నిర్ణయాన్ని స్వాగతించిన హీరోయిన్
సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఎస్ఈపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ స్పందించారు. పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామన్న సీబీఎస్ఈ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. స్టూడెంట్స్ పరీక్షలకు బాగా సిధ్దమై ఉంటే సమస్యే ఉండదన్నారు. అటాంటప్పుడు సీబీఎస్ఈ పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం పట్ల విద్యార్థులు కలత చెందాల్సిన పనిలేదని సూచించారు. రీ-టెస్ట్తో సిలబస్లో మార్పులేమీ ఉండవు గనుక పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కు సమస్య లేదన్నారు. అయితే ఆదరాబాదరాగా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సమస్యలు తప్పవని అభిప్రాయపడ్డారు. మొదటినుంచీ ప్రిపరేషన్ మొదలుపెడితే పరీక్షల్లో మంచి మార్కులు పొందొచ్చని విద్యార్థులకు ఆమె సూచించారు. రాణీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్కీ’ సినిమా సక్సెస్ మీట్లో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె ‘టురేట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడే స్కూల్ టీచర్ పాత్రలో నటించారు. కాగా 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను ఏప్రిల్ 25న తిరిగి నిర్వహించనున్నారు. అలాగే పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను కేవలం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
సాక్షి, జగిత్యాల: పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి రైతులు కోరుట్ల-జగిత్యాల రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. శ్రీరామ్సాగర్ కాలువకింద ఉన్న తమ భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని, తమ విద్యుత్ మోటార్ల కనెక్షన్లను విద్యుత్ అధికారులు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీ నీళ్లు తమ పంటలకు అందకుండా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. రహదారిపై రైతులు భైఠాయించడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాటిపల్లి రైతుల ఆందోళనకు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యుత్ మోటార్లకు కనెక్షన్ పునరుద్ధరించి సాగునీరు ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు. -
నాకెవరూ గుడ్మార్నింగ్ చెప్పట్లేదు: మోదీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ యాప్లో తాను ప్రతి రోజూ ఉదయం ఎంపీలందరికీ గుడ్మార్నింగ్ చెప్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఓ ఐదారుగురు నేతలు మాత్రమే తన సందేశాలకు ప్రతిస్పందిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంటరీ విభాగం వారంతపు భేటీలో మోదీ ఈ మేరకు స్పందించారు. మోదీ యాప్ను విరివిగా వాడాలని ఆయన ఎంపీలకు ఈ సందర్భంగా సూచించారు. గుడ్మార్నింగ్తో పాటు తాను పంపే ముఖ్యమైన విషయాలనూ ఎంపీలు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన ఈ యాప్ను మోదీ ఇటీవల ముగిసిన గుజరాత్ ఎన్నికల్లోనూ విరివిగా వాడారు. పార్లమెంటుకు సరిగ్గా హాజరుకాని ఎంపీలకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కవని ఆగస్టులో మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
నీళ్ల కోసం కదంతొక్కిన కర్ణాటక రైతులు
సాక్షి, బెంగళూరు: తమ ప్రాంతానికి రావాల్సిన నీటి కోసం ఉత్తర కర్ణాటక ప్రాంత రైతులు నిప్పులా రగిలిపోయారు. ఎన్నో ఏళ్లుగా వారిలో నిండిన ఆవేదన కట్టలు తెంచుకుంది. నిరసనల రూపంలో వారి ఆవేదన పెల్లుబికింది. మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలనే డిమాండ్తో రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉత్తర కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులకు అన్ని వర్గాల నుండి అపూర్వంగా మద్దతు లభించింది. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పాటు బస్ల టైర్లకు నిప్పుపెట్టారు. ఉత్తర కర్ణాటక బంద్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుండే హుబ్లీ-ధార్వాడతో పాటు గదగ్, బెళగావి, హావేరి, నరగుంద, నవలగుంద, బాగల్కోట, ఇళకళ్ తదితర ప్రాంతాలన్నింటిలో రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఉత్తర కర్ణాటక బంద్ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కళాశాలలు, పాఠశాలలకు మంగళవారం రోజునే సెలవు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. సినీరంగంతో పాటు ఆటోడ్రైవర్లు, వైద్యులు, లాయర్లు, ఇలా అన్ని వర్గాల వారు రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలో జనజీవనం పూర్తిగా స్థంబించింది. హుబ్లీ-ధార్వాడతో పాటు ఇతర ప్రాంతాలన్నింటిలో కేంద్రం, రాష్ట్రానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్లకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. బంద్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. సీఐకు తృటిలో తప్పిన ప్రమాదం హుబ్లీ-ధార్వాడ ప్రాంతాల్లోని వివిధ కూడళ్లలో నిరసనకారలు టైర్లకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలియజేశారు. నవలగుంద పట్టణంలో నిరసన కారులు టైర్లకు నిప్పు పెట్టే సందర్భంలో అడ్డుకోబోయిన సీఐ దివాకర్ ప్యాంట్కు నిప్పు అంటుకుంది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. తక్షణం పక్కనే ఉన్న సహచరులు మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఇక ఇదే సందర్భంలో పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హుబ్లీలోని ఎంపీ ప్రహ్లాద్ జోషి కార్యాలయం పై నిరసన కారులు రాళ్లు రువ్వడంతో పాటు కార్యాలయాన్ని ముట్టడించారు. నగరంలోని చెన్నమ్మ సర్కిల్లో నిరసనకారులు యడ్యూరప్ప ఫ్లెక్సీలను పట్టుకొని వాటిపై బురద జల్లుతూ తమ నిరసనను తెలియజేశారు. మరికొంత మంది నిరసనకారులు అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. నాయకులను వేలం వేసిన నిరసన కారులు.. ఇక హుబ్లీలో నిరసన కారులు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. మహదాయి పోరాట సమితి సభ్యులతో పాటు డ్రైవర్ల సంఘం నేతృత్వంలో నాయకులను వేలం వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు యడ్యూరప్ప, సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ల చిత్ర పటాలను ఉంచిన నిరసనకారులు వీరిని వేలం వేశారు. ఇక మహదాయి విషయంలో మాట తప్పిన యడ్యూరప్పను ఉచితంగానే తీసుకోవచ్చని, ఆయనకు ఎలాంటి రేటు లేదంటూ నిరసనకారులు ప్రకటించారు. రక్తం చిందించైనా నీరు తెచ్చుకుంటాం.. తమ రక్తం చిందించైనా సరే మహదాయి నీటిని తెచ్చుకుంటామని నిరసనకారులు నినదించారు. బంద్లో భాగంగా కర్ణాటక రక్షణ వేదిక నేతృత్వంలో హుబ్లీ రైల్వేస్టేషన్ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు తమ చేతులను బ్లేడ్లతో కోసుకున్నారు. రక్తం చిందినా సరే పోరాటం నుండి వెనక్కుతగ్గబోమంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్బంలో పోలీసులు, నిరసనకారలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బ్లేడ్లతో చేతులు కోసుకున్న కొంత మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో నిరసనకారులను చేర్పించారు. మహదాయి నదీ జలాల వివాదం గురించి క్లుప్తంగా.. గోవ, మహారాష్ట్ర, కర్ణాటకకు తాగు, సాగునీటిని అందించే మహదాయి నదీ జలాల పంపకం విషయంలో కర్ణాటక, గోవ, మహరాష్ట్ర మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్.ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహదాయి ఉపనదులైన కళసా–బండూరు అనే రెండు ఉపనదులకు అడ్డంగా కాలువలను నిర్మించి 7.56 టీఎంసీల నీటిని మలప్రభకు మరలించాలనే విషయం తెరపైకి తీసుకువచ్చారు. దీని వల్ల బెళగావి, గదగ్, దార్వాడ తదితర జిల్లాల్లో తాగుసాగునీటి ఇబ్బందులు తప్పుతాయనేది ప్రభుత్వ ఆలోచనా. అయితే గోవా మాత్రం కర్ణాటక ప్రతిపాదనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. మహదాయి నుంచి 7.56 టీఎంసీల నీటిని మరలించడం వల్ల స్థానికంగా పర్యావరణం దెబ్బతింటుందని వాదిస్తోంది. అంతేకాకుండా తమ రాష్ట్రం పర్యాటకం పై ఆధారపడి ఉందని నదీ జలాల మరలింపు దీని పై ప్రభావం చూపుతుందని చెబుతూ చాలా ఏళ్లుగా ఈ ప్రతిపాదనను అడ్డుకుంటోంది. ఈ విషయమై గత ఏడాది జులైలో మహదాయి నదీ జలాల ట్రిబ్యునల్లో కర్ణాటకకు వ్యతిరేకంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అప్పటి నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నిరసనలు మిన్నంటాయి. దాదాపు ఏడాదిన్నరగా అక్కడ ఏదో ఒక రూపంలో నిరంతరంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. -
ఇక మరాఠాల వంతు..!
