Second innings
-
India vs Bangladesh, 2nd Test: విజయం వేటలో... మెరుపు వేగంతో...
తొలి మూడు రోజుల ఆటలో రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మొదటి రోజు కూడా 35 ఓవర్లకే ఆట పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు రోజుల్లో ‘డ్రా’కే అవకాశం తప్ప మరో ఫలితం వస్తుందా అని సోమవారం ఉదయం అంతా ఊహించారు. కానీ భారత జట్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది. మ్యాచ్లో ఆధిక్యం ప్రదర్శించి విజయంపై గురి పెట్టాలంటే అసాధారణంగా ఆడాలని నిశ్చయించుకుంది. బ్యాటర్లంతా ఒక్కసారిగా టి20 ఫార్మాట్కు మారిపోయారు. అంతే... 50, 100, 150, 200, 250... ఇలా అన్ని పరుగుల మైలురాళ్లను వేగంగా, తక్కువ బంతుల్లో అధిగమించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రోహిత్తో మొదలు పెట్టి జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్ ధాటిగా ఆడటంతో ఏకంగా 8.22 రన్రేట్తో భారీగా పరుగులు, ఆపై ఆధిక్యం కూడా వచ్చేశాయి. అనంతరం 45 నిమిషాల్లోనే బంగ్లాదేశ్ను ఒత్తిడిలోకి నెట్టి రెండు వికెట్లతో పైచేయి సాధించింది. చివరి రోజు బంగ్లా పోరాడుతుందా లేక భారత్ ఇదే ఊపులో మ్యాచ్ గెలిచేస్తుందా చూడాలి. కాన్పూర్: వర్షంతో వృథా అయిన సమయాన్ని మర్చిపోయేలా గ్రీన్పార్క్ స్టేడియంలో భారత జట్టు అభిమానులకు ఒక్క రోజులో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో మెరుపు బ్యాటింగ్తో జట్టు సత్తా చాటింది. సోమవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 72; 12 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్లు) విరాట్ కోహ్లి (35 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (36 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించగా... షకీబ్, మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 11 ఓవర్లలో 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఉదయం 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) కీలక సెంచరీ సాధించారు. సోమవారం ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం విశేషం. మోమినుల్ మినహా... రెండు రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 107/3 స్కోరుతో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్ను కొనసాగించింది. సోమవారం మరో 39.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 126 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముష్ఫికర్ (11)ను బౌల్డ్ చేసి బంగ్లా పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టాడు. బుమ్రా తర్వాతి ఓవర్లో దాస్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించినా... రోహిత్ అద్భుత క్యాచ్తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్లో మోమినుల్ మాత్రం పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. కొద్ది సేపటికే సిరాజ్ అసాధారణ క్యాచ్ షకీబ్ (9)ను పెవిలియన్ పంపించింది. 93, 95 పరుగుల వద్ద పంత్, కోహ్లి క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన మోమినుల్ ఆ తర్వాత కెరీర్లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత మిగిలిన 4 వికెట్లను పడగొట్టేందుకు భారత్ కు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాలెద్ను అవుట్ చేసి జడేజా తన ఖాతాలో 300వ వికెట్ను వేసుకున్నాడు. ధనాధన్... దూకుడే మంత్రంగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. మహమూద్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 వరుస ఫోర్లు బాదగా... ఖాలెద్ వేసిన తర్వాతి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రోహిత్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్సర్లుగా మలిచాడు. అనంతరం మహమూద్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్స్లు, 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ కు దిగి రోహిత్ను వెనక్కి పంపాడు. 31 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో వైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో 32 పరుగుల వ్యవధిలో జైస్వాల్, గిల్, పంత్ (9) అవుటయ్యారు. ఈ దశలో కోహ్లి, రాహుల్ జోరు తగ్గకుండా బంగ్లా బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 59 బంతుల్లోనే 87 పరుగులు జోడించడం విశేషం. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకోగా, కోహ్లి ఆ అవకాశం చేజార్చుకున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో ఆకాశ్దీప్ కూడా తానూ ఓ చేయి వేశాడు. 16 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం 11 ఓవర్లపాటు క్రీజ్లో బంగ్లా బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. 7 ఓవర్లలో జట్టు 18 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే జాకీర్ (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్... తన తర్వాతి ఓవర్లో నైట్వాచ్మన్ మహమూద్ (4)ను బౌల్డ్ చేసి బంగ్లా ఆందోళనను మరింత పెంచాడు. అంతకుముందు 3 పరుగుల వద్ద షాద్మన్ ఇచి్చన క్యాచ్ను స్లిప్లో రాహుల్ వదిలేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్దీప్ 24; మోమినుల్ (నాటౌట్) 107; నజ్ముల్ (ఎల్బీ) (బి) అశి్వన్ 31; ముష్ఫికర్ (బి) బుమ్రా 11; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; షకీబ్ (సి) సిరాజ్ (బి) అశి్వన్ 9; మిరాజ్ (సి) గిల్ (బి) బుమ్రా 20; తైజుల్ (బి) బుమ్రా 5; మహమూద్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; ఖాలెద్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 233. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80, 4–112, 5–148, 6–170, 7–224, 8–230, 9–231, 10–233. బౌలింగ్: బుమ్రా 18–7–50–3, సిరాజ్ 17–2–57–2, అశి్వన్ 15–1–45–2, ఆకాశ్దీప్ 15–6–43–2, జడేజా 9.2–0–28–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) మహమూద్ 72; రోహిత్ (బి) మిరాజ్ 23; గిల్ (సి) మహమూద్ (బి) షకీబ్ 39; పంత్ (సి) మహమూద్ (బి) షకీబ్ 9; కోహ్లి (బి) షకీబ్ 47; రాహుల్ (స్టంప్డ్) దాస్ (బి) మిరాజ్ 68; జడేజా (సి) నజు్మల్ (బి) మిరాజ్ 8; అశ్విన్ (బి) షకీబ్ 1; ఆకాశ్దీప్ (సి) ఖాలెద్ (బి) మిరాజ్ 12; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 285. వికెట్ల పతనం: 1–55, 2–127, 3–141, 4–159, 5–246, 6–269, 7–272, 8–284, 9–285. బౌలింగ్: మహమూద్ 6–0–66–1, ఖాలెద్ 4–0–43–0, మిరాజ్ 6.4–0–41–4, తైజుల్ 7–0–54–0, షకీబ్ 11–0–78–4. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (బ్యాటింగ్) 7; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26. వికెట్ల పతనం: 1–18, 2–26. బౌలింగ్: బుమ్రా 3–1–3–0, అశి్వన్ 5–2–14–2, ఆకాశ్దీప్ 3–2–4–0.4: మూడు ఫార్మాట్లో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ జాబితాలో అతనికంటే ముందున్నారు. కోహ్లి ప్రస్తుతం 27,012 పరుగులు చేశాడు. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్లోని జో«ద్పూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్ఫోర్స్లో ఫైటర్ పైలట్గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అయ్యారు. 2017లో అకాలీదళ్లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్ఫోర్స్ ఫైటర్గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్ఫోర్స్ చీఫ్గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్లో భారత్కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్తీక 2.ఒ
కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్’గా కీర్తి అందుకున్న వెస్ట్ల్యాండ్ బుక్స్ (అమెజాన్ కంపెనీ) పబ్లిషర్గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్ కంపెనీ వెస్ట్ల్యాండ్ బుక్స్ను మూసివేసింది. ఆ తరువాత ఏమైంది? ‘ప్రతిలిపి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కార్తీక. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్ల్యాండ్ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్ టీమ్ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ కొత్త వెంచర్ని ‘వెస్ట్ల్యాండ్ 2.ఒ’ అని పిలుస్తున్నారు. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్ల్యాండ్లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ప్రతిలిపి పేపర్బ్యాక్స్’ శీర్షికతో తమ యాప్లో పాపులర్ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి. ‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్లో పాపులర్ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక. ‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్ ఆడియోబుక్, యాప్, పాడ్కాస్ట్... మొదలైన ఫార్మాట్లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది. ‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక. కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా! వైవిధ్యమే బలం ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్’ అనే ధోరణితో కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను. సోకాల్ట్–మెయిన్ స్ట్రీమ్ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్ బలం. – కార్తీక వీకే -
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్పై పర్యాటక జట్టే స్పిన్తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్లు జరిగాయి. ఆసీస్తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్ల్లో గెలిచి, 80 మ్యాచ్ల్లో ఓడింది. 10 మ్యాచ్లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్లు). సచిన్ (664 మ్యాచ్ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్ -
Ind Vs Sl 2nd Test: క్లీన్స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...
