brain dead
-
బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్పాట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
మరణిస్తూ మరికొందరికి ప్రాణం పోసి..
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు జీవన్దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు. 22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడిప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. -
మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే..
కాజీపేట: ‘ఒక దీపం వెలిగించును వేలకొలది జ్యోతులు. ఒక దీపం చూపించును ప్రగతికి రహదారులు’ అన్నాడో కవి. ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి అచేతనావస్థకు చేరుకోవడంతో జీవచ్ఛవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కానీ ఆ యువతి మాతృ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. ఈ విషాద ఘటన కాజీపేటలో శనివారం జరిగింది. బాపూజీనగర్ కాలనీకి చెందిన వశాపాక శ్రీనిత (23) పదిరోజుల కింద ఆడశిశువుకు జన్మనిచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనిత ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే శ్రీనిత బ్రెయిన్ వాపు వచ్చి కోమాలోకి వెళ్లింది. చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పుట్టిన బిడ్డ కనీసం తల్లి స్పర్శకు నోచుకోలేదు. ఇక.. ఎప్పటికీ తిరిగిరాని తమ బిడ్డ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని కన్నవాళ్లు, భర్త అవయవదానానికి అంగీకరించారు. శ్రీనిత కళ్లు, గుండె, కిడ్నీలు, లివర్లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరో నలుగురికి అమర్చారు. బిడ్డ పుట్టిందనే విషయం తెల్సి మురిసిపోయిన శ్రీనిత.. ఆ బిడ్డ ఆత్మీయ స్పర్శను ఆస్వాదించకుండానే కన్నుమూసింది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శనివారం రాత్రి బాపూజీనగర్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ఆ ఇద్దరిపై చర్యలేవీ!?
తెనాలి రూరల్: రౌడీషీటర్ రాగి నవీన్ చేసిన అమానుష దాడిలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన సహానా కేసు విచారణలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోకపోవడం వీరి అనుమానాలకు ప్రధాన కారణం. ఈనెల 19న సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో సహానాను నవీన్ తన కారులో తీసుకెళ్లి తెనాలి మండలం కఠెవరం నుంచి ఎరుకలపూడి వెళ్లే మార్గంలో ఆమైపె దాడిచేశాడు.సహానా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వెనుకనున్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో సహానా తల్లి అరుణకుమారికి ఫోన్చేసి విషయం చెప్పి ప్రకాశం రోడ్డులోని మరో వైద్యశాలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడకు సహానా తల్లి వెళ్లగానే ముగ్గురూ జారుకున్నారు. ఇక పోలీసులకు అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదులో నవీన్, అతని స్నేహితుల ప్రస్తావన ఉంది కానీ, 22వ తేదీ సాయంత్రం మీడియాకు నవీన్ అరెస్టు విషయాన్ని పోలీసులు వెల్లడించిన సందర్భంలో నిందితుడి స్నేహితుల ప్రస్తావనలేదు.దర్యాప్తు ‘సాగు..తోందంట’!సహానా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు వంగా సాంబిరెడ్డికి నవీన్ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరాడు. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా మొన్నటి ఎన్నికల్లో చురుగ్గా పనిచేశాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని సహానా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. నవీన్తో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులను దత్తు, సుమంత్లుగా పోలీసులు గుర్తించినా వారిపై చర్యల్లేవు. కేసు పురోగతిపై టూటౌన్ సీఐ నిసార్ బాషాను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప.గో... పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసు!
యలమంచిలి: పుట్టెడు దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా... ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడిని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరిపాలేనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు(బుల్లియ్య) కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టం కొనుక్కుని ఫంక్షన్స్కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల ఒకటోతేదీన కుమ్మరపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు.దానికి పవన్కుమార్ తన స్నేహితుడు కుడక అజయ్తో కలసి సౌండ్ బాక్సులను ఏర్పాటుచేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైనా పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా, అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు ఇద్దరినీ పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పవన్ తలలో రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినా... 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు చెప్పారు. చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మతో కలసి అక్కడకు వెళ్లి మృతదేహానికి నివాళులరి్పంచారు. అవయవ దానం చేసిన తల్లిదండ్రులను అభినందించారు. -
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్ను పోలీస్స్టేషన్లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు. మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి. అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది? దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది. కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి. గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి. కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది. అవయవ దానం విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి అవగాహన లేకపోవడం: చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు. అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి. కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు. ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది. ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్డెత్గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం. అవయవ దానాన్ని ప్రోత్సహించి, అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం. -
తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ
విశాఖపట్నం: పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామానికి చెందిన వెలమ పూర్ణకుమారి(53) తన కుమారుడుతో ద్విచక్రవాహనంపై ఈనెల 21న విశాఖ వస్తున్నారు. విశాఖ పోర్టు ఫ్లై ఓవర్పై వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కిందపడిన పూర్ణకుమారి తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను రామ్నగర్లో కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కేర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఈనెల 23 రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మంత్రి అమర్నాఽథ్ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయదానం కోసం ప్రోత్సహించగా అంగీకరించారు. జీవన్ధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుతో మాట్లాడి అవయదాన ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, లివర్ తొలగించి అవసరమైన వారి కోసం తరలించినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. అవయదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణకుమారి కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. పూర్ణకుమారికి భర్త జగదీశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
శ్రావణ్.. నీ కీర్తి శాశ్వతం
నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసన్నపేట మారుతీ నగర్కు చెందిన కృష్ణ శ్రావణ్ మరో ఇద్దరికి ప్రాణదానం చేశాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావణ్ ద్విచక్ర వాహనంతో విజయవాడ దుర్గాదేవి దర్శనానికి వెళ్తూ మూడు రోజుల కిందట ప్రమాదానికి గురయ్యాడు. వైద్యం అందించిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియతో సంప్రదింపులు చేసి అవయవ దానానికి అంగీకరింపజేశారు. గుండె, కాలేయం పనిచేయక పోవడంతో విద్యార్థికి చెందిన రెండు కిడ్నీలు శుక్రవారం జీవన్దాన్ రాష్ట్ర సమన్వయకర్త రాంబాబు ఆధ్వర్యంలో సేకరించి విశాఖ లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులకు అందచేశారు. శ్రావణ్ పార్థివ దేహానికి స్వగ్రామం నందిగాం మండలం సుభద్రాపురంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణ్ తల్లి దండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియలకు పలువురు అభినందించారు. -
తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం...
మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. గుంటూరు మెడికల్, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్కి తరలించారు. కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్ డెడ్ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఐదుగురికి పునర్జన్మ కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్కు, మరో కిడ్నిని రమేష్ హాస్పిటల్కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, గ్రీన్చానల్లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వ్యక్తికి గుండె ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్ను రప్పించి, గ్రీన్ చానెల్ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. మరణంలోనూ పరోపకారం కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది. – పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు మంచితనానికి మారుపేరు కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. – పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు -
బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవ దానం
వేలూరు: రాణిపేట జిల్లా సిప్కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది. ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుగురికి పునర్జన్మనిచ్చిన ‘కీర్తి’
పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు. కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. కీర్తికి గౌరవ వందనం చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. -
చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్నగర్కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్ (32) బ్రెయిన్డెడ్కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్ భౌతికకాయాన్ని విమ్స్కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్ భౌతికకాయానికి గురువారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్రహే సంతోష్ అంటూ నినాదాలు చేశారు. సంతోష్ తండ్రి శంకర్కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విమ్స్ అంబులెన్స్లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్ తీశామన్నారు. హెల్త్సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్లో కిమ్స్ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్సిటీలో పినాకిల్ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం తరలించినట్లు తెలిపారు. -
చంద్రకళా.. నీది గొప్ప జన్మ
శ్రీకాకుళం: తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించిన పట్నాన చంద్రకళను గ్రామస్తులు వేనోళ్ల కీర్తించారు. చంద్రకళ చేసిన త్యాగం నిరుపమానమని, ఆమెది గొప్ప జన్మ అని కొనియాడారు. మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) బ్రెయిన్డెడ్ అవ్వడంతో ఈనెల 2వ తేదీన మృతి చెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను దానం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో చంద్రకళ సంతాప సభ నిర్వహించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో స్థానికులు, యువత కలిపి రూ.2 లక్షలు సేకరించి వారి పేరున డిపాజిట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ నల్లి తవిటినాయుడులతోపాటు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ కుటుంబంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
-
బాలుడి అవయవదానం.. ఇద్దరికి ప్రాణదానం
శ్రీకాకుళం రూరల్/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్ డెడ్ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్చంద్(16)కు బ్రెయిన్ డెడ్ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు. కిరణ్చంద్ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్చంద్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్చంద్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు. మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్దాన్ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖలోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు. యువకుడికి కిడ్నీ, లివర్ కిరణ్చంద్ అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్లో విశాఖకు చేర్చారు. ఎయిర్పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్ను అమర్చి ప్రాణం పోశారు. దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్చంద్ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 27 నిమిషాల్లో శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, డాక్టర్ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు. వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్ జవహర్రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
బ్రెయిన్డెడ్ మహిళ అవయవాలతో ప్రాణదానం..
బెంగళూరు: బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడారు వైద్యులు. ఒకరికి లివర్, మరొకరికి కిడ్నీ సకాలంలో అందించి వారికి పునర్జన్మనిచ్చారు. కర్ణాటక ఉడుపి జిల్లా మణిపాల్లో ఈ ఘటన జిరిగింది. జిల్లాలోని ఉప్పండాకు చెందిన 44 ఏళ్ల శిల్పా మాధవ్ ఫిబ్రవరి 25న రోడ్డుప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వెద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అనుమతి ఇచ్చారు. అనంతరం కస్తుర్బా ఆస్పత్రి వైద్యులు శిల్పా మాధవ్ లివర్ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగికి అందించి అతని ప్రాణాలు కాపాడారు. అలాగే కిడ్నీని మంగళూరులోని ఆస్పత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీతో పాటు శిల్పా కళ్ల కార్నియాలు, చర్మాన్ని కసుర్బా ఆస్పత్రిలో భద్రపరిచారు వైద్యులు. వీటిని కూడా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు. చదవండి: బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట -
ప్రీతి బ్రెయిన్డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
బైక్పై నుంచి కళ్లు తిరిగి పడి మహిళ బ్రెయిన్ డెడ్.. పేద గుండెకు పునర్జన్మ
తిరుపతి తుడా/అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను శుక్రవారం ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. నిజానికి.. 2021 అక్టోబర్ 11న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చికిత్సాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. తొలిసారి ఇక్కడి వైద్యులు గుండెమార్పిడి చేశారు. ఈ యజ్ఞం పూర్వాపరాలు ఇవిగో.. పేద రైతుకు పెద్ద కష్టం.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన పదిహేనేళ్ల కుమారుణ్ణి పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్దాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. విశాఖపట్నంలో మహిళకు బ్రెయిన్ డెడ్ ఇంతలో.. విశాఖపట్నంలోని భెల్ (హెచ్పీవీపీ)లో టెక్నీషియన్గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్షిప్లో ఉంటున్నారు. వీరి ఇద్దరి కుమారులూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్దాన్ సైట్కు సమాచారమిచ్చారు. స్పందించిన సీఎంఓ.. సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. ఆగమేఘాలపై గుండె తరలింపు మరోవైపు.. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రావణ్కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలను పర్యవేక్షించారు. షీలానగర్ ఆస్పత్రి నుంచి ఎయిర్పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నియంత్రించారు. ఆ తర్వాత.. ►9.18 గంటలకు : ఆస్పత్రిలో అంబులెన్స్ బయల్దేరింది. ► 9.20 : ఎయిర్పోర్టుకు చేరుకుంది. ► 10.05 : అప్పటికే సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం గుండెను తీసుకుని బయల్దేరింది. ►11.31 : రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. ► 11.35 : విమానాశ్రయం నుంచి బాక్సును బయటకు తీసుకొచ్చారు. ► 11.56 : టీటీడీ అంబులెన్స్లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు తీసుకొచ్చారు. ►11.57 : ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. ►అప్పటికే ఆపరేషన్కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు. ►ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. అందరి సహకారంతోనే.. దాత కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, వైద్యుల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది. గుండెను తగిన జాగ్రత్తలతో భద్రపరిస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుంది. సన్యాసమ్మ గుండెను మూడు గంటల్లోపే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అమర్చిన గుండె పూర్తి సామర్థ్యంతో పనిచేసి బాలుడు కోలుకునేందుకు వారం రోజులు పడుతుంది. – డాక్టర్ శ్రీనాథ్రెడ్డి ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా సన్యాసమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటివరకు నేను, పెద్దబ్బాయి చైతన్య, చిన్నబాబు జయప్రకా‹Ùలు తేరుకోలేదు. ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకుని మురిసిపోయేది. వారికి ఏది కావాలన్నా నాతో గొడవపడి మరీ సాధించేది. – జంజూరు ఆనందరావు, సన్యాసమ్మ భర్త, భెల్ ఉద్యోగి -
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్తో సోమవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోనూ బ్రెయిన్డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫలితంగా అవయవదానాలు విరివిగా పెంచి, బాధితులకు మార్పిడి చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బ్రెయిన్డెడ్ నిర్ధారణ ఏర్పాట్లు చేస్తారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లోనూ అపస్మారకస్థితికి చేరిన రోగుల బ్రెయిన్డెడ్ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తక్షణమే కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్డెడ్ నిర్ధారణ, అవయవాల సేకరణ చర్యలు తీసుకోనున్నారు. డిమాండ్ ఎక్కువ... అవయవాలు తక్కువ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను అవసరమైనవారికి మార్పిడి చేయడానికి వైద్యపరంగా వీలుంది. రాష్ట్రంలో జీవన్దాన్ పథకం ద్వారా అవయవ దానాలు, అవయవమార్పిడి జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. జీవన్దాన్లో ప్రస్తుతం 2,863 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. నమోదు చేసుకోనివారు 90 శాతం మంది బాధితులు ఉంటారని జీవన్దాన్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం 10 వేల మంది బాధితులు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో సగం మందికైనా కిడ్నీ మార్పిడి చేయడానికి వీలుంది. కానీ, అవయవాల లభ్యత కొరవడింది. దానికి ప్రధాన కారణం బ్రెయిన్డెడ్ నిర్ధారణ చేయడానికి అనువైన వసతులు లేకపోవడమే. హైదరాబాద్లో మాత్రమే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 30 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ నిర్ధారణ జరుగుతోంది. జిల్లాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో వేలాదిమంది బ్రెయిన్డెడ్ కేసులు నమోదవుతున్నా, నిర్ధారణ జరగక అవయవాలు వృథాగా పోతున్నాయి. బ్రెయిన్డెడ్ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్గా పేర్కొంటారు.ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్లతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. జిల్లాల్లో అనువైన పరిస్థితులు కరోనా కాలంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల కారణంగా అవయవ దానాలు, సేకరణకు అవకాశాలు విస్తృతమయ్యాయి. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించాలన్నా, వారు చనిపోవడానికి ముందు అవసరమైన చికిత్స పొందాలన్నా తప్పనిసరిగా ఐసీయూ వసతి ఉన్న ఆసుపత్రులు కావాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 11,845 ఐసీయూ, వెంటిలేటర్లు ఉండగా, అందులో ప్రభుత్వంలో 2,143, ప్రైవేట్లో 9,702 ఐసీయూ, వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఫలితంగా బ్రెయిన్డెడ్ అయిన కేసుల నిర్వహణ సులువని అంటున్నారు. కాగా, 2013లో 189 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది 662 జరగడం గమనార్హం. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు అవయవాలను అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్న్ చేయించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉన్నచోట బ్రెయిన్డెడ్ నిర్ధారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – డాక్టర్ స్వర్ణలత, జీవన్దాన్ ఇన్చార్జి -
బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తాను బతికి ఉండగా నాగలి చేతబట్టి ధాన్యరాశులు పండించి పదుగురికీ పట్టెడన్నం పెట్టాడు. చివరకు మరణించాక కూడా ఐదుగురికి తన అవయవాలను దానం చేసి వారిలో జీవిస్తున్నాడు. కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి ఈ నెల 5వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కు తరలించారు. అతన్ని రక్షించేందుకు మూడురోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను మంగళవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత వైద్యబృందం అవయవదానంపై వారి కుటుంబసభ్యులు భార్య, కుమారులకు, బంధువులకు అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ అతను మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. జీవనధాన్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న చోటికి గ్రీన్చానెల్ ద్వారా కాలేయం, కిడ్నీలను తరలించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చదవండి: (సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు) -
బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. విల్క్స్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరు ర్యాన్ మార్లో. పాస్టర్గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్ఫెక్షన్తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్ఫెక్షన్ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. వైద్యపరంగా చెప్పాలంటే మరణించినట్లే అని పేర్కొన్నారు. తన భర్త పరిస్థితిని మేగన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిపింది. తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది. మళ్లీ పరీక్షలు.. వెంటనే మేగన్ వైద్యుల దగ్గరికి వెళ్లి తన భర్త బ్రెయిన్ పనితీరుపై మరోమారు పరీక్షలు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్ డెడ్గా ప్రకటించినట్లు స్పష్టమైంది. స్కాన్ రిపోర్టుల అనంతరం మేగన్ మళ్లీ సోషల్ మీడియాలో తన భర్త పరిస్థితి గురించి వెల్లడించింది. ర్యాన్కు బ్రెయిన్ డెడ్ కాలేదని చెప్పింది. దేవుడే తనను బతికించాడని పేర్కొంది. రీస్కాన్ తర్వాత ర్యాన్ హార్ట్బీట్ కొంచెం పెరిగింది. అయితే వైద్యుల చికిత్సకు స్పందనలో మాత్రం మార్పు లేదని మేగన్ చెప్పింది. ర్యాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని పేర్కొంది. చదవండి: ఉక్రెయిన్తో యుద్ధం.. కొరియా కిమ్తో చేతులు కలిపిన పుతిన్! -
తాను మరణిస్తూ ఐదుగురికి జీవితాన్నిచ్చిన విద్యార్థి
చెన్నై: మరణంలోనూ జీవనం! అవయవ దానం ఉద్దేశం ఇదే. మరణించిన తర్వాత మరొకరి జీవితాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్గా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. తమిళనాడు, చెన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఐదుగురికి ఆ యువకుడి అవయవాలు అమర్చారు. చెన్నై శివారులోని ఆర్టేరియల్ గ్రాండ్ సౌథర్న్ ట్రంక్ రోడ్డుపై నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆ యువకుడిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రేలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. అయినప్పటికీ అతడి ఇతర అవయవాలు పని చేస్తున్నాయని చెప్పారు. ఆసుపత్రికి చెందిన సామాజిక కార్యకర్తలు విద్యార్థి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అందుకు అంగీకరించారు. ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. బ్రెయిన్ డెడ్ టీనేజర్కు చెందిన అవయవాలను ఇతరులకు అమర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు కిడ్నీ, గుండె అమర్చాం. మరో ముగ్గురికి ఓ కిడ్నీ, రెండు ఊపిరితిత్తులు, కాలేయం మార్చాం.’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. అవయవదానంలో తమిళనాడు ముందంజలో ఉందని, అందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ట్రాన్ట్సాన్ సభ్యులు ఆర్ కాంతిమతి. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. మహిళ వీడియో వైరల్ -
ప్రమాదాల్లో మెదడుకు గాయమైతే!
ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలితే... మెలకువగా ఉండటం లేదా దెబ్బ బలంగా తగిలితే స్పృహ తప్పిపడిపోవడం... ఈ రెండే అందరికీ తెలిసిన పరిస్థితులు. అయితే ఇలా జరిగినప్పుడు బాధితులు ఏ మేరకు స్పృహలో ఉన్నారనే అంశం ఆధారంగా ఐదు రకాల కండిషన్లలోకి వెళ్లవచ్చు. అవి... స్టూపర్ అనే కండిషన్లోనా, కోమాలోనా, జీవించే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనలూ లేని జీవచ్ఛవ (వెజిటేటవ్ స్టేట్ అనే) స్థితిలోనా, లాక్డ్–ఇన్ సిండ్రోమ్ అనే దశలోనా... ఇలాంటి పరిస్థితుల్లో చివరిదైన బ్రెయిన్డెడ్ కండిషన్లలో దేనిలో ఉన్నాడని చూస్తారు. తలకు దెబ్బతగిలిన బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారు, ఏ మేరకు బాగవుతారు వంటి అంశాలు... అతడు ఏ స్థితిలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటాయి. ఆ స్థితులపై అవగాహనతో పాటు, తలకు దెబ్బతగిలి మెదడుకు గాయమైందని భావించినప్పుడు చేయాల్సిన పనుల గురించి తెలిపే కథనం. తలకు దెబ్బ తగిలి, దాని ప్రభావం ఎంతోకొంతైనా మెదడు మీద పడితే ఆ ప్రమాదాన్ని ‘ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ (టీబీఐ)’ అంటారు. అప్పుడు తలకు తగిలిన దెబ్బ తీవ్రత ఆధారంగా బాధితులు వెళ్లే ఐదు రకాల తీవ్ర పరిస్థితులివి... స్టూపర్ దశ: ఈ స్థితిలో కొద్దిగా మాత్రమే కదులుతూ... ఒకవేళ నొప్పికలిగినా, లేదా గిల్లడం వంటివి చేసినా కాస్త స్పందిస్తారు. వెజిటేటివ్ స్టేట్ : జీవచ్ఛవంగా ఉంటే దశనే వెజిటేటివ్ స్టేట్గా చెబుతారు. వీరికీ కోమాలో ఉన్న బాధితులకు తేడా ఏమిటంటే... కోమా ఉన్న రోగులకు నిద్ర, మెలకువ దశలు ఉండవు. వెజిటేటివ్ స్థితిలో ఉన్నవారిలో కొందరు అకస్మాత్తుగా సాధారణంగా స్పందించవచ్చు. కోమాలో ఉన్న రోగులు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కాగా జీవచ్ఛవంలా ఉన్న రోగులు కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండవచ్చు. శబ్దాలు చేయవచ్చు. చేతులు–కాళ్లు కూడా కదపగలరు. బాధితులు కంటిన్యువస్గా నెల (30 రోజుల) పాటు జీవచ్ఛవంలా ఉంటే దాన్ని ‘శాశ్వత జీవచ్ఛవ స్థితి’ (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్–పీవీఎస్) అంటారు. ఇలాంటి వారిలో రోగి మెరుగుపడే పరిస్థితి అన్నది వారి మెదడుకు అయిన గాయం తీవ్రతను బట్టి, బాధితుల వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసు వారైతే కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గుండెపోటు వచ్చిన కొందరిలో మెదడుకు రక్తం (ఆక్సిజనేటెడ్ బ్లడ్) అందక వారు జీవచ్ఛవ (వెజిటేటివ్) స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. కోమా : ఇది పూర్తిగా స్పృహ లేని స్థితి. అయితే బాధితులు కొన్నిసార్లు కొద్దిసేపు మాత్రమే కోమాలో ఉండి, మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలూ ఉంటాయి. వారు కోమాలో ఉండే వ్యవధి కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాలూ లేదా నెలల వరకూ ఉండవచ్చు. కోమాలో ఉన్నవారు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కోమాలో ఉన్నవారికి నిద్ర, మెలకువ వంటి స్థితులు కలగవు. కోమా నుంచి బయటపడ్డా... కొందరిలో ఎలాంటి స్పందనలూ లేకుండా జీవచ్ఛవం (వెజిటేటివ్ స్టేట్)లోనూ ఉండవచ్చు లేదా ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం వల్ల చాలామంది మునపటి చైతన్యాన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. లాక్డ్–ఇన్ దశ : ఈ కండిషన్లో బాధితుడు మెలకువగానే ఉంటాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా తన శరీరాన్ని కదిలించలేడు. అంటే శరీరం పూర్తిగా పారలైజ్ అవుతుంది. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (పీవీఎస్)లో బాధితుడికి మెదడు పైభాగం పూర్తిగా దెబ్బతిని, కింది భాగం మామూలుగానే ఉంటుంది. కానీ లాక్డ్–ఇన్ దశలో పై భాగం మామూలుగానే ఉండి, కింది భాగం (అంటే బ్రెయిన్ స్టెమ్) దెబ్బతింటుంది. లాక్డ్ ఇన్ సిండ్రోమ్లో ఉన్న చాలామంది రోగులు తమ కనురెప్పల కదలికల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. వీళ్లలోని కొందరిలో ముఖంలోని కొన్ని కండరాల్లోనూ కదలికలు ఉండవచ్చు. చాలామందిలో కాళ్లూ–చేతులపై నియంత్రణ (మోటార్ కంట్రోల్) ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఇలాంటి వారితో సంభాషించడానికీ / సమాచారాన్ని పంచుకోవడాని (కమ్యూనికేషన్)కి అనేక రకాల ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ డెడ్ : ఈ స్థితిలో బాధితులకు మెదడులోని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్తో పాటు బ్రెయిన్ స్టెమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా మెదడు మరణిస్తుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ఇక ఏమాత్రం చక్కదిద్దలేరు. శరీరం బతికి ఉండి... మెదడు పూర్తిగా మరణించిన స్థితి ఇది. ఇలాంటి స్థితిలో కృత్రిమశ్వాసపై శ్వాసప్రక్రియ కొనసాగుతుంటే... అది తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. బతికే అవకాశం ఏమాత్రమూ ఉండదు. అందుకే బ్రెయిన్డెడ్ పరిస్థితిలో ఉన్నవారి నుంచి డాక్టర్లు అవయవమార్పిడి (ట్రాన్స్ప్లాంటేషన్) కోసం అవసరమైన అవయవాలను సేకరిస్తారు. ∙ తలకు గాయం కాగానే పొరుగువారు చేయాల్సిన పనులు ♦తలకు గాయమైన వారిని సమతలంగా ఉండే పడకపై మెడ కదలకుండా పడుకోబెట్టాలి. ♦తరలించే సమయంలో తలకు, వెన్నుకు అయిన గాయం మరింత రేగకుండా, తీవ్రం కాకుండా చూడాలి. చికిత్స విషయానికి వస్తే... ఏదైనా ప్రమాదంలో తలకు గాయం అయినప్పుడు మెదడుకు నష్టం జరిగిందా లేదా అన్న విషయం తక్షణం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రమాదం జరిగిన గంటలోనే బాధితులను హాస్పిటల్కు తరలించగలిగితే... చాలావరకు ప్రాణాల కాపాడవచ్చు. దాంతో పాటు దుష్ప్రభావాలను (కాంప్లికేషన్స్ను) చాలావరకు అరికట్టవచ్చు. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అదే అరగంటలోపే తరలించగలిగితే... ఇంకా సమర్థమైన చికిత్స అందించవచ్చు. అందుకే ఆ సమయాన్ని ‘ప్లాటినమ్’ సమయంగా చెబుతారు. బాధితులకు ముందుగా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి తక్షణ వైద్య సహాయం అందాలి. ఇది ప్రమాద సంఘటన స్థలం నుంచే లేదా కనీసం ఆసుపత్రికి తరలించగానే క్యాజువాలిటీలోనైనా ప్రారంభం కావాలి. ఎందుకంటే గాయం కారణంగా మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం చాలా సందర్భాల్లో పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం చేయగలిగేది మెదడుకు మరింత నష్టం జరగకుండా చూసుకోవడం. ఒకవేళ గుండె స్పందనలు ఆగినట్లయితే వెంటనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీఆర్పీ) చేయాలి. దాంతో గుండె స్పందనలు మళ్లీ మొదలై... మెదడుకు రక్తం అందేలా చూడాలి. ఫలితంగా మెదడుకు జరిగే నష్టమూ తగ్గుతుంది, ప్రాణమూ నిలబడుతుంది. ఇక ఆ తర్వాత చేయాల్సిన వివిధ చికిత్సలను డాక్టర్లు హాస్పిటల్లో కొనసాగిస్తారు. చదవండి: Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు! -
అయ్యో టీచరమ్మ! స్కూల్కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
బ్రెయిన్ డెడ్ అయిన వార్డు వలంటీర్ అవయవదానం
గన్నవరం/తాడేపల్లి రూరల్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలంటీర్గా పనిచేస్తోన్న ఓ యువకుడికి రోడ్డు ప్రమాదం జరగడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి, బంధువుల అనుమతితో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఆ యువకుడి అవయవాలను దానం చేశారు. మచిలీపట్నం సుల్తానా బజార్కు చెందిన మరీదు వెంకటరత్నం (లేటు), రేవతిల రెండవ కుమారుడు కోటేశ్వరరావు (27) అక్కడే వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు వివాహం జరగడంతో తల్లితో ఉంటున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వివాహంలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా భీమడోలు వద్ద కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఇక్కడి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కోలుకోకపోవడంతో అవయవదానం చేసేందుకు తల్లి రేవతి ముందుకు వచ్చారు. దీంతో కోటేశ్వరరావు అవయవాలను ఎన్ఆర్ఐ వైద్యులు తొలగించారు. 8 మందికి కొత్త జీవితం.. కోటేశ్వరరావు శరీరంలో 6 అవయవాలను దానం చేయడంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎన్ఆర్ఐ చెన్నై ఆసుపత్రికి చెందిన 40 మంది డాక్టర్లు గురువారం శస్త్రచికిత్స చేశారు. కోటేశ్వరరావు శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులు, ప్రాంకయిటిస్, లివర్ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికోసం మంగళగిరి పోలీసులతో పాటు తాడేపల్లి, కృష్ణలంక, పటమట, రామవరప్పాడు, ఆటోనగర్, ఎనికేపాడు, గన్నవరం పోలీసులు హైవేపై భారీ బందోబస్తు నిర్వహించి గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రహదారిలో గ్రీన్ చానల్ను ఏర్పాటు చేశారు. అవయవాలతో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి బయలుదేరిన 3 అంబులెన్స్లు 27 నిమిషాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. అక్కడ అవయవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 విమానాల్లో వాటిని చెన్నైకి తరలించారు. కోటేశ్వరరావు 2 కిడ్నీలలో ఒక కిడ్నీని గుంటూరులోని రమేష్ హాస్పిటల్కు, మరో కిడ్నీని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోగికి అమర్చనున్నారు. రెండు కళ్లను ఓ కంటి ఆసుపత్రికి అందజేశారు. -
రిసెప్షన్లోనే కుప్ప కూలిన పెళ్లికూతురు..
(కర్ణాటక) శ్రీనివాసపురం: పెళ్లికూతురిపై మృత్యువు పంజా విసిరింది. పెళ్లికి ముందురోజు రిసెప్షన్లో కుప్పకూలగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయ్యింది. వివరాలు ... శ్రీనివాసపురం తాలూకాకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు హొసకోటకు చెందిన యువకునితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 6న వీరి వివాహం శ్రీనివాసపురం పట్టణంలో నిర్వహించాల్సి ఉంది. ముందు రోజు రిసెప్షన్ జరుగుతున్న సమయంలో వధువు చైత్ర కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా చికిత్స చేసిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానం చేసి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. అత్తవారింటికి వెళ్లడానికి బదులు కాటికి చేరుకుందని బంధుమిత్రులు విలపించారు. -
ఐదేళ్ల బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది....
5-Year-Old Girl Gives New Lease Of Life To Four: చండీఘడ్లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది. (చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!) ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) -
కన్నుమూస్తూ.. నలుగురికి కొత్త జీవితం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తను చనిపోతూ నలుగురికి జీవం పోశాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన యతిరాజ్యం రామారావు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురై శాశ్వత లోకాలకు వెళ్లిపోతూ నేత్రాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆమదాలవలసకు చెందిన రామారావు వ్యవసాయం చేసేవారు. ఈయనకు భార్య రూపావతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య గృహిణి, పిల్లలిద్దరికీ వివాహమైంది. కుమారుడు నగరంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రామారావు కాలు విరిగిపోయింది. చికిత్స చేసి రాడ్లు వేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 2న వేరే వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని వెళ్తుండగా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామం వద్ద బండి అదుపు తప్పి రామారావు కింద పడిపోయాడు. దీంతో రామారావును విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా, 3వ తేదీన శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. దీంతో రామారావు అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం స్పందించి కాలేయం, ఊపిరితిత్తులను వేరే వారికి అమర్చేందుకు తీసుకున్నారు. రెండు నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి అందజేశారు. గుండెను చెన్నైలోని ఎంజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రామారావు చనిపోతూ నలుగురికి జీవం పోయడంపై ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు. -
హైదరాబాద్: తనువు చాలిస్తూ.. పలువురికి ఊపిరి పోశారు
సాక్షి, లక్డీకాపూల్ : 55 ఏళ్ల రైతు తాను చనిపోతూ మరి కొంత మందికి ప్రాణదాతగా నిలిచాడు. అవయవాల్ని దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. నల్గొండ జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు సత్తయ్య(55) ఈ నెల20న స్పృహ కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు మలక్పేట యశోద హాస్పటల్కు తరలించారు. బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్దాన్ ప్రతినిధులు సత్తయ్య భార్య కె. లక్ష్మమ్మను కలిసి అవగాహన కల్పించారు. దీంతో ఆమె తన భర్త అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించినట్టు జీవన్దాన్ ప్రతినిధి పవన్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా! 96 ఏళ్ల వయసులో నేత్రదానం బంజారాహిల్స్: తాను మరణిస్తూ మరొకరికి వెలుగులు నింపాడు ఆ వృద్ధుడు. ప్రముఖ మానవతావాది గోపవరం రామసుబ్బారెడ్డి(96) ఈ నెల 23న కన్నుమూశారు. ఆయన నేత్రాలను అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం సేకరించి కంటి ఆస్పత్రికి అందజేసింది. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు మరణానంతరం వాటిని సంబంధిత కంటి ఆస్పత్రికి అందజేశారు. మరణం తర్వాత కూడా ఆయన తన మానవత్వాన్ని చాటుకున్న గొప్ప సంఘసేవకుడని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం తెలిపారు. -
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్దాన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్డెస్క్ -
ఏ అవయవాన్ని ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు?
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి చనిపోతూ ఎనిమిది మందిని బతికించవచ్చు. కానీ ఆ ఎనిమిది మంది బతకాలంటే చనిపోయిన వ్యక్తి ఇచ్చే అవయవాలతో పాటు వైద్యుల సహకారం కావాలి. సాటిమనిషిని బతికించాలన్న మనసు రావాలి. మన పెద్దాసుపత్రుల్లో ఏటా లక్షల మందికి వైద్యం అందుతోంది. మూడు వేల మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్నీ ఉన్నా ఆసక్తి లేకపోవడం వల్ల బ్రెయిడ్డెడ్ వ్యక్తి నుంచి రావాల్సిన అవయవాలు సేకరించేవారు లేరు. చాలామంది అవయవాల సేకరణ అనేది తమ పరిధిలో లేదని, తమకెందుకులే అని భావిస్తున్నారు. అదనపు భారంగా భావిస్తున్న వైద్యులు ప్రభుత్వ పరిధిలో ఉండే బోధనాసుపత్రులకే ఎక్కువ బ్రెయిడ్డెడ్ కేసులు వస్తాయి. ఈ కేసులకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించాలి. సదరు ఆస్పత్రిలో అవయవాలు అవసరం లేకపోయినా అవయవాలను సేకరించి జీవన్దాన్ ట్రస్ట్కు సమాచారమిస్తే సకాలంలో తీసుకెళ్తారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ డాక్టర్లు ఉన్న ప్రతిచోటా ఈ అవయవాలు సేకరించవచ్చు. కానీ చాలా చోట్ల వైద్యులు ఇది అదనపు పని కదా అని భావిస్తూ ఆసక్తి చూపడంలేదు. ప్రోత్సాహం ఇవ్వాలి.. అవయవాలు సేకరించిన వారికి ఏదైనా ఇన్సెంటివ్లు ఇస్తే బాగుంటుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో జరుగుతున్న ఆవయవ మార్పిడి పరిస్థితిని చూస్తే వేచిచూస్తున్న బాధితులకు 2031 సంవత్సరం వరకు అవయవాలు లభించే పరిస్థితి లేదు. అందువల్ల పెద్దాస్పత్రుల్లోని వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి, అవయవదానంపై ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవగాహన కల్పించి మరింత మందిని బతికించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి వంద పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి జీవన్దాన్ ట్రస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోయినా సమాచారమిస్తే అవయవాల సేకరణ జరుగుతుంది. దీంతో మరొకరిని బతికించినట్టు అవుతుంది. కానీ చాలామంది రిజిస్ట్రేషన్కు ముందుకు రావడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే కేసులు కూడా.. తమ ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగికి అవసరమైతేనే సేకరిస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తున్నారు. జీవన్దాన్ పరిధిలోకి తేవాలి అవయవాల సేకరణకు స్పెషలిస్టులు చొరవ చూపితేనే సాధ్యమవుతుంది. ఎన్నో బ్రెయిడ్డెడ్ కేసుల విషయంలో అవగాహన లేక వదిలేస్తున్నాం. అన్ని ఆస్పత్రులనూ జీవన్దాన్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకురావాలి. బ్రెయిన్డెడ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ట్రస్ట్కు సమాచారమిచ్చేలా చేస్తే మరింతమందిని బతికించే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి బ్రెయిన్డెడ్ కేసులోనూ అవయవాలు వాడుకోగలిగితే.. వేలమందిని బతికించవచ్చు. – డా.కె.రాంబాబు, జీవన్దాన్ స్టేట్ కోఆర్డినేటర్ ఏ అవయవాన్ని ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు అవయవం- నిల్వ సమయం కళ్లు- 4 నుంచి 6 గంటలు గుండె, ఊపిరితిత్తులు- 4 నుంచి 6 గంటలు కాలేయం- 12 నుంచి 20 గంటలు క్లోమగ్రంథి (పాంక్రియాస్)- 12 నుంచి 24 గంటలు మూత్రపిండాలు- 48 నుంచి 72 గంటలు అవయవాల కోసం వేచిచూస్తున్న బాధితులు అవయవం- బాధితుల సంఖ్య కాలేయం- 556 కిడ్నీ- 1,438 గుండె- 33 ఊపిరితిత్తులు- 10 మొత్తం- 2,037 -
బతికిలేకున్నా.. బతికించాడు
సాక్షి,విశాఖపట్నం (గాజువాక) : జీవనమృతుడిగా మారిన వ్యక్తి అవయవాలు దానం చేసి....ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. నాతయ్యపాలేనికి చెందిన భూపతి కిరణ్ కుమార్ (26) ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నాటి నుంచి వైద్యానికి స్పందించకపోవడంతో శనివారం బ్రెయిన్ డెడ్గా వైద్యుడు కిరణ్ కుమార్ నిర్థారించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందిన దుఃఖంలోనూ ఆ కటుంబం కన్నీళ్లను అదిమిపెట్టుకుని గొప్ప మనసు చాటుకుంది. తన కుమారిడి అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో వైద్యులు, బంధువులు బాధిత కుటుంబాన్ని అభినందించారు. మృతుడు భూపతి కిరణ్ కుమార్ నేవల్ అర్మెంట్ డిపోలో టీఎఫ్ (ఎస్కే)గా పనిచేస్తున్నాడని, తండ్రి భూపతి కృష్ణ (ఈ మధ్యనే బెహ్రాన్లో పనిచేస్తూ తన స్వస్థలానికి వచ్చారు), తల్లి రమణమ్మ (గృహిణి), సోదరి మాధురి (ఎన్ఏడీ ఉద్యోగి) ఉన్నారని బంధువులు తెలిపారు. అంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు కృష్ణ, రమణమ్మ ముందుకొచ్చారు. దీని కి సంబంధించి అంగీకార పత్రాన్ని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు. ఇద్దరికి అమర్చనున్న వైద్యులు కిరణ్ కుమార్కు చెందిన హార్ట్, లంగ్స్ పార్ట్లను హైదరాబాద్లోని ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. అలాగే కిడ్నీ, లీవర్లను కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అమర్చనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా
చాదర్ఘాట్: అనుకోని అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు బ్రెయిన్డెడ్కు గురై పుట్టెడు దుఃఖంలో ఉండికూడా ఆ పేద కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అతని అవయవదానానికి ఒప్పుకోవటం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. మహబూబ్నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కష్ణయ్య, సత్తెమ్మ దంపతుల రెండవ కుమారుడు రాములు (24) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గత గురువారం ఉదయం పనికి వెళ్లటానికి సిద్ధం అవుతుండగా అనుకోకుండా అతని కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. హుటాహుటిన అతడ్ని మలక్పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆలోపే అతని గొంతు కూడా మూగబోయింది. అతడికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాములుకు బ్రెయిన్డెడ్ అయిందని, బతికే అవకాశాలు లేవని నిర్ధారించారు. దాంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అవయవదానంపై ఆసుపత్రి వైద్యులు వారికి తెలియజేసి అవగాహన కలి్పంచారు. దాంతో రాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆసుపత్రికి వచ్చి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
వైద్యులను భయపెట్టిన బ్రెయిన్ డెడ్ రోగి
లండన్: బ్రెయిన్ డెడ్తో కోమాలోకి జారుకొనే వ్యక్తులను.. బతికున్న శవంగా భావిస్తారు. వారు మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆశ చావక వైద్యం కొనసాగిస్తే.. మరి కొందరు మాత్రం తమ బిడ్డ ఎలాను బతకడు.. తన అవయవాలను దానం చేస్తే.. మరి కొందరి ప్రాణాలైనా నిలబడతాయనే ఆశతో అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి స్థితిలో ఇక బతకడు అని డిసైడ్ అయ్యి.. అతడికి ఆపరేషన్ చేద్దామనుకుంటుండగా.. సదరు బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరంలో కదలిక వస్తే.. చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఆ పరిస్థితి. ఇలాంటి ఘటన యూకేలో చోటు చేసుకుంది. అయితే, యూకేలోని లీక్ అనే పట్టణానికి చెందిన లూయిస్ రాబర్ట్స్ అనే 18 ఏళ్ల యువకుడి విషయంలో విచిత్రం చోటుచేసుకుంది. బ్రెయిన్ డెడ్తో ఇక బతికే అవకాశాలు లేవని భావించిన వైద్యులు.. అతడి అవయవాలను మరొకరికి దానం చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో అవయవాలు తొలగిస్తారనగా లూయిస్ కళ్లు తెరిచాడు. ఈ ఏడాది మార్చి 13న లూయిస్ ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. దాంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు అత్యాధునిక వైద్యం అందించినప్పటికి అతడు కోలుకోలేదు. పూర్తిగా కోమాలోకి జారుకున్న లూయిస్కు వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. మార్చి 17న వైద్యులు మరోసారి అతడికి పరీక్షలు నిర్వహించారు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని .. బతికే అవకాశాలు లేవని డిక్లేర్ చేశారు. దాంతో లూయీస్ కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానమిచ్చేందుకు అంగీకరించారు. లూయిస్ అవయవాలు తొలగించేందుకు వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. సర్జరీకి ఒక గంట సమయం ఉందనగా.. లూయిస్ తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ ఘటనకు వైద్యులు తొలత షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని లూయిస్ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆశ్చర్యపోయారు. అతడు స్పృహలోకి రావడమే కాకుండా కాళ్లు చేతులు కూడా కదుపుతున్నాడు. రెప్పలు వేయడం, తలను అటూ ఇటూ తిప్పడం వంటివి కూడా చేస్తున్నాడు. దాంతో వైద్యులు అతడికి వైద్యం అందిస్తున్నారు. దీని గురించి జనాలకు తెలియడంతో అతడి వైద్యానికయ్యే ఖర్చులను ప్రజలు భరిస్తున్నారు. లూయిస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చదవండి: పోస్ట్ మార్టం చేస్తుండగా.. భయానక సంఘటన -
పోస్ట్ మార్టం చేస్తుండగా.. భయానక సంఘటన
బెంగళూరు: చనిపోయాడని.. నిర్ధారించి పోస్ట్ మార్టం చేస్తుండగా.. సడెన్గా ఆ వ్యక్తిలో చలనం వస్తే.. అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దారుణం కదా.. పిరికి వాళ్లు అయితే హార్ట్ ఎటాక్తో పోయినా పోతారు. ఇలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించిన ఓ వ్యక్తికి పోస్ట్ మార్టం చేస్తుండగా.. సడెన్గా అతడిలో కదలిక వచ్చింది. దాంతో మొదట షాక్ అయిన వైద్యులు.. ఆ తర్వాత తేరుకుని చెక్ చేసి.. అతడిని ఆస్పత్రికి తరలించి చికత్స కొనసాగిస్తున్నారు. ఆ విరాలు.. శంకర్ గోంబి అనే వ్యక్తి గత నెల 27న మహాలింగాపూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని బెలగావి ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. ఈ క్రమంలో పోస్ట్మార్టం నిమిత్తం శంకర్ గోంబిని మహాలింగాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎస్ఎస్ గల్గాలి అనే వైద్యుడి అధ్వర్యంలోని బృందం శంకర్కి పోస్ట్మార్టం నిర్వహించేందుకు రెడి అయ్యింది. ఇక శంకర్ కుటుంబం అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైద్యుల బృందం శంకర్కి పోస్ట్మార్టం నిర్వహించేందుకు గాను అతడి శరీరాన్ని తాకగానే.. వెంటనే అతడిలో కదలికి వచ్చింది. శంకర్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఆ తర్వాత శంకర్ని మరోసారి పరీక్షించగా.. అతడు బతికే ఉన్నట్లు తెలిసిందే. వెంటనే దీని గురించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని శంకర్ని వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా గల్గాలి మాట్లాడుతూ.. నా 18 ఏళ్ల కెరీర్లో దాదాపు 400 పోస్ట్మార్టమ్లు చేసి ఉంటాను. కానీ ఇలాంటి కేసును ఇంతవరకు చూడలేదు. భయంతో గుండె ఆగినంత పని అయ్యింది అన్నారు. చదవండి: ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు -
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: తను కన్నుమూస్తూ మృత్యువుతో పోరాడుతున్న మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ రైతు.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బాలయ్య (51) నా లుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకోగా చికిత్స కోసం బంధువులు హైదరాబాద్లోని కాం టినెంటల్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల చికి త్స అందించినా ఫలితం లేకపోయింది. బ్రెయిన్డెడ్ అయినట్లు బుధవారం ఉదయం ప్రకటించారు. కుటుంబీకులు అంగీకరించడంతో.. అవయవదానానికి బాధితుడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు వెంటనే జీవన్దాన్కు తెలిపారు. అప్పటికే అవయవాల పనితీరు దెబ్బతి ని అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు, వారికి వైద్య సేవలు అందిస్తు న్న ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్సకు ఆయా బాధితుల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు ఆలస్యం చేయకుండా వెంట నే ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఆస్పత్రిలోని వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం దాత నుంచి అవయవాలను సేకరించగా, మరో బృందం అవయవాలను స్వీకర్త చికిత్స పొందుతున్న ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమైంది. వివిధ ఆస్పత్రులకు తరలింపు దాత నుంచి సేకరించిన అవయవాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించారు. దాత శరీరం నుంచి తొలుత ఊపిరితిత్తులను వేరు చేసి కిమ్స్కు తరలించారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు మధ్య దూరం 21.7 కిలోమీటర్లు ఉంటుంది. వైద్య సిబ్బంది మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 3.19 గంటలకు (కేవలం 29 నిమిషాల్లో) కిమ్స్కు చేరుకుంది. ఆ తర్వాత గుండెను సేకరించి కేర్లో చికిత్స పొందుతున్న బాధితుడి వద్దకు చేర్చారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి మధ్య దూరం 15.7 కిలోమీటర్లు ఉండగా, వైద్య సిబ్బంది మధ్యాహ్నం 2.50 నిమిషాలకు దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం 3.09 గంటలకు (కేవలం 19 నిమిషాలు) బంజారాహిల్స్ కేర్కు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక కిడ్నీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించగా, మధ్యాహ్నం 3.30 గంటలకు నిమ్స్కు మరో కిడ్నీని తరలించారు. ఇక కాలేయాన్ని కాంటినెంటల్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఓ బాధితుడి వద్దకు చేర్చారు. అనంతరం ఆయా అవయవాలను వైద్య సిబ్బంది బాధితులకు విజయవంతంగా అమర్చారు. గుండె మార్పిడి ఆపరేషన్ సక్సెస్ బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుల కృషి ఫలించింది. హైదరాబాద్ మెట్రోలో నాగోల్ నుంచి 40 నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి గుండెను తరలించిన డాక్టర్ ఏజీకే గోఖలే బృందం.. మంగళవారం గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది. సాయంత్రం 5.15 గంటలకు శస్త్ర చికిత్స ప్రారంభించి అర్ధరాత్రి 12.30కి ముగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంకు చెందిన రైతు వరకాం తం నర్సిరెడ్డి(45) బ్రెయిన్ డెడ్కు గురవడంతో ఆయన గుండెను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి మెట్రోలో తరలించిన సంగతి తెలిసిందే. ఆ గుండెను అపోలోలో చికిత్స పొందుతున్న 44 ఏళ్ళ వ్యక్తికి విజయవంతంగా అమర్చారు. దీంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. గుండెను తరలించిన వైద్యులకు గవర్నర్ సన్మానం గుండె తరలింపు, చికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెట్రోరైలు అధికారులు, వైద్యులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం సన్మానించారు. రాజ్భవన్లో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, వైద్యులు గోపాలకృష్ణ గోఖలే ఈ సన్మానం అందుకున్నారు. -
వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!