సాక్షి, ముంబై : గుజరాత్లో పటేదార్ల రిజర్వేషన్ ఉద్యమంతో స్ఫూర్తిపొందిన మరాఠాలు.. మహారాష్ట్రలో మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. మరాఠా యోధుడు శివాజీ జన్మదినమైన పిబ్రవరి 19 నుంచి రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు మరాఠాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్లో పటేదార్లు ఉద్యమం, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో మహారాష్ట్ర శాసనసభ, లోక్సభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పటేదార్ల తరహా ఉద్యమాన్ని నిర్మించేందుకు మరాఠాలు సిద్ధమవుతున్నారు. ఉద్యమ నిర్మాణం గురించి మరాఠా నేతలు.. మంగళవారం సమావేశమయ్యారు. మరోదశ ఉద్యమాన్ని శివాజీ చక్రవర్తి జన్మదినం నాడు మొదలు పెట్టి.. 2019లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీలకు 2019లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యమ నేతలు తెలిపారు. మరాఠాలు కోరికేంటి? విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ.. మరాఠాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమానికి కారణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో.. వారికే విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. రిజర్వేషన్ల ఆసరాతో ఆయా వర్గాలు వేగంగా పురోగమిస్తున్నాయి. అదే రీతిలో మరాఠాలు తిరోగమిస్తున్నారు. బీజేపీ 2014 ఎన్నికల తరువాత బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర పఢ్నవీస్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో.. మరాఠాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫలితాలను మార్చే మరాఠాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను, పార్టీల తలరాతలను మరాఠాలు మార్చగలరు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మరాఠాలు ఫలితాలను తారుమారు చేయగలరు. మొత్తం మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33 శాతం వరకూ ఉన్నారు. చెక్కెర కర్మాగారాలు, విద్యాసంస్థలు, కో-ఆపరేటిక్ సెక్టార్లలో మరాఠాలది తిరుగులేని ఆధిపత్యం. -
విద్యుత్ అధికారుల నిర్బంధం
సాక్షి, కథలాపూర్ : విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేడంతో ఆగ్రహించిన రైతులు విద్యుత్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషన్రావుపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వ్యవసాయానికి కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించమని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం బిల్లుల వసూలుకు వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టి పంచాయతీ కార్యాలయంలో వారిని నిర్బంధించారు. -
పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన్షన్ సాధన కోసం పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
స్వంత ఇంటి ముందే వృద్ధురాలి దీక్ష
సాక్షి, నిజామాబాద్ : కోడలి దాష్టీకానికి నిరసనగా నిజామాబాద్లో స్వంత ఇంటి ముందే ఓ వృద్ధురాలు దీక్ష చేయడం సంచలనం సృష్టించింది. భారతి అనే వృద్ధురాలు తన ఇంట్లో తాను అండే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం తన ఇంటిముందే దీక్ష ప్రారంభించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భారతి కొడుకు కోడలు అమెరికాలో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన భారతిని కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టడమేకాక నిజామాబాద్లో ఉన్న ఇంటికి తాళం వేయించింది. తనూ, తన భర్త నివసించిన స్వంత ఇంటిని కబ్జాచేసి తన కోడలు తనకు నిలువనీడలేకుండా చేసిందని భారతి కన్నీటి పర్యంతమైంది. దీంతో స్పందించిన కాలనీ వాసులు ఆమెకు అండగా నిలిచారు. ఇంటి తాళం పగులగొట్టి భారతికి ఇల్లు అప్పగించారు. వృద్ధురాలి తరపున తాము పోరాడతామని వారు పేర్కొన్నారు. కాలనీవాసుల జోక్యంతో కథ సుఖాంతమైంది. -
ఆదివాసీ-లంబాడీల వివాదం హింసాత్మకం
-
ఆదివాసీల ఆందోళన హింసాత్మకం
సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు. -
గిరి గీసుకోవద్దు
న్యూఢిల్లీ: సంకుచిత ధోరణులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాన అడ్డంకులుగా మారాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వినూత్న మార్గాల ద్వారా ఇలాంటి వాటిని అధిగమించి పాలనను వేగవంతం చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 380 మంది డైరెక్టర్లు, డిప్యూటీ కార్యదర్శులతో మోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలపై చర్చించినట్లు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. 2022 నాటికి నవభారత్ లక్ష్య సాధనకు అంకితభావంతో పనిచేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. ‘సంకుచిత ఆలోచనా దోరణులు ప్రభుత్వ పాలనకు అడ్డంకిగా మారాయి. అధికారులు గిరిగీసుకోకుండా ఇలాంటి వాటిని వినూత్న మార్గాల ద్వారా అధిగమిస్తే పాలన వేగవంతమవుతుంది’ అని మోదీ అన్నారు. మెరుగైన ఫలితాలు రాబట్టాడానికి డైరెక్టర్, డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలను నియమించుకోవాలని సూచించారు. పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ సంస్థలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, రవాణా, జల వనరులు, స్వచ్ఛ భారత్, కమ్యూనికేషన్, పర్యాటకం, తదితరాలు ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ పేర్కొంది. -
డబ్బు, వారసత్వం శాసిస్తున్నాయి
రాజకీయాలపై జస్టిస్ చలమేశ్వర్ అహ్మదాబాద్: ధన బలం, వారసత్వ రాజకీయాలు.. రాజకీయ న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో డబ్బు, రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన రాజకీయ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టసభలో సభ్యుడయ్యే అర్హతను చివరకు ధనబలం నిర్ణయిస్తుందని, ఒకరు చట్ట సభలో సభ్యుడైతే.. అతని భార్య, పిల్లలు, మిగతా కుటుంబసభ్యులు ఆ స్థానం కోసం వరుసలో ఉంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ తప్పుపట్టారు. ‘రాజకీయ క్షేత్రంలో సమానత్వం, న్యాయం విషయానికొస్తే.. మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. రాజ్యాల్ని, జ్యేష్ట పుత్రుడికి వారసత్వ హక్కు నిబంధనను రద్దు చేశాం. అయితే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించే విషయంలో ఎంతవరకూ రాజకీయ న్యాయం సాధించాం?’ అని జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు. -
చలో గరగపర్రు భగ్నం
పాలకోడేరు: దళిత సంఘాల చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. గరగపర్రు గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు తమ వలయంలోకి తీసుకుని నిర్బంధించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ను గ్రామంలోకి రాకుండా మండలంలోని వేండ్ర రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో గరగపర్రు గ్రామంలోని దళితులంతా ర్యాలీగా గ్రామ సెంటర్లోకి చేరుకుని నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన ముగ్గురు దళిత యువకులు వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్లోకి దూకేశారు. దీంతో ఒక దశలో గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక దశలో ఏమవుతుందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. డీఎస్పీ పూర్ణచంద్రరావు వస్తున్నారు.. మీతో మాట్లాడతారు వెనక్కి పదండి అని పోలీసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంతానికి తీసుకువచ్చారు. మంత్రులు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాలని వారు కోరగా అందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నర్సాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న దళిత నేతలతో చర్చించి కొంత మంది ప్రతినిధులు నరసాపురం కార్యాలయానికి వస్తే చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపుతామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను దళితులు విరమించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు కారుమంచి క్రాంతి, ఎరిచర్ల రాజేష్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డీఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని, ఒకవేళ కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల చలో గరగపర్రుకు పిలువు ఇవ్వడంతో గరగపర్రు వెళ్లే ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వారి గుర్తింపు కార్డులు చూసి నిర్ధారించి గ్రామంలోకి పంపించారు. -
గరగపర్రులో మంత్రుల వరాల జల్లు
పాలకోడేరు : గరగపర్రు వచ్చిన వచ్చిన ముగ్గురు మంత్రులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కు దళితుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్బాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజుతో కలిసి సోమవారం గరగపర్రు వచ్చారు. గరగపర్రులోని 63 మంది బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని వారు ప్రకటించారు. దీనికి దళితులు నిరసన వ్యక్తం చేశారు. రేషన్కార్డు ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నష్టపరిహారం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిసేపు తర్జన భర్జనల అనంతరం అన్ని బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తామని వారు ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న చోటనే ఉంచుతామని, పాత పంచాయతీ కార్యాలయాన్ని అంబేడ్కర్ భవనంగా నిర్మిస్తామని ప్రకటించిన మంత్రి ఆనంద్బాబు కొద్దిసేపటికే స్వరం మార్చారు. పక్కకు వెళ్లి ఎమ్మెల్యేతో తర్జనభర్జనలు జరిపి మీరు కోరుకున్న మరో చోట అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని, మీరనుకున్నచోట వివాదాస్పద స్థలంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. దీన్ని దళితులంతా వ్యతిరేకించారు. పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి చెప్పినా దళితులు ఒప్పుకోలేదు. మంత్రులు పితాని, జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని 36 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయించామని మీకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరంతా కలసిమెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, డీఎస్పీ పూర్ణచంద్రరరావు, ఆచంట మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, సిరింగుల బాబి, సిరింగుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
-
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీలోపలికి వెళ్లేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని కిరోసిన్ డబ్బాలతో రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ నినాదాలు చేశారు. గ్రామస్దుల ఆందోళనలతో ఎట్టకేలకు లారీలు వెనుదిరిగాయి. లారీలు వెనుదిరగడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
రైతుల ఆందోళనకు డీఎంకే మద్దతు
పళ్లిపట్టు: సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళరైతులు చేపట్టిన ఆందోళనకు డీఎంకే మద్దతు పలికింది. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దులోని కుశస్థలి నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్డ్యాం నిర్మిస్తుండడంతో తమిళ రైతులు వారం రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో చెక్డ్యాం నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శి వేణు అధ్యక్షతన మండల కార్యదర్శి జి.రవీంద్ర సమక్షంలో 300 మంది డీఎంకే శ్రేణులు ఆదివారం చెక్డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి తమిళ రైతుల ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. వేణు మాట్లాడుతూ సరిహద్దులో యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్డ్యాం నిర్మించి సరిహద్దు గ్రామీణుల మధ్య చిచ్చుపెడుతున్నట్లు తమిళ రైతులకు తీవ్ర నష్టాన్ని ఏర్పరిచే చెక్డ్యాం నిర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంతవరకు రైతులకు మద్దతుగా డీఎంకే ఆందోళనలో పాల్గొంటుందని తెలిపారు. జిల్లా డీఎంకే అధ్యక్షుడు పగలవన్, పళ్లిపట్టు పట్టణకార్యదర్శి జ్యోతికుమార్, తిరుత్తణి పట్టణ కార్యదర్శి భూపతి, మండల నాయకులు మునిరత్నం నాయుడు, దేవరాజు, దాస్, తిరుమలైలోకనాథన్, సుధామెహన్ సహా 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
కలకలం రేపిన రైతు సూసైడ్ నోట్
పుణే: మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ రైతు ఆగ్రహంపై మరింత అగ్గి రాజేసింది. రైతులకు రుణ మాఫీ తదితర డిమాండ్లను నెరవేర్చేవరకు తన శరీరం దహనం చేయరాదని ఆత్మహత్య చేసుకున్న రైతు నోట్ రాసి మరీ తన ప్రాణాలను తీసుకోవడం మరింత ఆందోళనకు తావిచ్చింది. గురువారం ఉదయం సోలాపూర్ కలెక్టర్ రాజేంద్ర భోంస్లే రైతు ఆత్మహత్య ఉదంతాన్ని ధృవీకరించారు. బుధవారం రాత్రి కర్మాళి తాలూకాలోని వీట్ గ్రామంలో ధనజీ చంద్రకాంత్ జాధవ్ (45) అనే రైతు తన ఇంటికి సమీపంలో చెట్టు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి సందర్శించేంతవరకు తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ తన ఆత్మహత్య నోట్ లో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు సంఘాలు 'రాస్తా-రోకో' నిర్వహించి, బంద్కు పిలుపునిచ్చాయి. నేను రైతును. నా పేరు ధనజీ చంద్రకాంత్ జాధవ్.ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి నా మృతదేహాన్ని గ్రామానికి తరలించకండి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన గ్రామానికి వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ . ధనజీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో రైతు రుణమాఫీ ప్రకటించేంతవరకు మృతదేహాన్ని తరలించేందిలేదని రైతులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. అయితే ఇప్పటికే ధనజీ గ్రామాన్ని సందర్శించినట్టు సోలాపూర్ కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర మంత్రి విజరు దేశ్ముఖ్ గురువారం గ్రామానికి వెళ్లారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కాగా మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2.5 ఎకరాల సాగు భూమిపై రూ. 60,000 రుణం తీసుకున్నాట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని దాదాపు 33 రైతు సంఘాలు జూన్ నెల 1వ తేదీ నుంచి వారు నిరవధిక సమ్మె చేస్తున్నాయి. రాష్ట్రంలోని ముంబై, పూణె నగరాలు సహా మొత్తం 20 జిల్లాలకు కూరగాయలు, పండ్లు, పాల రవాణాను రైతులు ఆపేసి సమ్మె చేపట్టారు ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పాలను, ఉల్లిపాయలను రోడ్లపై పారబోసి మరీ తీవ్ర ఆందోళనకు దిగారు. స్వామి నాథన్ కమిషన్ సిఫారసు అమలు, కనీస మద్దతుధర, రుణాలు మాఫీ , ఫించన్ తదితర డిమాండ్లతో రైతులు పోరాటానికి దిగారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మృతదేహాలతో ఆందోళన