భారత్ టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...తొలిరోజు బౌలింగ్లో కొంతైనా ప్రతాపం చూపిన శ్రీలంక రెండో రోజు ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో పూర్తిగా కుదేలైంది. వంద పరుగులు దాటిన కాసేపటికే తొలి ఇన్నింగ్స్ను ముగించుకున్న లంక తర్వాత రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో కొండంత లక్ష్యం ముందు లంక ఓడేందుకు చేరువవుతోంది. పంత్ మెరుపు బ్యాటింగ్, అయ్యర్ మరో చక్కటి ఇన్నింగ్స్ రెండో రోజు హైలైట్గా నిలిచాయి. బెంగళూరు: రెండో టెస్టులో విజయానికి అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ రెండో రోజే చేసేసింది. ప్రత్యర్థి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ను తక్కువ స్కోరుకే ముగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి తోడు రెండో ఇన్నింగ్స్లో పటిష్టమైన స్కోరుతో భారీ లక్ష్యాన్ని నిర్మించింది. ఆదివారం హాయిగా స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు రిషభ్పంత్ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్లు) పసందైన బ్యాటింగ్ విందు ఇచ్చాడు. రెండో రోజుకు సరిపడే వినోదం అతనిదైతే... మొత్తం మ్యాచ్లో భారత్ను శ్రేయస్ అయ్యర్ (87 బం తుల్లో 67; 9 ఫోర్లు) పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడో బంతికే తిరిమన్నె (0) అవుట్ కాగా, కరుణరత్నే (10 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక 109 ఆలౌట్ రెండో రోజు లంకను ఆలౌట్ చేసేందుకు భారత్కు ఎక్కువ సేపు పట్టలేదు. ఆదివారం మరో ఆరు ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 35.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌ టైంది. ఓవర్నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా కెరీర్లో 8వ సారి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యం లభించింది. అయ్యర్ మళ్లీ సూపర్ రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (79 బంతుల్లో 46; 4 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (22; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీళ్లిద్దరి తర్వాత హనుమ విహారి (35; 4 ఫోర్లు) కాస్త మెరుగనిపించగా, కోహ్లి (13) విఫలమయ్యాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్కు పంత్, అయ్యర్ 6.2 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. జడేజాతో కలిసి శ్రేయస్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. డిన్నర్ బ్రేక్ పూర్తయిన వెంటనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఆరో వికెట్కు వీళ్లిద్దరు 63 పరుగులు జత చేశాక జడేజా (22) అవుటయ్యాడు. ఆ తర్వాత 69 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. వరుసగా రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతను ఫిఫ్టీలతో అదరగొట్టాడు. స్కోరు 300 దాటి 9వ వికెట్ పడగానే భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) ధనంజయ (బి) ఎంబుల్డెనియా 22; రోహిత్ (సి) మాథ్యూస్ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి (ఎల్బీ) (బి) జయవిక్రమ 13; పంత్ (సి) అండ్ (బి) జయవిక్రమ 50; అయ్యర్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్ (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్ (బి) ఎంబుల్డెనియా 9; షమీ నాటౌట్ 16; ఎక్స్ట్రాలు 10; మొత్తం (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–42, 2–98, 3–116, 4–139, 5–184, 6–247, 7–278, 8–278, 9–303. బౌలింగ్: లక్మల్ 10–2–34–0; ఎంబుల్డెనియా 20.5–1–87–3, ఫెర్నాండో 10–2–48–1, ధనంజయ 9–0–47–1, జయవిక్రమ 19–2–78–4. -
అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ. ఈ సినిమాలో నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’ (హీరోగా సల్మాన్ ఖాన్కి కూడా ఇది తొలి సినిమా). ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేశాను. కెరీర్ బాగున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అది సరైన సమయం అని, అప్పుడు చేసుకుంటే మంచి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుందని హిమాలయ్ని పెళ్లి చేసుకున్నాను. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణతో బిజీగా ఉన్నందువల్ల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకని నా భర్త, పిల్లలు తిరిగి నన్ను సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశాను. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కంగనా రనౌత్ ‘తలైవి’ (తమిళనాడు మాజీ సీయం, ప్రముఖ నటి జయలలిత బయోపిక్) చిత్రాల్లో యంగ్ మదర్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ప్రభాస్ గొప్ప నటుడు.. నిగర్వి కూడా. ఈ చిత్రనిర్మాతలు మేకింగ్ విషయంలో రాజీ పడలేదు. జార్జియాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ జరిగినప్పుడు కూడా యూనిట్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్వారు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలవైపే చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. -
ఎందాక ఈ ఎదురీత!
లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్లో భారత్ కోలుకునే అవకాశం ఉంది. 9 పరుగులే చేసి... మూడో రోజు ఇంగ్లండ్ ఎక్కువ సేపు ఏమీ ఆడలేదు. ఓవర్నైట్ స్కోరు 423/8తో శుక్రవారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు చేసి 432 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఓవర్టన్ (32; 6 ఫోర్లు)ను షమీ ఎల్బీగా పంపించగా... రాబిన్సన్ (0)ను బుమ్రా క్లీన్బౌల్డ్ చేశాడు. షమీ 4 వికెట్లను పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, స్పిన్నర్ జడేజా తలా 2 వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ ఇద్దరు నిలబడ్డారు... ప్రత్యర్థి కొండంత ఆధిక్యంలో ఉంది. దీన్ని కరిగించాలంటే క్రీజులో పాతుకుపోవాలి. ఇంకో దారేం లేదు. ఇలాంటి స్థితితో రోహిత్, రాహుల్ అదే పని చేశారు. 16వ ఓవర్లో రాబిన్సన్ వేసిన బౌన్సర్ను రోహిత్ థర్డ్మ్యాన్ దిశగా సిక్సర్ బాదాడు. గంటన్నరపాటు క్రీజులో నిలిచిన రాహుల్ (54 బంతుల్లో 8) చివరకు ఓవర్టన్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అప్పుడే 34/1 స్కోరు వద్ద భారత్ లంచ్కు వెళ్లింది. తర్వాత పుజారా క్రీజులోకి రాగా ఇంగ్లండ్ బౌలర్లకు ఇంకో వికెట్ కోసం సుదీర్ఘ శ్రమ తప్పలేదు. రోహిత్ 125 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ పేస్ వాడిపోగా... భారత బ్యాట్స్మెన్లో ధీమా పెరిగింది. కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన పుజారా ఈ మ్యాచ్లో రోహిత్తో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఈ సెషన్లో అలసటే తప్ప వికెట్లు రాలేదు. ఆఖరి సెషన్లో రోహిత్ ఔటైనప్పటికీ పుజారా... కెప్టెన్ కోహ్లి అండతో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 మార్క్ను దాటించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాబిన్సన్ 59; కేఎల్ రాహుల్ (సి) బెయిర్స్టో (బి) ఓవర్టన్ 8; పుజారా (బ్యాటింగ్) 91; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 45; ఎక్స్ట్రాలు 12; మొత్తం (80 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–34, 2–116. బౌలింగ్: అండర్సన్ 19–8–51–0, రాబిన్సన్, 18–4–40–1, ఓవర్టన్ 17–6–35–1, స్యామ్ కరన్ 9–1–40–0, మొయిన్ అలీ 11–1–28–0, రూట్ 6–1–15–0. -
రెండే రోజుల్లో మట్టికరిపించేశారు