సాక్షి, గుంటూరు (మెడికల్): కోవిడ్ వ్యాక్సిన్ వికటించి ఆశ కార్యకర్తకు బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం అందగా.. మరో ఏఎన్ఎం అస్వస్థతకు గురై కోలుకుంటోంది. వివరాలివీ.. తాడేపల్లి పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. తరువాత ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్లో చేర్చించారు. చదవండి: (వ్యాక్సిన్: ఆసుపత్రిలో అంగన్వాడీ టీచర్) ఆందోళన వల్ల ఏఎన్ఎం లక్ష్మికి రియాక్షన్ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు సమాచారం. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలావుండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ జీజీహెచ్కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు. -
ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్డెడ్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన రక్షిత అనే బీటెక్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్ అయింది. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన 20ఏళ్ల రక్షిత.. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. డిసెంబర్ 31న రక్షిత బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షితకు బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి అవయవాలను దానం చేస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితలు ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోని డీఆర్డీఓలో పని చేస్తున్నారు. -
దర్శకుడి బ్రెయిన్ డెడ్
కోయంబత్తూరు: సెట్స్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు నారానీపుజ షానవాస్ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో వెంటనే అతడిని కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా షానవాస్ ప్రస్తుతం 'గంధీరాజన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాలక్కడ్లోని ఆటపదిలో వేసిన సెట్స్లో చిత్రీకరణ జరుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఉదయం అతడిని మరోసారి పరీశిలించిన డాక్టర్లు అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ) ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నిర్మాత విజయ్ బాబు ట్వీట్ చేశారు. షానవాస్ ప్రస్తుతం వెంటిలేటర్పైనే ఉన్నట్లు తెలిపారు. అతడి గుండె ఇంకా కొట్టుకుంటోందన్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. కాగా 2015లో 'కేరీ' సినిమాతో షానవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత అదితి రావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. (చదవండి: మరీ అంత డర్టీ కాదు!) -
ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి
గాంధీనగర్: దానం చేయడం అంటేనే మనకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచడం. ఇక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యా దానం గొప్పదని చెప్తారు. ఒకటి ఆకలి తీర్చితే.. మరొకటి మనతో పాటు మరి కొందరి ఆకలి తీర్చే మార్గం చూపిస్తుంది. అయితే వీటన్నిటికంటే గొప్పదానం మరొకటి ఉంది. కానీ దాని గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు. అదే అవయవ దానం. అవును మనం చనిపోతూ మరి కొందరిని బతికించడం. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. కానీ ఎందుకో మన దగ్గర అవయవ దానం గురించి ఎక్కువగా అవగాహన లేదు.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవు. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి.. వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపుకోతను మర్చిపోతున్నారు. (చదవండి: 36 కిమీ..28 నిమిషాలు! ) వివరాలు.. గుజరాత్కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్ గురించి తెలుసుకున్న డోనేట్ లైఫ్ అనే ఎన్జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. (చదవండి: రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!) ఈ క్రమంలో యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్నాగర్కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్ తల్లిదండ్రులు వీరిలో తమ చిన్నారిని చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. -
80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం
రాంగోపాల్పేట్: పుణేలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ (ఊపిరితిత్తులు) సేకరించారు... అవి అక్క డి నుంచి చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు.. అక్కడి నుంచి మినిస్టర్ రోడ్లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. మొత్తం 560 కి.మీ దూరం ప్రయాణానికి కేవలం 80 నిమిషాలు పట్టింది... ఇక్కడ సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి ఆ లంగ్స్ను అమర్చే చికిత్సను వైద్యులు మొదలుపెట్టారు. పుణే ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ద్వారా రెండు ఎయిర్పోర్టుల నుంచి రోడ్డు మార్గంలో తరలించే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది. బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి సేకరించి ఆదివారం ఉదయం పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆ వ్యక్తి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణం పోయాలని మానవత్వంతో ముందుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఊపిరితిత్తుల దాత కోసం జీవన్దాన్లో పేరు నమోదు చేసుకున్నాడు. జీవన్ధాన్ డాక్టర్ స్వర్ణలత, పుణేలో జడ్టీసీసీ సెంట్రల్ కో–ఆర్డినేటర్ ఆర్తిగోఖలే.. పుణే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను సేకరించి హైదరాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి శస్త్రచికిత్స ద్వారా లంగ్స్ను సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 11 కిమీ దూరం ఉండే పుణే ఎయిర్పోర్టుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. అప్పటికే ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ఆ ఆర్గాన్స్తో పుణే నుంచి బయలుదేరి 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి 2.9 కి.మీ దూరం ఉండే కిమ్స్ ఆసుపత్రికి 2 నిమిషాల 5 సెకన్లలో అంబులెన్స్లో ఆర్గాన్ను చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కిమ్స్ వైద్యుల బృందం ఆర్గాన్ను మరో వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స మొదలెట్టారు. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు. -
అందరూ ఉండి అనాథగా..!
సాక్షి, కడప/ పెనగలూరు: ఉక్రెయిన్ దేశంలో యువకుడి మృతదేహం.. కువైట్ దేశంలో అతడి తల్లిదండ్రులు.. వైఎస్సార్ జిల్లా బెస్తపల్లెలో చెల్లెలు, ఇతర బంధువులు.. కుమారుడిని కడసారి చూసుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు.. ఉక్రెయిన్ నుంచి కువైట్కు మృతదేహం తీసుకువెళ్లడానికి అసలు వీలు కాదు.. ఏపీకి తేవాలంటే ఉక్రెయిన్ నుంచి యువకుడి మృతదేహాన్ని, కువైట్ నుంచి తల్లిదండ్రులను తీసుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణణాతీతం.. కరోనా వైరస్ ప్రజలకు ఎలాంటి కష్టాలు కల్పించిందనేదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. వివరాల్లోకెళ్తే.. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం బెస్తపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి, భారతి దంపతులకు సతీష్రెడ్డి, గ్రీష్మ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియెట్ నెల్లూరులో చదివిన సతీష్ రెడ్డిని డాక్టర్గా చూడాలనే ఉద్దేశంతో 2018లో వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు పంపారు. ఇందుకోసం సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. కుమారుడిని బాగా చదివించడానికి సుబ్బారెడ్డి దంపతులు కువైట్కు వెళ్లారు. అక్కడ సుబ్బారెడ్డి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తుండగా, ఆయన భార్య భారతి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్లోని ప్రతిష్టాత్మక కార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్/ఎండీ ఫిజీషియన్ కోర్సులో సీటు సాధించిన సతీష్ రెడ్డి ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటున్న అతడు ఏప్రిల్ 25న తన గదిలోని మంచంపై నుంచి కిందపడడంతో తలకు దెబ్బ తగిలి బ్రెయిన్ డెడ్కు గురైనట్లు కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. సతీష్ను స్నేహితులతోపాటు కళాశాల యాజమాన్యం ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మే 10న మృతిచెందాడు. కరోనా సమయంలో కష్టం బాగా చదువుకుని డాక్టర్గా తిరిగొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా విగత జీవిగా తిరిగొస్తాడని అనుకోలేదని సతీష్రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చివరి చూపైనా దక్కుతుందో, లేదోనని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సతీష్ రెడ్డి మృతదేహం ఉక్రెయిన్లో ఉండగా, అతడి తల్లిదండ్రులు కువైట్లో ఉండటమే ఇందుకు కారణం. మృతుడి చెల్లెలు గ్రీష్మ, ఇతర బంధువులు బెస్తపల్లెలో ఉన్నారు. అన్నతో పది రోజుల కిందటే మాట్లాడానని ఇంతలోనే ఇలా అవుతుందని అనుకోలేదని మృతుడి సోదరి గ్రీష్మ విలపించింది. తన తమ్ముడు డాక్టర్గా తిరిగొస్తాడని అనుకుంటే ఇలా విగత జీవిగా మారతాడని ఊహించలేదని మృతుడి చిన్నాన్న కుమారుడు ఓబుల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు చివరి చూపైనా చూసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సతీష్రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. -
కిమ్ ఆరోగ్యంపై గందరగోళం
సియోల్/వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 12న బయట ప్రపంచానికి కనిపించారని దక్షిణ కొరియా మీడియాలో చాలా వార్తలొచ్చాయి. ఊబకాయం, చైన్ స్మోకింగ్, పని ఒత్తిడి కారణంగా కిమ్ను గత ఆగస్టు నుంచి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని ప్యాంగ్యాంగ్ దగ్గర్లోని రిసార్టులో ఉంచి ఆయనకి చికిత్స అందిస్తున్నారని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా నిఘా విభాగ అధికారులు నిరంతరం నిఘా వేశారని అమెరికాలోని భద్రత విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారసులపై ఊహాగానాలు 7దశాబ్దాలుగా అక్కడ వంశపారంపర్య పాలనే నడుస్తోంది. 1948 నుంచి కిమ్ కుటుంబమే అధికారాన్ని చెలాయిస్తోంది. తన తండ్రి కిమ్ సంగ్ మరణానంతరం కిమ్ జాంగ్ ఇల్ 1994లో కొరియా పగ్గాలు చేపట్టారు. జాంగ్ ఇల్ మరణానంతరం కిమ్ 2011లో పీఠమెక్కారు. కిమ్ 2009లో రి సోల్ జూ అనే సింగర్ని పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వీరంతా చిన్నవాళ్లు కావడంతో గద్దెనెక్కే పరిస్థితి లేదు. రేసులో ఎవరు ! కిమ్ యో జాంగ్ అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఆయనకు అత్యంత సన్నిహితురాలు. కిమ్ కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వంలో కీలకంగా ఎదుగుతూ అధికారంపై పట్టు సంపాదించిన ఏకైక వ్యక్తి జాంగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్లతో కలిసి ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో కిమ్ పాల్గొన్నప్పుడు ఆమె తన సోదరుడి వెంటే ఉన్నారు. ఈ నెల మొదట్లో అధికారి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ప్రత్యామ్నాయ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. కిమ్ హాన్ సోల్ కిమ్ సవతి సోదరుడైన కిమ్ జాంగ్ నామ్ కొడుకు ఇతను. కిమ్ జాంగ్–2 పెద్ద కుమారుడైన నామ్ జూదానికి అలవాటు పడి చైనాకు ప్రవాసం వెళ్లిపోయాడు. తరచు తన సవతి తమ్ముడు కిమ్ పాలనను విమర్శిస్తూ ఉండేవారు. 2017లో మలేసియా కౌలాలంపూర్ విమానాశ్రయంలో నామ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక కిమ్ హస్తముందనే ఆరోపణలున్నాయి. దీంతో నామ్ కుమారుడు కిమ్ హాన్ సోల్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు వచ్చే సాహసం చెయ్యలేదు. కిమ్ వంశంలో మగవారికే అధికారాన్ని అప్పగించాల్సి వస్తే హాన్ సోల్ కూడా రేసులో ఉన్నట్టే. కిమ్జాంగ్ చోల్ కిమ్కున్న సోదరుల్లో జీవించి ఉన్న వ్యక్తి చోల్ మాత్రమే. అయితే ఆయనకి రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. గిటార్ వాయించడంలో చోల్ అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. తండ్రి కిమ్ జాగ్–2కి చోల్ను వంశోద్ధారకుడిలా కాకుండా ఒక కూతురిలా చూసేవారన్న వార్తలు వచ్చాయి. 2011లో సింగపూర్లో ఒక కచేరికి హాజరైన సందర్భంలో జాంగ్ చోల్ను దక్షిణ కొరియాకి చెందిన మీడియా సంస్థ కేబీఎస్ ఫొటోలు తీసింది. జాంగ్ చోల్ స్విట్జర్లాండ్లో చదువుకున్నారన్న విషయం మినహా ఆయన గురించి వివరాలేవీ తెలీవు. -
యూఎస్లో కారు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
-
అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.45 గంటలకు మిచిగాన్ వద్ద ఆగి ఉన్న కారును అతివేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నేరేడ్మెట్లోని రేణుకానగర్కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్రెడ్డి ఉన్నారు. 8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. మిచిగాన్లో ఉంటున్న ఆమె.. వీకెండ్ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. ప్రమాదం ముందురోజే తన సోదరి తమతో మాట్లాడిందని, హెచ్వన్ వీసా రాకపోతే హైదరాబాద్ వచ్చేస్తానని చెప్పిందని యశ్వంత్రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
వెంటాడిన మృత్యువు
నిజామాబాద్ నాగారం: కుక్కలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఏడీఈని కుక్కలు వెంటాడగా, తప్పించుకునేందుకు పరుగెత్తిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన గంగారాం (55) కామారెడ్డిలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్ మహాలక్ష్మీనగర్లో నివాసముంటున్న ఆయన.. రోజూ కామారెడ్డికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని నిజామాబాద్కు వచ్చిన గంగారాం.. నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా కుక్కలు ఆయన వైపు దూసుకొచ్చాయి. దీంతో భయపడి పరుగులు పెట్టారు. వేగంగా పరుగెత్తిన గంగారాం.. ఇంటి గేటు ముందరకు రాగానే కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటనలో.. కుక్క దాడి చేయగా, పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ కోటగల్లి సమీపంలోని మైసమ్మ వీధికి చెందిన వేముల ఆంజనేయులు (49) బస్వాగార్డెన్ ఫంక్షన్ హాలు మేనేజర్గా పని చేస్తున్నాడు. మంగళవారం ఫంక్షన్ హాలులోకి కుక్క రావడంతో తరిమేందుకు యత్నించారు. కుక్క ఆంజనేయులుపై దాడి చేసి, వేలిని కొరికేసింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడిపోయిన ఆంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కోమాలోకి వెళ్లాడు. బుధవారం అతడు బ్రెయిన్డెడ్ అయి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. -
ఆమె త్యాగం.. ‘సజీవం’
ముస్తాబాద్ (సిరిసిల్ల): తాను మరణించినా మరో నలుగురికి ప్రాణదానం చేశారా మానవతామూర్తి. కలకాలం తోడూనీడగా ఉంటుందనుకున్న భార్య.. అనూహ్య రీతిలో బ్రెయిన్డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసి త్యాగనిరతిని ప్రదర్శించారు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవెల్లి వినిల్ – సరిత దంపతులు. వినిల్ హైదరాబాద్లో దంత వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్నారు. రెండురోజుల క్రితం సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తనాళాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సరిత బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. తన భార్యను రక్షించుకోలేక పోయా మని భర్త వినిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వైద్యుడిగా అంతకు మించి మానవతావాదిగా ఆలోచించిన భర్త వినిల్.. బ్రెయిన్డెడ్ అయిన భార్య సరిత అవయవాల దానానికి అంగీకరించారు. శుక్రవారం సరిత గుండె, కాలేయం, కార్నియా, మూత్ర పిండాలను వైద్యులు సేకరించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో గుండె అవసరమున్న ఓ యువతికి ఆ గుండెను అమర్చేందుకు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి 5 కి.మీ. దూరంలోని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి సరిత గుండెను పది నిమిషాల్లో తరలించారు. 18 ఏళ్ల యువతికి గుండెను అమర్చారు. అలాగే సరిత మూత్ర పిండాలు, కార్నియా, కాలేయం మరో ముగ్గురికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిత మరణించినా ఆమె నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సరిత స్వగ్రామం పోత్గల్లో ఆమె త్యాగాన్ని గ్రామస్తులు స్మరించుకుంటున్నారు. భర్త వినిల్ మానవతావాదిగా.. నాలుగు కుటుంబాలకు జీవితాన్ని ఇచి్చన వ్యక్తిగా అభినందిస్తున్నారు. -
అమ్మను మించి దైవమున్నదా..
-
పసి వయసు పరబ్రహ్మ
ఏడాది క్రితం..! మెట్టుమెట్టుగా భవిష్యత్ను నిర్మించుకుంటూ పదో తరగతి చేరింది పద్నాలుగేళ్ల అవులూరి అభినయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలో సాధారణ కుటుంబం అభినయది. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సోదరుడు వెంకట్ వరుణ్ పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీలో మైనింగ్లో డిప్లొమా చేస్తున్నాడు. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఒక ప్రింట్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్. గతేడాది ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆరోజే ఒక్కసారిగా అభినయ కలలసౌధం కుప్పకూలింది. చెప్పాలని ఉంది..! తండ్రి ఎడబాటుతో అభినయ విచలితురాలైంది. ఒక వైపు తల్లి శోకాన్ని పరికిస్తూ, మరోవైపు.. ఆవేదనలో ఉన్న సోదరుడిని ఓదారుస్తూ, తండ్రినే కలవరిస్తూ, పలవరిస్తూ నీరసపడిపోయింది. పగలంతా తండ్రి జ్ఞాపకాలు. రాత్రి నిద్రలోనూ తండ్రిని కోల్పోయిన పీడకలలే. ఆ క్రమంలోనే రోజురోజుకూ నీరసించిన అభినయను మానసిక నిస్సత్తువ కుంగదీసింది. తీరని ఆ విషాదంలోనే తలనొప్పి రూపంలో ఆమెను తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. వైద్యులకే అంతుచిక్కని వ్యాధితో కృషించి పోయింది అభినయ. దాంతో కొత్తగూడెంలో వైద్యం అందిస్తున్న స్థానిక వైద్యులు హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇదంతా గమనిస్తున్న అభినయ తన తల్లి కవితకు మనసులో మాటేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించేది. ఇదేదో ప్రాణాంతక వ్యాధి అని గ్రహించిందో ఏమో ఆ చిట్టి తల్లి.. తను పోయినా నలుగురిలో బతికుండాలని తపన పడింది. తటపటాయిస్తూనే ‘చిరంజీవి’గా ఉండిపోవాలనే తన జీవితేచ్ఛను తల్లి చెవిలో విన్పించింది. అందుకు తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం, విద్యాదానం, నేత్రదానం గొప్పవని మనంచెప్పుకుంటుంటాం. అయితే బాల్యమింకా పూర్తిగా వీడకుండానే అవయవదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అభినయ ఆశించిందని తెలిసి పలువురి కళ్లు చెమర్చాయి. ఐదుగురికి పునర్జన్మ బ్రెయిన్ డెడ్ అయిన అభినయ కళ్లు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం బాగానే పనిచేస్తున్నాయి. వీటిని అవసరమైన ఐదుగురు రోగులకు వైద్యులు అమర్చారు. అలా అభినయ వల్ల ఐదుగురికి పునర్జన్మ లభించింది. కడసారిగా తను సంకల్పించినట్టుగానే ఆ చిన్నారి తన జీవితేచ్ఛను నెరవేర్చుకుంది. పిన్న వయసులోనే పదుగురికి ఆదర్శంగా నిలిచి ఇక వీడ్కోలంటూ మరలిరాని లోకాలకేగినా ఈ భువిపై తరతరాల జ్ఞాపకంగా అందరి మదిలో నిలిచిపోయింది. ∙విషాదమేమిటంటే ఆమె తండ్రి కర్మ ఈనెల 17వ తేదీన వస్తుండగా, అదే తేదీన అభినయ కర్మ కూడా రావడం! ఈ విషయాన్ని చెబుతూ, ‘ఇదేమి కర్మ భగవంతుడా’ అని అభినయ తల్లి కవిత బోరున విలపించింది. ‘అది నా బిడ్డ చివరి కోరిక’ ‘‘నా బిడ్డ లోకం విడిచిపోయినా ఐదుగురికి పునర్జన్మనిచ్చి వెళ్లింది. నా భర్త జాండీస్ సోకి, అనారోగ్యంపాలై ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి పోయాక అభినయ బాగా నీరసించిపోయింది. భరించలేని తలనొప్పితో ఈనెల ఐదున అనారోగ్యం పాలైంది. వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాం. అక్కడ రెండు రోజుల పాటు వైద్యం అందించారు. ఏడవ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. అభినయ కోరిక ప్రకారం ఆమె అవయవాలు దానం చేశాం’’ అని చెప్పారు కవిత. -
తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం
సోమాజిగూడ: బ్రెయిన్డెడ్ అయిన ఓ విద్యార్థిని తన అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొందరికి ప్రాణదానం చేసింది. వివరాలు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన అయిలూరి శ్రీనివాస్, కవిత దంపతుల కుమార్తె అభినయ(14) కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.ఈ నెల 5న అభినయ తన ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. వెంటనే చికిత్స కోసం మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించినా ఫలితం కనిపించలేదు. 7వ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్ డెడ్ అయిందని అక్కడి న్యూరో ఫిజీషియన్ నిర్ధారించాడు. జీవన్దాన్ ప్రతినిధులు అవయవ దానంపై బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అవయవ దానానికి వారు అంగీకరించారు. దీంతో అభినయ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లు, ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన మరికొందరు రోగులకు అమర్చారు. -
బతికున్న యువకుడిని చంపేశారంటూ..
గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బతికున్న యువకుడిని చనిపోయాడని నిర్ధారించారని ఆరోపిస్తూ బాధిత యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, ఆస్పత్రి అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పఠాన్చెరువుకు చెందిన భాను (19) గత నెల 28న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అతడిని 30న గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు భాను బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారిస్తూ ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు చెప్పారు. బ్రెయిన్ డెడ్ను, డెత్ (మృతి చెందినట్లు) గా భావించిన వారు బంధువులకు సమాచారం అందించారు. ఎంఎల్సీ కేసు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఓ కానిస్టేబుల్ భానును పరీక్షించగా నాడీ కొట్టుకుంటుండటాన్ని గుర్తించి బతికే ఉన్నట్లు తెలిపాడు. దీంతో ప్రాణం ఉండగానే చనిపోయినట్లు ఎలా నిర్ధారిస్తారని భాను బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే భాను మృతి చెందాడని తాము చెప్పలేదని బ్రెయిన్డెడ్ అయినట్లు మాత్రమే పేర్కొన్నామని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురువారం ఉదయం టీఎంటీ వార్డులో భాను కుటుంబ సభ్యులను తాను స్వయంగా కలిసి పరిస్థితి వివరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. పల్స్ రికార్డు కావడం లేదని చెబితే మృతి చెందినటు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
ఆ నలుగురిలో సజీవంగా..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెడ్కు గురైన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తమ కొడుకు కళ్లెదుట లేకున్నా.. మరో నలుగురిలో సజీవంగా ఉండాలన్న ఆశయంతో అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా యనమలకుదురు కట్ట ప్రాంతంలో నివసించే సంభాన దుర్గాప్రసాద్ (23) ప్రయివేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. ఈ నెల 21న ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం కానూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు దుర్గాప్రసాద్ను పరీక్షించి బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. ఎంత ఖరీదైన వైద్యం చేసినా ఫలితం ఉండదని, అవయవదానం చేస్తే మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని కుటుంబీకులకు వివరించారు. కొడుకు చనిపోతున్నాడనే బాధలోనూ తల్లిదండ్రులు మంచి ఆశయంతో అవయవదానానికి సమ్మతించారు. ‘సన్రైజ్’లో అవయవాల సేకరణ బ్రెయిన్డెడ్కు గురైన యువకుడిని జీవన్దాన్ అనుమతి ఉన్న సన్రైజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరోసారి న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్ల బృందం పరిశీలించి బ్రెయిన్డెడ్గా నిర్ధారించిన అనంతరం అవయవాలను సేకరించారు. గుండెను చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి, కిడ్నీలు సన్రైజ్, ఆయుష్ ఆస్పత్రులకు, లివర్ను ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. గుండెను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గన్నవరం, అక్కడి నుంచి విమానంలో చెన్నైకి తరలించారు. పోలీసులు అంబులెన్స్కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంతో సన్రైజ్ ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి 19 నిమిషాల్లోనే చేరుకుంది. పోలీసులకి సన్రైజ్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
గురుగ్రామ్ : జడ్జి కొడుకు బ్రెయిన్ డెడ్
గురుగ్రామ్ : సెలవు ఇవ్వలేదన్న కోపంతో జడ్జి భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరిపిన హరియాణాలోని గురుగ్రామ్లో శనివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన జడ్జి భార్య మరణించగా, అతని కుమారుడు బ్రెయిన్ డెడ్కు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. హరియాణా పోలీస్శాఖలో హెడ్ కానిస్టేబుల్గా ఉన్న మహిపాల్ సింగ్ రెండెళ్లుగా అదనపు సెషన్స్ జడ్జి కృష్ణకాంత్ శర్మ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్ సింగ్ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్ సింగ్ను తరచూ దూషించేవారనే కోపంతో సదరు పోలీసు జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్లపై శనివారం అర్కాడియా మార్కెట్లో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బెల్లెట్ ధ్రువ్ తలలోకి దూసెకెళ్లడంతో అతనికి తీవ్ర రక్త స్రావమైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జడ్జి భార్య రీతూ మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న మహిపాల్, జడ్జి కుటుంబం తనను తరచుగా దూషించడం మూలానే తాను ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
అంగట్లో అవయవాలు
మానవుల్లో ‘అవయవాల దానం’ అనే మహోత్కృష్ట సేవానిరతిని నీరుగార్చేశారు. ఉదాత్తమైన హృదయంతో ఉచితంగా అందజేసే అవయాలను అంగడి సరుకుగా మార్చేశారు. అందులోనూ స్వదేశీయులకు మొండిచేయి చూపుతూ విదేశీయుల ముందు చేయిచాపుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ పుణ్యమా అని అవయవాల అమ్మకాల దారుణం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలతో బయటపడే అవకాశం లేని వ్యక్తులు, బ్రెయిన్ డెడ్కు గురయ్యేవారు అవయవాలు దానం చేయడం సహజం. బాధితుల బంధువుల సమ్మతితో అవయవాలను స్వీకరించి మరో రోగికి అమర్చాలనే నిబంధన ఉంది. అయితే 90 శాతానికి పైగా కేసుల్లో బంధువులకు తెలియకుండా అవయవాలను తస్కరిస్తున్నారు. దాదాపు మరణశయ్యపై ఉన్న రోగిని ఎంచుకుని అతడు కోలుకోవడానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పి ఒప్పించి అవయవాలు కాజేస్తున్నారు. తస్కరించిన అవయవాలను లక్షలాది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన రోగుల అవయవాలను తమిళనాడులోని వివిధ ఆస్పత్రుల్లో అవయవాల కోసం కాచుకుని ఉండే విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్మివేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమిళనాడులోని కార్పొరేట్ ఆస్పత్రుల సహకారంతో ఈ ఘోరాలు సాగిపోతున్నాయి. అవయవాల కేటాయింపునకు సంబంధించి కేంద్రం రూపొందించిన నియమ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా అక్రమాలు సాగిపోతున్నాయి. తమిళనాడులో అందుబాటులోకి వచ్చిన అవయవాలను ముందుగా తమిళనాడుకు చెందిన రోగికి అమర్చాల్సి ఉంటుంది. అలాంటి రోగి లేనిపక్షంలోనే ఇతరులను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అవయవదానంలోని చట్టాలను ధిక్కరించి.. ఎక్కువసొమ్ము ముట్టజెప్పే విదేశీయులకు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేరళ వ్యకి అవయవాలు ఉక్రెయిన్ వ్యక్తికి ఈ ఏడాది మే 18వ తేదీన సేలంలో జరిగిన ఒక ప్రమాదంలో కేరళకు చెందిన కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఈ కుటుంబంలోని మణికంఠన్ అనే వ్యక్తి బ్రెయిన్డెడ్కు గురికాగా అతడి అవయవాలను తమిళనాడుకు చెందిన వారికి అమర్చలేదు. ఊపిరితిత్తులను ఇజ్రాయిల్కు చెందిన రోగికి, ఇతర అవయవాలను ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ దుర్మార్గంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి ఉత్తరం ద్వారా కోరారు. ఎడపాడి వెంటనే విచారణకు ఆదేశించగా విచారణ కమిటీ బృందం సోమవారం నివేదికను సమర్పించింది. మంత్రి భార్యకు కూడా అమర్చకుండా.. నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. అవయవాల దాత కోసం ఎదురుచూసే వారు తమ పేర్లను అందుకు సంబంధించిన జాబితాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాబితాలోని వరుస ప్రాధాన్యత ప్రకారం మాత్రమే అవయాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు తమ వరుసవారీ నంబరును తారుమారు చేసి అవయవాలను పొందినట్లు తేలింది. మరో కార్పొరేట్ ఆస్పత్రి వారు భారతీయునికి అమర్చాల్సిన అవయవాన్ని విదేశీయుని అమ్మివేసి అమర్చారు. ఈ శస్త్రచికిత్స మే 21వ తేదీన జరిగింది. సేలంలో ప్రమాదానికి గురైన కేరళ వ్యక్తి మణికంఠన్ అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులను బలవంతంగా ఒప్పించారు. మణికంఠన్ కిడ్నీని అమర్చాల్సిన వ్యక్తికి బదులుగా ఉక్రెయిన్కు చెందిన రోగికి అమర్చారు. అలాగే మణికంఠన్ గుండెను ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చాలని నిర్ణయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా లెబనాన్ దేశానికి చెందిన రోగికి అమర్చారు. అయితే మణికంఠన్ గుండె లెబనాన్ వ్యక్తికి సెట్ కాకపోవడంతో కొన్ని గంటల్లోనే మృతిచెందాడు. మణికంఠన్ అవయవాలు ఎవరెవరికి అమర్చారో అనే వివరాలను సైతం నమోదు చేయలేదు. మూత్రపిండాల మార్పిడికి ఎంతోకాలంగా వేచి ఉన్న తమిళనాడు మంత్రి భార్యకు సైతం లేని ప్రాధాన్యత నివ్వకుండా విదేశీయునికి అమ్ముకున్నట్లు తేలింది. అంతా దళారీల ద్వారానే.. అవయవదానాలకు చెందిన అన్ని అక్రమాలు కార్పొరేట్ ఆస్పత్రులోని అవయవ మార్పిడి విభాగం, దళారీల నడుమ సెల్ఫోన్ల ద్వారానే రహస్యంగా సాగిపోతోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా సాగుతున్నట్లు విచారణ బృందం కనుగొంది. అంగీకారం లేకుండా మనుషుల అవయవాల తొలగింపు చట్టం సెక్షన్ 18, ఐపీసీ 420 సెక్షన్ కింద చీటింగ్, 465 సెక్షన్ కింద అక్రమాలు, 120 సెక్షన్ కింద మూకుమ్మడి కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు విచారణ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అక్రమంగా అవయవాల మార్పిడిలో సుమారు రూ.12 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు రాష్ట్ర స్థాయి విచారణలో స్పష్టమైనందున సీబీఐ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ధర్మపురి పార్లమెంటు సభ్యులు డాక్టర్ అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. -
యువతి బ్రెయిన్ డెడ్
సోమాజిగూడ: బైక్పై వెళుతున్న తల్లికూతుళ్లను లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా..కుమార్తె బ్రైయిన్ డెడ్కు గురైన సంఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఐకె గూడకు చెందిన శృతి (26) సాప్ట్ ఉద్యోగి. ఈ నెల 8న తల్లి మాధవితో కలిసి బైక్పై ఈసీఐల్కు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శృతిని చికిత్స నిమిత్తం ఈ నెల 9న బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమె బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె శరీరంనుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లనుసేకరించి మరో ఐదుగురికి ప్రాణ దానం చేశారు. -
నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. వైరల్
నిర్లక్ష్యం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు(బ్రెయిన్ డెడ్) తీసింది. అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో చెప్పలేం. సరిగ్గా హైదరాబాద్లో ఇలాంటి విషాదం ఒకటి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్ : ఖాజా మొహినుద్దీన్(35) నగరంలోని బహదుర్పురలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పని మీద బయటకు వెళ్లాడు. తొలుత నో పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసిన ఖాజా ఆపై ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు. సెల్ఫోన్లో మాట్లాడుతున్న అతడు బహదుర్పురా నాలా సమీపంలో రాంగ్రూట్లో రోడ్డు క్రాస్ చేసేందుకు చూడగా ఖాజా బైక్ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాజా తల నేరుగా రోడ్డుకి గట్టిగా తాకడంలో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. హెల్మెట్ ధరించక పోవడంతో పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్లే ఖాజాకు బ్రెయిన్ డెడ్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్గా మారింది. -
మరణించి మరొకరిని బతికించింది
మైసూరు: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన యువతి గుండెను సజీవంగా తరలించి మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తికి అమర్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చాముండిబెట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నమన (21) అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం నమన బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించుకున్న వైద్యులు నమన తల్లితండ్రుల సమ్మతితో నమన గుండెను బెంగళూరు నగరంలో మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తికి అమర్చడానికి అంబులెన్స్ ద్వారా బెంగళూరు నగరానికి తరలించడానికి నిర్ణయించుకున్నారు. అందుకోసం మైసూరు–బెంగళూరు వరకు మార్గాన్ని జీరో ట్రాఫిక్ చేయాలంటూ నగర పోలీసులును కోరగా అందుకు అంగీకరించిన పోలీసులు నిర్ధిష్ట సమయంలో గుండెను సజీవంగా తరలించడానికి మార్గాన్ని జీరో ట్రాఫిక్గా చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో అనుకున్న సమయానికి మైసూరు నుంచి బెంగళూరు నగరంలోని బీజీఎస్ ఆసుపత్రికి గుండెను తరలించి ప్రాణాపాయంలో ఉన్న మరొక వ్యక్తికి విజయవంతంగా అమర్చారు. -
కరాటే మాస్టర్ కుమార్తె బ్రెయిన్డెడ్..
అన్నానగర్: తిరుచ్చికి చెందిన కరాటే మాస్టర్ కుమార్తె బెంగళూర్లో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బ్రెయిన్డెడ్ అయిన ఆమె ఆవయవాలను కుటుం బీకులు దానం చేశారు. దీంతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. తిరుచ్చికి చెందిన ప్రసిద్ధ కరాటే మాస్టర్ వాసుదేవన్. తిరుచ్చి పాఠశాల, కళాశాలలో, పోలీసు శిక్షణ కళాశాలలో కరాటే నేర్పిస్తున్నారు. ఈయన కుమారులు వెంకట్, ముత్తుకుమార్, కుమార్తె రథి(38). ఈమెకి వివాహం జరిగి బెంగళూర్లో భర్త ఆనందపిళ్ళై, పిల్లలతో నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట బెంగళూర్లో రథి స్కూటిలో వెళుతూ ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంట నే ఆమెని అక్కడున్న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. కానీ ఆదివారం ర«థి బ్రెయిన్డెడ్ చెందింది. దీంతో అవయవదానం చెయ్యడానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆమె గుండె, రెండు మూత్రపిండాలు, కళ్లు, కాలేయాన్ని డాక్టర్ల బృందం సహాయంతో తీసి దానంగా ఆయా ఆస్పత్రులకు ఇచ్చారు. -
ఆ యువతి మరణిస్తూ.. కొందరికి వెలుగు
సోమాజిగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేసి మరికొందరి జీవితాలను నిలబెట్టారు. శనివారం జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామగిరికి చెందిన డీసీఎం డ్రైవర్ కె.మల్లిబాబు, లలితల కుమార్తె మౌనిక (21) స్థానిక ఎస్ఆర్టీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గతనెల 28న మధ్యాహ్నం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. ఆమెను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మౌనికను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మే 29న ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న న్యూరో ఫిజీషియన్ మౌనికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఆమె కుటుంబ సభ్యులకు జీవన్దాన్ ప్రతినిధులు అవయవ దానంపై కౌన్సిలింగ్ ఇవ్వగా అందుకు వారు అంగీకరించారు. దీంతో మౌనిక శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను సేకరించారు. -
ఎవరి గుండె ఎవరికి ఊపిరి !?
సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ 18వ తేదీ. రివ్యానీ రహంగ్డలే ఆరేళ్ల పాప. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన ఆ పాప రోడ్డు పక్కనున్న కుళాయి నుంచి మంచినీళ్లు తాగుతుండగా, ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయమైన ఆ బాలికను నాగపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పాప మెదడుకు సర్జరీ చేశారు. అయినా స్పృహ రాలేదు. ‘బ్రెయిన్ స్టెమ్ డెడ్’ అని ప్రకటించారు. అది విన్న ఆ పాప తల్లిదండ్రులు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అయితే అంతటి విషాదంలో ఆ పాప శరీరంలోని అవసరమైన అన్ని అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు. ‘నా కూతురుకు బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెప్పగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె శరీరంలోని ఇతర అవయవాలు బాగానే ఉన్నాయికదా, అవెందుకు బతకకూడదు! అని అనిపించిందీ. వాటిని అవసరమైన వారికి డొనేట్ చేయాలని అనుకున్నాను’ అని పోలీసు డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్న రాధేశ్యామ్ రహంగ్డలే తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన రివ్యానీ గుండె, కాలేయం, కిడ్నీలను వైద్యులు తొలగించి అత్యంత అవసరమైన నలుగురు వ్యక్తులకు అమర్చారు. ఆ అవయవాలు ఎవరికి వెళుతున్నాయో కూడా తెలుసుకోకుండా వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవయవాలు దానం చేసిన మహానుభావుల జాబితాలో రివ్యానీ తల్లిదండ్రులు కూడా చేరి పోయారు. పెరిగిన అవయవ దానాలు భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య ఇలాంటి అవయవదానాలు పెరిగాయి. నగరాల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మధ్య కూడా గ్రీన్ కారిడార్ ద్వారా (ఎక్కడి ట్రాఫిక్ను అక్కడే నిలిపివేసి) ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అవయవాలను రవాణా చేస్తున్నారు. కుల, మత, లింగ వివక్షతలు లేకుండా అవయవాల మార్పిడి కూడా జరుగుతోంది. దేశంలో అవయవ దానాలు పెరుగుతున్నందుకు ఆనందించాల్సిందే. కానీ ఎక్కువ అవయవదానాలు ఎవరు చేస్తున్నారు? వారి అవయవాలు ఎవరికి వెళుతున్నాయి? అవయవదానాలపై ఆధారపడి దేశంలో బతుకుతున్న వారు ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి అవయవాలు ధనవంతుడిని బతికిస్తున్నాయి. అవయవాలు ఇచ్చేది పేదవాళ్లే అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల పేద వాళ్లే అస్వస్థత కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రెయిన్ డెడ్కు గురవుతున్నారు. కొందరు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇస్తున్నారు లేదా అమ్ముకుంటున్నారు. డబ్బున్నవారిలో దాతలు ఉండరని కాదు. చాలా తక్కువ ఉంటున్నారు. అవయవాలు మాత్రం కచ్చితంగా డబ్బున్న వారికే ఊపిరి పోస్తున్నాయి. అందుకు కారణం అవయవ మార్పిడి అత్యంత ఖరీదైన వైద్యం అవడమే. ఉదాహరణకు కాలేయం, గుండె మార్పిడికి 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. సులభమైన కిడ్నీ ఆపరేషన్కు కూడా 8 నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అంత డబ్బు పెట్టి ఏ పేద వాడు వైద్యం చేయించుకోలేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు చేయరు. కాలేయం, గుండె, మూత్ర పిండాలు లాంటి మానవ అవయవాల మార్పిడి చికిత్సను మొట్టమొదట విజయవంతంగా నిర్వహించిందీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే. ఆశ్చర్యంగా నేడు 1 నుంచి రెండు శాతం అవయవాల మార్పిడి వైద్య చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే. సరైన వ్యవస్థ లేనిదీ భారత్లోనే ఇలాంటి దారణమైన పరిస్థితి భారత్ దేశంలోనే ఉందని చెప్పవచ్చు. పాశ్చాత్య దేశాలు సమాన న్యాయం అనే మౌలిక సూత్రం లేదా అంతర్జాతీయ వైద్య విధాన వ్యవస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని దేశాలు నేరుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఆ సంస్థ ‘ఈక్వెటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆర్గాన్స్’ అని చెబుతోంది. అంటే, ఓ అవయవం వైద్యం ఖర్చులు భరించే ధనవంతుడికి వెళితే, మరో అవయవం పేదవాడికి వెళ్లాలి. పేద వాడికి ప్రభుత్వ ఆస్పత్రులుగానీ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైవేటు ఆస్పత్రిగానీ ఉచితంగా అవయవమార్పిడి చే యాలి. ఓ గుండె ధనవంతుడికి వెళితే మరో గుండె పేదవాడికి వెళ్లడం, ఓ కాలేయం ధనవంతుడికి వెళితే మరో కాలేయం పేదవాడికి వెళ్లడం సమాన న్యాయం అనిపించుకుంటుంది. అయితే ఏ అవయం ఎవరికి ఎంత అత్యవసరమో అన్న ప్రాతిపదికనే సాధారణ అవయవ మార్పిడి ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. మోదీ ఆలోచించి ఉండాల్సిందీ అవయవాల మార్పిడిలో సమాన న్యాయం జరగాలంటే దానికో పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’లో దాన్ని భాగం చేయవచ్చు. ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయవచ్చు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మానవ అవయవాలను దానం చేయండంటూ పిలుపునిచ్చారు. వాటిని ఎవరి కోసం దానం చేయమంటున్నారో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. అవయవాలను ఎవరికి దానం చేయాలనే విషయాన్ని డోనర్లు లేదా వారి సంబంధీకుల చిత్తానికి వదిలి పెట్టాలని కొందర భావించవచ్చు. అందరూ మన రాధేశ్యామ్లాంటి వారు ఉండకపోవచ్చు. వారిని డబ్బుతో ప్రలోభ పెట్టవచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు. అందుకని ఓ పటిష్టమైన వ్యవస్థ ఉండాల్సిందే. మన రాధేశ్యామ్ కూతురు రివ్యానీ బతికుంటే మే 5వ తేదీన ఏడవ పుట్టిన రోజును జరుపుకునేది. ఆమె గుండెను ఓ మూడేళ్ల పాపకు అమర్చారు. ప్రతి ఏడాది ఆ పాప పుట్టిన రోజుతోపాటు తన పాప పుట్టిన రోజును కూడా మే 5వ తేదీన జరుపు కోవాల్సిందిగా ఆ పాప తల్లిదండ్రులను మన రాధేశ్యామ్ కోరారు. మరేమీ కోరలేదు. మనం మనవంతుగా అవయవదానంతో పాటు వాటి మార్పిడికి మంచి వ్యవస్థను కోరుదాం. (గమనిక : ముంబైలోని జోనల్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ జాయింట్ సెక్రటరీ, సర్జన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షర రూపం ఈ వార్తా కథనం) -
మరణం లేని మారాజు
ఆరిలోవ/తగరపువలస : మంచి మనసున్న వారు భౌతికంగా దూరమైనా వారి జ్ఞాపకాలు ఈ భూమిపై పదిలంగానే ఉంటాయి. మరణం లేని మారాజులా వెలుగొందుతూనే ఉంటారు. ఆ కోవకే చెందుతారు బోర కనకరాజు. తను చనిపోతూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. విషాదకరమైనప్పటికీ స్ఫూర్తి రగిలించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి మండలం తాటితూరు పంచాయతీ బీసీ కాలనీకి చెందిన బోర కనకరాజు(31) మూడేళ్లు దుబాయ్లో వెల్డర్గా పనిచేశారు. అనంతరం మూడేళ్ల క్రితం స్వస్థలం వచ్చి వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో పనిచేస్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో తోటి కార్మికులు పినాకిల్ ఆస్పత్రిలో చేర్చగా అయిదు రోజుల పాటు చికిత్స పొందిన కనకరాజు బుధవారం బ్రెయిన్డెడ్కు గురయ్యారు. దీంతో అతని అవయవాలను జీవన్ధార ఫౌండేషన్ ద్వారా ఇతరులకు అమర్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. కిడ్నీలలో ఒకటి కేర్ ఆస్పత్రికి, మరొకటి పినాకిల్ ఆస్పత్రికి, కాలేయం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కళ్లు, ఊపిరితిత్తులు, గుండె పాడవడంతో ఇతరులకు పనికిరాకుండా పోయాయి. తాటితూరులో విషాదం కనకరాజు మృతిలో స్వగ్రామం తాటితూరులో విషాదం నెలకొంది. కనకరాజు అవయవాలు వేరొకరికి మార్చే ప్రక్రియలో భాగంగా అతని శరీరం నుంచి తీసివేసిన తరువాత భౌతికకాయాన్ని స్వగ్రామమైన తాటితూరు తరలించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆస్పత్రిలోనే ఉంచారు. ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంట గురువారం వివాహం జరుగుతుండడంతో ఆ వివాహాన్ని ఆపలేక... మృతదేహాన్ని తరలించలేక శుక్రవారం వరకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు గ్రామంలో గ్రామదేవతల పండుగలు కూడా జరుగుతుండడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య అనురాధ, ఏడాదిన్నర కుమారుడు వంశీ, తల్లిదండ్రులు మంగరాజు, కొండమ్మ, అక్క, తమ్ముడు ఉన్నారు. -
తేజోదీప్తి.. సజీవ కీర్తి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్తో ఢీకొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చిన్నాబత్తుల మైత్రి తేజస్విని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. విజయవాడలోని ఏలూరురోడ్డులో మంగళవారం రాత్రి ప్రమాదం జరగ్గా, బుధవారం ఉదయం తేజస్విని బ్రెయిన్డెడ్ అయిన విషయం తెలిసిందే. జీవన్ధాన్ సభ్యులు సంప్రదించగా ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. తేజస్విని చికిత్స పొందిన మెట్రో హాస్పిటల్లో గురువారం గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు సేకరించారు. గుండెను చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రికి, కాలేయాన్ని విశాఖపట్నం అపోలోకు, కిడ్నీలను విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్కు అప్పగించారు. గుండెను చెన్నై తరలించేందుకు ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. గుండెను తరలిస్తున్న సమయంలో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారమైన హృదయాలతో అంజలి ఘటించారు. -
ఇతరుల కుటుంబాల్లో వెలుగు నింపాలని..
గుంటూరు ఈస్ట్: తాను మరణించినా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఓ యువకుడు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపారు. శావల్యాపురం మండలం పోట్లూరుకు చెందిన నారాయణరెడ్డి, భద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు గోపవరపు హనుమంతరావు (37) విఘ్నేశ్వర డెయిరీలో పనిచేస్తున్నాడు. మార్చి 26న అతడు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు 29న జీజీహెచ్కు తీసుకొచ్చారు. అయితే తమ కుమారుడు దక్కడని వైద్యులు స్పష్టం చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ కుమారుడి అవయవాలను దానం చేయడం ద్వారా ఇతర కుటుంబాల్లోనైనా వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వైద్యులు తెలిపి తమ కుమారుడి అవయవాలను ఆదివారం దానం చేశారు. కన్న బిడ్డ దూరమైనా.. మరో ఐదుగురిలో జీవించి ఉన్నాడనే సంతృప్తి తమకు చాలని ఆ తల్లిదండ్రులు తెలిపారు. గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతం సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మరో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. రెండేళ్లుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గుంటూరు సురేష్ (24)కు జీజీహెచ్లో ఆదివారం గుండె మార్పిడి ఆపరేషన్ చేసి పునర్జన్మను ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే విలేకరులకు వివరాలు వెల్లడించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న గుంటూరు సురేష్ (24)కు గుండె మార్పిడి ఆపరేషన్ మినహా మరో మార్గం లేదని గుర్తించామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో బ్రెయిన్ డెడ్ కేసు ఉందని డాక్టర్ రాజునాయుడు చెప్పడంతో డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో తమ బృందం అత్యవసరంగా చికిత్స చేసి గుండె మార్పిడి ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. జీవన్దాన్ ట్రస్టు ద్వారా గుండెను సేకరించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మొట్ట మొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రమే అవయవాలు సేకరించే తరుణంలో గుంటూరు జీజీహెచ్లోనే అవయవాలు సేకరించి ఇక్కడే అమర్చడం మరో అరుదైన సంఘటన అని చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ జీజీహెచ్కి ఇదొక మైలురాయి అన్నారు. అనంతరం డాక్టర్ గోఖలే, డాక్టర్ సుధాకర్ను సన్మానించారు. వైద్యులు మోతీలాల్, భరద్వాజ్, శరశ్చంద్ర, సహృదయ ట్రస్టు సభ్యులు, డాక్టర్ గోఖలే బృందం పాల్గొంది. -
ఒకరి మరణం ఆరుగురికి పునర్జననం..!