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తల ఘటన శుక్రవారం ఆందోళనకు దారితీసింది. ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు (రాజా), భార్య శ్రీదేవి గురువారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సూసైడ్ నోట్ రాసి వీరు బలవన్మరణం చెందారు. వీరి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే తీసుకురావాలని, అప్పటివరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపమని రాజా తల్లి ఝాన్సీ, బంధువులు భీష్మించారు. చివరకు బం ధువులు, స్నేహితుల సూచనల మేరకు అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో పోలీస్స్టేషన్ వద్ద మృతదేహాలను తీసు కువెళ్తున్న వాహనాన్ని నిలిపి ఆందోళన చేయాలని నిర్ణయిం చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు స్టేషన్ వద్ద ఆం దోళనకు అంగీకరించలేదు. తమకు న్యాయం జరిపించాలని మృతుని తల్లి ఝాన్సీ సీఐ శ్రీనివాస్యాదవ్ను వేడుకున్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. -
డబ్బులు కట్టించుకొని వాహనాలు ఇవ్వలేదు
చిత్తూరు: మెగా ఆఫర్ కింద ద్విచక్రవాహనాలు ఇవ్వడానికి డబ్బులు కట్టించుకొని ఒక్కరికీ వాహనం ఇవ్వలేదని పులవురు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో గల హీరో షోరూమ్ వద్ద వందలాది కొనుగోలుదారులు షోరూమ్ సబ్బందితో శనివారం వాగ్వాదానికి దిగారు. భారత్ స్టేజ్-3 వాహనాలపై మార్చి 31న నగదు డిస్కౌంట్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగదు చెల్లించి వాహనాలను బుక్ చేసుకున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం వాహనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కట్టలు’ తెంచుకున్న ఆగ్రహం
► చెన్నై ఆర్బీఐ వద్ద బారులు తీరిన పెద్ద నోట్ల రద్దు బాధితులు ► ఆఖరి రోజు కావడంతో 2 కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు ► వందలాది మంది వచ్చినా.. ఒకే కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు ► మధ్యాహ్నం 2.30 గంటలకే దానినీ మూసివేసిన వైనం ► నోట్లు మార్చుకోలేక కన్నీళ్ల పర్యంతమైన బాధితులు ► కేంద్రానికి, ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కష్టపడి సంపాదించిన సొమ్ము కాష్టం పాలేనా.. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం మా పొట్టకొట్టింది. బ్యాంకు ఆధికారులే మమ్మల్ని తప్పుదారిపట్టించి నిలువునా ముంచేశారు..’ శుక్రవారం చెన్నైలోని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయం పరిసరాల్లో ఏవైపు చూసినా కరెన్సీ బాధితుల గోడు ఇది. చెల్లని డబ్బుతో మేమేమి చేయాలంటూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు కన్నీళ్లపర్యంతమయ్యారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 8వ తేదీన పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రద్దయిన నోట్లను డిసెంబర్ 31వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఇలా జమ చేసే మొత్తంపై సవాలక్ష షరతులు కూడా విధించింది. అలాగే డిసెంబరు 31లోపు తమ స్వస్థలాల్లోని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోలేని వారు ఈ ఏడాది మార్చి 31లోపు ఆర్బీఐ శాఖల్లో జమ చేసి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులు, ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) సైతం తగిన ఆధారాలతో తమ నగదును ఆర్బీఐలో మార్చుకోవచ్చని సూచించింది. ఆర్బీఐ వద్ద అష్టకష్టాలు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు శుక్రవారం చివరి రోజు కావడంతో చెన్నై ఆర్బీఐ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పలు దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఆర్బీఐ మాత్రమే దిక్కుకావడంతో తమిళనాడు సహా ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రెండు కిలోమీటర్ల పొడవున క్యూలో నిలుచున్న ఎక్కువ శాతం మందికి చివరికి నిరాశే మిగిలింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారి చేత స్టాంప్ వేయించుకుని ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన ఎన్నారైలకు మినహా మిగిలిన వారిని అనుమతించలేదు. దీనిపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా సమాధానం ఇచ్చేందుకు ఒక్క ఆర్బీఐ అధికారి కూడా అందుబాటులో లేరు. ఆర్బీఐ వద్దకు వచ్చే జనాన్ని అదుపు చేయడం కోసం నియమించిన పోలీసుల చేష్టల వల్ల అవమాన భారంతో కుంగిపోయిన కొందరు తమ చేతిలోని కరెన్సీని చింపివేసి వెళ్లిపోయారు. ‘డబ్బు తీసుకెళ్లి సముద్రంలో పడెయ్’ వందలాది మంది కరెన్సీ బాధితుల కోసం ఆర్బీఐ కేవలం ఒకే ఒక కౌంటర్ను, అది కూడా రోడ్డుపై ఏర్పాటు చేసింది. మండుటెండలో కిలోమీటర్ల పొడవున్న క్యూలో నిల్చుని తీరా కౌంటర్ వద్దకు చేరుకోగానే ‘నీవు అనర్హుడవు’ అంటూ అధికారులు నింపాదిగా చెప్పి పంపేశారు. ‘నేను ఓ విదేశీ నౌకలో కెప్టెన్ను. నోట్ల రద్దు సమయంలో ఇండియాలో లేను’ అంటూ నగదు మార్చుకోవాలని ఓ వ్యక్తి కోరగా.. ‘డబ్బు తీసుకెళ్లి సముద్రంలో పడేసెయ్’ అంటూ అక్కడి సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. క్యూలో పెద్ద సంఖ్యలో జనం ఉన్నా సరిగ్గా 2.30 కాగానే కౌంటర్ను మూసివేశారు. దీంతో తమ గతేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ గేటు వద్ద గుమికూడారు. కరెన్సీ కట్టలను పైకెత్తి చూపుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. రూ.1.74 లక్షలు పక్క కింద ఉంచుకొని నాన్న చనిపోయారు మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, దూకులపాడు గ్రామం. పక్షవాతానికి గురై మాట్లాడలేని స్థితిలో ఉండే మా నాన్న జగన్నాథం (85) మార్చి 3న చనిపోయారు. శవాన్ని తొలగించినపుడు ఆయన పక్క కింద రూ. 1.74 లక్షల పాత కరెన్సీ ఉంది. నాన్నకు వచ్చే వృద్ధాప్య పెన్షన్, సాగు భూమి కౌలు కింద వచ్చిన నగదు పక్క కింద పెట్టుకునే ప్రాణాలు విడిచాడు. మాట్లాడలేని కారణంగా మాకు చెప్పలేదు. నాన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని, ఇతర సాక్ష్యాలను తీసుకొని ఈ నెల 22వ తేదీన చెన్నై ఆర్బీఐకి రాగా 29, 30, 31వ తేదీల్లో తీసుకుంటామని చెప్పి పంపేశారు. ఈ రోజు వస్తే కేవలం ఎన్నారైలకు మాత్రమే నగదు మార్చుకునే వీలుందని మోసం చేశారు. – అల్లు జగన్మోహన్రావు, శ్రీకాకుళం జిల్లా అప్పు తీసుకుని.. పాత నోట్లు ఇచ్చారు నేను ఎలక్ట్రికల్ వ్యా పారం చేస్తాను. వ్యాపారం లో భాగంగా అప్పుపై వస్తువులు తీసుకున్నవారు పాత నగదు చెల్లించారు. మార్చి 31వ తీదీ వరకు పెద్ద నోట్లను ఆర్బీఐలో తీసుకుంటారనే నమ్మకంతో వచ్చాను. ఎన్నారైల కంటే సామాన్య జనమే ఎక్కువగా వచ్చి వెళ్తున్నారు. – మురళి, నెల్లూరు 6 వేల కోసం వచ్చా.. నేను మార్కె టింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తాను. రూ. 6 వేల కోసం 400 కిలో మీట ర్ల దూరం నుంచి వ చ్చాను. లేనిపోని ప్రశ్న లు వేసి నగదు తీసుకునేందుకు బ్యాంకు అధికా రులు నిరాకరించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఫూల్స్ చేశారు. – కిశోర్, విజయవాడ ఇదేనా భారతీయత? ప్రధాని మోదీ చీటికి మాటికీ విదేశాల కు వెళ్లి మన భారత్, భారతీయత అని గొప్ప లు చెబుతుంటారు. దేశ పౌరులను ఇలా రోడ్లపాలు చేయడమేనా భారతీయత అంటే. నోట్ల రద్దు నిర్ణయంతో నష్టపోయిన వారంతా నల్లధనం ఉన్నవారా. ప్రధాని జవాబు చెప్పాలి. – సుధాకర్, విజయవాడ వైద్యం కోసం దాచుకున్న సొమ్ము మా అన్నకు మూగ, చెవుడు. పైగా శ్వాసకోస సమస్య ఉంది. నోట్ల రద్దు విషయం ఆయనకు తెలియదు. వైద్య ఖర్చుల కోసం వికలాంగుల పెన్షన్ కింద వచ్చే సొమ్మును దాచుకున్నాడు. గత నెలలో ఆస్పత్రికి వెళ్తే పాత నోట్లు చెల్లవనడంతో రూ. 23 వేలు నాకు ఇచ్చాడు. గత నెలలో చెన్నై ఆర్బీఐకి వస్తే.. వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని తర్వాత రమ్మన్నారు. ఈ రోజు వస్తే ఎన్నారైలకు మాత్రమేనని పంపేశారు.– వేణుగోపాల్రెడ్డి, నెల్లూరు -
అడుగడుగునా ఆంక్షల కత్తి
భీమవరం: తుందుర్రు అంటే ఉలికి పడుతున్న ప్రభుత్వం.. ఆక్వా ఫుడ్పార్క్ పేరెత్తితే ఆగమేఘాలపై రంగంలోకి దిగుతున్న పోలీసులు.. అరెస్టులు, నిర్బంధాలు షరా మామూలైపోయాయి. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్క్ను సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా దాదాపు 40 గ్రామాల ప్రజల పోరాటం చేసూ్తనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్పార్క్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేలా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలిసి వినతిపత్రం అందించాలని సోమవారం అమరావతి వెళ్లిన సీపీఎం, పోరాట కమిటీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరోసారి పో రాటంపై అక్కసు వెళ్లగక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుందుర్రులో గోదావరి మెగా ఫుడ్పార్క్ వల్ల కలిగే అనర్థాలను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు వివరించేందుకు సీపీఎం నాయకులు వి.ఉమామహేశ్వరరా వు, జేఎన్వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ ముందుగా అసెంబ్లీ గేట్పాస్లు తీసుకున్నారు. దీనికిగాను సోమవారం అనుమతి లభించింది. గేట్పాస్తో పాటు వినతిపత్రాన్ని తీసుకుని బ యలుదేరిన వారిని అసెంబ్లీలోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదేమని ప్రశ్నించగా అసెంబ్లీలో ఎటువంటి వినతిపత్రాలు ఇవ్వడానికి అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. వినతిపత్రాన్ని మీకే ఇచ్చేస్తామని పాస్లు ఉన్నందును తమను లోనికి అనుమతించాలని సీపీఎం, పోరాట కమిటీ నాయకులు పోలీసులను కోరారు. అయినా వినిపించుకోకుండా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్స్టేషన్కు తరలించారని గోపాలన్ చెప్పారు. సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్లో నిర్బంధించి సొంత పూచీకత్తులతో విడుదల చేశారని తెలియజేశారు. అసెం బ్లీలో ప్రవేశించేందుకు పాస్లు ఇచ్చినా పోలీసులు వ్యవహించిన తీరు బాధాకరమని గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. తుందుర్రు అంటేనే ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతుందని వేలాదిమంది ఫుడ్పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అధికారికంగా పాస్లు పొందినా అనుమతించకపోవ డం చూస్తుంటే ప్రజలపై పాలకులకు ఉ న్న శ్రద్ధ తేటతెల్లమవుతోందని గోపాలన్ విమర్శించారు. అక్రమ అరెస్ట్లపై నిరసన గోదావరి ఆక్వా మెగా ఫుడ్పార్కు నిర్మాణాన్ని నిలుపుదల చేయా లని కోరుతూ రాజధాని అమరావతి వెళ్లిన పోరాట కమిటీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణం లోని మెంటేవారితోటలోని సీపీఎం కా ర్యాలయం నుంచి ప్రదర్శనగా పోలీస్ బొమ్మ సెంటర్ మీదుగా ప్రకాశం చౌక్ కు చేరుకుని నిరసన తెలిపారు. సీపీఎం ఆక్వాఫుడ్ పార్కు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాట కమిటీ, సీపీఎం నేతలు అసెంబ్లీ వద్దకు వెళ్లారని పట్టణ కార్యదర్శి బీవీ వర్మ అన్నారు. ఇందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. సమస్య వినేం దుకు పిలిచి అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. నిరసనలో చేబోలు సత్యనారాయణ, ఎం.వైకుంఠరావు, చెల్లబో యిన వెంకటేశ్వరరావు, కె.అప్పన్న, ఎన్.రాము తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లడిగినా నేరమే!
సాగునీరందక చేలు ఎండుతుండటంతో రైతులు రోడ్డెక్కారు. వంతులవారీ విధానంలోనూ నీటిని అందించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ నినదించారు. అదే వాళ్లు చేసిన పాపం. నీళ్లడిగిన నేరానికి ఆ అన్నదాతలపై ప్రభుత్వం కేసులు పెట్టించింది. నేడోరేపో అరెస్ట్లు తప్పవంటోంది. పెనుగొండ మండలం వడలిలో ఈ అరాచకం చోటుచేసుకుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : సాగునీరు అడిగితే చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఆదుకోండంటూ రోడ్డెక్కిన రైతులపై కేసులు నమోదు చేసింది. రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో రుజువు చేసుకుంది. సాగునీటి సమస్య పరిష్కారంపై ఇప్పటికీ దృష్టి పెట్టని సర్కారు రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదు చేయించి తమపై కేసులు నమోదు చేయించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెనుగొండ మండలం రామన్నపాలెం, వడలి, దేవ, కొఠాలపర్రు, మునపర్రు, వెంకట్రామపురం తదితర గ్రామాల్లోని శివారు భూములకు సాగునీరు అందక వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండు వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతినే ప్రమాదం ముంచుకురావడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పెనుగొండ, ఆచంట, యలమంచిలి, పోడూరు మండలాలకు సాగునీరు అందించే బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగకపోవడంతో సార్వాలోనూ సాగునీటి సమస్య వచ్చింది. కాకరపర్రు వద్ద కర్రనాచు పెరిగిపోవడంతో దిగువకు నీరు వెళ్లడం లేదు. వంతులవారీ విధానం అమలు చేస్తుండటంతో శివారు భూముల్లో పంట ఎండిపోతోంది. అక్కడి పరిస్థితిని రైతులు జల వనరుల శాఖ అధికారులకు,, నీటి సంఘాల ప్రతి నిధులకు పలుసార్లు తెలియజేశారు. వాళ్లెవరూ స్పందించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఈనెల 14న రోడ్డెక్కారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని వడలి వద్ద ఆందోళనకు దిగి, రెండు గంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు స్పందించి సాగునీరు అందించే ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిపై కేసులు పెట్టేందుకు తెగబడింది. వడలి వీఆర్వో డి.మల్లేశ్వరరావుతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. రైతులు రామన్నపాలెం లాకుల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఫిర్యాదు ఆధారంగా పెనుగొండ పోలీసులు ఐపీసీ 341, 147 రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొదట 20 మందిపై కేసు నమోదు చేసినా తర్వాత ముగ్గురు రైతు నాయకుల పేర్లు పెట్టి, మరికొందరు కౌలు రైతులు అంటూ ఎఫ్ఐఆర్ రాశారు. అధికారులపైనే కేసులు పెట్టాలి సాగు నీరందక పంటలు ఎండిపోతుంటే కౌలు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. వారిపై పోలీసులతో కేసులు బనాయించడం దారుణం. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలి. రైతులకు సాగునీరు అందించలేని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తక్షణం కేసులు నమోదు చేయాలి. కేసులు ఉపసంహరించే వరకూ ఉద్యమిస్తాం. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా శాఖ -
ఇంకా ఆంక్షల మధ్యే..
