రాజధానికి సీఎం చంద్రబాబుతో పట్టిన అరిష్టం పోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తిరిగిన రోడ్లపై గో పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.