విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ (29) అనే యువకుడు కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.