భీమవరం : భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్పార్క్ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ను సడలించలేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదేమైనా సరే.. తమ ప్రాణాలు పోయినా ఆక్వా పార్క్ను నిర్మించనీయబోమని కరాకండీగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలపక్షనాయకులు బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు భీమవరం మండలం తుందుర్రుతోపాటు నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాలిబేతపూడి, శేరేపాలెం, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రజల గోడు వినేందుకు తాము వెళ్తున్నామని, అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీలకు వినతిపత్రాలు ఇచ్చారు. గ్రామాల్లో శాంతియుతంగా పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల వారికి కలిగే ఇబ్బందులు తెలుసుకుంటామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదని అధికారులకు విన్నవించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో హడల్ ఈనెల 8న ఫుడ్పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఫుడ్పార్క్ వ్యతిరేక పోరాటకవిుటీ, సీపీఎం సిద్ధం కాగా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం పెద్దఎత్తును పోలీసు బలగాలను మోహరించి బాధితులపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కిన పోలీసుల దమనకాండ గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధిత గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ధైర్యం నింపేందుకే.. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెసుకుని వారిలో ధైర్యం నింపేందుకు అఖిపక్షం నాయకులు సిద్ధమయ్యారు. 9న విజయవాడలో వివిధ పార్టీల నాయకులు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి ఈనెల 14న ఫుడ్పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఐదు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దీంతో తమ వద్దకు వచ్చే నాయకులకు తమ గోడు వినిపించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా గతంలో తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో పర్యటించిన పర్యావరణవేత్తల అభిప్రాయాలను, రొయ్యల ప్యాక్టరీ వల్ల తాగు, సాగునీటి ఇబ్బందులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాల గురించి ప్రముఖులు చెప్పిన వివరాలను అఖిలపక్ష బృందానికి తెలియజేయాలని నిశ్చయంచుకున్నారు. సర్కారుపై ఆగ్రహం ఇదిలా ఉంటే ఫుడ్పార్క్ వల్ల తలెత్తే నష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంపై బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ వల్ల గ్రామాల్లోని మంచినీటి చెరువులు, గొంతేరు డ్రెయిన్ కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొంతేరు డ్రెయిన్లో సహజసిద్ధంగా పెరిగే మత్స్యసంపద హరించుకుపోతోందని, దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సర్కారుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. మొండిగా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఫుడ్పార్క్ కలుషిత నీరు చుక్క కూడా బయటకు రాదని, ఫ్యాక్టరీ ఆవరణలో ఆ నీటితో మొక్కలు పెంపకం చేపడతామని యాజమాన్యం చెప్పగా, ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తర్వాత కలుషిత జలాలను సముద్రంలో కలిపేలా ప్రత్యేకంగా పైప్లైన్ వేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కలుషిత నీరు రాదని చెప్పి.. ఇప్పుడు పైపులైన్లు ఎలా వేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు తమ గోడు విని ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఎన్నాళ్లిలా!
భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ, దమనకాండకు పాల్పడుతున్న ప్రభుత్వం.. ప్రజలను చల్లార్చాల్సింది పోయి పుండుమీద కారం చల్లినట్టుగా వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ‘ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పం పిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాం టి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పట్టారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగి స్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజ లకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మా ణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతి నిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొహం చాటేయగా, శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతోంది. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం వరకూ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసంలో బాధితులతో సమావేశమై ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు. అధికారుల వైఫల్యం సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని భీష్మించారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా.. భవిష్యత్లో దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
నీటికోసం రోడ్డుపై బైఠాయించిన మహిళలు
చిత్తూరు: మోటార్లు చెడిపోయినా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని వి.కోట మండలం సుద్దులకుప్పం గ్రామస్తులు నీటి కోసం బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి చేరుకున్న మహిళలు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. గుక్కెడు నీటికి నానా అగచాట్లు పడుతున్నామని పేర్కొన్నారు. తాము ఇరవై రోజులుగా నీటి కోసం ఇబ్బందులుపడుతున్నామని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని, విద్యుత్ మోటార్లు తరుచూ కాలిపోతున్నా వాటికి మరమ్మత్తులు చేయడం లేదని ఆరోపించారు. నీటి సమస్య పరిష్కరించేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని మహిళలు చెప్పారు. వీరి ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
దద్దరిల్లిన హోదా నినాదం
అత్తిలి (తణుకు) : ప్రత్యేక హోదా ఉద్యమం జిల్లాలో విస్తరిస్తోంది. సోమవారం అత్తిలి, చింతలపూడిలో ప్రత్యేక హోదా నినాదం దద్దరిల్లింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు అత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఎస్ఎస్ డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు ర్యాలీగా గ్రామ పుర వీధుల్లో తిరిగి ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బస్స్టేన్ సెంటర్లో మానవహారంగా నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. హోదాతో పరిశ్రమలు ఏర్పాటువుతాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తామంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదాయే కావాలని డిమాండ్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తుగా పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఎస్సై వీఎస్ వీరభద్రరావు విద్యార్థులకు తెలిపారు. దీంతో కొద్దిసేపు ర్యాలీ నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు విద్యార్థులు చేస్తున్న ర్యాలీ వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు విద్యార్థులకు సంఘీభావం తెలిపి, ర్యాలీని కొనసాగించారు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు మద్దాల నాగేశ్వరరావు, బుద్దరాతి భరణీప్రసాద్, ఆకుల చినబాబు, పైబోయిన సత్యనారాయణ, కంకటాల సతీష్, మద్దాల శ్రీనివాస్, గూనా మావుళ్లు, పైబోయిన శ్రీనివాస్లను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. చింతలపూడిలో రాస్తారోకో, ధర్నా చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెయిన్రోడ్డుపై సోమవారం «రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.ధామస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీలకు అలవాటు పడి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి జగపతిరావు అధ్యక్షతన జరిగిన గాంధీవర్ధంతి కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు సంకు ప్రసాద్, నిరీక్షణ, వేట వెంకన్న, సుందరం, మూర్తు జాలి, సుబ్బారావు, సూర్యనారాయణ, వెంకన్నబాబు, పాండురంగారావు పాల్గొన్నారు. -
టోకెన్లు ఇచ్చి భోజనం లేదన్నారు
* మార్కెట్ యార్డులో మూణ్నాళ్ల ముచ్చటైన ఉచిత భోజన పథకం * రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన కొరిటెపాడు (గుంటూరు): మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, మార్కెటింగ్ అధికారులు ఈనెల 20వ తేదీన అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించారు. అయితే అన్నదాతలకు టోకెన్లు ఇచ్చి, భోజనం పెట్టకపోవడంతో మంగళవారం యార్డులో గందరగోళం నెలకొంది. టోకెన్లు తీసుకొన్న రైతులు భోజనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి మిర్చి రైతులు భారీ స్థాయిలో గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం మిర్చి బస్తాలను తీసుకు వచ్చారు. అమానత్ పట్టీల ఆధారంగా యార్డు సిబ్బంది వారందరికీ ఉచిత భోజనం టోకెన్లు పంపిణీ చేశారు. మిర్చి బస్తాలను విక్రయించి భోజన హాలు దగ్గరకు వెళ్ళే సరికి భోజనం అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహించి యార్డు బయటకు వచ్చి నరసరావుపేట రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో, ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు మిర్చి రైతులు మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి క్యూలో నిలబడితే భోజనం అయిపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. భోజనం పెట్టకపోగా రైతుల పట్ల యార్డు సిబ్బంది హేళనగా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యదర్శి ఎం.దివాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇక మీదట యార్డులో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని, రైతులందరికీ భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్ప్లేట్ లేని కారుకు, వైజాగ్లోని వేరే కారు నంబర్ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్ప్లేట్ లేని కారుకు, వైజాగ్లోని వేరే కారు నంబర్ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
మధ్యాహ్న మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక నాయకుడికి లబ్ది చేకూర్చేందుకు 200 మంది మహిళల ఉపాధిని పణంగా పెట్టారు. పైకి సేవలాగే కనపడుతున్నా దీని వెనుక పెద్దఎత్తున దోపిడీకి రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. జిల్లాలో మొదటి దశలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ డీఈవో డి.మధుసూదనరావు ఆదేశాలు జారీ చేయడం ప్రకంపనలు రేపుతోంది. తొలి దశలో 65 హైస్కూల్స్ను ఆ సంస్థకు కేటాయించాలని నిర్ణయించగా ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతానికి తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లోని 35 హైస్కూల్స్ను అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అ««దl్యక్షుడిగా ఉన్న గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శుక్రవారం నుంచి జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో గల 35 స్కూల్స్కు మధ్యాహ్న భోజనం ఈ సొసైటీ నుంచి అందుతుందని డీఈవో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ సొసైటీలో రైస్మిల్లర్లతో పాటు స్వచ్ఛంద సేవ చేసేవారు ఉన్నారని, పథకం అమలు బాధ్యతను వారికి అప్పగించడం వల్ల మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, ఇరగవరం, అత్తిలి, నల్లజర్ల, భీమవరం మండలాల్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని 15,210 మంది విద్యార్థులకు ఈ సొసైటీ మధ్యాహ్న భోజనం అందజేస్తుంది. ప్రస్తుతం హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా స్కూళ్లలోనే వంటచేసి భోజనం వడ్డిస్తున్నారు. 17 ఏళ్లుగా ఈ పథకం నడుస్తుండగా.. అప్పటినుంచి డ్వాక్రా సంఘాల ద్వారా ఎంపికైన మహిళలే ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. వారే వంట సామగ్రి సమకూర్చుకుని.. స్కూల్ ఆవరణలోనే వంట చేసి విద్యార్థులకు వేడిగా వడ్డిస్తున్నారు. ఇందులో చిన్నపాటి లోపాలున్నా పథకం పూర్తిస్థాయిలోనే అమలవుతోంది. ఇకపై తాడేపల్లిగూడెం నుంచి సరఫరా కొత్తగా ఒప్పందం చేసుకున్న సంస్థ తాడేపల్లిగూడెంలో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తుంది. అక్కడే వంటలు చేసి భోజనాన్ని పాఠశాలలకు పంపిస్తారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి స్కూల్లో ఆ రోజు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా బియ్యం ఎంత వేయాలి, ఎంత కందిపప్పు వాడాలన్నది కచ్చితంగా నిర్ధారించి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు వాటిని ఇస్తున్నారు. ఇద్దరు టీచర్లు అక్కడే ఉండి వంట చేయిస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ కిచెన్లో ఎంతమందికి భోజనం వండుతారు, ఎంత పరిమాణంలో బియ్యం, కందిపప్పు వంటి సరుకులు కేటాయిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆయా స్కూళ్లలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికీ భోజనం పంపిస్తారు. అంటే.. విద్యార్థులు తక్కువ సంఖ్యలో పాఠశాలకు హాజరైనా.. ఆ పాఠశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఆధారంగా భోజనం వండి పంపిస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో నడుస్తున్న విధానానికి ఇది పూర్తి వ్యతిరేకం. 15వేల మంది విద్యార్థులకు భోజనం పంపించాలంటే ఉదయాన్నే వంట చేయాల్సి వస్తుంది. దీనివల్ల వేడి అన్నం వడ్డించడం సాధ్యం కాదు. స్థానికంగా ఉన్న అవకాశాలను వదులుకుని ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించడాన్ని చూస్తే.. దశలవారీగా ఈ పథకాన్ని పెద్ద సంస్థలకు కట్టబెట్టడానికే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్కర్లు ఇంటికే.. ప్రస్తుతం గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీకి అప్పగించిన 35 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వండటానికి సుమారు 200 మంది వర్కర్లు పని చేస్తున్నారు. ఆ పాఠశాలలను ఆ సంస్థకు అప్పగించడంతో అక్కడ పనిచేస్తున్న ఆ వర్కర్స్ అంతా ఉపాధి కోల్పోయి ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. వీరి పరిస్థితి ఏమిటనే దానిపై డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదిలావుంటే.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ 35 స్కూల్స్కు చెందిన మధ్యాహ్న భోజన కార్యకర్తలు గురువారం ఏలూరులో డీఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. శుక్రవారం జిల్లావ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఉపాధి పోగొడుతున్నారు 15 ఏళ్లుగా మధ్యాహ్నభోజన కార్మికులుగా పనిచేస్తున్నాం. ఈ పథకాన్ని ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చి అప్పులు చేసి మరీ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణం. ఈ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి వెంటనే రద్దు చేయాలి. – ఎ.శ్యామలారాణి, జిల్లా కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఉపసంహరించుకోవాలి కార్మికులు జీవనోపాధి కోల్పోయేలా డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం అమానుషం. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. చైతన్య సొసైటీ ప్రభుత్వం నుంచి అన్ని ఖర్చులకు సొమ్ములు, మెటీరియల్ తీసుకుని ఈ పథకాన్ని నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకుంటూ సేవ చేస్తున్నామని సొసైటీ ప్రతినిధులు చెప్పడం విడ్డూరం. – షేక్ మదీనాబీబీ, యూనియన్ కార్యవర్గ సభ్యురాలు ఆందోళన ఉధృతం చేస్తాం పేద కుటుంబాలకు చెందిన డ్వాక్రా గ్రూపు మహిళలు మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వేలాది రూపాయలు అప్పులు చేసి ఈ పథకాన్ని నిర్వహిస్తుంటే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తున్నారు. దీనిపై ఉద్యమిస్తాం. – ఆర్.మంగతాయారు, భోజన పథకం వర్కర్, వీరవాసరం -