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్మెన్ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరకు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్ 11 వికెట్లతో (రెండు ఇన్నింగ్స్ల్లో) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2–1తో టెస్టు చాంపియన్షిప్ రేసులో టీమిండియా ముందడుగు వేసింది. అహ్మదాబాద్: భారత్ స్పిన్తో మరో మ్యాచ్ విన్నయ్యింది. డేనైట్ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది. ఇంగ్లండ్తో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 46 పరుగులకు 7 వికెట్లు... రెండో రోజు 99/3 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ రహానే (7), రోహిత్ (96 బంతుల్లో 66; 11 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా... తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగనే లేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మళ్లీ టపటపా వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ వికెట్లు రాలడంతోనే మొదలైంది. తొలి ఓవర్ వేసిన అక్షర్ మొదటి బంతికి క్రాలీ (0)ని, మూడో బంతికి బెయిర్స్టో (0)ను ఔట్ చేశాడు. ఇలా మొదలైన పతనంతో డిన్నర్ బ్రేక్కు ముందే ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తం మీద బెన్ స్టోక్స్ (25), రూట్ (19), పోప్ (12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫోక్స్ (8), లీచ్ (9), ఆర్చర్ (0), అండర్సన్ (0) స్పిన్ ఉచ్చులో తేలిగ్గానే పడిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 81 పరుగుల వద్దే ముగియగా భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని అబేధ్యమైన ఓపెనింగ్తో ముగించింది. ఇంగ్లండ్ ఖేల్ ఖతం! తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు భారత్ మరింత చేరువైంది. చివరి టెస్టులో గెలిస్తే 3–1తో ఫైనల్ చేరగలిగే భారత్, మ్యాచ్ ‘డ్రా’ అయినా సరే 2–1తో ముందంజ వేస్తుంది. మూడో టెస్టులో ఓటమితో సొంత గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఆ జట్టుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. అయితే చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే 2–2తో సిరీస్ ముగుస్తుంది. అప్పుడు ఇంగ్లండ్తో పాటు భారత్ను కూడా వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112 భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లీచ్ 66; గిల్ (సి) క్రాలీ (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (ఎల్బీ) (బి) లీచ్ 7; పంత్ (సి) ఫోక్స్ (బి) రూట్ 1; అశ్విన్ (సి) క్రాలీ (బి) రూట్ 17; సుందర్ (బి) రూట్ 0; అక్షర్ (సి) సిబ్లీ (బి) రూట్ 0; ఇషాంత్ నాటౌట్ 10; బుమ్రా (ఎల్బీ) (బి) రూట్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (53.2 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98, 4–114, 5–115, 6–117, 7–125, 8–125, 9–134, 10–145. బౌలింగ్: అండర్సన్ 13–8–20–0, బ్రాడ్ 6–1–16–0, ఆర్చర్ 5–2–24–1, లీచ్ 20–2–54–4, స్టోక్స్ 3–0–19–0, రూట్ 6.2–3–8–5. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) అక్షర్ 0, సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 7; బెయిర్స్టో (బి) అక్షర్ 0; రూట్ (ఎల్బీ) (బి) 19; స్టోక్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; పోప్ (బి) అశ్విన్ 12; ఫోక్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; ఆర్చర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 9; బ్రాడ్ నాటౌట్ 1; అండర్సన్ (సి) పంత్ (బి) సుందర్ 0; మొత్తం (30.4 ఓవర్లలో ఆలౌట్) 81. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–19, 4–50, 5–56, 6–66, 7–68, 8–80, 9–80, 10–81. బౌలింగ్: అక్షర్ 15–0–32–5, అశ్విన్ 15–3–48–4, సుందర్ 0.4–0–1–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 25; గిల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 9; మొత్తం (7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 49. బౌలింగ్: లీచ్ 4–1–15–0, రూట్ 3.4–0–25–0. రూట్, రోహిత్ -
చెన్నపట్నం చిన్నోడు.. రవిచంద్రన్ అశ్విన్
‘చెపాక్ మైదానంలో సెంచరీ చేయడం నా చిన్ననాటి కల’... కొన్నాళ్ల క్రితం రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన మాట ఇది. 34 ఏళ్ల వయసులో కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చిన తర్వాత అతను తన కోరికను నెరవేర్చుకున్నాడు. మళ్లీ చెన్నైలో అతను ఎప్పుడు టెస్టు ఆడగలడో తెలీదు కానీ సోమవారం మాత్రం అతను తన బ్యాటింగ్లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాడు. అందుకే శతకం పూర్తయ్యాక తనకు అండగా నిలిచిన అభిమానులను ఎవరినీ మరచిపోలేదన్నట్లుగా ప్రేక్షకులు ఉన్న ప్రతీ ఒక్క గ్యాలరీ వైపు మళ్లీ మళ్లీ బ్యాట్ చూపిస్తూ ‘థ్యాంక్స్’ చెప్పాడు. ఒక బౌలర్గా సొంత మైదానంలో అశ్విన్ ఖాతాలో చెప్పుకోదగ్గ గణాంకాలే ఉన్నాయి. తాజా సిరీస్లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అశ్విన్ అంతకుముందే మరో రెండుసార్లు చెన్నైలో ఈ ఘనత సాధించాడు. అయితే ఈసారి తన బ్యాటింగ్తో మ్యాచ్ను అతను చిరస్మరణీయం చేసుకున్నాడు. బ్యాట్స్మన్గా కెరీర్ మొదలు పెట్టి జూనియర్ స్థాయి వరకు అలాగే కొనసాగి ఆపై ఆఫ్స్పిన్నర్గా మారిన అశ్విన్లోని అసలైన బ్యాట్స్మన్ ఇక్కడ మళ్లీ కనిపించాడు. నిజానికి కెరీర్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చినా ఆ తర్వాత అశ్విన్ బ్యాటింగ్ కళ మసకబారింది. 2017 ఆగస్టు తర్వాత అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే ఇటీవల సిడ్నీలో మ్యాచ్ను కాపాడిన ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్లో కూడా జడేజా లేకపోవడంతో బ్యాటింగ్పరంగా కూడా అశ్విన్పై బాధ్యత పెరిగింది. అయితే గతంలో అతను సాధించిన నాలుగు టెస్టు సెంచరీలతో (అన్నీ వెస్టిండీస్పైనే) పోలిస్తే సోమవారం పరిస్థితులు భిన్నం. అశ్విన్ క్రీజ్లో వచ్చే సమయానికి భారత్ మంచి ఆధిక్యంలో ఉన్నా సరే... పిచ్ అంత అనుకూలంగా లేదు. పరుగులు సునాయాసంగా వచ్చేలా కనిపించడం లేదు. ఒకే సెషన్లో జట్టు ఐదు వికెట్లు కోల్పోయిందంటే ఇకపై ఎలా ఆడాలన్న ఒక సందిగ్ధతతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ దశలో అతను అతను తన ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చిన ఈ మదరాసీ తొలి ఐదు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతని ఇన్నింగ్స్లో స్వీప్ షాట్లు హైలైట్గా నిలిచాయి. చదవండి: (వహ్వా.. చెపాక్ తలైవా!) మొదటి నాలుగు బౌండరీలను స్వీప్ ద్వారానే రాబట్టిన అశ్విన్ పదే పదే ఆ షాట్తో ఫలితం సాధించాడు. ‘ఎప్పుడో అండర్–19 స్థాయిలో స్వీప్ షాట్లు ఆడాను. వాటి కారణంగా తుది జట్టులో చోటు పోవడంతో వదిలేశాను. గత 13–14 ఏళ్లుగా స్వీప్ షాట్ ఆడనే లేదు. ఇప్పుడు మాత్రం పిచ్ను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా సాధన చేశాను’ అని అతను స్వయంగా చెప్పాడు. 64 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సాహసవంతులకే అదృష్టం కూడా కలిసొస్తుందన్నట్లుగా రెండుసార్లు అశ్విన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్రాడ్ బౌలింగ్లో స్టోక్స్ క్యాచ్ వదిలేసినప్పుడు అశ్విన్ స్కోరు 29 పరుగులు కాగా, 56 పరుగుల వద్ద బ్రాడ్ బౌలింగ్లోనే కీపర్ ఫోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. అయితే మరో ఎండ్లో కోహ్లి, కుల్దీప్, ఇషాంత్ తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో అశ్విన్ సెంచరీ సాధించడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. చివరి బ్యాట్స్మన్ సిరాజ్ క్రీజ్లోకి వచ్చే సమయానికి అశ్విన్ స్కోరు 77 పరుగులు! ఈ దశలో సిరాజ్ పట్టుదలగా నిలబడి అశ్విన్కు సహకరించాడు. పదో వికెట్కు వీరిద్దరి మధ్య 49 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. లీచ్ బౌలింగ్లో ఫోర్తో 90ల్లోకి వచ్చిన అశ్విన్... అలీ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్లో సిక్సర్ బాది 97 వద్ద నిలిచాడు. అదే ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించగా, బంతి స్లిప్స్ మీదుగా బౌండరీని చేరింది. అంతే... తన ఆనందాన్ని ప్రదర్శిస్తూ మైదానంలో అశ్విన్ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్లో సిరాజ్ కూడా తానే సెంచరీ చేసినంతగా సందడి చేయడం విశేషం. తాను ఓనమాలు నేర్చిన చోట బ్యాట్తోనూ అశ్విన్ సాధించిన ఈ ఘనత ఎప్పటికీ అతనికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చదవండి: వైరల్: అశ్విన్ సెంచరీ.. సిరాజ్ స్పందన కాస్తైనా కనికరం లేదా అశ్విన్..! -
వహ్వా.. చెపాక్ తలైవా!