మరణమంటే.. చావు! భౌతికంగా ఈ లోకాన్ని వీడి, పంచభూతాల్లో కలవడం. మనలో అనేకమందికి తెలిసిన అర్థం ఇదే. మరణమంటే.. పునర్జన్మ!! ఖమ్మం నగరానికి చెందిన ఓ సాధారణ గృహిణి మాత్రం.. ఇలా కొత్త అర్థాన్నిచ్చారు. ఖమ్మంవ్యవసాయం: ‘‘మరణమంటే.. అనేకమంది అనుకుంటున్నట్టుగా ‘చావు’ మాత్రమే కాదు. మరణమంటే.. పునర్జన్మ..! మరణిస్తూనే.. మరికొందరికి ప్రాణం పోయడం. వారి దేహంలో భాగమవడం. ఇదే పునర్జన్మ’’ అంటున్నారు పసుమర్తి స్మిత. ఎవరీమె..? ఏం చేసింది..? వీటికి జవాబులు కావాలనుకుంటే.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే. ♦ ఆయన పేరు పసుమర్తి వేణు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోగల స్నేహ జ్యూయలరీ షాప్ యజమాని, వ్యాపార ప్రముఖుడిగా వేణుకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్య స్మిత, కూతురు స్నేహ ఉన్నారు. ఆ ముగ్గురిదీ ముచ్చటైన కుటుంబం. ♦ హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా భయంకరమైన కల్లోలం. ఈ నెల 23న వేణు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థుడయ్యారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ♦ వేణు–స్మితది పాతికేళ్ల దాంపత్యం. ఇన్నేళ్లపాటు తనను ప్రాణప్రదంగా చూసుకున్న జీవిత భాగస్వామి ఒక్కసారిగా దూరమయ్యాడన్న చేదు నిజాన్ని విని ఆమె తట్టుకోలేకపోయారు. గుండె పగిలినంత పనైంది. ఆ తల్లీబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ♦ మన మనిషి ఎవరైనా అసాధారణ పరిస్థితిలో చనిపోతే... సాధారణంగా పోస్టుమార్టానికి అంగీకరించం. కానీ, ఈ ఇల్లాలు స్మిత అలా కాదు. అంత బాధలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భౌతికంగా ఈ లోకాన్ని వీడిని తన భర్త ద్వారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి బతుకును ఇవ్వాలనుకున్నారు. ♦ వెంటనే, తన స్వంత ఖర్చుతో భర్తను అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకం ‘జీవన్దాన్’ కింద తన భర్త అవయవాలను దానం చేసేందుకు సిద్ధపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం వేణు దేహం నుంచి రెండు కళ్లు, గుండె, లివర్, రెండు కిడ్నీలను వైద్యులు సేకరించారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో దాదాపుగా ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఆరుగురికి అమర్చారు. ఆ ఆరుగురూ రేపోమాపో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి బయటికొస్తారు. ఆ ఆరుగురిలో వేణు బతికుంటారు..! ఇక్కడ పునర్జన్మ పొందింది ఆ ఆరుగురు మాత్రమే కాదు..!! పసుమర్తి వేణు కూడా...!!! ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆయన అవయవాలు ఇతరుల దేహాల్లో చక్కగా పనిచేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అనేకమంది తమ మనసుల్లో ఇలా దీవిస్తున్నారు... ‘అమ్మా స్మితమ్మా..! వందనం తల్లీ...!!’ మహోన్నతం పసుమర్తి వేణు అవయవదానం మహోన్నతమని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని వర్తక సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వెండి, బంగారం మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. వేణు అవయవాలను దానం చేయాలని ఆయన భార్య, కుటుంబీకులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, సాహసోపేతమైనదని అన్నారు. ఈ సమావేశంలో కొప్పు నరేష్కుమార్, గొడవర్తి శ్రీనివాస్రావు, కురువెళ్ల ప్రవీణ్కుమార్, పత్తిపాక రమేష్, తూములూరి లక్ష్మీనరసింహారావు, బందు సూర్యం, నకిరికంటి రాధాకృష్ణ(సతీష్), బూర్లె లక్ష్మీనారాయణ, సుంకరి నరసింహారావు, రాయపూడి శేషగిరిరావు, బూమా సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. నేడు అంత్యక్రియలు పసుమర్తి వేణు అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఇందుకు ఖమ్మం పౌర సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లను ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొప్పు నరేష్, గొడవర్తి శ్రీనివాస్రావు, కళాపరిషత్ చైర్మన్ వివి.అప్పారావు, కిరాణా జాగిరి మర్చంట్స్ అధ్యక్షుడు వేములపల్లి వెంకన్న, బంగారం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బందు సూర్యం, నకిరికంటి సతీష్, రోటరీ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్, చాంబర్ ఆఫ్ మాజీ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు కొదుమూరి జగన్నాథం, ప్రతాపనేని నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు. -
మరణంలోనూ.. జీవం
నల్లగొండ, మిర్యాలగూడ రూరల్ : ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. పొంగివచ్చే దుఃఖాన్ని దిగమింగారు ఆ తల్లిదండ్రులు.. కొడుకు ఎలాగూ బతకడని.. తన కుమారుడి అవయవాలు ఇతరులకు దానంచేసి.. వారికి జీవితాన్ని ప్రసాదించాలని తలచారు. వివరాల్లోకి వెళ్తే.. మండలం పరిధిలోని గోగువారిగూడెం గ్రామానికి చెందిన ఊట్ల పూర్ణచందర్రావు, అరుణ దంపతులకు కొడుకు, కూతురు. కొడుకు ఊట్ల సందీప్(22)ఈ నెల 23న బైకుపై వస్తూ మిర్యాలగూడ వస్తుండగా అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ఏడుకోట్లతండా వద్ద అదుపుతప్పి బైక్ను డివైడర్కు ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమితం హైదరాబాద్ తరలించారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డైడ్ అయినట్లు చెప్పారు. కుమారుడు బతకడం కష్టమని.. ఇదే సమయంలో ఆయన అవయవాలు దానం చేస్తే మరొకరికి ప్రాణదాతగా మీ కొడుకు మిగిలిపోతాడని వైద్యులు వివరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖం దిగమింగుకుని కొడుకు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. -
విద్యార్థి అవయవాలు ఆస్పత్రులకు తరలింపు
చిత్తూరు, పూతలపట్టు : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన విద్యార్థి అవయవాలును వైద్యులు ప్రత్యేక వాహనంలో పలు ఆసుపత్రులకు తరలించా రు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన విద్యార్థి చరణ్ నాలుగు రోజుల ముందు పూతలపట్టు మండలం ముత్తిరేవుల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. అతనిని వేలూరు సీఎంసీకి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స చేసి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పిన సంగతి తెలిసింది. ఈ విషయం తల్లిదండ్రులు శ్రీనివాసన్, సరితకు చెప్పారు. అవయవాలు దానం చేయాలని వైద్యులు కోరగా వారు అంగీకరించారు. వైద్యులు శనివారం రాత్రి అవయవాలు, లివర్ను సీఎంసీ వైద్యులు తీసుకోగా హార్ట్, లంగ్స్ను పోర్టిస్ మలయార్ సన్నితియా(చెన్నై), కిడ్నీలను ఎంఐఓటీ(చెన్నై), సిమ్స్(చెన్నై) ఆస్పత్రులకు ప్రత్యేక వాహనంలో తరలించారు. -
అవయవదానం
డోన్ టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. డోన్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త దారా శ్రీనివాసరెడ్డి(52) శనివారం సాయంత్రం తన బావగారి ఊరైన కొట్రాయి నుంచి డోన్కు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఐచర్ వాహనం ఢీ కొనింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్డెడ్ అయినట్లుగా తెలిపారు. అయితే బంధువులు హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించగా..అక్కడి వైద్యులు ఫలితం లేదని చెప్పారు. దీంతో అతని గుండె, లివర్, కిడ్నీలను యశోదా ఆసుపత్రి ద్వారా జీవన్దాన్ ట్రస్ట్కు, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ఐ ఇన్స్టిట్యూట్కు అందజేసేందుకు భార్య శారదమ్మ అంగీకరించింది. శ్రీనివాస రెడ్డికి కుమార్తెలు ప్రత్యూషా, అలైఖ్యారెడ్డిలు ఉన్నారు. ఇతని స్వగ్రామం మద్దికెర మండలం ఎం. అగ్రహారం గ్రామం కాగా 30 ఏళ్ల క్రితం డోన్ పట్టణంలో స్థిరపడ్డారు. -
మరణిస్తూ.. జీవితాన్నిచ్చాడు...
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అరుున యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు సోమవారం దానం చేశారు. పురాణం శ్రీనివాస్, రమాదేవి దంపతులు యూసుఫ్గూడలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శశాంక్ (17) ప్రగతి డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆల్విన్ కాలనీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించగా.. సోమవారం బ్రెరుున్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. ఇతరులకు సహాయం చేయాలని తపనపడే కుమారుడి అవయవాలను ‘జీవన్దాన్’ సంస్థ ద్వారా దానం చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణరుుంచారు. అవయవాలను సేకరించిన అనంతరం గుండెను విమానంలో చెన్నైలోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రికి తరలించారు. కుడి కిడ్నీని నగరంలోని అపోలోకు, ఎడమ కిడ్నీని నిమ్స్కు, కార్నియాను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు. లివర్ను కాంటినెంటల్ ఆస్పత్రిలోనే ఓ రోగికి అమర్చాలని నిర్ణరుుంచారు. అన్నింట్లోనూ చురుకుదనం అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడు. శశాంక్ మరణించడం చాలా కలచివేసింది. తను ఎన్సీసీ క్యాడెట్ కావడంతో ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తపన పడేవాడు. అందుకే అవయవదానం చేయాలని నిర్ణరుుంచుకున్నాం. -శశాంక్ తల్లిదండ్రులు -
చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు
-
చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు నలుగురికి ప్రాణం పోశారు. పట్టణంలోని సప్తగిరి కాలనీకి చెందిన జోగినిపల్లి రామ్మోహన్ రావు(34) రూసో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని తిరిగివస్తుండగా శ్రీరాములపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పై వస్తున్న ఆయనను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. చుట్టుపక్కల వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయం గడిచే కొద్దీ పరిస్ధితి విషమిస్తుడటంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారని డాక్టర్లు ధ్రువీకరించారు. అవయవదానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేయవచ్చని అవగాహన కల్పించారు. వారు అందుకు ఒప్పుకోవడంతో జీవన్దాన్ సంస్థకు ఆదివారం అవయవ దానం చేశారు. రాంమోహన్రావు కాలేయం, కిడ్నీలు, గుండెను అపోలోరీచ్ ఆస్పత్రిలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో జీవన్దాన్ బృందానికి అందించారు. -
మరణిస్తూ.. ప్రాణం పోశాడు..
• విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో 29 ఏళ్ల యువకుడి బ్రెయిన్డెడ్ • అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు • హైదరాబాద్కు విమానంలో గుండె... అంబులెన్స్ లో కాలేయం తరలింపు సాక్షి, హైదరాబాద్: తను కన్నుమూస్తూ.. కొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన గంగుల వంశీకృష్ణ(29) ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల తీవ్రమైన తలనొప్పి, జ్వరం వచ్చింది. చికిత్స కోసం మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మెదడులో రక్తం గడ్డకట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు బ్రెరుున్డెడ్గా ప్రకటించారు. వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో వెంటనే జీవన్దాన్కు సమాచారం ఇచ్చారు. వైద్య బృందం వెంటనే ఆస్పత్రికి చేరుకుని దాత నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. ఇలా సేకరించిన అవయవాల్లో గుండెను జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి అమర్చగా, కాలేయాన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, కిడ్నీలను మంగళగిరి ఎన్ఆర్ఐ, విజయవాడ ఆయుష్ ఆస్పత్రులకు, కళ్లు వాసన్ ఐ కేర్కు తరలించారు. తమ బిడ్డ భౌతికంగా తమ ముందు లేకున్నా మరో ఆరుగురిలో సజీవంగా ఉన్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. యశోదలో కాలేయ మార్పిడి... లూథియానాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, కాలేయం మార్చాలని సూచించారు. వంశీకృష్ణ వివరాలు వీరికి కూడా అందడంతో విజయవాడ చేరుకుని దాత నుంచి కాలేయాన్ని సేకరించి అంబులెన్స(ప్రత్యేక గ్రీన్ఛానల్)లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మందితో కూడిన వైద్య బృందం పది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత కాలేయాన్ని అమర్చింది. అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి విశాఖకు చెందిన చెందిన 25 ఏళ్ల యువకుడు కొంత కాలంగా తీవ్రమైన ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. మంగళవారం అపోలో ఆస్పత్రిని ఆశ్రరుుంచగా.. కార్డియోమయోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండెమార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇదే రోజు సాయంత్రం వంశీకృష్ణ అవయవదాన వివరాలు అందాయి. బాధితుడు చికిత్సకు అంగీకరించడంతో డాక్టర్ ఏజీకే గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లి దాత నుంచి గుండెను సేకరించింది. బుధవారం ఉదయం గన్నవరం ఎరుుర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంది. ఆస్పత్రికి చేరుకున్నాక ఎనిమిది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత గుండెను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోఖలే స్పష్టం చేశారు. -
హైదరాబాద్ కు వంశీకృష్ణ అవయవాలు
హైదరాబాద్ : విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆంధ్రా ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. వంశీకృష్ణ గుండెను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి.. లివర్ను యశోద ఆసుపత్రికి తరలించారు. అవయవాల తరలింపు సందర్భంగా విజయవాడ నగరంలో పోలీసులు గ్రీన్ ఛానల్ చేపట్టి... బెంజి సర్కిల్ నుంచి గన్నవరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవయవాలను హైదరాబాద్కు తరలించారు. వంశీకృష్ణ.. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు. -
'ఆంధ్రా ఆసుపత్రి'లో యువకుడికి బ్రెయిన్డెడ్..
-
ఆంధ్రా ఆసుపత్రిలో యువకుడికి బ్రెయిన్డెడ్..
-
ఆంధ్రా ఆసుపత్రిలో యువకుడికి బ్రెయిన్డెడ్..
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ (29) అనే యువకుడు కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గుండె, కాలేయాన్ని హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ ఆంధ్రా ఆసుపత్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు గ్రీన్ ఛానెల్ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తునట్టు సమాచారం. -
చనిపోయి.. ‘బతుకు’నిస్తోంది..
ట్రస్టుకు అవయవాలు దానం ఈపూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి బుధవారం రాత్రి మృతి చెందింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన సూరే శ్రీనివాసరావు ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లా నందిగామలో ఉంటున్నారు. ఆయన కుమార్తె విష్ణు ప్రియ(22), కుమారుడు వరుణ్ ఈనెల 3వ తేదీన స్వగ్రామంలో శుభకార్యానికి వచ్చి దిచక్రవాహనంపై వెళ్తున్నారు. నర్సరావుపేటలోని శంకరభారతీ హైస్కూల్ వద్ద విష్ణుప్రియ చున్నీ మోటార్ బైక్ వెనుక చక్రానికి చుట్టుకోవడంతో ఆమె బైక్పై నుంచి కిందకు పడిపోయింది. చికిత్స కోసం గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయినట్టు చెప్పారు. అనంతరం విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి అవయవాలను ఆమె తల్లిదండ్రులు మణిపాల్లోని ట్రస్టుకు దానం చేశారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విష్ణుప్రియకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 6న ఉద్యోగంలో చేరాల్సి ఉంది. -
గుండెను మార్చి.. పునర్జన్మను ప్రసాదించి..
47 ఏళ్ల బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి గుండె సేకరణ 24 ఏళ్ల మాతృమూర్తికి విజయవంతంగా మార్పిడి కాకినాడకు చెందిన మహిళకు ‘యశోద’లో చికిత్స హైదరాబాద్: తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 47 ఏళ్ల బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్రావు, గుండె మార్పిడి నిపుణులు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, జీవన్దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలతలు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అరుణ (24)తన భర్త గోపాలకృష్ణ, కుమారుడు కార్తిక్తో కలసి పుణేలో స్థిరపడింది. ఏడాది క్రితం కుటుంబంతో కలిసి పుట్టింటికి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యులకు చూపించగా బ్రెయిన్లో క్లాట్ అయింది. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. ‘కార్డియోమయోపతి’గా గుర్తింపు తొమ్మిది నెలల తర్వాత అరుణ మార్చి 20న మళ్లీ అనారోగ్యానికి గురైంది. పుణేలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా పది రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పలు పరీక్షలు చేసి ‘డలేటెట్ కార్డియోమయోపతి’అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీలైన ంత త్వరలో గుండె మార్పిడి చేయించుకోవాలన్నారు. ఏప్రిల్ 20న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డి యో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నరే శ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్లను సంప్రదించగా.. గుండె దానం కోసం జీవ న్దాన్లో ఆమె పేరు నమోదు చేయించారు. 47 ఏళ్ల వ్యక్తి నుంచి గుండెను సేకరించి.. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలాజీ (47) బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ మేరకు జీవన్దాన్కు సమాచారం ఇచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు ఆయన అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అప్పటికే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అరుణకు గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జూన్ 15న డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, డాక్టర్ రాజశేఖర్ల నేతృత్వంలోని వైద్య బృందం దాత నుంచి గుండెను సేకరించారు. సోమాజిగూడ నుంచి సికింద్రాబాద్కు తరలించారు. సుమారు 20 మందితో కూడిన వైద్య బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెను అమర్చారు. అనంతరం ఆమె కోలుకోవడంతో జూన్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్లు స్పష్టం చేశారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ఎవరో ఒకరికి ప్రసవానికి ముందు కానీ, తర్వాత కానీ ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయని, అయితే కొంతమందిలో దానంతట అదే నయమవుతుందన్నారు. ఇతర ఆస్పత్రులతో ఎంవోయూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు యశోద ఆస్పత్రి వైద్యులు బెంగళూరు, మధ్యప్రదేశ్, కోల్కతా, ఏపీలోని పలు ఆస్పత్రులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ జీఎస్రావు చెప్పారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు. జీవన్దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ఇప్పటి వరకు 233 కాలేయ, 400కి పైగా మూత్రపిండాలు, 26 గుండె, 5 ఊపిరితిత్తులు, ఐదు పాంక్రియాస్లను సేకరించి ఆయా జబ్బులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించినట్లు తెలిపారు. -
ఇతడు చిరంజీవి
► తిరుపతి స్విమ్స్లో చిరంజీవిరెడ్డి బ్రెయిన్డెడ్ ► అవయవదానానికి కుటుంబసభ్యుల అంగీకారం ► గుండె, కాలేయం, మూత్రపిండాలు సేకరించిన వైద్యులు ► హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి గుండె.. ► విశాఖ అపోలోకు కాలేయం తిరుపతి : బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబసభ్యులు ఆదివారం దానం చేశారు. నలుగురికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తి చిరంజీవిగా నిలిచాడు. వివరాలు.. తిరుపతి గాంధీపురంలో నివసించే పెద్దపాపమ్మ కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) నగరంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అవివాహితుడైన చిరంజీవి తీవ్రమైన జ్వరం, అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఈనెల 27న స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరంజీవి శనివారం బ్రెయిన్ డెడ్కు గురైనట్లు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చిరంజీవి అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. స్విమ్స్ వైద్యులు, జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం మధ్యాహ్నం వరకు దశల వారీ శస్త్ర చికిత్సలు చేసి 4 అవయవాలు తీశారు. అందులోగుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి విమానం ద్వారా తరలించారు. ఒక కిడ్నీని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నా రాయణ ఆసుపత్రికి చేర్చారు. మరొక దానిని స్విమ్స్ ఆసుపత్రిలోనే ఓ రోగికి అమర్చారు. చిరంజీవి మృతదేహానికి స్విమ్స్ సి బ్బంది పూ లమాలలు వేసి నివాళులర్పించారు. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన గుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో ఓ మహిళకు, కాలేయాన్ని విశాఖ అపోలో మరో వ్యక్తికి ఆదివారం విజయవంతంగా అమర్చారు. మహబూబ్నగర్ జిల్లా వట్టివర్లపల్లికి చెందిన పరమేశ్వర్ భార్య విజయలక్ష్మి(36) పదేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నెం గోపీచంద్ను ఆశ్రయించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు గుండె మార్పిడి అవసరమని తేలింది. దీంతో దాత కోసం జీవన్దాన్లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవిరెడ్డి గురించి తెలుసుకున్న స్టార్ వైద్య బృందం వెంటనే తిరుపతి చేరుకుని గుండెను సేకరించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.05 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి, అంబులెన్స్లో అక్కడి నుంచి ‘గ్రీన్చానల్’ద్వారా 15 నిమిషాల్లో స్టార్ ఆస్పత్రికి గుండెను చేర్చింది. అనంతరం వైద్య బృందం విజయవంతంగా విజయలక్ష్మికి గుండెను అమర్చింది. అలాగే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాలేయ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కాలేయ మార్పిడి అవసరమని తేల్చిన వైద్యులు.. బ్రెయిన్డెడ్ అయిన చిరంజీవిరెడ్డి నుంచి కాలేయాన్ని ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్లో సాయంత్రం 7.25 గంటలకు ఆస్పత్రికి చేర్చి ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. -
ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి
-
బ్రెయిన్డెడ్ కావడంతో అవయవదానం
తిరుపతి మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. తిరుపతి గాంధీపురంలో నివాసం ఉండే పెద్దపాపమ్మకు కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) ఉన్నాడు. అవివాహితుడైన చిరంజీవి తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఈనెల 27న స్విమ్స్లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి ఆర్ఐసియు విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చిరంజీవి బ్రెయిన్ డెడ్కు గురైనట్టు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వచ్చారు. స్విమ్స్ అధికారులు, జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా శస్త్ర చికిత్సలు చేసి నాలుగు అవయవాలను తీసుకున్నారు. అందులో గుండెను హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్కు విమానం ద్వారా తరలించారు. రెండు కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు. మరణించినా తన అవయవాలను మరో నలుగురికి దానం చేసిన చిరంజీవి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, దాత కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డెరైక్టర్లు ఆదిక్రిష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి,అవయవ దాన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి, జయశ్రీ,సుదర్శన్, ప్రకాష్లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చిరంజీవిరెడ్డి బ్రేయిన్డెడ్
తిరుపతి: నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్వీ జూనియర్ కాలేజీ వాచ్మెన్ చిరంజీవిరెడ్డి బ్రేయిన్ ఆదివారం డెడ్ అయింది. అవయవదానం చేసేందుకు చిరంజీవి రెడ్డి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అతడి గుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే లివర్ విశాఖకు, ఓ కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి తరలించనున్నారు. అందుకోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గం.లకు చిరంజీవిరెడ్డి గుండెను హైదరాబాద్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎప్పటికీ అమరుడే
- ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన జర్నలిస్ట్ - అవయవదానంతో పలువురికి ప్రాణంపోసిన కుటుంబ సభ్యులు కొరుక్కుపేట(తమిళనాడు) చనిపోతూకూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాడు 35 ఏళ్ల యువకుడు సుదర్శన్. తమిళ టీవీ చానల్ పుదియ తలైమురై టీవీలో సీనియర్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్న సుదర్శన్(35) ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ కారణంగా బ్రెయిన్డెడ్కావడంతో అతని కుటుంబసభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి, సుదర్శన్ అవయవాలను దానం చేశారు. వివరాలు.. సీనియర్ న్యూస్ ఎడిటర్ సుదర్శన్ ఈనెల 16 వతేది పుదుచ్చేరి నుంచి చెన్నైకు టెంపోట్రావెల్లో వస్తుండగా ఆ రోజు సరిగ్గా 3:30 గంటల సమయంలో టెంపోట్రావెల్ను బస్సు ఢీ కొట్టింది. దీంతో సుదర్శన్తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పుదుచ్చేరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ రోజు రాత్రి 9:30 గంటల సమయంలో చెన్నై వడలపనిలోని సిమ్స్ ఆసుపత్రిలో న్యూరో ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టారు. సుదర్శన్కు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని దీంతో ఈనెల 23వ తేదీ సాయంత్రం 4:54 గంటలకు బ్రెయిన్డెడ్ అయినట్లు న్యూరాలజిస్టులు నిర్ధారించారని సిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీస్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్ చోక్కాన్ తెలిపారు. దీంతో సుదర్శన్ కుటుంబసభ్యులతో అవయువదానంపై చర్చించగా వారు సుదర్శన్ అవ యవాలను దానం చేసేందుకు ముందుకు వాచ్చారు. తమిళనాడు కేడవెర్ ట్రాన్స్ప్లాంట్ పోగ్రామ్ అథారిటీస్ అనుమతితో సిమ్స్ వైద్యులు సుదర్శన్ అవయువాలు లివర్,కిడ్నీ, ,హర్ట్వాల్వలు, నేత్రాలు, స్కిన్ను తీసుకున్నారు. లివర్, ఒక కిడ్నీని ఈనెల 23వతేదీన సిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు ట్రాన్స్ప్లాంట్ చేయగా, మిగిలిన కిడ్నీ,హర్ట్, పాంక్రియాస్లు చెన్నైలోని పలు అసుపత్రులకు అందించారు. బ్రెయిన్ డెడ్ కు గురైన సుదర్శన్ కు భార్య దీపాతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవయువదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, సుదర్శన్ కుటుంబ సభ్యులు అవ యవదానం చేసేందుకు ముందుకు రావడంపై సిమ్స్ వైద్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యో...శ్రీలత
* గిరిజన యువతి బ్రెయిన్డెడ్ * పేద కుటుంబానికి పెద్ద కష్టం చీడికాడ : కోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు టెస్ట్కు హాజరు కావాలని లేఖ అందింది. ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. ఈ నెల 31న పరీక్షకు హాజరు కావలసి ఉంది. అంతలోనే ఆమెను మృత్యువు కబళించింది. ఉద్యోగం చేసి అమ్మానాన్నల కష్టం తీరుద్దామని ఆ యువతి ఆ కోరిక తీరకుండానే కాల్లెటర్ వచ్చిన రోజే అకస్మాత్తుగా అపస్మారకస్థితికి చేరుకుంది. ఆ యువతి పెదనాన్న వంతంగి పేరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి మండలం పెదగంగవరానికి చెందిన అల్లం బుచ్చిబాబు,అతని భార్యమహాలక్ష్మీ ఇద్దరు పిల్లలతో చీడికాడ మండలం కొండ్లకొత్తూరులోని అత్తవారింట్లో ఉండేవారు. గ్రామంలో పూట గడవక బుచ్చిబాబు కుటుంబాన్ని తీసుకుని కొత్తగాజువాకలో ఉంటూ పోర్టులో రోజుకూలిగా పనిచేస్తున్నాడు. బుచ్చిబాబు పెద్దకుమార్తే శ్రీలత(20) ఇంటర్,ఐటీఐ పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటల సమయంలో పాలుతాగుతూ శ్రీలత ఆకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చెసిన వైద్యులు శ్రీలతకు బ్రెయిన్డెడ్ అయిందని చెప్పారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. శ్రీలత మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాకోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు ఈనెల 31న టెస్ట్కు అటెండుకావాలని గురువారం ఉదయమే కాల్లెటర్ అందింది. ఆ ఆనందంలో ఉండగానే మృత్యువు ఆమెను కబళించింది. -
అవయవదాత కుటుంబానికి ఊరట
* వసూలు చేసిన సొమ్మును తిరిగిచ్చేసిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి * జీవన్దాన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవిరాజు జోక్యంతో సుఖాంతం సాక్షి, విజయవాడ: బ్రెయిన్డెడ్కు గురై ఆరు అవయవాలను దానం చేసిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబానికి ఊరట లభించింది. అతని వైద్యంకోసం బిల్లులకింద వసూలు చేసిన మొత్తాన్ని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి శనివారం తిరిగిచ్చేసింది. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి రూ.లక్షల్లో ఫీజు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడిన అవయవదాత ఏడుకొండలు కుటుంబ దీనస్థితిని వివరిస్తూ ‘అవయవదాత’ను పిండేశారు’ శీర్షికన ‘సాక్షి’ పత్రికలో, టీవీలో కథనం వెలువడడం తెలిసిందే. అంతేగాక ‘సాక్షి’ చొరవ తీసుకుని ఏడుకొండలు కుటుంబ పరిస్థితుల్ని జీవన్దాన్ ట్రస్టు చైర్మన్, ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజు దృష్టికి తీసుకుపోయింది. ఈ నేపథ్యంలో రవిరాజు జోక్యం చేసుకుని మాట్లాడడంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. బిల్లుల కింద తాము వసూలు చేసిన రూ.1.50 లక్షల సొమ్మును అవయవదాత ఏడుకొండలు కుటుంబానికి తిరిగిచ్చింది. -
సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్(42) శనివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వరుసగా రెండు ఆపరేషన్లు నిర్వహించగా.. ఈ రోజు మధ్యాహ్నం మరణించారు. ఆయన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీఆర్వోగా ఉండేవారు. దాసరి రవీందర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా రాయికల్. గతంలో ఆయన సాక్షి టీవీలో సీనియర్ కరస్పాండెంట్గా విధులు నిర్వహించారు. రవీందర్ మృతికి సాక్షి యాజమాన్యం, సిబ్బంది సంతాపం ప్రకటించింది. రవీందర్ మృతి కారణంగా మిషన్ కాకతీయ మీడియా అవార్డుల కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపాయి. -
ఆశయం ఐసీయూలో..!