65 రోజుల పోరాటం ఫలించింది
పోలవరం రూరల్ : పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోలవరం నిర్వాసితులు చేపట్టిన దీక్షలను ఎట్టకేలకు విరమించారు. ఎనిమిది గ్రామాల నిర్వాసితులు 65 రోజులుగా పోలవరంలో దీక్షలు చేపట్టారు. పలు రకాలుగా ఆందోళనలు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ ఎం.ముక్కంటి బుధవారం సందర్శించి నిర్వాసితులతో చర్చించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి 176 మంది నిర్వాసితులకు రూ.3,47,94,000 చెల్లించాల్సి ఉండగా ఈ మొత్తం మంజూరు కావాల్సి ఉందన్నారు. 12 రోజుల్లో నిర్వాసితులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని తహసీల్దార్ను నిర్వాసితులు కోరడంతో ఆయన అంగీకరించారు. 12 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మరలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని చేగొండిపల్లి, దేవరగొంది సర్పంచ్లు మడకం పరమేశు, బొరగం కన్నపరాజు, నిర్వాసితులు స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో గృహనిర్మాణ సంస్థకు సంబంధించి లీకవుతున్న ఇళ్లను, మరుగుదొడ్లను గుర్తించి వాటి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారని తహసీల్దార్ చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు కూడా అసంపూర్తిగా ఉన్న ఆలయాలు, చర్చిలు, రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేస్తారన్నారు. భూమికి భూమి కింద కేటాయించిన 40 ఎకరాల భూమి నచ్చలేదని నిర్వాసితులు చెప్పారని, దీనిలో ఐదెకరాల భూమి మరోచోట ఇస్తామని అన్నారు. మిగిలిన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టి సాగుచేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. పోలవరం ఎస్ఐ కె.శ్రీహరిరావు, ఆర్ఐ కాజా రమేష్ పాల్గొన్నారు. -
నట్టేట ముంచారు
జంగారెడ్డిగూడెం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధికారులు తమను నట్టేముంచారని వర్జీనియా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక ఎస్బీఐ, ఎస్బీహెచ్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దెత్తున ధర్నా నిర్వహించారు. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు వర్జీనియా రైతులకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చేవని అయితే ఈ ఏడాది రూ.3 లక్షలు ఇచ్చి మిగిలిన రుణాన్ని తర్వాత ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చే సమయంలో మోసం చేశారని ఆరోపించారు. రెండు నెలలుగా తిరుగుతున్నా.. గతేడాది బ్యార¯ŒSకు 25 క్వింటాళ్లు పంట అనుమతి ఇవ్వగా బ్యాంకులు ఐదు నుం చి ఆరు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాయని, ఈ ఏడాది బ్యార¯ŒSకు 30 క్వింటాళ్లు అనుమతి ఉన్నా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండు నెలలుగా బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించినా ఫలితం లేదన్నారు. అదనపు రుణం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకు అధికారుల నిర్ణయం శరాఘాతంగా తగిలిందన్నారు. 30 ఏళ్లుగా లేని నిబంధనలు పెట్టి రైతులను నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నారు. బకాయిలకు జమ రైతులకు మంజూరు చేసిన రూ.3 లక్షలూ గత బకాయిలకు బ్యాంకులు జ మచేసుకున్నాయని, దీంతో రైతు చేతికి కనీసం రూ.25 వేలు కూడా అందలేదని అన్నారు. పంట చేతికి వచ్చే సమయం లో ఎక్కువ ఖర్చులు ఉంటాయని కూ లీలకు పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో బ్యాంకర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ ఎంవీ సీతారామన్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏవో పి.సత్యనారాయణకు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డు సభ్యులు గడ్డమణుగు సత్యనారాయణ, గంటశాల గాంధీ, జి.రవికుమార్, చెరుకూరి సందరరావు, వేగేశ్న రాధాకృష్ణరాజు, తెల్లం వెంకటేశ్వరరావు, గద్దే వీరకృష్ణ తది తరులు పాల్గొన్నారు. మభ్యపెట్టి మోసం చేశారు ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకులు వర్జీనియా రైతులను నట్టేట ముంచాయి. రుణాలు పెంచి ఇస్తామని మభ్యపెడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా రుణం పెంచేది లేదని చేతులెత్తేశాయి. వర్జీనియా తోటలు మధ్యరకంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. మధ్యస్థంగా ఉన్న, చేతికి వచ్చే పంట దశలో ఉన్న రైతులు నష్టపోతారు. –గడ్డమణుగు సత్యనారాయణ, పొగాకుబోర్డు సభ్యుడు ఆత్మహత్యలే శరణ్యం వర్జీనియా రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పటివరకు రుణాలు పెంచి ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో వర్జీనియా రైతులంతా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అదంతా కోల్పోవాల్సి వస్తోంది. –గంటశాల గాంధీ, వర్జీనియా పొగాకు రైతు -
సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి
ఏలూరు సిటీ : విద్యాసంవత్సరం పూర్తికావస్తున్న దశలో ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. బి.గోపీమూర్తి, పి.ప్రసాద్, గుగ్గులోతు కృష్ణ, రాజబాబు ఈ కర్యక్రమానికి నేతృత్వం వహించారు. ధర్నాకు హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యశాఖ కార్యదర్శితో చర్చిస్తానని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 672 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబద్ధంగా ఉందని, సరిదిద్దమని విన్నవించేందుకు అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా సబ్జెక్టు రిలవెన్సీతో సంబంధం లేకుండా ఇష్టమైన వారిని పాఠశాలల్లో ఉంచి మిగిలిన వారిని డెప్యుటేషషన్ వేశారని ఆరోపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో, పాఠశాలలు ప్రారంభించిన వెంటనే మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 7 నెలలు గడిచిన అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.బాలాజీ మాట్లాడుతూ అధికారులు ఎటువంటి ముందుచూపు లేకుండా ఉత్తర్వులు జారీ చేయటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరహరి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో పి.జయకర్ (యూటీఎఫ్), పి.సాల్మన్రాజు (ఏపీటీఎఫ్), ఆర్వీవీఎం శ్రీనివాస్ (ఏపీటీఎఫ్1938), ఎన్.శ్రీనివాసరావు (డీటీఎఫ్), ప్రతాపరాజు (ఎస్టీయూ) తదితరులు ఉన్నారు. -
అమీతుమీ
చింతలపూడి : ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులు సిద్ధమవుతున్నారు. గత ఉగాది సంబరాలకు విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం కామవరపుకోటలో జిల్లా రైతు సదస్సు తలపెట్టారు. సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డితో పాటు రాష్ట్ర, రైతు సంఘం నాయకులు, జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, రైతులు పెద్ద ఎత్తున సదస్సుకు తరలిరానున్నారు. సదస్సులో రాజకీయాలకతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడేలా పోరాటానికి నిర్ణయం తీసుకోనున్నారు. రెండో దశ మంజూరుతో ఆందోళన మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడం జిల్లా రైతుల్లో ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏడేళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. పరిహారం విషయంలో రైతుల అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణ సమస్యగా మారింది. రైతులు గత మే నెలలో ఆందోళనకు దిగి కాలువ తవ్వకం పనులను అడ్డుకోవడంతో 8 నెలలుగా పనులు నిలిచిపోయాయి. పరిహారంలో వ్యత్యాసం జిల్లాలో పట్టిసీమ పథకం కాలువకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువకు మరోలా నష్టపరిహారం అందజేయడంతో రైతులు భూసేకరణకు అడ్డుపడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాలువ కింద రైతులకు ఎకరానికి రూ.30 లక్షలకు పైగా చెల్లించగా ఇక్కడ మాత్రం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
'సమ్మె విరమించాల్సిందే'
విజయవాడ: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమ్మె విరమించాలని శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్లకు అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం సమ్మె విరమించని పక్షంలో కాంట్రాక్ట్ లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా సమ్మె కాలంలో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను గాలికొదిలేశారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్న లెక్చరర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. -
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
-
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్ కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి. ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎస్ నాగార్జున ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు కార్యక్రమం చేపట్టి, స్తానిక ఆర్బీఐ అధికారులకు మెమోరాండం అందించినట్టు తెలిపారు. తాము సరిపడా నగదు సరఫరా చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ను కోరామనీ, కానీ ఆర్ బీఐ విఫలమైందని ఆరోపించారు. నగదు అందుబాటులో లేనపుడు ఆయా కార్యాలయల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొత్త నోట్లు పట్టుబడ్డ కొంతమంది వ్యక్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతోపాటు డీమానిటైజేషన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం దాదాపు 9 లక్షల బ్యాంక్ ఉద్యోగుల్లో రెండు సంఘాలు 5.50 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. రద్దయిన పాత నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్30 తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
ఆకలికేకలు విజయవంతం చేయండి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : కాపుల ఆకలి కేకల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కాపు కల్యాణ మండపం వద్ద నిర్వహించిన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం కూడలి వద్ద ప్లేట్లు, గరిటెలతో శబ్ధం చేసే నిరసన కార్యక్రమం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాపులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొత్తపల్లి సుబ్బలక్ష్మి కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షు రాలిగా కొత్తపల్లి సుబ్బలక్షి్మని చినమిల్లి వెంకట రాయుడు నియమించారు. తాడేపల్లిగూడెం పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న సుబ్బలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు. పెంటపాడు మండల అధ్యక్షుడిగా పెన్నాడ సూరిబాబును నియమించారు. కాపుల ఆకలి కేకలు నిరసనకు అనుమతి తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించే కాపుల ఆకలి కేకలు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద పట్టణ అధ్యక్షులు మాకా శ్రీనివాస్ శనివారం రాత్రి మాట్లాడుతూ పోలీస్ ఐలండ్ వద్ద ఆదివారం ఉదయం 10–11 గంటల మధ్య నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతారని చెప్పారు. కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ కాపు కుటుంబాలు ప్లేట్లు, కంచాలపై గరిటెలతో చప్పుడు చేసే కార్యక్రమం నిర్వహిస్తాయన్నారు. దీనికి డీఎస్పీని అనుమతి కోరగా, ఆయన అంగీకరిస్తూ ఆ¯ŒSలై¯ŒS ద్వారా సమాచారం పంపించారన్నారు. కాపులంతా ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. -
కురగల్లులో కొనసాగుతున్న నిరసన
కురగల్లు (తాడేపల్లి రూరల్): మండలం కురగల్లులో స్థానికుల నిరసన గురువారం కూడా కొనసాగింది. కురగల్లును రాజధాని ప్రాంతంగా నిర్ణయించినప్పటి నుంచి దళితవాడలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని మండిపడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ధర్నా విరమించాలని కోరినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో గంగానమ్మపేట అభివృద్ధి కమిటీ సభ్యులు, రాజధాని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం రవి, యువజన నాయకులు లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ నేతల సంఘీభావం గుంటూరు ఎడ్యుకేషన్: శ్రమకు తగిన విధంగా వేతనాలు చెల్లింపు కోరుతూ నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘీభావం పలికారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు గుప్పించిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంతో పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. -
విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమం
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్:కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ పిలుపునిచ్చారు. అరండల్పేటలోని మాదాల నారాయణస్వామి భవన్లో గురువారం నిర్వహించిన పీడీఎస్యూ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ వరకు ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలోకి నెట్టివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మెకాలై విద్యా విధానమే నేటికి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొఠారి కమిషనర్ సూచించిన మేరకు కేంద్ర బడ్జెట్లో పది శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం, జీడీపీలో ఆరుశాతంగా ఉండాల్సిన విద్యారంగ కేటాయింపులు గత ఐదు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిధుల కొరతతో ప్రభుత్వ విద్యాసంస్థలు కునారిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం 2016 పేరుతో విద్యా రంగాన్ని కాషాయికరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందని తెలిపారు. విద్యార్థి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి, అవినీతి, నల్లధనం నిర్మూల పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ కార్పొరేట్ శక్తులు, నల్లకుబేరులకే మేలు చేశారన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టల్స్ రద్దుకు ప్రభుత్వం పూనుకుని పేద వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. ష్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టి విద్యార్థులను అనర్హులను చేసే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించి, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రసాద్, పీడీఎస్యూ న్యాయవాదుల వేదిక కన్వీనర్ ఎస్.సురేష్బాబు, జిల్లా అధ్యక్షురాలు ఎన్.ఝాన్సి, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రకృతి, నాయకులు బి.నందకిషోర్, అక్బర్ బాషా, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు పెంచాలని నిరసన