‘నేను చెప్పింది ఎలాగూ చేస్తాను... కానీ నేను చెప్పనిది కూడా చేస్తాను’... రజినీకాంత్ ‘అన్నామలై’ సినిమాలోని సూపర్హిట్ డైలాగ్ ఇది. రజినీకి వీరాభిమాని అయిన చెన్నై తలైవా రవిచంద్రన్ అశ్విన్ ఇదే మాట ఇంగ్లండ్ జట్టుకు చెప్పినట్లున్నాడు. తన బలమైన స్పిన్తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్, భారత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాట్తోనూ చెలరేగాడు. స్పిన్ పిచ్, బ్యాటింగ్కు కష్టమంటూ చెబుతున్నవన్నీ ఒట్టి మాటలే అంటూ రుజువు చేస్తూ అశ్విన్ అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు నివ్వెరపోయింది. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తెచ్చేశాడు. అసాధ్యమైన 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను మరో రెండు రోజులు ఎలాంటి వాన, తుఫాన్లు కూడా రక్షించే పరిస్థితి లేదు. అహ్మదాబాద్లో జరిగే ‘పింక్ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్ 1–1తో సమం కావడం ఇక లాంఛనమే. చెన్నై: ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. లారెన్స్ (19 బ్యాటింగ్), రూట్ (2 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 54/1తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 96 పరుగులు జోడించారు. సూపర్ ఫోక్స్... మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సెషన్లో భారత్ ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. సోమవారమే తన 28వ పుట్టిన రోజు జరుపుకున్న వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇందులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే చతేశ్వర్ పుజారా (7) దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. అలీ బౌలింగ్లో ముందుకొచ్చి షాట్ ఆడగా బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ పోప్ వద్దకు వెళ్లింది. అతని త్రోను అందుకొని ఫోక్స్ స్టంప్స్ను పడగొట్టాడు. పుజారా సరైన సమయంలోనే వెనుదిరిగినా అతని బ్యాట్ పిచ్లో ఇరుక్కుపోవడంతో రనౌట్ తప్పలేదు. అదే స్కోరు వద్ద ఫోక్స్ అద్భుత స్టంపింగ్తో రోహిత్ శర్మ (26) అవుటయ్యాడు. కొద్ది సేపటికే లీచ్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ (8)ను కూడా ఫోక్స్ స్టంపౌట్ చేశాడు. రహానే (10) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అక్షర్ పటేల్ (7) వికెట్ల ముందు దొరికిపోయాడు. 1968 (అలెన్ నాట్) తర్వాత ఒక ఇంగ్లండ్ వికెట్ కీపర్ టెస్టు మ్యాచ్లో మూడు స్టంపింగ్లు చేయడం (ఫోక్స్) ఇదే మొదటిసారి. కోహ్లి నిలకడ... భారత్ స్కోరు 106/6గా నిలిచిన దశలో జట్టును ఆదుకునే బాధ్యత కోహ్లి తనపై వేసుకున్నాడు. అశ్విన్ సహకారంతో అతను ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ 20వ బంతికి గానీ తొలి పరుగు తీయని కెప్టెన్... నిలదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. లంచ్ తర్వాత మరింత ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన కోహ్లి 107 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి, అశ్విన్ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో అలీ ఈ జోడీని విడదీశాడు. అలీ బౌలింగ్లో విరాట్ ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అంపైర్ నిర్ణయంపై అతను రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కుల్దీప్ (3), ఇషాంత్ (7) తొందరగానే వెనుదిరిగినా అశ్విన్కు సిరాజ్ (16 నాటౌట్) అండగా నిలిచాడు. చివర్లో సిరాజ్ రెండు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. అశ్విన్ సెంచరీ తర్వాత కూడా భారత జట్టు డిక్లేర్ చేయకుండా ఆలౌట్ అయ్యే వరకు ఆటను కొనసాగించింది. రోహిత్ స్టంపౌట్ అదే తడబాటు... ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లోనూ కాస్త పట్టుదల కనబర్చలేకపోయారు. అక్షర్ బంతిని ఆడలేక సిబ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోగా, దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన రోరీ బర్న్స్ (25) ఆటను అశ్విన్ ముగించాడు. నైట్ వాచ్మన్ లీచ్ (0) తొలి బంతికే వెనుదిరగడంతో రూట్ బరిలోకి దిగక తప్పలేదు. ఆ తర్వాత రూట్ విషయంలో అంపైర్ నిర్ణయం కోహ్లి ఆగ్రహానికి కారణమైంది. కోహ్లికి కోపమొచ్చింది... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో రూట్ అవుట్ కోసం భారత్ చేసిన అప్పీల్ఫలితం ప్రతికూలంగా రావడం విరాట్ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. అక్షర్ బౌలింగ్లో క్యాచ్ పట్టిన పంత్ అప్పీల్ చేయగా, అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్గా ప్రకటించాడు. దాంతో భారత్ రివ్యూ కోరింది. అయితే రీప్లేలో బంతి బ్యాట్కు తాకలేదని స్పష్టం కావడంతో ఎల్బీడబ్ల్యూ కోసం కూడా థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. వికెట్ల ముందే రూట్ ప్యాడ్కు బంతి తగిలినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా... బాల్ ట్రాకర్ ప్రకారం ‘అంపైర్ కాల్’ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించడంతో రూట్ బతికిపోయాడు. దీనిపై కోహ్లి అంపైర్తో వాదనకు దిగగా, మైదానం బయట నుంచి హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 329; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 134; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 26; గిల్ (ఎల్బీ) (బి) లీచ్ 14; పుజారా (రనౌట్) 7; కోహ్లి (ఎల్బీ) (బి) అలీ 62; పంత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 8; రహానే (సి) పోప్ (బి) అలీ 10; అక్షర్ (ఎల్బీ) (బి) అలీ 7; అశ్విన్ (బి) స్టోన్ 106; కుల్దీప్ (ఎల్బీ) (బి) అలీ 3; ఇషాంత్ (సి) స్టోన్ (బి) లీచ్ 7; సిరాజ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 20; మొత్తం (85.5 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–42, 2–55, 3–55, 4–65, 5–86, 6–106, 7–202, 8–210, 9–237, 10–286. బౌలింగ్: స్టోన్ 6.5–1–21–1, లీచ్ 33–6–100–4, మొయిన్ అలీ 32–7–98–4, రూట్ 4–0–15–0, స్టువర్ట్ బ్రాడ్ 9–3–25–0, లారెన్స్ 1–0–7–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 25; సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్ 3; లారెన్స్ (బ్యాటింగ్) 19; లీచ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 0; రూట్ (బ్యాటింగ్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 53. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50. బౌలింగ్: ఇషాంత్ శర్మ 2–1–6–0, అక్షర్ పటేల్ 9–3–15–2, అశ్విన్ 8–1–28–1. ఒక టెస్టులో ఐదు వికెట్లు తీయడంతోపాటు సెంచరీ సాధించడం అశ్విన్కు మూడోసారి. రెండుసార్లు ఈ ఫీట్ చేసిన సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, కలిస్, షకీబ్లను అశ్విన్ అధిగమించగా... ఇయాన్ బోథమ్ (5 సార్లు) మాత్రమే ముందున్నాడు. సెంచరీతో పాటు మ్యాచ్లో పది వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు బోథమ్, ఇమ్రాన్ ఖాన్, షకీబ్ మాత్రమే నమోదు చేయగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ మరో 4 వికెట్లు తీస్తే వారి సరసన చేరతాడు. -
చెన్నైలో గెలుస్తారా, మనోళ్లు నిలుస్తారా!