గుంటూరు పెద్దాసుపత్రిలో బ్రెయిన్డెడ్ను నిర్ధారించలేని దుస్థితి అవయవాల సేకరణకు అక్టోబరులోనే జీజీహెచ్కు అనుమతులు గుండె మార్పిడి ఆపరేషన్లకు ‘గోఖలే’ ముందుకొచ్చినా స్పందించని వైద్యులు రోగులకు శాపంగా మారిన అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు...సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో ఏడాదిలో 150కు పైగా గుండె ఆపరేషన్లు జరిగాయి...ఈ నెల 18లోపు గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. అయితే జీజీహెచ్ అధికారులు, వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాశయానికి తూట్లు పడుతున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించాలంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించాలి. అయితే జీజీహెచ్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారించలేని దుస్థితి నెలకొంది. ఆశయం ఐసీయూలో..! సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో గుండె ఆపరేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 18న సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు మొదలు పెట్టారు. ఏడాదిలోపు ఎవరూ ఊహించని విధంగా 150 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి నిరుపేద రోగులకు పునర్జన్మ ప్రసాదించారు. తాను చదువుకున్న కళాశాలకు ఏదో చేయాలనే తపనతో ముందుకు వచ్చిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే దాతల సహాయంతోపాటు, సొంత ఖర్చులతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఇటీవల పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భావించిన డాక్టర్ గోఖలే జీజీహెచ్లో గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించాలని తలంచారు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనే దానిపై స్పష్టత రాకపోయినప్పటికీ దాతల సహాయంతో ఈనెల 18వ తేదీలోపు పూర్తి చేయాలనే తపనతో పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇప్పటికే గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎనిమిది మందిని పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ముగ్గురు రోగులను సిద్ధం చేశారు. బ్రెయిన్ డెడ్ కేసులు రాగానే వారి గుండెను సేకరించి వీరిలో ఒకరికి మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్ను నిర్ధారించలేని దుస్థితి ... గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్య విభాగానికి నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. వీటిలో బ్రెయిన్ డెత్ అయిన కేసులు అనేకం ఉంటాయి. జీవన్దాన్ పథకం ద్వారా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించేందుకు గత ఏడాది అక్టోబరులో జీజీహెచ్కు అనుమతులు వచ్చాయి. బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించేందుకు ఇటీవల కమిటీని సైతం నియమించారు. అయితే జీజీహెచ్ వైద్యుల సమన్వయ లోపం వల్ల బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల మధ్య సమన్వయ లోపం రోగులకు శాపంగా మారింది. జీజీహెచ్లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి చరిత్ర సృష్టించడంతోపాటు, పేద రోగులకు అండగా నిలవాలనే డాక్టర్ గోఖలే చేపట్టిన ఉన్నత ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన జీజీహెచ్ అధికారులు, వైద్యులే తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఈ చిన్నారి.. చిరంజీవి
♦ ఐదుగురికి జీవితాన్నిచ్చిన18 నెలల బాలుడు ♦ కన్నపేగు కోత దిగమింగి..తల్లిదండ్రుల స్ఫూర్తి ♦ చిన్నారి అవయవదానం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం సాక్షి, విశాఖపట్నం : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. పద్దెనిమిది నెలల ప్రాయంలోనే బ్రెయిన్డెడ్ అయ్యాడు.నిన్నటి దాకా గోరుముద్దలు తినిపించిన తమ చిన్నారి ఇక లేడని తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. అయినా దానిని దిగమింగుకొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తమ చిన్నారి అవయవదానానికి అంగీకరించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... విశాఖలోని ఆరిలోవలో ఉంటున్న మద్ది వెంకటనారాయణరాజు చిన్న కుమారుడు రోహిత్ (18 నెలలు) మర్రిపాలెంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ఈనెల 11న తల్లితో వెళ్లాడు. ఆ రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన రోహిత్పై అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ పడింది. తలకు తీవ్రగాయాలైన బాలుడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని తండ్రికి తెలియజేశారు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఆ తండ్రి తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో రోహిత్ను నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. జీవన్దాన్ సంస్థ ద్వారా అవయవదానం ప్రక్రియను రాత్రి 10.30 గంటలకు పూర్తి చేశారు. రోహిత్ రెండు కళ్లు మోహిసిన్ ఐ బ్యాంకుకు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని విశాఖ కేర్ ఆస్పత్రిలోని రోగులకు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి తాను మరణించి మరో ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. పద్దెనిమిది నెలల వయసులో ఓ చిన్నారి అవయవాలను దానం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని జీవన్దాన్ ప్రతినిధులు ‘సాక్షి’కి చెప్పారు. -
ఒకే రోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు
నలుగురికి ఊపిరి పోసిన మహిళ ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే తొలిసారి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఒకేరోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. నిమ్స్లో గుండె, కిడ్నీ, ఉస్మానియాలో కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మనిచ్చారు. ఈ నెల 3న ఎద్దు పొడవడంతో ఆ మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్డెడ్ అయినట్టు ప్రకటించిన వైద్యులు ఆమె బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. అందుకు వారు అంగీకరించడంతో జీవన్దాన్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్స కోసం పేర్లు నమోదు చేసుకున్న నలుగురికి ఆమె అవయవాలను అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. బ్రెయిన్డెడ్ మహిళ నుంచి సేకరించిన గుండెను బెలెటైడ్ కార్డియోపతి (గుండె కండరాలు దెబ్బతినడం)తో బాధపడుతున్న మంచిర్యాలకు చెందిన జ్యోతి(23)కి, మరో బాధితుడికి ఒక కిడ్నీని నిమ్స్ వైద్యులు అమర్చారు. అలాగే ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడికి కాలేయాన్ని, మరొకరికి మూత్రపిండాన్ని విజయవంతంగా అమర్చారు. -
తాను లేకున్నా.. ఐదుగురికి ప్రాణం పోసింది
బెంగళూరు: ఇంజనీర్ కావాలని కలలు కంది. కల సాకారం కాకుండానే చిన్న వయసులోనే కనుమూసింది. ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తాను ఈ లోకంలో లేకున్నా అవయవదానం చేయడం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చి సజీవంగా బతుకుతోంది కర్ణాటకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని సంజన (18). బ్రెయిన్ డెడ్ అయిన సంజన అవయవాలను తల్లిదండ్రుల అనుమతితో దానం చేశారు. సంజన గుండెను కోయంబత్తూరుకు చెందిన శివన్ (30) అనే వ్యక్తికి అమర్చారు. సంజన గుండెను బెంగళూరు నగరంలో కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బొమ్మసంద్ర నారాయణ హెల్త్ సిటీకి తీసుకెళ్లడానికి పోలీసు అధికారులు సహకరించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో కేవలం 28 నిమిషాల్లో 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండెను సురక్షితంగా చేర్చారు. శివన్ కు గుండెను దానం చేయకుంటే మరో పది రోజులు మాత్రమే బతికేవాడని వైద్యులు తెలిపారు. సంజన కళ్లు, కాలేయం, కిడ్నీలను మరో నలుగురు రోగులకు దానం చేశారు. బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల మహిళకు కాలేయం, కిడ్నీ దానం చేశారు. మరో పేషెంట్కు ఇంకో కిడ్నీ, మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు. హసన్కు చెందిన సంజన ఈ నెల 21న మైసూర్ కేఆర్ఎస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హాసన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజన అవయవాలను దానం చేయాలని వైద్యులు ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. వైద్యుల సలహా మేరకు ఆమెను బెంగళూరులోని కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. సంజన మరణించినా ఆమె అవయవాలను దానం చేయడంతో మరో ఐదుగురి రూపంలో బతికే ఉంటుందని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైస్ చైర్మన్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ కే వెంకటరమణ అన్నారు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన సంజన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన హసన్ డాక్టర్లకు, బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు. -
హెల్త్ వర్సిటీ ఉద్యోగి బ్రెయిన్ డెడ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొత్తపల్లి హేమప్రసాద్ (55) శుక్రవారం గుండెపోటుకు గురై వెంటనే కోమాలోకి వెళ్లారు. యూనివర్సిటీలో విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురవ్వడంతో ఉద్యోగులు బందరు రోడ్డులోని రమేష్ హాస్పిటల్కు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్డెడ్ (జీవన్మృతుడు) గా నిర్ధారించారు. బ్రెయిన్డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబం సభ్యులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఏయే అవయవాలు జీవన్దాన్కు పనికొస్తాయో డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని అరుణ్ కిడ్నీ సెంటర్, సన్రైజ్ ఆసుపత్రులకు ఒక్కో మూత్రపిండం దానం చేయనున్నట్లు జీవన్దాన్ అధికారులు తెలిపారు. నేత్రాలను శంకర్ నేత్రాలయం, కాలేయం హైదరాబాద్, విశాఖపట్నం గాని పంపుతామని డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. హేమప్రసాద్ అవయవాలు ఏమేమి పనిచేస్తాయి?, ఎక్కడెక్కడికి పంపించాలనే దానిపై శనివారం తుదినిర్ణయం తీసుకోనున్నారు. బ్రెయిన్డెడ్కు గురైన హేమప్రసాద్ భార్య అరుణకుమారి ప్రభుత్వాస్పత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. హేమప్రసాద్ను యూనివర్సిటీ, ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు సందర్శించారు. ఆయన 1988లో టైపిస్ట్గా యూనివర్సిటీలో చేరారు. అందరితో కలివిడిగా, సౌమ్యంగా ఉండే హేమప్రసాద్ బ్రెయిన్ డెడ్కు గురికావడం పట్ల వర్సిటీ ఉద్యోగులు విచారం వెలిబుచ్చారు. -
విధి చిదిమేసింది..
ఆ యువకుడికి భవిష్యత్పై ఎన్నో ఆశలు.. మరెన్నో బరువు బాధ్యతలు.. వాటన్నిటినీ మోయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించేవాడు. అందుకోసం కష్టపడి చదివేవాడు. ప్రతిభావంతుగా పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల్లో స్టీల్ప్లాంట్లో జరిగే జూనియర్ ఇంజినీర్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే విధికి క న్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. ఈ విషాదగాథ రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయి, అవయవదానం చేసిన అల్లాడ సాయికుమార్ది. విశాఖపట్నం/అల్లిపురం: సాయికుమార్ నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగానే గాక బుద్ధిమంతుడిగానూ పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని స్నేహితులతో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. తొందరగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన ‘గేట్ 2016’ పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాజరవుతున్నాడు. హాల్టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు కూడా. తల్లిదండ్రులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ‘నిన్ను ఎమ్మెస్సీ చదివిస్తాను బాగా చదువు చెల్లెమ్మా!’ అంటుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు కొన్నాళ్లలోనే ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని ఎన్నో కలలు కంటున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త! సాయికుమార్ బైకు ప్రమాదంలో గాయపడ్డాడని. కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ ఏ దేవుడూ కనికరించలేదు. సాయికుమార్ బ్రెయిన్డెడ్ అయి బతకడని వైద్యులు గుండెలు పిండేసే చేదు నిజాన్ని వెల్లడించారు. ఒకపక్క పుట్టెడు విషాదంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా ముగ్గురికి ప్రాణదానం, మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించగలిగాడు. విషణ్ణవదనంతో బంధుమిత్రులు, స్నేహితులు సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామం కేడీపేటకు తరలించారు. జీర్ణించుకోలేకపోతున్నాం.. సాయికుమార్ స్నేహితులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఒకసారి స్నేహం చేస్తే ఎవరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఎక్కడికైనా వెళ్దామన్నా వచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్ ఇక లేడన్న నిజాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. - జిలానీ బాషా, సాయికుమార్ స్నేహితుడు -
చిరంజీవి.. ఈ శ్రీమన్నారాయణుడు
♦ తాను మరణించి మరో నలుగురికి జీవితాన్నిచ్చి.. ♦ బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కిడ్నీ, లివర్, కళ్లు సేకరణ సాక్షి, బెంగళూరు: మరణంలోనూ మరో నలుగురికి జీవం పోసి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు మైసూరుకు చెందిన శ్రీమన్నారాయణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీమన్నారయణ బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అవయవాలను బెంగళూరుకు తరలించి, అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో మరణం తర్వాత కూడా మరో నలుగురికి శ్రీమన్నారాయణ జీవం పోసినట్లైంది. వివరాలు.....మైసూరుకు చెందిన శ్రీమన్నారయణ(38) కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 3న కోళ్లు ఉన్న వ్యాన్లో మైసూరు ప్రధాన రహదారిపై వెళుతుండగా, వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ మరమ్మత్తు చేస్తున్నారు. దీంతో శ్రీమన్నారాయణ కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో శ్రీమన్నారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే శనివారం ఉదయం శ్రీమన్నారాయణ బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. శ్రీమన్నారాయణ అవయవాలను దానం చేయాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులను వైద్యులు కోరారు. ఇందుకు వారు అంగీకరించడంతో శ్రీమన్నారాయణ గుండె, కిడ్నీ, లివర్, రెండు కళ్లను సేకరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు..... ఇక మైసూరు నుంచి అత్యంత వేగంగా బెంగళూరులోని ఆస్పత్రులకు ఈ అవయవాలను చేర్చేందుకు మైసూరు, బెంగళూరు పోలీసులు మైసూరు నుంచి బెంగళూరు వరకు జీరో ట్రాఫిక్(గ్రీన్ కారిడార్) మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో సాధారణంగా నాలుగు గంటల సమయం పడుతుండగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో గంటన్నర వ్యవధిలోనే ఆంబులెన్స్ బెంగళూరుకు చేరుకోగలిగింది. అనంతరం బెంగళూరులో ఆవశ్యకత ఉన్న వివిధ ఆస్పత్రులకు ఆయా అవయవాలను తరలించారు. -
జీవన్దాన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జీవన్దాన్ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభించామని సహృదయ ట్రస్టు నిర్వాహకులు, ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే చెప్పారు. గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు తమ వద్ద తొమ్మిది మంది గుండె జబ్బు రోగులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ అనుమతి రాగానే గుండె మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు ఆలస్యమయ్యే పక్షంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు వైద్య బృందం జీజీహెచ్లో సిద్ధంగా ఉందని స్సష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినవారి అవయవాలను గుంటూరు జీజీహెచ్కు తరలించేందుకు, ఆపరేషన్ అనంతరం అవసరమయ్యే మందులు, ఆపరేషన్ చేసేందుకు అయ్యే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దాతలు పెద్ద మనస్సుతో ముందుకు రావాలని కోరారు. సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్లో గత ఏడాది మార్చి 18 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు ఎన్టీఆర్ట్రస్టు వైద్య సేవ ద్వారా ఉచితంగా బైపాస్ సర్జరీలు చేస్తున్నామని తెలిపారు. తమ ట్రస్టు సేవలు జీజీహెచ్లో ప్రారంభమై మార్చి 18 నాటికి ఏడాది పూర్తి అవుతుందని, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆపరేషన్ చేసేందుకు ముందుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సుమారు రూ. లక్షన్నర, ఆపరేషన్కు రూ. 12 లక్షలు, ఆపరేషన్ చేసిన తొలి ఏడాది మందులు వాడేందుకు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. తాముచేస్తున ఓపెన్ హార్ట్ సర్జరీలకు గుంటూరుకు చెందిన వైద్య నిపుణులు వైద్య నిపుణులు డాక్టర్ చిరుగుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్, ప్రతినెలా కొంత విరాళంగా అందజేస్తున్నారని, దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ అనుమతి వచ్చేలోగా రోగులు ఇబ్బంది పడకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. దాతలు 9848045810, 9391029810 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని డాక్టర్ గోఖలే కోరారు.సమావేశంలో సీటీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్లు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ లలిత, కో ఆర్డినేటర్ శాంతి, పాల్గొన్నారు. -
నాన్నా..నీవు కన్నుమూసిన చోటే..