ఏసీ కళాశాల అన్ఎయిడెడ్ అధ్యాపకుల ఆందోళన గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాల అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ ఎయిడెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ కళాశాలలో 62 మంది అన్ ఎయిడెడ్ అధ్యాపకులు రూ. 3,500ల జీతానికి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి రూ. 25 వేలకు జీతం పెంచాలని తాము అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు.ఇది దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనను అడ్డుకుంటాం.. ఏఈఎల్సీ ఆస్తుల పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షులు పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ జనవరి 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద కళాశాలలో నిర్మించబోయే భవన శంకుస్థాపనను తాము అడ్డుకుంటామన్నారు. జీతాలు పెంచకపోతే ముఖ్యమంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అధ్యాపకుల జీతాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటరత్నం, డాక్టర్ గురవయ్య, నీలాంబరం, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన
* జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులు మూసివేత * రోగులకు ఇక్కట్లు గుంటూరు మెడికల్ : కేంద్ర ప్రభుత్వం వైద్యుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం వైద్యులు ఆసుపత్రులు మూసివేసి రోడెక్కి నిరసన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బుధవారం సత్యాగ్రహం పేరుతో వైద్యులు ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు నగరంలో వైద్యులు ఆసుపత్రులు మూసివేసి గుంటూరు మెడికల్ క్లబ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ర్యాలీకి ముందు మెడికల్ క్లబ్లో ఐఎంఏ గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు సభ నిర్వహించారు. పలువురు వైద్యులు, ఐఎంఏ నాయకులు వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దును తాము వ్యతిరేకిస్తున్నామని, వైద్యులపై దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అల్లోపతి వైద్యాన్ని కేవలం అల్లోపతి వైద్యులు మాత్రమే చేసేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. కిందిస్థాయి ఉద్యోగులు, క్లరికల్ ఉద్యోగులు చేసే తప్పిదాలకు వైద్యులను బాధ్యులు చేయకూడదన్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ద్వారా క్లీనికల్ ఎస్టాబ్లీష్మెంట్ యాక్ట్లో సవరణలు చేయాలని, కన్జుమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సవరణలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షుడు డాక్టర్ ఈద కృష్ణమూర్తి, సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, సీనియర్ వైద్యనిపుణులు డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య, డాక్టర్ చక్కా శివరామకృష్ణ, డాక్టర్ బదిరి నారాయణ, డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఇంజేటి బాబ్జిశ్యామ్కుమార్, గుంటూరు శాఖ సెక్రటరీ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. మూతపడ్డ ఆసుపత్రులు.. గుంటూరు నగరంలో పలు ఆసుపత్రులు సత్యాగ్రహంలో భాగంగా మూతపడ్డాయి. పెద్ద నోట్ల రద్దుతో వారం రోజులుగా సాధారణవైద్య సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు బుధవారం ఆసుపత్రుల సమ్మెతో మరింత ఇబ్బంది పడ్డారు. అధిక సంఖ్యలో వైద్యులు, మెడికల్ క్లబ్కు చేరుకుని తమ నిరసన తెలియజేశారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రం ఇబ్బంది లేకుండా కొందరు వైద్యులు ఆసుపత్రిలో ఉండి రోగులకు సేవలు అందించారు. గుంటూరునగరంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో సత్యాగ్రహంలో భాగంగా ఆసుపత్రులు మూసివేశారు. -
జీవో-279ని రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు నెహ్రూనగర్ (గుంటూరు): మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం.279ని రద్దు చేయకుంటే దీర్ఘకాలిక పోరాటం చేయకతప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జీవో 279ని రద్దు చేయాలని, 151, 193 జీవోల ప్రకారం జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బు«ధవారం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జీవో నం : 279 వల్ల అటు కార్మికులకే కాకుండా ఇటు ప్రజల నెత్తిన ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. తెనాలి, చీమకుర్తి మున్సిపాల్టీల్లో 279 జీవో ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం నిర్వహణ, జీతాల కంటే అదనంగా దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చువుతుందని చెప్పారు. అదనపు ఖర్చుల భారమంతా ప్రజలపై వేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే నెల్లూరు, విజయనగరం, తెనాలి, సాలూరు మున్సిపాల్టీల్లో జీవో 279 అమలు పరిచి విఫలమయ్యారని తెలిపారు. 151, 193 జీవోల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడించేందుకు సైతం వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు పి.రామచంద్రరావు, ఎం.డేవిడ్, కె.తిరుపాల్, ధనలక్ష్మి, సుబ్బారావు, నాగభూషణం, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చెంతకు ససేమిరా
భీమవరం : అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడతామే తప్ప.. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి అంగీకరించేది లేదని పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆక్వా పార్క్ నిర్మి ంచడం తమకూ ఇష్టం లేదని భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు స్వరం మార్చగా.. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళదామని ప్రతిపాదించగా.. సీఎం చెంతకు వచ్చేది లేదంటూ పోరాట కమిటీ నాయకులు తెగేసి చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గృహంలో ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులతో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బండారు మాధవనాయుడు, నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల నుంచి పోరాట కమిటీ ప్రతినిధులు సుమారు 100 మంది హాజరయ్యారు. సీతారామలక్ష్మి ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు పోరాట కమిటీకి చెందిన కొందరు నాయకులతో మాత్రమే ఎమ్మెల్యేలు మాట్లాడతారని, వారు మాత్రమే లోపలికి రావాలని చెప్పారు. దీనిని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేం మాట్లాడినా అందరి సమక్షంలో మాట్లాడాలని, లేకుంటే తాము చర్చలకు వచ్చేది లేదని భీష్మించారు. దీంతో చేసేదిలేక వచ్చిన వారందరినీ పిలిచి చర్చించారు. మా శవాలపై కట్టుకోండి ముందుగా వివిధ గ్రామాలకు చెందిన 12 మంది పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుడ్పార్క్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ శవాలపై కట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫుడ్పార్క్ నిర్మాణం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే కొన్ని పరిశ్రమల వల్ల యనమదుర్రు డ్రెయి¯ŒS పూర్తిగా కలుషితమై అనేక గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, రావులపాలెం మండలం ఈతకోట, నెల్లూరు జిల్లాలో గల రొయ్యల ఫ్యాక్టరీల్లో అమోనియా గ్యాస్ లీకై వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఉద్యమకారులు వివరించారు. వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. మొదట్లో తమకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడు ఆ తరువాత ఎందుకు మాట మార్చారని నిలదీర్చారు. స్వరం మార్చిన ఎమ్మెల్యేలు ఉద్యమకారులతో భేటీలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు స్వరం మార్చారు. నిన్నటివరకు ఫుడ్పార్క్ నిర్మాణం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వారిద్దరూ.. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకోబోమని ఉద్యమకారులతో భేటీలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కావాలని తాను కూడా కోరుకోవడం లేదన్నారు. ఆక్వాపార్క్ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణం విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని, పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు మాత్రమే తాము గుర్తొచ్చామని చెప్పారు. ప్రజలందరి అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ‘నేనూ వ్యతిరేకించా’ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల తామంతా నష్టపోతామని నరసాపురం నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల ప్రజలు తనకు చెప్పారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆదేశించారన్నారు. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్, కొన్ని పంట కాలువలు కలుషిత కావడం వల్ల తన నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని మాధవనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా ఫుడ్పార్క్ నిర్మాణం వల్ల నష్టం కలుగుతుందని తేలితే దానిని తాను కూడా వ్యతిరేకిస్తానని స్వష్టం చేశారు. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తాం ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉద్యమకారులతో జరిపిన భేటీలో ప్రకటించారు. గ్రామాల్లో విధించిన 144 సెక్ష¯ŒS ఎత్తివేతకు కృషిచేస్తామన్నారు. ఫుడ్పార్క్ నిర్మాణం వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ఒక కమిటీగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిద్దామని ప్రతిపాదించగా, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎట్టి పరిస్థితిల్లో చంద్రబాబు వద్దకు వచ్చేది లేదని, ప్రజాప్రతినిధులే ఆయనతో మాట్లాడి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు. ‘హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒS వచ్చారు.. మీరు మాత్రం రాలేదు ఆక్వాపార్క్ ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్ట్లతో భయాందోళనలకు గురైన ప్రజలను ఓదార్చేందుకు, వారిపక్షాన నిలబడేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి వచ్చారని, జిల్లాలోనే ఉన్న మీరెందుకు రాలేకపోయారని ఉద్యమకారులు ఎమ్మెల్యేలను నిలదీశారు. తమ గ్రామాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు, మాధవనాయుడుకు తీరిక దొరకలేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన మీరు ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులకు, పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఆక్వా పార్క్ను ఎట్టిపరిస్థితుల్లో జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. -
లస్కర్ల ఆందోళన
* వర్క్ఇన్స్పెక్టర్పై దాడి చేసిన రైతును అరెస్ట్ చేయాలని డిమాండ్ నరసరావుపేట: విధి నిర్వహణలో ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్పై దాడి చేసిన రైతును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని లస్కర్లు, వర్క్ ఇన్lస్పెక్టర్లు సుమారు 400 మంది గురువారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం ఆశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొహిద్దీన్ను చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ...యడ్లపాడు నీటిపారుదల శాఖలో వర్క్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎం.నాగేశ్వరరావు 18/6వ మైలు రాయి వద్ద విధి నిర్వహణలో ఉండగా సమీపంలోని రైతు ఎన్.శ్రీరామమూర్తి ఆయిల్ ఇంజిన్లతో తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా వారించాడని, దీనిపై రైతు వర్క్ఇనస్పెక్టర్ గొంతు పట్టుకొని దుర్భాషలాడుతూ కొట్టాడని తెలిపారు. నాగేశ్వరరావు సంబంధిత ఏఈకి తనపై జరిగిన దాడిని గురించి తెలియచేసి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదుచేశాడని, అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబితేనే ఫిర్యాదును స్వీకరిస్తామని పోలీసులు చెబుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. రైతును శుక్రవారం నాటికి అరెస్టు చేయిస్తామని ఈఈ హామీ ఇచ్చినా కేసు నమోదుచేసి అరెస్టు చేసేంతవరకు తాము విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. దీంతో బాధితుడిని తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయాలని ఏఈని ఈఈ మొహిద్దీన్ ఆదేశిస్తూ ఎస్.ఇ రామప్రసాదుకు పరిస్థితి వివరించారు. దీంతో తాను కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళానని, ఆయన ఏఎస్పీతో మాట్లాడారని, కేసు నమోదు చేసి రైతును అరెస్టు చేస్తామని హామీ ఇచ్చినందున ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఎస్ఈ ఫోన్ ద్వారా ఉద్యోగులకు చెప్పారు. అయినా రైతును అరెస్టుచేస్తేనే తాము ఉద్యోగాలు చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. -
న్యాయవాదుల నిరసన
తిరువూరు: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిపై సోమవారం సాయంత్రం జరిగిన దాడి సంఘటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. కక్షిదారుతో కోర్టు ఆవరణలో మాట్లాడుతున్న తనపై ప్రతివాది బడుగు భాస్కరరావు దాడిచేశారని న్యాయవాది వాకదాని లక్ష్మీనారాయణ జడ్జికి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగళ్ళ మోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళనలో న్యాయవాదులు సంకురాత్రి జనార్థనరావు, మాకరాజు రాంమోహనరాజు, అత్తునూరు ప్రభాకరరెడ్డి, మేకల నాగేంద్రప్రసాద్, మోదుగుమూడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, సీత, శ్రీనివాసరావు, మురహరి పాల్గొన్నారు. -
జీఎస్టీ బిల్లు సవరించే వరకూ పోరాటం
మధురానగర్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లు సవరించే వరకు పోరాడతామని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ స్థానిక విజయవాడ ధర్నా చౌక్లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎక్తా డిప్యూటీ జనరల్ సెక్రటరీ తోట రాజశేఖర్ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయాలని కోరారు. కేంద్రం అధికారాలను తమ వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీన పరుస్తోందని విమర్శించారు. కేంద్రlప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో వాణిజ్య పన్నుల శాఖల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ శేఖర్, రఘునాథ్ మాట్లాడుతూ వస్తు సేవల చట్టవ్యవస్ధలో రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్ర ఎకై ్సజ్ శాఖ సిబ్బందితో సమానంగా విధులు, అధికారాలు, జీతభత్యాలు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయవాడ రెండో డివిజన్ కార్యదర్శి కే నాగరాజు, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఎస్ఎస్ఎన్ ప్రసాద్బాబు, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విజయవాడ రెండో డివిజన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు పాల్గొన్నారు. -
ఆరని నిరసన జ్వాల
-
డాక్టర్ లక్ష్మీ అరెస్టు ఇంకెప్పుడు..?