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు నాలుగో ఇన్నింగ్స్లో సాధించిన అత్యధిక పరుగుల ఛేదన 418 పరుగులు... ఇప్పుడు భారత్ ముందు దానికంటే మరో రెండు పరుగుల ఎక్కువ విజయ లక్ష్యం నిలిచింది. అందుబాటులో కనీసం 90 ఓవర్లు ఉండగా, తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కొన్నాళ్లుగా టీమిండియా పఠిస్తున్న దూకుడు మంత్రంతో ఈ లక్ష్యాన్ని సాధించే సాహసం చేస్తుందా లేక ఆత్మ రక్షణ ధోరణిలో ఆడి ‘డ్రా’గా ముగిస్తే చాలని ప్రయత్నిస్తుందా అనేది ఆసక్తికరం. ఎన్నో ఏళ్లలో భారత జట్టుకు సొంతగడ్డపై ఎదురుకాని పరిస్థితి ఇది! భారత్ను ఈ స్థితిలో పడేసిన ఇంగ్లండ్ మాత్రం తొమ్మిది వికెట్లు తీయడమే లక్ష్యంగా గెలుపుపై గురి పెట్టింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్, గింగిరాలు తిరుగుతూ వెళ్లిన కొన్ని బంతులు పర్యాటక జట్టుకు విజయంపై ఆశలు రేపుతున్నాయి. తమ బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ నాలుగో రోజు ఏకంగా 241 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్ ఇవ్వకుండా రూట్ సేన రెండో ఇన్నింగ్స్ ఆడగా... భారత్ మెరుగైన బౌలింగ్తో కట్టడి చేయగలిగింది. ఆరు వికెట్లతో అశ్విన్ ఇందులో కీలకపాత్ర పోషించడం విశేషం. చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరిత ఘట్టానికి చేరింది. 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12) పెవిలియన్ చేరగా, ప్రస్తుతం శుబ్మన్ గిల్ (15 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. చివరిరోజు భారత్ విజయం కోసం మరో 381 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 80 పరుగులు...4 వికెట్లు... సొంత మైదానంలో సుందర్, అశ్విన్ (91 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్)ల భాగస్వామ్యం భారత జట్టుకు కాస్త చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. ఓవర్నైట్ స్కోరు 257/6తో సోమవారం ఆటను కొనసాగిస్తూ వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 82 బంతుల్లో సుందర్ టెస్టుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఏడో వికెట్కు 80 పరుగులు జోడించాక అశ్విన్ను అవుట్ చేసి లీచ్ ఈ జంటను విడగొట్టాడు. ఆ తర్వాత ఒకవైపు సుందర్ ధాటిగా ఆడినా... మరో ఎండ్లో నదీమ్ (0), ఇషాంత్ (4), బుమ్రా (0) నిలబడలేకపోవడంతో ఇంగ్లండ్ స్కోరుకు చాలా దూరంలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. రూట్ మినహా... రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు జోడిద్దామని భావించిన ఇంగ్లండ్ ఆ ప్రయత్నంలో కొంత వరకే సఫలమైంది. భారీ ఆధిక్యంతో ఆట ప్రారంభించిన ఆ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. అశ్విన్ చక్కటి బౌలింగ్ను ఆడలేక రోరీ బర్న్స్ (0) స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లో రూట్ మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. సిబ్లీ (16)ని కూడా అశ్విన్ పెవిలియన్ పంపించగా... లారెన్స్ (18)ను అవుట్ చేసి ఇషాంత్ కెరీర్లో 300వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రూట్ మాత్రం అశ్విన్, నదీమ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే స్టోక్స్ (7) విఫలం కాగా, రూట్ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన ఒలీ పోప్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) నదీమ్ బౌలింగ్లో రివర్స్ స్వీప్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అంతే?... ఈ వికెట్తో ఇంగ్లండ్ దృక్పథం మారిపోయింది. అప్పటి వరకు జోరు ప్రదర్శించిన జట్టు రక్షణాత్మకంగా ఆడింది. వేగంగా పరుగులు చేయడంకంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలనే భావనతో ఉన్నట్లు కనిపించింది. ఈ దశలో డిక్లేర్ చేయడంకంటే ఆలౌట్ అయ్యే వరకు ఆడేందుకు నిశ్చయించుకుంది. ఈ క్రమంలో డామ్ బెస్ (55 బంతుల్లో 25; 3 ఫోర్లు), జోస్ బట్లర్ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించారు. అయితే అశ్విన్ చక్కటి బౌలింగ్తో చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. రోహిత్ మళ్లీ... భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించలేదు. ఆర్చర్ ఓవర్లో వరుసగా ఫోర్ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన రోహిత్ ఎక్కువసేపు నిలబడలేదు. లీచ్ వేసిన అద్భుత బంతి అతని స్టంప్స్ను ఎగరగొట్టింది. ఈ దశలో గిల్, పుజారా జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించగలిగారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 578, భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; గిల్ (సి) అండర్సన్ (బి) ఆర్చర్ 29; పుజారా (సి) బర్న్స్ (బి) బెస్ 73; కోహ్లి (సి) పోప్ (బి) బెస్ 11; రహానే (సి) రూట్ (బి) బెస్ 1; పంత్ (సి) లీచ్ (బి) బెస్ 91; సుందర్ (నాటౌట్) 85; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 31; నదీమ్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (సి) పోప్ (బి) అండర్సన్ 4; బుమ్రా (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 0; ఎక్స్ట్రాలు 6, మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225, 7–305, 8–312, 9–323, 10–337. బౌలింగ్: అండర్సన్ 16.5–5–46–2, ఆర్చర్ 21–3–75–2, స్టోక్స్ 6–1–16–0, లీచ్ 24–5–105–2, బెస్ 26–5–76–4, రూట్ 2–0–14–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) రహానే (బి) అశ్విన్ 0; సిబ్లీ (సి) పుజారా (బి) అశ్విన్ 16; లారెన్స్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 18; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 40; స్టోక్స్ (సి) పంత్ (బి) అశ్విన్ 7; పోప్ (సి) రోహిత్ (బి) నదీమ్ 28; బట్లర్ (స్టంప్డ్) పంత్ (బి) నదీమ్ 24; బెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; ఆర్చర్ (బి) అశ్విన్ 5; లీచ్ (నాటౌట్) 8; అండర్సన్ (సి అండ్ బి) అశ్విన్ 0; ఎక్స్ట్రాలు 7, మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–0, 2–32, 3–58, 4–71, 5–101, 6–130, 7–165, 8–167, 9–178, 10–178. బౌలింగ్: అశ్విన్ 17.3–2–61–6, నదీమ్ 15–2–66–2, ఇషాంత్ 7–1–24–1, బుమ్రా 6–0–26–1, సుందర్ 1–0–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బి) లీచ్ 12, గిల్ (బ్యాటింగ్) 15, పుజారా (బ్యాటింగ్) 12, మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 39. వికెట్ల పతనం: 1–25. బౌలింగ్: ఆర్చర్ 3–2–13–0, లీచ్ 6–1–21–1, అండర్సన్ 2–1–2–0, బెస్ 2–0–3–0. అశ్విన్, రోహిత్ క్లీన్ బౌల్డ్ -
గెలుపు పిలుపు...
