భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 114 పరుగుల చేసిన ఇంగ్లాండ్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కుక్(46), హసీబ్ హమీద్(62) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఉత్తమ ఆటతీరును కనబరిచిన ఇంగ్లాండ్ 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 488 పరుగులకు ఆలౌట్ అయ్యింది.