గుంటూరు మెడికల్: ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆమెకు ఉన్న పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు డాక్టర్ లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు, కొందరు రోగులు డాక్టర్పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైద్యులతోపాటు ఆయాలు, నర్సులు, రోగులందరూ ప్రొఫెసర్ లక్ష్మి దూషణలపై ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు ఆమెను అరెస్ట్ చేయరంటూ ప్రశ్నించారు. రోగులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ముగ్గురు వైద్యులతో కూడిన హైపవర్ కమిటీ శుక్రవారం కూడా జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది విచారించింది. -
ఆరని నిరసన జ్వాల
* సంధ్యారాణి మృతికి కారణమైన ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని కొనసాగుతున్న ధర్నా * లేదంటే నిరసన కొనసాగిస్తాం * జూడాల సంఘం వెల్లడి * నగరంలో భారీ ర్యాలీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని అరెస్టు చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గురువారం మృతురాలి చిత్రపటాలను పట్టుకుని.. నల్లబ్యాడ్జీలు ధరించి నగరంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి న్యాయం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. గుంటూరు మెడికల్: డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని అరెస్టు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు(జూడా) స్పష్టం చేశారు. గురువారం డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పెట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి హిందూ కళాశాల మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తొలుత బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు సూపరింటెండెంట్ చాంబర్ వద్దే నేలపై బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ సుబ్బారావు జీజీహెచ్కు వచ్చి జూడాలతో మాట్లాడారు. తొలుత ఏర్పాటు చేసిన కమిటటీపై తమకు నమ్మకం లేదని జూడాలు చెప్పటంతతో ముగ్గురు సభ్యులతో హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, విజయవాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నెల్లూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి హైపవర్ కమిటీలో ఉన్నారని తెలిపారు. డీఎంఈ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని జూడాలు ప్రొఫెసరల్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలంతా లక్ష్మిపై ఫిర్యాదు... ఆసుపత్రిలో జూడాలు చేస్తున్న సమ్మెకు ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నేతలు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మద్దతుగా గంటసేపు నిరసన తెలిపారు. వీరు డాక్టర్ లక్ష్మిపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బహిరంగ విచారణలోనైనా ఆమెపై ఫిర్యాదు చేస్తామన్నారు. తదుపరి డీఎంఈ ఆస్పత్రి అధికారులు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పోలీస్ అధికారులతో చర్చించి వెళ్లిపోయారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్సీలు సరిత, సంతోష్ ఆస్పత్రికి వచ్చి జూడాలతో చర్చించారు. లక్ష్మిని తక్షణమే అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు. హైపవర్ కమిటీ విచారణ హైపవర్ కమిటీ సభ్యులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రొఫెసర్ లక్ష్మిపై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేశారు. వైద్యుల నుంచి రోగుల వరకు ఆస్పత్రిలో అందరితో మాట్లాడారు. 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తాం.. గురువారం అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలకు హాజరైన జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్ లక్ష్మిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే అత్యవసర వైద్య సేవలను నిలిపివేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
కాంట్రాక్టర్లు ఏం పాపం చేశారు
విజయవాడ సెంట్రల్: ఏం పాపం చేశారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని నగరపాలక సంస్థ వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ప్రశ్నించారు. బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు గురువారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి ఆమె సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 2009 నుంచి బకాయిలు పెండింగ్ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల జీతాలను క్లియర్ చేసిన తరహాలోనే కాంట్రాక్టర్ల బిల్లుల్ని చెల్లించాలన్నారు. పాలకులు కాంట్రాక్టర్ల న్యాయమైన డిమాండ్ను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. సమ్మె చేస్తే అభివృద్ధికి ఆటంకం 26వ తేదీ నుంచి సమ్మె జరిగితే నగరాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని పుణ్యశీల అన్నారు. ఇప్పటికే డివిజన్లలో అసంపూర్తిగా పనులు నిల్చిపోయాయన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు సంబంధించి రూ.230 కోట్లు మంజూరయ్యాయని ఇందులో ఎవరెవరికి ఎంతమేర బిల్లులు చెల్లించారో అధికారులు బహిర్గతం చేయాలన్నారు. బడా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్న టీడీపీ చిన్న కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందన్నారు. ఏళ్ళ తరబడి బిల్లులు రాక ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కార్పొరేషన్లో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ చొరవ చూసి సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆదిబాబు మాట్లాడుతూ తమ పోరాటానికి మొట్టమొదటిగా మద్దతు తెలిపింది వైఎస్ఆర్సీపీ పార్టీయేనన్నారు. పార్టీ కార్పొరేటర్లు షేక్బీజాన్బీ, జమల పూర్ణమ్మ, పాల ఝాన్సీలక్ష్మి, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మూడవరోజూ కాంట్రాక్టర్ల ఆందోళన అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ కాంట్రాక్టర్లు చెవిలో పూలతో మూడురోజు ఆందోళనను కొనసాగించారు. నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన, ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు వీరబాబు, అంకేశ్వరరావు మాట్లాడుతూ కమిషనర్ మొండి వైఖరి విడనాడాలన్నారు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకం పూర్తి కావొస్తున్నా బిల్లులు చెల్లించబోమనడం సరికాదన్నారు. 26 నుంచి నగరంలో ఎక్కడా అభివృద్ధి పనుల్ని జరగనీయమన్నారు. కార్పొరేషన్లో డబ్బులు లేవని చెప్పడం తమ చెవిలో పూలు పెట్టడమే అన్నారు. డబ్బుల్లేకుండా రూ.32 కోట్లతో కొత్త భవనం ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.యూనియన్ నాయకులు రాఘవేంద్రరావు, సీహెచ్. వెంకటేశ్వరరావు, పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలు చేయాల్సిందే
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): అడ్హాక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్సీని అమలు చేయాలంటూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగ జేఏసీ నిరసన కార్యక్రమంలో రెండు రోజూ కొనసాగింది. శనివారం కూడా గంట పాటు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. సోమవారం నుంచి పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులంతా స్వచ్చందంగా ఆందోళనలో పాల్గొన్నారు. -
దౌర్జన్యకాండను అడ్డుకోండి..
అన్యాయంగా తమపై దాడి చేశారని పిల్లుట్ల దళితుల నిరసన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా మాచవరం: తమపై దౌర్జన్యం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిపించాలని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దారు కార్యాలయం, పోలీసుస్టేషన్ ఎదుట పిల్లుట్ల గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొందరు బుధవారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఎస్సీ కాలనీకి చెందిన ఎండూరి రవి, మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో, కేసు వాపసు తీసుకోకుంటే అంతు చూస్తామంటూ యాదవ కులానికి చెందిన కొందరు గురువారం రాత్రి కాలనీలోకి వచ్చి అడ్డువచ్చిన వారిని కొట్టారని వాపోయారు. అంతేగాక అధికార పార్టీ నాయకుల అండతో శుక్రవారం తమపై అక్రమ కేసు బనాయించారని చెప్పారు. గతంలోనూ ఇదే విధంగా జరుగగా, ఎస్సై రాజీ కుదిర్చారని తెలిపారు. పదే పదే దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దారు ఆజాద్కు, స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
జీజీహెచ్లో విద్యార్థిని మృతి
గుంటూరు ఈస్ట్: జ్వరంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పైగా మతిచెందిన తర్వాత కూడా ఐసీయూలోకి తీసుకువెళ్లి ప్రత్యేక వైద్యం అందించినట్టు వైద్యులు నాటకాలాడారని బంధువులు ఆరోపించడం జీజీహెచ్లో కలకలం రేపింది. మృతురాలి మేనమామ గోరంట్ల సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ మండలం బైజోత్పురంలో నివసించే కూరపాటి నాగరాజు,సుజాతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రణతి (16) తెనాలిలోని జేఎమ్జే కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు గుంటూరు స్వర్ణభారతి నగర్లోని తన అమ్మమ్మ గోరంట్ల మేరీ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం నుంచి జ్వరంగా ఉండడంతో పాటు సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం 103 వార్డుకు తరలించారు. అర్ధరాత్రిలో ప్రణతి కడుపునొప్పితో మెలికలు తిరిగి వాంతి చేసుకుంది. ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్లకు తెలియచేసినా వారు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డ్యూటీలో లేని మరో వైద్యుడు ప్రణతి మృతి చెందిన విషయాన్ని బంధువుల చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు హడావుడిగా విద్యార్థినిని ఐసీయూకి తరలించారు. కొంతసేపు ప్రత్యేక వైద్యం చేసి ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగానే ప్రణతి మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని ఆర్ఎమ్వో డాక్టర్ రమేష్ హామీ ఇచ్చినా బంధువులు ఆందోళన కొన సాగించారు. -
టీడీపీ కార్పొరేటర్, ఆమె భర్తపై కేసు పెట్టాలి
ఏలూరు సెంట్రల్ : పెద్ద కృష్ణ హత్య కేసులో పోలీసులు అసలు నిందితులను వదిలిపెట్టి వేరేవారిపై కేసులు పెడుతున్నారని నిరసిస్తూ మృతుని బంధువులు గురువారం రాత్రి టూటౌన్ పోలీస్స్టేçÙన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, ఆమె భర్త సురేషే నిందితులని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో టూటౌన్ పోలీసు స్టేషన్కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. గంటకుపైగా ఆందోళన చేయడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆధిపత్యం కోసమే కార్పొరేటర్ భర్త తన అన్నను చంపారని మృతుని సోదరుడు చిన్ని కృష్ణ ఆరోపించారు. తమను హత్య చేయడానికి యత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పడంతో తాను హైదరాబాద్ వెళ్లానని, తన అన్నను సురేష్ అతని వర్గం పొట్టన పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో తనను హత్య చేయడానికి యత్నించారని, తీవ్ర గాయాలై 47 కుట్లు పడినా తాను బతికి బయటపడ్డానని చెప్పారు. తన సోదరుడిని తీసుకువెళ్లి హత్య చేయడానికి కారణమైన వారిని సాక్షిగా చూపించారని, డీఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురూ గంజాయి తాగేవారని, వారిని ఈ కేసులో చూపించి పోలీసులు చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఎస్పీ డీఎస్పీ భాస్కర్ ఘటనాస్థలానికి వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఘటనకు ప్రత్యక్ష సాక్షులని మృతుని బంధువులు కొందరిని చూపించడంతో వారి నుంచి మరో ఫిర్యాదును పోలీç Üులు తీసుకున్నారు. కార్పొరేటర్, ఆమె భర్తపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీలు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చా రు. ఆందోళనలో తెలుగుదేశం కార్పొరేటర్ కరణం లోకేష్ పాల్గొనడం విశేషం. -
అక్రమ కేసులకు చంద్రబాబుదే బాధ్యత