భారత బౌలర్లు మళ్లీ మాయ చేశారు. అనుభవజ్ఞుడు షమీ లేకపోయినా, మరో సీనియర్ ఉమేశ్ మూడున్నర ఓవర్లకే గాయంతో తప్పుకున్నా... సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చి విజయానికి బాటలు వేశారు. బుమ్రా చూపిన దారిలో సిరాజ్ రాణించగా, ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజా సత్తా చాటడంతో మెల్బోర్న్ వేదికలో వరుసగా రెండో సిరీస్లో భారత్కు గెలుపు పిలుపు వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ సాధించిన 131 పరుగుల భారీ ఆధిక్యాన్ని తీసివేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 2 పరుగులు మాత్రమే! నాలుగో రోజు చివరి నాలుగు వికెట్లు మరికొన్ని పరుగులు జోడించగలిగినా విజయలక్ష్యం భారత్కు అందనంత దూరంలో ఉండకపోవచ్చు. వేగంగా ఆ కొన్ని పరుగులు ఛేదించేస్తే సంతోషంగా సిడ్నీ టెస్టుకు టీమిండియా సిద్ధం కావచ్చు. మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను 1–1తో సమం చేసేందుకు భారత్ చేరువైంది. రెండో రోజు బ్యాటింగ్లో జోరు కనబర్చిన రహానే సేన సోమవారం బౌలింగ్లో సత్తా చాటి ఆసీస్ను పడగొట్టింది. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (17 బ్యాటింగ్), కమిన్స్ (15 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 2 పరుగులు మాత్రమే. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 277/5తో ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటై 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రహానే (223 బంతుల్లో 112; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (159 బంతుల్లో 57; 3 ఫోర్లు) తమ స్కోరుకు మరికొన్ని పరుగులు జోడించగలిగారు. 32 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో లయన్, స్టార్క్ చెరో 3 వికెట్లు తీశారు. రహానే రనౌట్... మూడోరోజు మరో 23.4 ఓవర్లు ఆడిన అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. లయన్ బౌలింగ్లో కవర్స్ దిశగా ఆడిన జడేజా సింగిల్ కోసం ప్రయత్నించగా... మరోవైపు నుంచి వచ్చిన రహానే సరైన సమయంలో క్రీజ్లోకి చేరలేకపోయాడు. దాంతో 121 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడగా, తర్వాతి ఓవర్లోనే జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. ఇదే సింగిల్తో భారత్ ఆధిక్యం కూడా సరిగ్గా 100 పరుగులకు చేరింది. ఈ దశలో వరుసగా షార్ట్ పించ్ బంతులతో జడేజాను ఇబ్బంది పెట్టిన ఆసీస్ పేసర్లు చివరకు ఫలితం సాధించారు. స్టార్క్ బౌన్సర్ను పుల్ షాట్ ఆడబోయిన జడేజా డీప్ మిడ్ వికెట్లో కమిన్స్కు చిక్కాడు. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద ఉమేశ్ (9), అశ్విన్ (14) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో బుమ్రా (0) అవుటయ్యాడు. వరుస కట్టి... భారత్ పదునైన బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మరోసారి తలవంచారు. ఆద్యంతం తడబడటం మినహా ఒక్కరూ సాధికారికంగా, పట్టుదలగా క్రీజ్లో నిలబడి పరుగులు సాధించలేకపోయారు. ఘోరమైన ఫామ్లో ఉన్న జో బర్న్స్ (4) దానిని కొనసాగిస్తూ ఆరంభంలోనే వెనుదిరగ్గా, వేడ్, లబ్షేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్) కలిసి కొద్దిసేపు ప్రతిఘటించారు. అయితే ఈ జోడీని విడదీసేందుకు భారత్కు ఎక్కువ సమయం పట్టలేదు. అశ్విన్ బంతులను ఎదుర్కొనేందుకు పదే పదే ఇబ్బంది పడిన లబ్షేన్ చివరకు ఒక చక్కటి బంతికి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. రెండో సెషన్ ముగిసేసరికి ఆసీస్ 65/2 స్కోరుతో నిలిచింది. అయితే టీ విరామం తర్వాత ఆసీస్ పతనం వేగంగా సాగింది. స్మిత్ (8) వికెట్తో భారత్కు పట్టు చిక్కగా... ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్న వేడ్ను జడేజా వెనక్కి పంపాడు. ఎల్బీగా అవుట్ ఇవ్వడంపై వేడ్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. పేలవ షాట్తో హెడ్ (17) పెవిలియన్ చేరగా, కెప్టెన్ పైన్ (1) కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి స్థితిలో గ్రీన్, కమిన్స్ కలిసి మ్యాచ్ మూడో రోజే ముగిసిపోకుండా అడ్డుకున్నారు. చివర్లో అశ్విన్ బౌలింగ్లో కమిన్స్ (11 వద్ద) ఇచ్చిన క్యాచ్ను కీపర్ పంత్ అందుకోలేకపోయాడు. పాపం స్మిత్! భారత్పై అత్యద్భుత రికార్డు ఉండి (71.95 సగటు) ఈసారి ఆస్ట్రేలియా రాత మారుస్తాడని భావించిన ప్రపంచ నంబర్వన్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ పేలవ ప్రదర్శన కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన అతను ఈసారి బుమ్రా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతి అతని కాళ్ల వెనుకవైపు నుంచి వచ్చి లెగ్స్టంప్ బెయిల్స్ను మెల్లగా ముద్దాడింది! తాను సరైన లైన్లోనే నిలబడ్డానని పొరబడిన స్మిత్కు లెగ్స్టంప్ను వదిలేసిన విషయం అర్థం కాలేదు. అసలు తాను బౌల్డ్ అయిన విషయాన్నే అతను గుర్తించలేకపోయాడు. బెయిల్ పడిన తర్వాత కీపర్ బంతిని అందుకోకపోవడంతో స్మిత్ పరుగు కోసం కూడా ప్రయత్నించడం గమనార్హం! దానిని గుర్తించేసరికి భారత్ సంబరాల్లో మునిగిపోవడం, అతను నిరాశతో వెనుదిరగడం చకచకా జరిగిపోయాయి. పైన్ అవుట్పై వివాదం! తొలి ఇన్నింగ్స్లో రనౌట్ విషయంలో బ్యాట్ లైన్పైనే కనిపిస్తున్నా ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో బయటపడిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెండో ఇన్నింగ్స్లోనూ వివాదానికి కేంద్రంగా నిలిచాడు. జడేజా వేసిన బంతిని కట్ చేయడానికి ప్రయత్నించగా అది బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. భారత్ అప్పీల్కు అంపైర్ స్పందించకపోవడంతో రహానే రివ్యూ కోరాడు. మూడో అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూడాల్సి వచ్చింది. ‘హాట్స్పాట్’లో బంతి బ్యాట్కు తగిలినట్లుగా ఎలాంటి ముద్ర కనిపించలేదు. అయితే తర్వాత ‘స్నికో’లో మాత్రం బంతి బ్యాట్ను దాటుతున్న సమయంలో మీటర్లో మార్పు స్పష్టంగా కనిపించింది. దాంతో అంపైర్ అవుట్గా ప్రకటించగా, తీవ్ర అసంతృప్తితో పైన్ మైదానం వీడాడు. ఆట ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాడు వేడ్ ప్రశ్నించాడు. డీఆర్ఎస్ నిర్ణయాల్లో నిలకడ లేదని అతను విమర్శించాడు. ‘రెండో రోజు తొలి బంతి ఆడిన పుజారాకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. స్నికోలో ఇదే తరహాలో కనిపించింది. కానీ అతడిని నాటౌట్గా ప్రకటించి పైన్కు మాత్రం అవుట్ ఇచ్చారు. అవుటైనా, నాటౌట్ అయినా అంపైర్ల నిర్ణయాలు ఒకేలా ఉండాలి’ అని వేడ్ అన్నాడు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన దిగ్గజ అంపైర్ సైమన్ టఫెల్ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. పైన్ అవుట్ విషయంలో మూడో అంపైర్ సరిగ్గా వ్యవహరించారన్నారు. ‘నిబంధనల ప్రకారం బంతి దిశ మార్చుకుందా అనేది ముందుగా అంపైర్ చూస్తారు. దీనిపై స్పష్టత లేకపోతే హాట్ స్పాట్ను ఆశ్రయిస్తారు. అప్పటికీ తేలకపోతే ప్రొటోకాల్ ప్రకారం రియల్ టైమ్ స్నికోను పరిశీలించాలి. బంతి బ్యాట్ను తాకే సమయంలో మీటర్లో అసాధారణ మార్పు కనిపిస్తే దానినే తుది నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా స్నికోలో చూసినప్పుడు బంతి బ్యాట్ను దాటిన తర్వాత శబ్దం వినిపిస్తుంది. అప్పుడే మీటర్లో కదలిక వస్తుంది. ఇదేమీ తప్పు కాదు. శబ్దంకంటే కాంతి వేగం ఎక్కువ కావడమే దీనికి కారణం. ఐసీసీ రూల్స్ ప్రకారం హాట్ స్పాట్లో ముద్ర కనిపించకపోతేనే స్నికో వరకు వెళ్లాలి. అంతకుముందు జో బర్న్స్ అప్పీల్ చేసినప్పుడు బ్యాట్కు బంతి తగిలిన విషయం హాట్స్పాట్లోనే స్పష్టంగా తేలిపోయింది కాబట్టి స్నికో చూడాల్సిన అవసరమే రాలేదు’ అని టఫెల్ వివరించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0, గిల్ (సి) పైన్ (బి) కమిన్స్ 45, పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 17, రహానే (రనౌట్) 112, విహారి (సి) స్మిత్ (బి) లయన్ 21, పంత్ (సి) పైన్ (బి) స్టార్క్ 29, జడేజా (సి) కమిన్స్ (బి) స్టార్క్ 57, అశ్విన్ (సి) లయన్ (బి) హాజల్వుడ్ 14, ఉమేశ్ (సి) స్మిత్ (బి) లయన్ 9, బుమ్రా (సి) హెడ్ (బి) లయన్ 0, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు 22, మొత్తం (115.1 ఓవర్లలో ఆలౌట్) 326. వికెట్ల పతనం: 1–0, 2–61, 3–64, 4–116, 5–173, 6–294, 7–306, 8–325, 9–325, 10–326. బౌలింగ్: స్టార్క్ 26–5–78–3, కమిన్స్ 27–9–80–2, హాజల్వుడ్ 23–6–47–1, లయన్ 27.1–4–72–3, గ్రీన్ 12–1–31–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (బ్యాటింగ్) 17, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (బ్యాటింగ్) 15, ఎక్స్ట్రాలు 3, మొత్తం (66 ఓవర్లలో 6 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99. బౌలింగ్: బుమ్రా 17–4–34–1, ఉమేశ్ 3.3–0–5–1, సిరాజ్ 12.3–1–23–1, అశ్విన్ 23–4–46–1, జడేజా 10–3–25–2. -