14ఏళ్ల క్రితం తండ్రి మృత్యువాత పడిన ప్రాంతంలోనే కుమారుడూ.. పోలీసాఫీసర్ కావాలనే కల చెదిరిపోయింది హరనాథ్ కుటుంబంపై పగబట్టిన విధి విశాఖపట్నం: తాను మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన మండల హరనాథ్ కల చెదిరిపోయింది. చదువుకుని పోలీస్ ఆఫీసర్ కావాలన్న అతని ఆశను మృత్యువు తుంచేసింది. సబ్బవరం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయి, అవయవదానం చేసిన హరనాథ్కు చిన్నప్పట్నుంచి పోలీస్ ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ తన లక్ష్యం గురించే ఎక్కువగా చెప్పేవాడు. డిగ్రీ అయ్యాక పోలీస్ సెలక్షన్ కోసం కోచింగ్ తీసుకుంటానని అనేవాడు. ‘ముందు బాగా చదువుకుని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వు’ అంటూ కుటుంబీకులు సరదాగా అనేవారు. హరనాథ్ ఇప్పుడు అర్థాంతరంగా తనువు చాలించడాన్ని వీరంతా గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. హరనాథ్ తాత, నాన్నమ్మలతో సన్నిహితంగా మెలిగేవాడు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఐదో ఏట వచ్చే వరకు వారి దగ్గరే పెరిగాడు. చదువుల కోసం తల్లితో బర్మా క్యాంపు వచ్చాక సెలవులకు వారి వద్దకే వెళ్తుండేవాడు. అలాగే దసరా సెలవుకు తాతగారింటికి వెళ్లి పూజా సామగ్రి కోసం వెళ్తూ లారీ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు. 14 ఏళ్ల క్రితం తండ్రి : సుమారు 14 ఏళ్ల క్రితం అంటే 2001 ఏప్రిల్లో హరనాథ్ తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశేషమేమిటంటే హరనాథ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే లారీ ఢీకొని ఆయన దుర్మరణం పాలయ్యారు. తండ్రీకొడుకులిద్దరు ఒకే ప్రాంతం లో ప్రమాదానికి గురై మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. భర్త మరణానంత రం పుష్పలత పెద్ద కొడుకు హరనాథ్తో పాటు ఇద్దరు క వల పిల్లల (రాము, లక్ష్మణ)లను చదువుల కోసం నగరంలోని బర్మా కాంపునకు వచ్చేసింది. భర్తను కోల్పోయి నా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడి పిల్లలను చది విస్తోంది. ఈ తరుణంలో పెద్ద కొడుకును పోగొట్టుకున్న ఆమె సెల్ఫోన్లో ఉన్న కొడుకు ఫోటోను చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తోంది. అంతటి విషాదంలోనూ కొడుకు అవయవ దానానికి ముందుకు వచ్చి ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించడాన్ని పలువురు శ్లాఘిస్తున్నారు. ఒత్తిడితో పనికి రాని గుండె..: హరనాథ్ గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చాలనుకున్నారు. అందుకు చార్టర్డ్ ఫ్లైట్ను సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గుండెపై ఒత్తిడి అధికం కావడం వల్ల కేవలం కవాటాలను మాత్రమే వైద్యులు చెన్నై తీసుకెళ్లారు. హరనాథ్ మృతదేహానికి ఆదివారం బర్మా క్యాంపు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
-
ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖకు చెందిన మండల హరనాథ్(17) నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా అతడు అమ్మమ్మ గారి ఊరు పెబ్బవరం వెళ్లాడు. అక్కడే ఈ నెల 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈనెల 23న హరనాథ్ను బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అతని తండ్రి లేకపోవటంతో తల్లి పుష్పలత, తాత అప్పలనాయుడుతో స్థానిక జీవన్దాన్ కోఆర్డినేటర్ ఇందిర మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఇండస్ ఆస్పత్రిలో అవయవ దానానికి సరైన సదుపాయాలు లేక పోవడంతో పక్కనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి మార్చారు. ఈ మేరకు గుండెను చెన్నైలోని ఫోర్టిస్ ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని వైజాగ్లోని కేర్ ఆస్పత్రికి, మరో కిడ్నీని మణిపాల్ ఆస్పత్రిలో పేషెంట్కు, నేత్రాలను స్థానిక ఐ బ్యాంక్కు ఇచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మృత్యువులోనూ చిరంజీవి జతిన్
ఆ బాలుడు మరణిస్తూ కూడా ఆరుగురికి జీవితాల్ని ఇచ్చాడు. మృత్యువుతో పోరాటంలో ఓడినా తన అవయవ దానంతో అందరి హృదయాల్లో చిరంజీవి అయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన బాలుడు జతిన్ ఇప్పుడు నిజంగా రియల్ హీరోగా వేనోళ్ల కీర్తి పొందుతున్నాడు. మానవత్వంఉన్న ప్రతి గుండెను కదిలించే ఆ కథనం.. - ఖైరతాబాద్ ఖైరతాబాద్ డివిజన్లోని జాగీర్దర్బాడాలో నివాసముండే బి.కృష్ణ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. రెండో సంతానమైన బి.జతిన్(14) స్థానికంగా ఉన్న మాస్టర్ ట్యాలెంట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి పక్కనే నల్గొండ జిల్లా తిరుగలపల్లి గ్రామానికి చెందిన సైదులు, ఈశ్వరమ్మలు ఎన్టీఆర్గార్డెన్లో మాలీలుగా పనిచేస్తున్నారు. వీరికి గణేష్ యాదవ్(14) ఒక్కగానొక్క సం తానం. ఇద్దరూ ఒకే స్కూల్లో సహ విద్యార్థులు కావడం, ఇరుగుపొరుగులవ్వడంతో ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. ప్రమాదం జరిగిందిలా.... ఈ నెల1వ తేదీన గణేష్యాదవ్ అన్న మల్లేష్ ఉదయం 8 సమయంలో హీరోహోండా స్ల్పెండర్ప్లస్పై ఇంటికి వచ్చా డు. వద్దంటున్నా గణేష్ ఇప్పుడే వస్తానంటూ ఆ బండిపై బయటకు వచ్చాడు. జతిన్ కలవడంతో ఇద్దరు కలిసి బైక్పై నిమజ్జనం అయిన ఖైరతాబాద్ మహాగణపతిని చూసేం దుకు బయలుదేరారు. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో బైక్ అదుపు తప్పి డ్రైవింగ్ చేస్తున్న గణేష్యాదవ్, జతిన్లు ఫుట్పాత్పై పడ్డారు. దాంతో వీరి తలలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ గాంధీ హాస్పిటల్కు తరలిం చారు. చికిత్స పొందుతూ అదే రోజు గణేష్యాదవ్ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జతిన్ను ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అయితే బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు ఆదివారం ధ్రువీకరించారు. జతిన్ కిడ్నీలు, గుండె, కార్నియాలు, కాలేయాన్ని సేకరించారు. గుండెను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. అవయవదానం చేసిన జతిన్కు పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. -
తను మరణించినా.. ఐదుగురికి అవయవదానం
విశాఖపట్టణం: విశాఖకు చెందిన ఓ మహిళ బ్రెయిన్ డెడ్ కాగా ఆమె అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ కలుగనుంది. వివరాలివీ... విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆర్.రమణమ్మ(48) ఈనెల 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక కేర్ ఆస్పత్రిలో చేర్పించగా రాత్రి 8 గంటల సమయంలో బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. జీవన్దాన్ అధికారులు రమణమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడి, ఆమె అవయవదానానికి అంగీకరింపజేశారు. ఆమె రెండు కిడ్నీలను విశాఖలో కేర్, అపొలో ఆస్పత్రుల్లో అవసరమున్న ఇద్దరు రోగులకు ఇచ్చేందుకు సమ్మతించారు. నేత్రదానానికి కూడా సమ్మతించారు. అంతేకాకుండా హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు లివర్, ఊపిరితిత్తులను అమర్చడానికి సమ్మతించారు. దీంతో ఆ మేరకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం హెలికాప్టర్లో లివర్, ఊపిరితిత్తులను హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా, రమణమ్మ కుటుంబం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం నుంచి విశాఖకు వలస వచ్చింది. ఆమె భర్త లారీ క్లీనర్ కాగా కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా కుమారులు కృష్ణంరాజు, శ్రీనివాసరాజు లారీ డ్రైవర్లుగా స్థిరపడ్డారు. -
బ్రెయిన్డెడ్ కావడంతో అవయవదానం
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్డెడ్ కావడంతో తల్లిదండ్రులు అవయవదానం చేశారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో పని చేస్తున్న నూల శంకరయ్య, సరోజ దంపతుల కుమారుడు సాగర్బాబు(20) హైదరాబాద్లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 23న కళాశాల నుంచి హాస్టల్కు వెళ్తుండగా.. ట్రాలీ ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా సాగర్బాబు బ్రెయిన్ స్పందించడం లేదని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో వైద్యం చేసినా ప్రయోజనం ఉండదని వైద్యులు సూచించడంతో కొడుకు అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో జీవన్దాన్ సంస్థకు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు అప్పగించి పుట్టెడు దుఃఖంలోనూ ఉదారతను చాటుకున్నారు. వైద్యం చేసినా కొడుకు బతకడనే చేదు నిజాన్ని దిగమింగి మరొకరికి ప్రాణదానం చేయడానికి ముందుకొచ్చిన సింగరేణి కార్మిక దంపతులను స్థానికులు అభినందించారు. -
పాత్రికేయుడి అవయవదానం
తమ ఎదుట కొండంత కష్టం కనపడుతున్నా, పది మందికీ సాయపడాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీయూడబ్ల్యుజే నాయకుడు చేరాల కృష్ణ (30)కు బ్రెయిన్ డెడ్ కావడంతో.. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. సాక్షి దినపత్రిక అబ్దుల్లాపూర్ మెట్ విలేకరిగా పనిచేస్తున్న కృష్ణ గత గురువారం రాత్రి విధులు ముగించుకుని రాత్రి 11గంటల ప్రాంతంలో బైక్పై ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం ఆటోనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన కృష్ణను ఎల్బినగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తల లోపలి భాగంలో బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్లో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. చిన్నమెదడుకు బలమైన గాయాలు కావడంతో.. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో కృష్ణ భార్య గౌతమి, తల్లి , సోదరుడు లింగస్వామి తదితరులు అవయవ దానానికి అంగీకరించారు. కృష్ణ అకాల మరణం పట్ల టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కృష్ణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం ఉదయం జరుగుతాయి. -
ఆ ముగ్గురిలో.. హరి బతికే ఉన్నాడు..
అతను లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలుండాలని.. కొందరికైనా ప్రాణ దానం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ కుటుంబ సభ్యులు భావించారు. మనస్ఫూర్తిగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం.. అనే నానుడిని నిజం చేస్తూ.. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం నుంచి అవయవాలను మ్రుగ్గురికి దానం చేసి తమ త్యాగాన్ని చాటుకున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్.. అన్న మాటలకు వాస్తవ రూపమిచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు అవయవాలను ఆయన కుటుంబ సభ్యుల ఆంగీకారం మేరకు వేలూరు సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకు తరలించారు. బంగారుపాళెం: వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయి మృతి చెందిన వ్యాపారి హరికృష్ణమనాయుడు(55) అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. అతని గుండె, కిడ్నీలను వేలూరు నుంచి చెన్నైకి ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. బం గారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు గత నెల 28న బంగారుపాళెం-అరగొండ రహదారి ఎంపీడీవో కార్యాలయం సమీపం లో మోటారు సైకిల్పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన సరోజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు హరికృష్ణమ నాయుడుకు బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతి అనంతరం అతని అవయవాలు దానం చేసేందుకు ముం దుకొచ్చారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు. గుండెను చెన్నైలోని మలర్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని మియట్ ఆసుపత్రికి, మరొక కిడ్నీని గునాపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీం తో శుక్రవారం ఉదయం 9.25 గంట లకు వేర్వేరు అంబులెన్స్ ద్వారా అవయవాలను చెన్నైకి తరలించారు. అవయవాలను తీసుకెళ్లే సమయంలో ఎ లాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వేలూ రు నుంచి చెన్నై కార్పొరేషన్లోని ఆసుపత్రి వరకు అంబులెన్స్లకు ముందుగా పెలైట్ వాహనాలు వెళ్లడంతో ఉదయం 11.10 గంటలకు బయలుదేరిన అంబులెన్సులు చెన్నైకి 1.45 గంటల సమయంలోనే చెన్నై ఆసుపత్రికి చేరాయి. అనంతరం మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను అమర్చారు. అదే విధంగా రెండు కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులకు అందజేశారు. అలాగే కళ్లు, లివర్ను సీఎంసీ ఆసుపత్రికి దానంగా అందజేశారు. అవయవాలు దానంగా పొందిన కుటుంబ సభ్యులు.. హరికృష్ణమనాయుడు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇతని భార్య రాణియమ్మ. కుమార్తె జాన్సీప్రియ. ఈమె పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రిలో డాక్టర్గా పని చేస్తోంది. కుమారుడు అజయ్ విదేశాల్లో ఇంజినీర్గా పని చే స్తున్నాడు. -
నలుగురికి ప్రాణదాత... ఆ బాలుడు
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 12 ఏళ్ల బాలుడికి బ్రెయిన్డెడ్ అయింది. అయితే, ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అతని తల్లిదండ్రులు... తన కొడుకు మరణించినా నలుగురి ప్రాణాలు నిలిపి చిరంజీవి కావాలని అవయవదానం చేశారు. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనూరాధ కథనం ప్రకారం ... ప్యారడైజ్ బాలంరాయి వద్ద నివాసం ఉండే పి.సత్యనారాయణ జీఎంఆర్ కార్గోలో మేనేజర్. భార్య విమల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వీరికి వైష్ణవ్ (12) కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ దంపతులు ఈనెల 12న కారులో వైష్ణవ్తో పాటు బంధువుల పిల్లలు ముగ్గురితో కలిసి రామోజీ ఫిలింసిటీ వద్ద నుంచి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు వెనుక కూర్చున్న నలుగురు పిల్లలలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా వైష్ణవ్కు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న సత్యనారాయణకు ఛాతీపై బలమైన గాయాలు కాగా. విమల కాలు విరిగింది. ముగ్గురినీ వెంటనే సన్షైన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైష్ణవ్ను అక్కడి నుంచి లక్డికాపూల్లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వైష్ణవ్కు మంగళవారం బ్రెయిన్ డెత్ అయింది. జీవన్దాన్ ప్రతినిధులు సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ, విమల వద్దకు వెళ్లి విషయం చెప్పి వారిని వైష్ణవ్ అవయవాలను దానం చేసేందుకు ఒప్పించారు. వైద్యులు వైష్ణవ్ శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం, గుండెను తొలగించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ఎయిర్ఫోర్టుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
విజయవంతంగా కాలేయ మార్పిడి
దోమలగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి కాలేయాన్ని రోగికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. శనివారం సాయివాణి ఆసుపత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్వీ రాఘవేంద్రరావు ఆపరేషన్ వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన విజయ్కుమార్ కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతూ దోమలగూడలోని సాయివాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. డాక్టర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో వైద్యులు శ్రీనివాస్, ఆకాష్ చౌదరి, అనస్థటిషియన్ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ బృందం ఆయనను పరీక్షించి కాలేయ మార్పిడి తప్పదని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 22 న జీవన్ధాన్ పథకం ద్వారా విజయవాడలో బ్రెయిన్డెడ్ అయిన ఓ యువకుడి సమాచారం తెలుసుకున్న ఈ బృందం అక్కడికి చేరుకుంది. ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి బ్రెయిన్డెడ్ వ్యక్తి కాలేయాన్ని వేరు చేసి విమానం ద్వారా నగరానికి తీసుకువచ్చారు. దాదాపు 9 గంటల పాటు వైద్యుల బృందం విజయ్కుమార్కు సర్జరీ చేసి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన అనంతరం సాధారణ వార్డుకు మార్చారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించినట్లు రాఘవేంద్రరావు తెలిపారు. -
‘75 ఏళ్లు దాటితే బ్రెయిన్డెడ్ అంటున్నారు’
ముంబై: ప్రధాని మోదీపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్సిన్హా విమర్శల వర్షం కురిపించారు. 75 ఏళ్ల వయసు దాటిన వారందరినీ బ్రెయిన్డెడ్ అయినట్టుగా మోదీ గత ఏడాది మే 26న ప్రకటించారని విమర్శించారు. 75 ఏళ్లు దాటిన వారు మంత్రి పదవికి అనర్హులుగా మోదీ పరిగణించడాన్ని సిన్హా బుధవారం ముంబైలో తప్పుబట్టారు. 75 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లలో బీజేపీ ప్రధాన నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శత్రుఘ్నసిన్హా వంటి వారికి మోదీ మంత్రి వర్గంలో స్థానం లభించలేదని, తానూ ఆ బ్రెయిన్ డెడ్ అయిన వారిలోనే ఉన్నానని సిన్హా అన్నారు. మోదీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా సిన్హా విమర్శించారు. ప్రధాని ముందు భారత్ను నిర్మించాలని తర్వాత మిగతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితం
పంజగుట్ట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన 14 ఏళ్ల బాలిక అవయవాలతో మరో ఏడుగురికి కొత్త జీవితం. దీనికి సంబంధించి నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... బీదర్కు చెందిన ఐనాపూర్ మహేష్ తన భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె శివాని(14)తో కలిసి తిరుపతికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా గత నెల 30న బీదర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహేష్ కుటుంబ సభ్యులందరికీ గాయాలు కాగా, వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేష్ కుమార్తె శివాని (14) తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ తన కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో శివానికి శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్ వాల్వులు, రెండు కండ్లు తొలగించి వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవసరమైన వారికి అమర్చారు. -
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్డెడ్తో మృతి
పంజగుట్ట: వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడంటూ ఓ మహిళ పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాగార్జునాసాగర్ వద్ద ఎస్పీఎఫ్ పోలీస్ విభాగంలో పనిచేసే ఎం. శంకర్(38) దవడ నొప్పితో బాధపడుతూ.. ఈ నెల 19వ తేదీన నిమ్స్లో అడ్మిట్ అయ్యాడు. వైద్యపరీక్షలు పూర్తిచేసిన బరడా పి.డి. సాహూ వైద్య బృందం శంకర్కు 25వ తేదీన శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం రోగి పరిస్థితి చెప్పమని శంకర్ భార్య మాధవి ఎన్ని సార్లు వైద్యులను అడిగినా వారు స్పందించలేదు. తెలిసిన మరో వైద్యునితో మాధవి బంధువులు నిమ్స్ వైద్యులకు ఫోన్ చేయించి రోగి పరిస్థితి గూర్చి వాకబు చేయగా శంకర్ బ్రైయిన్డెడ్ అయ్యారని తెలిపారు. కోమాలో ఉన్న శంకర్ గురువారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలపడంతో శంకర్ భార్య మాధవి తన భర్త నడుచుకుంటూ వచ్చి నిమ్స్లో అడ్మిట్ అయ్యారని కేవలం దవడ నొప్పి ఉంటే వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో మృతిచెందాడని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి ఇద్దరు వైద్యులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్పృహలో ఉండగానే ‘బ్రెయిన్డెడ్’!
మన్సూరాబాద్: ప్రాణాలతో స్పృహలో ఉన్న ఓ మహిళకు బ్రెయిన్డెడ్ అయిందని వైద్యులు చెప్పడంపై రోగి తరపు బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితుల కథనంప్రకారం... హయత్నగర్ మండలం తుర్కయంజాల్కు చెందిన విష్ణువర్ధన్రెడ్డి భార్య అమృతారెడ్డి(22)ని ప్రసవం కోసం గత నెల 23న కమ్మగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవం సమయంలో గర్భ సంచి చీలిపోవడంతో అధిక రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స తర్వాత కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మరోసారి అధిక రక్తస్రావం అవడంతో ఈనెల 19న మళ్లీ ఆమెను ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. 20న వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. శ్వాస కూడా తీసుకోలేక పోతుండటంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. కిడ్నీ ఫెయిల్ కావడంతో పాటు బ్రెయిన్డెడ్ అయిందని ఆదివారం ఉదయం చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె బంధువులకు తెలిపారు. డిశ్చార్జ్ చేస్తామని అంబులెన్స్ తెచ్చుకోండి అని చెప్పారు. ఇదే సమయంలో కొంత మంది బంధువుల ఐసీయూలోకి వెళ్లి అమృతారెడ్డిని పలకరించగా కాళ్లు, చేతులు కదిపింది. దీంతో ఆశ్చర్యపోయిన వారు ప్రాణాలతో స్పృహలో ఉన్న మనిషిని బ్రెయిన్డెడ్ అయిందని చెప్పడం ఏమిటని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస ్పత్రి ముందు బైఠాయించారు. ఇదిలా ఉండగా... రోగిని బతికించేందుకు వైద్యులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రోగి బంధువులు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆస్పత్రి ఎండీ డాక్టర్ శశిధర్రెడ్డి‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం అమృతారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యానికి ఆమె శరీరం కూడా సహకరించడం లేదన్నారు. -
ఆ ఆరుగురిలో ‘ఆమె’
అవయవదానం చేసి చిరంజీవిగా మారిన శారద హైదరాబాద్: అప్పటి దాకా చక్కగానే ఉన్న ఆమె ఒక్క సారి కుప్పకూలిపోయింది. తాళలేని తలనొప్పి, కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందనీ..‘బ్రెయిన్ డెడ్’ అయిందని వైద్యులు వెల్లడించారు. అమె కొడుకు సురేష్ స్పందించాడు. తన తల్లి చిరంజీవి కావాలని కోరుకున్నాడు. కానరాని లోకాలకు వెళ్లినా మరికొందరిలో ఆమె బతకాలని భావించాడు. మిగతా కుటుంబీకులు అందుకు సరే అన్నారు. ఇలా అనుకోని రీతిలో ఆమె మరో ఆరుగురికి కొత్త జీవితాన్నిచ్చింది. అవయవదానంతో చిరంజీవిగా నిలచిపోయింది. ఇదీ నిజాంబాద్ జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగంపేట శారద(45) కథ. ఎందరికో చూపిన స్ఫూర్తి బాట. శారద భర్త గంగా గౌడ్ గీత కార్మికుడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో పనిచేస్తూ కుప్పకూలిపోయింది. స్థానికంగా చికిత్సలందించినా ఫలితం లేక పోవడంతో శనివారం నగరంలోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’గా తేల్చారు. కొడుకు చొరవతో... దీంతో ఆమె కుమారుడు సురేష్ తన తల్లి భౌతికంగా లేకపోయినా పది మందిలో బతికుండాలనే కోరికతో ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చాడు. మోహన్ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవన్దాన్ కోఆర్డినేటర్ అనురాధ సహకారంతో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారు జామున డాక్టర్ల బృందం శారద అవయవాలను సేకరించింది. ఆమె లివర్ను గ్లోబల్ హాస్పిటల్లో ఢిల్లీకి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి డాక్టర్ బల్భీర్సింగ్ నేతృత్వంలోని బృందం అమర్చి ఆయనకు కొత్త బతుకు నిచ్చారు. ఒక కిడ్నీని పాతబస్తీకి చెందిన 31ఏళ్ల మహిళకు డాక్టర్ జి.శ్రీధర్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేసి అమర్చారు.గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రసిడెంట్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ హీరేంద్రనాధ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో కిడ్నీని దక్కన్ హాస్పిటల్, గుండె వాల్వ్స్ను ఇన్నోవా హాస్పిటల్, కళ్లను ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్కు ఇచ్చారు. అవయవాల సేకరణ అనంతరం శారద మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి అంబులెన్స్లో కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కుటుంబీకుల చొరవను పలువురు ప్రశంసించారు. -
గ్రీన్ కార్పెట్తో ‘గ్లోబల్’కు కాలేయం తరలింపు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా.. లివర్ను గ్రీన్కార్పెట్తో హైదరాబాద్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్కు తరలించి ఓ వ్యక్తికి అమర్చారు. విశాఖపట్నం నివాసి సత్యనారాయణ (53) ఈ నెల 26న రోడ్డుప్రమాదానికి గురవగా.. అక్కడి సెవెన్హిల్స్ హాస్పిటల్కు తరలించారు. 27న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్ కష్ణమూర్తిల సహకారంతో అవయవదానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా మంగళవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్లు మాథ్యూ జేకబ్, డాక్టర్ రాఘవేంద్ర, మురగన్ రాజన్నల బృందం అవయవాలను శరీరం నుంచి వేరు చేశారు. ఒక కిడ్నీని సెవెన్హిల్స్ హాస్పిటల్కు, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ హాస్పిటల్కు తరలించారు. లివర్ను గ్రీన్ కార్పెట్ సాయంతో లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్కు తరలించారు. దీంతో నగరంలో నివాసముండే 63 ఏళ్ల వ్యక్తికి లివర్మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్ హీరేంద్రనాథ్ తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల పోలీసులు లివర్ తరలించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం వల్లే సకాలంలో హాస్పిటల్కు లివర్ను తరలించగలిగామని తెలిపారు. -
చనిపోతూ... జీవం పోస్తూ..
కూతురు పరీక్ష కోసం వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లిన బెన్సన్ బ్రెయిన్డెడ్ కావడంతో అవయవాల దానం దుండగుల దాడిలో గాయపడి బ్రెరుున్డెడ్ అరుున వరంగల్ కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన కొమ్ము బెన్సన్ (47) కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్న కాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను... మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి దాతృత్వాన్ని చాటుకుంది. - కాశిబుగ్గ కాశిబుగ్గ : దుండగుల దాడిలో గాయపడి బ్రెరుున్ డెడ్ అరుున ఓ వ్యక్తి కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్నకాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్ డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి పుణ్యం కట్టుకున్నారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కొమ్ము బెన్సన్(47) కర్ణాటక రాష్ట్రానికి ఆరేళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో వెళ్లి కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రస్తుతం లక్ష్మిపుర ంలో వాళ్ల నాన్నమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుకుంటోంది. కూతురికి పరీక్షలు ఉండడంతో మార్చి 27న లక్ష్మిపురంలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అదేరోజు సాయంత్రం రూ.500 చిల్లరకోసమని లక్ష్మిపురం సమీపంలోని ఏఎం వేబ్రిడ్జి కాంటా వద్దకు వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న ఇబ్రహీం, అతని స్నేహితుడు శ్రీకాంత్తో ఆయనకు మాటమాట పెరిగి గొడవపడ్డాడు. ఈ క్రమంలో వారిద్దరు బెన్సన్పై దాడిచేసి ఇనుప రాడ్లతో తీవ్రంగా బాదగా కోమాలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మృతుడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు హైదరాబాద్కు పంపించారు. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు బతికున్న సమయంలో వెలిబుచ్చిన కోరిక మేరకు అతని భార్య సరిత, తల్లి మేరమ్మ, కుటుంబ సభ్యులు బెన్సన్ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి కాలేయం, కిడ్నీలు, రెండు గుండె కవాటాలను దానం చేసి మరో ఐదుగురికి పునర్జన్మ కల్పించారు. బెన్సన్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమైనా గొప్ప మనసుతో శరీర భాగాలను కంటతడి పెడుతూనే ఇతరులకు దానం చేయడాన్ని స్థానికులు, జిల్లా అధికార యంత్రాంగం ఎంతగానో అభినందించింది. స్థానికులు కంటతడి పెడుతూనే దహన సంస్కారాలు నిర్వహించారు. బెన్సన్ లక్ష్మిపురంలోని చర్చి లో చాలా ఏళ్లు సహాయ కార్యదర్శిగా పనిచేస్తూనే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనేవాడని, ఇతరులకు సేవ చేయడం, సహాయ సహకారాలు అం దించడంలో ఎప్పుడు ముందుండేవాడని స్థానికులు చర్చించుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. బతికున్న సమయంలో ఎప్పుడు అనే వాడు.. నా భర్త ఎక్కువ చదువుకోకపోయినా విశాలమైన మనస్థత్వం కలిగినవాడు. అతను బతికున్న సమయంలో ఎప్పుడు కూడా రక్తదానం, నేత్రదానం కన్నా అవయవదానం చేయాలని అంటుండేవాడు. అతని మాటే నిజమైంది. - సరిత, మృతుడి భార్య అందరి బాగోగులను ఆకాంక్షించేటోడు.. తన కుమారుడు దూరప్రాంతంలో బ్రతుకుతూ బిడ్డ పరీక్ష కోసమని నగరానికి వచ్చిండు. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. అందరి బాగోగులను ఆకాంక్షించే నా కొడుకు మరణించడం చాలా బాధగా ఉంది. అతడి కోరిక మేరకే అవయవదానంతో ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టి సంతోషపడ్డాం. - మేరమ్మ, మృతుడి తల్లి -
ఆ ఒక్కడు... ఐదుగురికి దేవుడు!