తణుకు అర్బన్ : ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టడం, తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి దురాగతాలకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ పేర్కొన్నారు. తణుకు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ బాధితురాలు ఆరేటి సత్యవతిని బృందాకరత్ గురువారం పరామర్శించారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడి అమాయకులపై హత్యానేరం కేసులు మోపి జైళ్లలో పెట్టడం దారుణమన్నారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్న తీరు బా«ధాకరమన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల నీరు, గాలి కలుషితమవుతాయనే భయంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారి అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తుందుర్రు పరిసర గ్రామాలను పోలీసు చట్రంలో నిర్బంధించి పరిశ్రమ నిర్మిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. ఆమె వెంట ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్వరూపారాణి, కార్యదర్శి రమాదేవి, తణుకు డివిజన్ సీపీఎం కార్యదర్శి పీవీ ప్రతాప్, ఆల్ ఇండియా లాయర్స్ యూని యన్ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి, ఐద్వా తణుకు డివిజన్ కార్యదర్శి కె.నాగరత్నం, నాయకులు గార రంగారావు, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్ల సురేష్, జేఎస్పీ నాయకుడు అనుకుల రమేష్, ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ నాయకుడు పీఎల్ నరసింహరావు ఉన్నారు. -
చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి
భీమవరం :‘మీరెవరూ అధైర్య పడకండి. పోలీస్ దౌర్జన్యాలను.. సర్కారు గూండాగిరికి భయపడి కన్నీరు పెట్టకండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై పోరాడండి. చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ ఆక్వా ఫుడ్పార్క్ బాధిత గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం పాత బస్టాండ్లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల సహజ వనరులు పూర్తిగా దెబ్బతింటాయని, తాగు, సాగునీటి వనరులు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తుందుర్రు సమీపంలోని సుమారు 40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం కారణంగా ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం కరువై జీవచ్ఛవాల్లా గడపాల్సి వస్తోందన్నారు. వేలాది మంది వ్యతిరేకిస్తున్నా ఫుడ్పార్క్ నిర్మాణం కోసం పోలీసులను ఉపయోగించి ప్రజలపై దౌర్జన్యాలు చేయడం సరికాదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహించగలరని ప్రశ్నిం చారు. ఆక్వా పార్క్ అవసరాలకు ప్రతిరోజు లక్ష లీటర్ల నీటిని వాడతారని, 50 వేల లీటర్ల కలుషిత నీటిని విడుదల చేస్తారని చెప్పారు. ఈ కారణంగా తాగు, సాగునీరు కలుషితమై ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్ యాజమాన్యం భూములు కొనుగోలు చేసే సమయంలో అక్కడి రైతులకు చేపల చెరువులు తవ్వుతామని నమ్మించిం దన్నారు. ఆ భూముల్లో కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వా పార్క్ నిర్మిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే యాజమాన్యానికి కొమ్ముకాయడంలో ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన కారణంగా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు : శేషుబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రజలను జైలులో పెట్టి ఆక్వా పార్క్ నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వానికి వారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాభివృద్ధికి, ఫ్యాక్టరీల నిర్మాణానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. పార్టీ నాయకుల బృందం ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుకుందని, అక్కడి పరిస్థితులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ఇప్పటికే ఇసుక మాఫియగా తయారైన టీడీపీ నేతలు ఫ్యాక్టరీల పేరిట మరింత దోచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఐద్యా రాష్ట్ర కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజలు చుట్టూ నది ప్రవహిస్తున్నా తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నారని.. పర్యావరణానికి హాని కలిగించే ఆక్వా పార్క్ వంటివి నిర్మిస్తే రానున్న రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బల రామ్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీని ఒప్పంద పత్రంలో ప్రైవేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్యాక్టరీల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసే ఫుడ్పార్క్ను జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. తుందుర్రులో ఆక్వా పార్క్కు బదులుగా ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ శిబిరాలను, నిర్బంధాలను తక్షణమే తొలగించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఫుడ్పార్క్ నిర్మాణం నిలిపివేసేవరకు పోరాటం ఆగదన్నారు. బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, భీమవరం, నరసాపురం మునిసిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్స్ గాదిరాజు వెంకట సత్యసుబ్రహ్మణ్యంరాజు (తాతరాజు), ద్వారా సాయినాథ్ ప్రసాద్, సీపీఐ నాయకురాలు పెన్మెత్స దుర్గాభవాని, ఎంసీపీఐ నాయకుడు శానంపూడి నాగరాజు, సీపీఎం రాష్ట్ర నాయకురాలు డి.రమాదేవి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గన్నాబత్తుల సత్యనారాయణ, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి.కల్యాణి, తుందుర్రు ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, నాయకులు గంగరాజు, పెందుర్తి దుర్గాభవాని, జేఎన్వీ గోపాలన్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనం బహిరంగ సభకు భీమవరం, మొగల్తూరు, నరసాపురం, వీరవాసరం మండలాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు ఆటోలు, వ్యాన్లు వంటి వాహనాలపై చేరుకున్నారు. ఆక్వా పార్క్ ప్రభావిత ప్రాంతాల నుంచి మహిళలు చంటిబిడ్డలతో హాజరుకావడంతో ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రజల నుంచి ఏ మేరకు వ్యతిరేకత ఉందో అవగతమవుతోందనే వ్యాఖ్యలు వినిపించాయి. మహిళలతో మమేకమైన బృందాకరత్ బృందాకరత్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే సభకు హాజరైన మహిళల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు. వారు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు అధైర్యపడవద్దని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్ల కోసం ఉద్యమం
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాలు సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జాతీయరహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం, సౌత్రాజుపాళెం క్రాస్ రోడ్ల వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది 52 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని మూడంచెల పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. ప్రజా ఉద్యమం, రాజకీయ ఒత్తిడి, న్యాయపోరాటం చేసి సర్వీస్రోడ్లు, అండర్ బ్రిడ్జీలను సాధిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా సర్వీస్రోడ్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉన్నా, నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కనుపర్తిపాడు సమీపంలో జాతీయరహదారిపై టోల్గేట్ నిర్మాణాన్ని ఉద్యమాలతో నిలిపేశామని, ఇదే పంథాతో ప్రస్తుతం వీటి సాధనకు ఉద్యమిస్తామన్నారు. ఈ నెల ఆరో తేదీన బుజబుజనెల్లూరు క్రాస్రోడ్డు వద్ద జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై బుజబుజనెల్లూరులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఉద్యమానికి కార్యాచరణను రూపొందించామని వెల్లడించారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు నరసింహయ్యముదిరాజ్, పురుషోత్తమ్యాదవ్, మందా పెద్దబాబు, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాసగౌడ్, రియాజ్, బహుదుల్లా, ఖాదర్బాషా, సప్తగిరి శీనయ్య, సాయి సునీల్, జయవర్ధన్, మదన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మిల్లు తెరిపించకుంటే ఆమరణ దీక్షే..
* భజరంగ్ జూట్మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి * వాయిదా వేసుకోవాలని కోరిన కలెక్టర్ కాంతిలాల్ దండే * వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ గుంటూరు (పట్నంబజారు): రోజురోజుకు భజరంగ్ జూట్మిల్లు అంశం వేడెక్కుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గత సంవత్సరం అక్టోబరు 2వ తేదీన మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం గడుస్తోంది. ఈ నేపథ్యంలో జూట్మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడిన విషయం విధితమే. ఆదివారం నుంచి దీక్షకు దిగుతున్నట్లు పరిరక్షణ సమితి సభ్యులు శనివారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి తెలియజేశారు. ఈలోగా సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ మిల్లు మూసి 15 నెలలు గడుస్తుంటే కనీసం ఆ కార్మికుల కడుపులు కాలుతున్న సంగతి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకటికి పలుమార్లు హామీలు ఇవ్వడమే తప్ప, చేస్తోంది ఏమీ లేదని మండిపడ్డారు. యాజమాన్యం నిరంకుశ వైఖరిపై పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రాణాలు విడిచి అయినా మిల్లు తెరిపించుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులతో చర్చించిన కలెక్టర్ మిల్లు యాజమాన్యం మరోమారు చర్చకు సానుకూలంగా ఉందని చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులు, కార్మికులు, సహనాన్ని పాటించాలని కోరారు. వారం రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతానికి దీక్షను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అప్పిరెడ్డి సమస్య పరిష్కారం అవుతుందంటే దీక్షను కచ్ఛితంగా వాయిదా వేస్తామన్నారు. సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఆమరణ దీక్ష చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో పరిరక్షణ సమితి సభ్యులు న్యాయవాది వైకే, ఎన్.భావన్నారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ జానీ, ఎబ్బూరి పాండురంగ తదితరులున్నారు. -
జీతాల కోసం సెక్యూరిటీ గార్డుల ధర్నా
నెల్లూరు(అర్బన్): పనిలో చేరి నాలుగు నెలలైనా ఒక్క నెల జీతం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పెద్దాసుపత్రి వద్ద 100 మంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవా«ధ్యక్షుడు నరమాల సతీష్ మాట్లాడారు. నాలుగు నెలలుగా జీతాలివ్వక పోయేసరికి పలువురు సిబ్బంది అర్ధాకలితో పనిచేసి ఇంటికి వెళుతున్నారన్నారు. ఇదే సమయానికి అటుగా వచ్చిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుకి కూడా ఖాళీ క్యారియర్ బాక్సులు చూపించి బాధపడ్డారు. జీతాల విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా తనకు సంబంధం లేదని, ఏజెన్సీ వారిని అడిగి తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. జేపీ ఇంతియాజ్కు తమ బాధలు విన్నవించుకోవడంతో సూపరింటెండెంట్ను పిలిచి జీతాల ఆగిన విషయమై వివరణ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అల్లాడి గోపాల్, యూనియన్ నాయకులు సందానిబాష, ఉస్మాన్, అహ్మద్ బాష, రమణయ్య పాల్గొన్నారు. సూపరింటెండెంట్పై కలెక్టర్ ఆగ్రహం సెక్యూరిటీ గార్డుల విషయాన్ని విజయవాడలో ఉన్న కలెక్టర్ ముత్యాలరాజు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి ఫోన్ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీతాలు రాకపోతే అధికారిగా ఏమి చర్యలు చేపట్టావో వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దిగొచ్చిన ఆమె కార్మికుల వద్దకి వచ్చి జీతాలు రెండు రోజుల్లో ఏర్పాటు చేయిస్తానన్నారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. -
జాతీయ రహదారి దిగ్బంధం
– ఇందిరమ్మ కాలనీ వాసుల ఆందోళన – 10 కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు – ఆందోళనకారులకు ఎమ్మెల్యే మద్దతు మదనపల్లె: మౌలిక వసతులు కల్పించాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన అమ్మచెరువు మిట్ట వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం మదనపల్లె– కదిరి జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఉదయం మూడు గంటల సేపు రోడ్డును దిగ్బంధించడంతో ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందిరమ్మ కాలనీలో సుమారు 4 వేలకు పైగా కుటుంబాలున్నాయి. పదేళ్లుగా అధికారులు వివక్ష చూపుతూ మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. దీంతో కాలనీ వాసులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారం కోసం మదనపలె ్లసబ్కలెక్టరేట్ ముందు 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు వందల సమఖ్యలో కదిరి–మదనపల్లె జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు రోడ్డుపై బైఠాయించారు. తమ కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపి ఎర్రటి ఎండలో ఆందోళనకారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా ఫలితం లేదు. ఎట్టకేలకు అధికారులు నేరుగా వచ్చి సబ్కలెక్టర్తో చర్చించి లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.