హైదరాబాద్: మృత్యువు ముంగిట నిలిచినా, మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టి చిరంజీవిగా నిలిచాడు ఓ వ్యక్తి! వరంగల్ నగరానికి చెందిన బెన్సన్(46) కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందాడు. బ్రెయిన్డెడ్ అయినట్లు అపోలో వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బెన్సన్ భార్య కొమ్ము సరోజ అవయవదానానికి అంగీకరించారు. బెన్సన్ కళ్లు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె నాళాలను సేకరించిన వైద్యులు వాటిని జీవన్దాన్ ట్రస్టుకు శనివారం అందజేశారు. -
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
'నువ్వు మరణించినా.. నలుగురిని జీవింపజేయి' అనే అవయవదాన ప్రధాన ఉద్దేశాన్ని ఆ తల్లిదండ్రులు ఉన్నతంగా భావించారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాల్ని.. వాటి అవసరంతో అల్లాడుతున్నవారికి ఇచ్చేందుకు ముందుకొచ్చి అతణ్ని చిరంజీవిగా నిలబెట్టారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న అఖిల్ మధు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. తల్లిదండ్రుల అంగీకారంతో అఖిల్ మధు గుండెను చెన్నైలోని ఓ వ్యక్తికి, కిడ్నీలను హైదరాబాద్ కు చెందిన ఇద్దరికి అమర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుండెను చెన్నై తరలించేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. -
అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు
బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యుల ఆదర్శం రాష్ట్రం విడిపోయిన తరువాత ఇది రెండో సంఘటన ఒక దీపం వెలిగింది. ఐదు కుటుంబాల్లో కాంతులు నింపింది. ప్రాణం పోయినా చిరంజీవిగా వర్థిల్లవచ్చని నిరూపించింది. బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ చంద్రరావు చనిపోతూ ఐదుగురు వ్యక్తులకు జీవన దానం చేశారు. ఈ అపురూప సన్నివేశానికి విశాఖ వేదికైంది. నవ్యాంధ్రప్రదేశ్లో ఇది రెండో అవయవదానం కావడం విశేషం. విశాఖ-మెడికల్: పుట్టెడు దుఃఖం... ఇంటి యజమాని కన్నుమూసిన క్షణాన తీరని శోకం... అయినా ఆ కుటుంబం స్పందించింది. ప్రజాప్రతినిధిగా సేవాభావం కలిగిన మతుని ఆశయం నెరవేరాలని కోరుకుంది. అవయవ దానానికి అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ అయ్యంవారిపేట వార్డు సభ్యుడు రౌశో కష్ణచంద్రరావు (54) గురువారం రక్తపోటు పెరిగి నడుస్తుండగానే అకస్మాత్తుగా పడిపోయారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళిపోయారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బ్రెయిన్డెడ్ అయినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం ప్రకటించారు. ఆస్పత్రి అవయవదాన కౌన్సెలర్ సీహెచ్ ఇందిర అతని కుటుంబ సభ్యులతో చర్చించి అవయవ దానానికి ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ అవయవదాన సాధికారక సంస్థ జీవనదాన్ అనుమతి రావడంతో ఆదివారం మధ్యాహ్నం కృష్ణచంద్రరావు కాలేయాన్ని కేర్ ఆస్పత్రిలోనే కాలేయం దెబ్బతిన్న మరో రోగికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేశారు. అదే ఆస్పత్రిలో రెండో కిడ్నీలు పూర్తిగా పాడై చికిత్స పొందుతున్న మరో రోగికి కిడ్నీని అమర్చారు. రెండో కిడ్నీని నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కిడ్నీ బాధితునికి అమర్చారు. రెండు కళ్లను నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంకు అందచేశారు. గ్రామస్తులు వద్దన్నారు చనిపోయిన నా భర్త కృష్ణచంద్రరావు కండక్టర్గా పనిచేస్తూనే వార్డు సభ్యునిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలుకగా సేవలు చేసేవారు. ఆయన లేని లోటు మా కుటుంబానికి తీరకపోయినా ఆయన అవయవదానంతో ఐదుగురికి ఆయుష్షుపోశారు. అదే నాకు సంతోషం ఇచ్చింది. మొదట మా గ్రామస్తులంతా అవయవదానం చేయవద్దని, కులాచారానికి కట్టుబడి దహన సంస్కారం చేయాలని చెప్పినా, ఆస్పత్రి వైద్యుల కోరిక మేరకు అవయవ దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించాం. - శారద (అవయవ దాత భార్య) గర్వంగా ఉంది కృష్ణచంద్రరావు కుమారునిగా నాకెంతో గర్వంగా ఉంది. ప్రత్యక్షంగా మా నాన్న మాకు దూరమైనా, పరోక్షంగా ఐదుగురు వ్యక్తుల్లో సజీవంగా ఉండటం మానసికంగా మాకెంతో సంతోషాన్ని మిగిల్చింది. అందుకే అవయవ దానానికి అంగీకరించాం. ప్రజాప్రతినిధిగా ఉన్న మా నాన్న అందరికీ ఆదర్శంగా నిలవడం నాకు గర్వంగా ఉంది. - జగదీష్ (కుమారుడు) స్ఫూర్తి దాయకం.. అవయవ దానం ఇచ్ఛాపురం: కృష్ణచంద్రరావు మృతి ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ అతని అవదానం స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అవయవ దానం ప్రాధాన్యంపై స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. చనిపోయినా బతికే ఉండాలంటే అవయవ దానం చేయడం ఉత్తమమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మృతుడి స్వగ్రామం మండలంలోని అయ్యవారిపేటలో గ్రామస్తులంతా గ్రామ మండపం వద్దకు చేరుకుని విలపించారు. నేడు అంత్యక్రియలు కృష్ణ మృత దేహం సోమవారం విశాఖ నుంచి గ్రామానికి చేరుకుంటుంది. గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్విహ స్తామని గ్రామస్తులు చెప్పారు. -
మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం
విశాఖపట్నం:ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని మెదడు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణారావు ఊపిరితిత్తులు, కిడ్నీలను సావిత్రిబాయి పూలే ట్రస్టుకు దానం చేశారు. ఆయన రెండు కిడ్నీలను కేర్, అపోలో ఆస్పత్రులకు అందించారు. అలాగే ఊపిరితిత్తులను కేర్ ఆస్పత్రికి అందించారు. ఈ నెల ఆరంభంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడలో3వ తేదీన సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మణికంఠ బ్రెయిన్డెడ్ కావడంతో అతని అవయవాలను నలుగురికి దానం చేశారు. -
బెంగాల్ వ్యాపారి అవయవదానం
పంజగుట్ట: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యాపారి నగరంలో ఉంటున్న తన కొడుకును చూసేందుకు వచ్చి బాత్రూమ్లో కాలు జారిపడ్డాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అతని అవయవాలు దానం చేసేందు కు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్కు చెందిన సోమనాథ్ (64) గచ్చిబౌలిలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న తన కొడుకు నిలంజన్ జానను చూసేందుకు అతని భార్య కల్పనతో కలిసి నగరానికి వచ్చాడు. ఈనెల 11 వ తేదీన సోమనాథ్ బాత్రూమ్లో కాలు జారి పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతనికి ఈనెల 12వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్దాన్ బృందం అతని కుటుంబ సభ్యులకు అవయవదానం ఆవశ్యకతను వివరించగా, వారు ఒప్పుకున్నారు. సోమనాథ్కు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను భద్రపరిచారు. -
బ్రెయిన్ డెడ్ కాదు... భరత్ కుమార్ క్షేమం
ఇబ్రహీంపట్నం :బ్రెయిన్ డెడ్ అయి అవయదానానికి వచ్చిన భరత్ కుమార్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడని మంగళగిరి ఎన్నారై డాక్టర్లు నిర్థారించారు. దాంతో అతనికి డాక్టర్లు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. భరత్ కుమార్ క్షేమంగా ఉన్నాడని వైద్యులు చెప్పటంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గురువారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భరత్కుమార్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకమెడల భరత్కుమార్(45) మూడు లారీల ఓనర్. వాటితో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం కంచికచర్ల వెళ్తుండగా వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతన్ని వెంటనే కంచికచర్లలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిందని అతన్ని గుంటూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు మృతి చెందాడని చెప్పడంతో.. భరత్కుమార్ తమ్ముడు అశోక్కుమార్ , చెల్లెలు కృష్ణవేణిలు అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులను ఒప్పించారు. వారి అంగీకారంతో భరత్ కుమార్ అవయవాలను మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. భరత్ కుమార్కు భార్య , ఇద్దరు కుమారులు యశ్వంత్ సాయి(10), ఆజాద్(7)లు ఉన్నారు. కాగా, ఎన్నారై ఆస్పత్రి వైద్యులు భరత్ కుమార్ బ్రెయిన్ డెడ్ కాలేదని.. సరైన వైద్యం అందిస్తే.. బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో చనిపోయాడునుకున్న తమ కుమారుడు బ్రతికే ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. -
యువకుడి అవయవదానం
వేలూరు: ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకి అంబులెన్స్లో తరలించారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మోర్థాంగల్ గ్రామానికి చెందిన అరుణ్(23) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 13న ద్విచక్ర వాహన ప్రమాదంలో అరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించా రు. చికిత్స చేసినా ఫలించక అరుణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందు కు వచ్చారు. చెన్నైలోని మద్రాసు మెడిక ల్ మిషన్ ఆస్పత్రిలోని ఒక రోగికి గుండె ఆపరేషన్ చేసేందుకు అత్యవసరం కావడంతో వేలూరు సీఎంసీలోని వైద్యులు అధునాతన పద్ధతిలో అరుణ్ గుండెను శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసి సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో అంబులెన్స్లో చెన్నైకి తరలించారు. అరుణ్ కళ్లు, గుండె, వంటి అవయవాలను వివిధ రోగులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మరణంలోనూ అపర్ణ కీర్తి
బీటెక్ విద్యార్థిని శరీరదానం వెంకోజీపాలెం: ఒక ఏడాది గడిస్తే ఆమెకు మంచి ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశ యం నెరవేరుతుంది. కూతురి భవిష్యత్పై రోజూ ఎన్నో ఊహలు.. అందమైన కలలు..! కానీ దేవుడు మరోలా తలచాడు. వారి కలలను కల్లలు చేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో కన్నబిడ్డను శాశ్వతంగా దూరం చేశాడు. గుండెలను పిండేసే ఈ విషాదంలోనూ ఆమె అమ్మానాన్నలు తమ కంటిపాప కోర్కెను నెరవేర్చారు. తన చావును ముందే ఊహించినట్టు మూడు నెలల క్రితం కుమార్తె సమ్మతించిన మేరకు ఆమె అవయవాన్ని దానం చేశారు. వివరాల్లోకి వెళితే.. స్టీల్ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ దేవినేని ప్రసాద్ కుమార్తె అపర్ణకీర్తి దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఈనెల 3న ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆమెను హుటాహుటిన నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అపర్ణకీర్తి కోమాలోకి వెళ్లిపోయింది. 5న వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. చివరకు తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలో ముంచేస్తూ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కన్ను మూసింది. కూతురు ఆశయా న్ని గౌరవిస్తూ అమ్మానాన్నలు ఆమె పార్థివ దేహాన్ని శరీరదాన ఫౌండేషన్కు అప్పగించారు. దీంతో అపర్ణకీర్తి తన శరీర దానంతో మరికొందరి జీవితాలకు దారి చూపించింది. ఆదర్శంగా నిలిచింది. -
చిరంజీవి ఫ్రాన్సిస్..
అవయవ దానంతో ఏడుగురికి జీవితం పంజగుట్ట: ఓ వ్యక్తి తాను పుట్టి ఏం సాధించాడో తెలియదు కాని.. చనిపోతూ తన అవయవాలు దానం చేసి మరో ఏడుగురికి ప్రాణం పోసి చిరకాలం గుర్తుండిపోయాడు. సోమవారం నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన బి.ఫ్రాన్సిస్(53) ఖైరతాబాద్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో పనిచేసేవారు. ఈనెల 20న బైక్పై కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇతను లక్డీకాపూల్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఫ్రాన్సిస్ను గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఇలియాస్, ప్రవీణ్లు ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 23న ఫ్రాన్సిస్కు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అనంతరం గ్లోబల్ జీవన్దాన్ కో ఆర్డినేటర్ భానుచంద్ర.. ఫ్రాన్సిస్ భార్య విజయకు అవయవ దానం ఆవశ్యకతను వివరించారు. ఆమె ఒప్పుకోవడంతో ఫ్రాన్సిస్ రెండు కిడ్నీలు, లివర్, గుండె వాల్వులు, కళ్లను సేకరించి అవసరమైన వారికి అమర్చారు. -
ఇక ఇక్కడా... కృత్రిమ గుండె
హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చిన కిమ్స్ పరికరం ఖరీదు రూ.60 లక్షలు హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితులకు శుభవార్త. ఇక నుంచి బ్రెయిన్డెడ్ బాధితుని నుంచి సేకరించే సహజమైన గుండె కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కృత్రిమ గుండెను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఢిల్లీ, చెన్నైలో మాత్రమే ఈ తరహా వైద్యసేవలు అందుబాటులో ఉండగా, తాజాగా హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. వైద్య పరిభాషలో హార్ట్వేర్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ (హెచ్వీఏడీ)గా చెప్పుకునే 160 గ్రాముల బరువున్న ఈ కృత్రిమ గుండెను ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ యాజమాన్యం సోమవారం ఆస్పత్రిలో ఆవిష్కరించింది. గోల్ఫ్ బంతి సైజులో ఉన్న ఈ పరికరాన్ని రోగి ఛాతిలోపల ఉన్న గుండెకు కింది భాగంలో అమర్చుతారు. లెఫ్ట్ వెంట్రికల్ (ఎల్వీఏడీ) ఫెయిల్యూరైతే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా, రైట్ వెంట్రికల్ (ఆర్వీఏడీ) పనిచేయకపోతే కుడి భాగానికి సపోర్టుగా, రెండు వెంట్రికల్స్ విఫలమైతే రెండి ంటికీ సపోర్టుగా దీన్ని అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన ఈ గుండె నిమిషానికి పది లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్కు అనుసంధానిస్తారు. చిన్న కేబుల్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. ఆరు గంటలకోసారి బ్యాటరీ మార్చుకోవాలి. దీని ఖరీదు రూ.60 లక్షలు. శస్త్రచికిత్స, వైద్యుడి ఫీజు, ఆస్పత్రి ఖర్చు అన్నీ కలిపి రూ.80-90 లక్షలవుతుంది. కిమ్స్ ఎండీ, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు హృద్రోగులకు మాత్రమే ఈ పరికరాన్ని అమర్చారని, దీంతో వారి జీవితకాలం మెరుగుపడిందన్నారు. ప్రముఖ గుండెమార్పిడి నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ నందగిరి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతుండగా, 7.25 మిలియన్ల మంది మరణిస్తున్నారని చెప్పారు. వీరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైన సమయంలో సహజమైన గుండె దొరక్క రోగులు చనిపోతున్నారని, సహ జ గుండెకు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాన్ని అమర్చి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. -
40కి.మీల దూరం.. 42 నిమిషాలు.. ఓ ప్రాణం!!!
-
చనిపోతూ.. ముగ్గురి జీవితాల్లో వెలుగులు
సాక్షి, ముంబై: మనిషి చనిపోయినా మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు. ప్రమాదవశాత్తు, ఏదైనా జబ్బు చేసి మనిషి చనిపోతే అవయవ దానం చెయ్యొచ్చు. ఇలా చేయడం వల్ల మరికొందరి ప్రాణాలను కాపాడొచ్చు. ఇటీవల కొందరు కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో తమ వారెవరైనా చనిపోతే అవయవదానం చేయడానికి ముందుకొస్తున్నారు. ముంబై నగరంలో అవయవ దానాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ మహిళ బ్రెయిన్ డెడ్(43) అయి మరణించి మరికొందరి జీవితంలో వెలుగులు నింపింది. శ్రీరామ్ గోపాల్, నందిని దంపతులు ములుండ్లో నివాసం ఉంటున్నారు. నందిని ఓ ప్రైవేట్ హెచ్ఆర్ కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఇటీవల నందినికి తీవ్ర తలనొప్పి రావడంతో మూర్ఛపోయింది. ఆమెకు వైద్యపరీక్షలు చేసిన బాంబే ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్డెడ్గా ధ్రువీకరించారు. తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు. తన భార్య కల్లెదుటే ఉన్నదనే సంతృప్తి ‘తన భార్య చనిపోయినా అవయవాలను దానం చేయాలని శ్రీరామ్గోపాల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు భార్య అవయవాలను దానం చేశాడు’. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను బతికి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందోన ని, చనిపోతే తన అవయవాలను దానం చేయాలని భార్య నందిని కోరిందని, ఇదివరకే తన కళ్లను ఐబ్యాంక్కు దానం చేసినట్లు చెప్పారు. ఆమె కోరిక మేరకు మరో అవయవాలు వృథాగా పోకుండా ఆమె కిడ్నీలు, కాలేయం, కళ్లను దానం చేసినట్లు చెప్పాడు. తన భార్య అవయవ దానం వల్ల మరో ముగ్గురి ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. తన భార్య కల్లెదురుగా లేకున్నా ఆమె అవయవాలను దానం చేయడం వల్లలో ఆమె ఇంకా బతికి ఉన్నదనే సంతృప్తి కలుగుతుందని కన్నీటి పర్యంతమయ్యాడు. ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగాం: డాక్టర్ ఓ 28 ఏళ్ల మహిళ కిడ్నీ కోసం బాంబే ఆస్పత్రిలో చేరింది. మరో 47 ఏళ్ల మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. 72 ఏళ్ల మరో మహిళ కాలెయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఫోర్టిస్ట్ ఆస్పత్రిలో వెయిటింగ్ జాబితాలో ఉన్నారని ఆస్పత్రి ట్రాన్స్ప్లాంట్ కో-ఆర్డినేటర్ సంతోష్ సొరాటే పేర్కొన్నారు. ఈ ముగ్గురు మహిళలకు శ్రీరామ్గోపాల్ భార్య నందిని దానం చేసిన అవయవాలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆ మూడు ప్రాణాలు నిలబడ్డాయని చెప్పారు. అవగాహన కల్పించాలి కిడ్నీ జబ్బుల వైద్యుడు డాక్టర్ హరేస్ దోదేజీ మాట్లాడుతూ ..కిడ్నీ మార్పడి చేయడం ద్వారా ప్రస్తుతం ఓ మహిళ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మరో 72 ఏళ్ల మహిళకు కాలెయ మార్పిడి చేశామన్నారు. అవయదానం వల్ల రెండు జీవితాలను కాపాడగలిగామని చెప్పారు. అవయవ దానం పట్ల రోగుల్లో, బంధువుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అవయవ దానం చేయడం ద్వారా ఇతర రోగుల ప్రాణాలను కాపాడినవారు అవుతారని వారికి తెలియజెప్పాలని అభిప్రాయపడ్డారు. -
ఆదర్శమూర్తి ఈ అమ్మ..!
సాక్షి ముంబై: అమ్మ.. ఈ రెండక్షరాలను ఈ సృష్టిలో దేనితో పోల్చినా తక్కువే అవుతుంది. ప్రాణం పోయడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. అది తన బిడ్డకైనా, ఇతరులకైనా ప్రాణం పోసేందుకు అమ్మ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే అమ్మను అమ్మతో మాత్రమే పోల్చగలమంటారు కవులు. అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో చాటిచెప్పే ఓ ఘటన నగరంలో చోటుచేసుకుంది. తన బిడ్డ బతకదని తెలిసి, కనీసం ఆమె అవయవాలను ఇతరులకు దానం చేస్తేనైనా తన బిడ్డ ఉనికి మరికొన్ని కాలాలు ఈ భూమిపై ఉంటుందని భావించింది. గుండె నిబ్బరం చేసుకొని బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న తన బిడ్డ కాలేయాన్ని, మూత్రపిండాలను దానం చేసి ఇద్దరికి ప్రాణం పోసింది. వివరాల్లోకెళ్తే... ముంబై మాజీ మేయర్ నిర్మలా సావంత్ ప్రభావల్కర్ తన 18 ఏళ్ల కూతురు నీలిమకు తలనొప్పి రావడంతో బాంద్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూన్ 6న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తలనొప్పి తీవ్రం కావడంతోపాటు విరేచనాలు కూడా అవుతుండడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని గుర్తించారు. చూస్తుండగానే ఆమె పరిస్థితి మరింత విషమించింది. మెదడు పనిచేయకపోవడంతో శరీరంలోని ఒక్కో అవయం పట్టును కోల్పోతూ నిర్జీవంగా మారడం మొదలైంది. దీంతో బ్రెయిన్ డెడ్గా వైద్యలు ధ్రువీకరించుకొని విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె శరీరం వైద్యానికి ఏమాత్రం సహకరించడంలేదని చెప్పిన వైద్యులు ‘క్లినికల్లీ డెడ్’గా ప్రకటించారు. 18 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా నిర్జీవంగా పడి ఉండడాన్ని చూడలేకపోయిన ఆ కన్నతల్లి గుండలవిసేలా విలపించింది. అంతలోనే తేరుకొని ఎలాగైనా తన కూతురు అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకుంది. అందుకు మార్గం ఆమె అవయవాలను దానం చేయడమేనని నిర్ణయించుకొని విషయాన్ని వైద్యులకు చెప్పింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు అవసరమున్న బాధితులను గుర్తించిన వైద్యులు వెంటనే నీలిమ అవయవాలను వారికి అమర్చే ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే అమర్చి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. లీలావతి ఆసుపత్రిలో 38 ఏళ్ల వ్యక్తికి కిడ్నీలను, ఠాణేలోని జుపిటర్ ఆసుపత్రిలోని ఓ వృద్ధుడికి కాలేయాన్ని అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడారు. తన బిడ్డ మరణిస్తూ కూడా ఇద్దరికి ప్రాణాలను కాపాడిందని ఆ తల్లి పలువురితో గర్వంగా చెప్పుకోవడం పలువురిని కదిలించింది. -
రైలు ప్రమాదంతో కుటుంబం చెల్లాచెదురు
(విజయనగరం నుంచి గౌరీకుమార్, సూరిబాబు) బొకారో ఎక్స్ ప్రెస్ నుంచి దూకి, రాయగఢ ప్యాసింజర్ ఢీకొన్న ప్రమాదంతో ఓ కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోయింది. శనివారం సాయంత్రం 6.38 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు కలెక్టర్, ఇతర అధికార వర్గాలు తెలిపాయి. మృతులంతా ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్నవారేనని తెలిసింది. ఎస్-2 బోగీలోని 16వ నెంబరు సీటులో ప్రయాణిస్తున్న మనోజ్ కుమార్ సింగ్ కుటుంబంలోని దాదాపు సభ్యులంతా మరణించారు. ఆయనొక్కరే ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన భార్య శ్వేతా సింగ్ (33) ఆ బోగీలోని 5వ నెంబరు సీట్లో ప్రయాణించారు. ఆమెతో పాటు కుమార్తె సంహితకుమారి (10), బాబు శౌర్య (2) కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఇదే ప్రమాదంలో ఎస్ 2 బోగీలోని 9వ నెంబరు సీట్లో ప్రయాణించిన కార్తీక్ సాహు (70), అదే బోగీలోని తారాదేవి (34) కూడా మరణించారు. వీరంతా ప్రమాదం జరిగిన సంఘటనలోనే మరణించారు. అలెక్స్ తోప్నో (26) విజయనగరం కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రంలోని నవాబ్ జిల్లాకు చెందిన కార్పస్ అనే వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కావడంతో అతడిని విశాఖపట్నం తరలించారు. గాయపడిన వారిని గొట్లాం, విజయనగరం ఆస్పత్రులకు తరలించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో అత్యవసర కేంద్రం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ సెంటర్ల ఫోన్ నెంబర్లు: 0891 2843003, 004, 005, 006