రిషభ్ పంత్ వీర విహారం
‘పింక్ టెస్ట్’కు ముందు జరుగుతున్న డే అండ్ నైట్ సన్నాహక పోరులో భారత బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నారు. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటారు. ఆరో బ్యాట్స్మన్గా అవకాశం కోరుకుంటున్న హనుమ విహారి శతకం సాధించగా... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పోటీ పడుతున్న రిషభ్ పంత్ తన బ్యాటింగ్ పదునేమిటో మెరుపు సెంచరీతో చూపించాడు. రెండో ఓపెనర్గా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న శుబ్మన్ గిల్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, ఇప్పటికే ఓపెనర్గా ఉన్న మయాంక్కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే పృథ్వీ షా మాత్రం మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత్ ముందు తేలిపోయిన ఆస్ట్రేలియా ‘ఎ’ చివరి రోజు ఓటమిని తప్పించుకోగలదా చూడాలి. సిడ్నీ: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తడబడిన భారత బ్యాట్స్మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా... ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. నేడు మ్యాచ్కు ఆఖరి రోజు. పృథ్వీ షా విఫలం... చక్కటి బ్యాటింగ్ పిచ్పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు కూడా దూరం చేయవచ్చు! అయితే ఓపెనర్ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్డ్రైవ్లు, పుల్ షాట్లతో పాటు బ్యాక్ఫుట్పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్మన్ను చూపించాయి. 49 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే కొద్ది సేపటికే దురదృష్టవశాత్తూ అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో గిల్ వెనుదిరిగాడు. స్వెప్సన్ బౌలింగ్లో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... బంతి బ్యాట్కు తగిలిందని భావించిన అంపైర్ స్లిప్లో అబాట్ క్యాచ్ పట్టడంతో అవుట్గా ప్రకటించాడు. మరోవైపు మయాంక్ పట్టుదలగా క్రీజ్లో నిలబడ్డాడు. స్వెప్సన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 91 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అనంతరం భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్ దూకుడు... తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విహారి రెండో ఇన్నింగ్స్ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. అందమైన ఆన్ డ్రైవ్లు అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. విహారి, పంత్ 147 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్పై విరుచుకుపడ్డ పంత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్ముత్ బౌలింగ్లో సింగిల్తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్కు ముందు ఓవర్ ఆఖరి బంతికి సదర్లాండ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ 81 పరుగుల వద్ద నిలిచాడు. విల్డర్ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 194; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 108; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) స్వెప్సన్ (బి) స్టెకెటీ 3; మయాంక్ (సి) (సబ్) రోవ్ (బి) విల్డర్ముత్ 61; గిల్ (సి) అబాట్ (బి) స్వెప్సన్ 65; విహారి (బ్యాటింగ్) 104; రహానే (సి) క్యారీ (బి) స్టెకెటీ 38; పంత్ (బ్యాటింగ్) 103; ఎక్స్ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 386. వికెట్ల పతనం: 1–4; 2–108; 3–161; 4–239. బౌలింగ్: సీన్ అబాట్ 7–1–24–0; స్టెకెటీ 16–1–54–2; సదర్లాండ్ 16–5–33–0; విల్డర్ముత్ 15–2–79–1; స్వెప్సన్ 29–1–148–1; మ్యాడిసన్ 7–1–42–0 బౌలర్లకు ప్రాక్టీస్ కావాలి... విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేదు. మన బ్యాట్స్మెన్కు ఫ్లడ్లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్ నైట్ మ్యాచ్ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది. ఆ జట్టు పేలవ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే వారు రోజంతా నిలబడతారా అనేది సందేహమే. చీకటి పడే సమయానికి ముందే ఆసీస్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిపోతే పింక్ బాల్తో మన బౌలర్లు ఆశించిన ప్రాక్టీస్ లభించదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా చివరి రెండు సెషన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అందుకే భారత్ తమ బ్యాటింగ్ను కొనసాగించవచ్చు. -
విజయం దిశగా న్యూజిలాండ్
హామిల్టన్: బౌలర్లు విజృంభించి ఒకేరోజు 16 వికెట్లు పడగొట్టడంతో.... వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. ఆట మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 49/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కివీస్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. టిమ్ సౌతీ (4/35), జేమీసన్ (2/25), వాగ్నర్ (2/33) హడలెత్తించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దాంతో న్యూజిలాండ్కు 381 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్లోనూ విండీస్ బ్యాట్స్మన్ తడబడ్డారు. ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లకు 196 పరుగులు చేసింది. -
రేణూ రీ ఎంట్రీ
‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ ‘ఆద్య’ అనే ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్పై రావ్. డి.ఎస్–రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటì,, గీతికా రతన్ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందినీ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ .ఎస్ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. -
నా ఆట అప్పుడు మొదలవుతుంది!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత జట్టు టెస్టు విజయాల్లో పేస్ బౌలర్ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. అయితే సహచర పేసర్లతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్లోకంటే షమీ రెండో ఇన్నింగ్స్ రికార్డు చాలా బాగుంది. తన కెరీర్లో పడగొట్టిన మొత్తం 180 వికెట్లలో షమీ తొలి ఇన్నింగ్స్లో 32.50 సగటుతో 92 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన సందర్భంలో కేవలం 21.98 సగటుతో 88 వికెట్లు తీశాడు. మ్యాచ్ సాగినకొద్దీ అతని బౌలింగ్లో పదును పెరిగినట్లు కనిపిస్తుంది. దీనిపై షమీ మాట్లాడుతూ... ‘ఇతర బౌలర్లు అలసిపోయిన సందర్భంలో బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోతాను. జట్టులో ప్రతీ ఒక్కరు అప్పటికే కనీసం మూడు రోజులు మైదానంలో గడుపుతారు. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే పెట్రోల్ ఇంజిన్ తొందరగా పికప్ అందుకుంటుంది. నాదైన సమయం కోసం వేచి చూస్తాను. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచ్ దానికి మంచి ఉదాహరణ. పిచ్లో జీవం, బౌన్స్ లేకున్నా అలాంటి చోట రెండో ఇన్నింగ్స్లో నేను ఐదు వికెట్లు తీశాను’ అని షమీ విశ్లేషించాడు. -
మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం
బెంగళూరు: ప్రజల ప్రాణాలను కబళిస్తోన్న కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచమంతా సమష్టిగా పోరాడాలని భారత మాజీ కోచ్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పిలుపునిచ్చాడు. వైరస్ను ఎదుర్కోవడంలో ప్రస్తుత మన స్థితిని ‘టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్’గా అభివర్ణించాడు. తొలి ఇన్నింగ్స్లో కాస్త ఆధిక్యం సాధించామని సంబరపడొద్దని హెచ్చరించాడు. ‘ఈ మహమ్మారిని నిర్మూలించాలంటే మనందరం ఉమ్మడిగా పోరాడాల్సిందే. ఇదో టెస్టు మ్యాచ్లాంటిది. టెస్టులో రెండు ఇన్నింగ్స్లు మాత్రమే ఉంటాయి. కానీ కరోనాకు ఎన్నో దశలున్నాయి. అందుకే ఇప్పటివరకు కరోనాపై సాధించిన విజయంతో సంతృప్తి చెందవద్దు. రెండో ఇన్నింగ్స్లో ఇంకా గడ్డు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నందున తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించామని సంబరపడొద్దు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే లభించే విజయం కాదు ఇది. అందుకే దీన్ని జయించేందుకు రెండో ఇన్నింగ్స్లో మనమంతా కఠినంగా పోరాడాలి’ అని కుంబ్లే వివరించాడు. వైరస్ నియంత్రణ కోసం నిరంతరం పోరాడుతోన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారులకు కుంబ్లే కృతజ్ఞతలు తెలిపాడు. ‘వారంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. హ్యాట్సాఫ్’ అని వారి సేవల్ని కొనియాడాడు. -
బూమ్ బూమ్ బ్లాస్ట్!
‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’... సరిగ్గా వారం క్రితం జస్ప్రీత్ బుమ్రా ఈ ట్వీట్ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్ అని క్రికెట్ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్తో ‘బుల్స్ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. నార్త్ సౌండ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్ ఖాన్ నుంచి నేటి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ అతని విలువేమిటో మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో విజయం కోసం భారత్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్ బ్యాట్స్మెన్కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ వాపోయాడు. అవుట్ స్వింగర్లతో... బంతి విసిరేందుకు తీసుకునే రనప్ చిన్నదే కావచ్చు... స్పీడ్గన్లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్ స్టంప్ బయటకు వేస్తూ కీపర్ లేదా స్లిప్ వైపు క్యాచ్ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్ స్టంప్స్ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్బౌల్డ్లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్ స్వింగర్’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ సిరీస్కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్మెన్కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్లో పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేకపోయిన జస్ప్రీత్... రెండో ఇన్నింగ్స్లో స్వింగ్కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు. 8–4–7–5 బుమ్రా వేసిన 48 బంతులు విండీస్ బ్యాట్స్మెన్ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్ మూడో బంతిని వెంటాడి బ్రాత్వైట్ ఔట్ కావడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్బెల్ స్టంప్స్ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్లో కోహ్లి క్యాచ్ వదిలేయకపోతే మరో వికెట్ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్కు బ్రేవో ఆఫ్ స్టంప్ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది! తొలి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్మెన్ చచ్చీ చెడి ఏడు సింగిల్స్ తీయగలిగారు. కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్ తొలి బంతికి హోప్ స్టంప్ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్స్టంప్పై ఎర్రబంతి దాడి! ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు. 5/7ఇన్నింగ్స్లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్ బౌలర్గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. 4 బుమ్రా ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు. గతంలో ఇన్స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం –జస్ప్రీత్ బుమ్రా, భారత బౌలర్ -
న్యూజిలాండ్ 195/7
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ స్పిన్కు తలవంచారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా (4/71) చెలరేగడంతో మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. వికెట్ కీపర్ వాట్లింగ్ (63 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా, లాథమ్ (45) రాణించాడు. ధనంజయకు 2 వికెట్లు దక్కాయి. సౌతీ (23)తో కలిసి వాట్లింగ్ ఏడో వికెట్కు 54 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లున్న న్యూజిలాండ్ 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 227/7తో ఆట కొనసాగించిన శ్రీలంక మరో 40 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం లభించింది. డిక్వెలా (61) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లక్మల్ (40) రాణించాడు. -
కోల్కతా కోచ్గా మెకల్లమ్
కోల్కతా: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఇప్పుడు హెడ్ కోచ్గా నియమితులయ్యాడు. ఈ సీజన్ అనంతరం చీఫ్కోచ్ జాక్వస్ కలిస్ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో మెకల్లమ్కు కోచింగ్ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతా నైట్రైడర్స్తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్బాగో నైట్రైడర్స్కు కూడా మెకల్లమ్ కోచ్గా వ్యవహరిస్తాడు. లీగ్లో మెకల్లమ్.. 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్లో మెకల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్ నుంచి 2018 వరకు కేకేఆర్తో పాటు, కొచ్చి టస్కర్ కేరళ, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 మ్యాచ్లాడిన మెకల్లమ్ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు. -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్మన్గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
ఆసక్తికరంగా యాషెస్ టెస్టు
బర్మింగ్హామ్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో మూడో రోజు అనేక మలుపులతో రసవత్తరంగా సాగింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వార్నర్ (8), బాన్క్రాఫ్ట్ (7), ఉస్మాన్ ఖాజా (40) పెవిలియన్కు చేరగా... స్టీవ్ స్మిత్ (46 బ్యాటింగ్), ట్రవిస్ హెడ్ (21 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 49 పరుగులు జోడించారు. వెలుతురు లేని కారణంగా ఆటను చాలా ముందుగా నిలిపివేశారు. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగుల ఆధిక్యం కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 34 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఎడ్జ్బాస్టన్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చాలా కష్టమని అంచనాలు ఉన్న నేపథ్యంలో నాలుగో రోజు కంగారూలు ఎన్ని పరుగులు జోడించి ఇంగ్లండ్కు లక్ష్యాన్ని నిర్దేశిస్తారనేది ఆసక్తికరం. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 267/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకు ఆలౌటైంది. బర్న్స్ (133) ఆరంభంలోనే వెనుదిరగ్గా, బెన్ స్టోక్స్ (50) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో ఆసీస్ 18 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీసింది. అయితే క్రిస్ వోక్స్ (37 నాటౌట్), స్టువర్ట్ బ్రాడ్ (29) తొమ్మిదో వికెట్కు 65 పరుగులు జత చేసి జట్టును మెరుగైన స్థితికి చేర్చారు. చివరకు ఇంగ్లండ్కు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కమిన్స్, లయన్ చెరో 3 వికెట్లు తీశారు. బ్రాడ్ తన 128వ టెస్టులో 450 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. బాల్ ట్యాంపరింగ్ నిషేధం ముగిసిన తర్వాత తొలి టెస్టు ఆడుతున్న స్మిత్, వార్నర్లను ఇంగ్లండ్ అభిమానులు తొలి రోజునుంచే గేలి చేస్తున్నారు. అయితే వీరిద్దరు మాత్రం దానిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టారు. శనివారం మాత్రం వార్నర్ ప్రేక్షకులకు సమాధానమిచ్చాడు. అయితే అది సరదాగానే సుమా... జేబులో స్యాండ్పేపర్ పెట్టుకొని ట్యాంపరింగ్ వివాదానికి కారణమైన వార్నర్ ఇప్పుడు మాత్రం తాను అలాంటి పనేమీ చేయడం లేదని, కావాలంటే మీరే చూసుకోండి అంటూ పోజివ్వడం విశేషం! -
సెకండ్ ఇన్నింగ్స్ బోనస్ మాత్రమే
న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్కు పర్యాయ పదంగా నిలిచిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా మళ్లీ కోర్టులో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. అమ్మతనం కారణంగా రెండేళ్లు ఆటకు దూరమైనా... టెన్నిస్పై ఏమాత్రం ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుతో సహా మరెన్నో ఘనతలు సాధించిన ఆమె... ఇకపై వచ్చేవన్నీ బోనస్ మాత్రమేనని అంటోంది. వచ్చే ఏడాది జనవరిలో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తానంటున్న సానియా అంతరంగం ఆమె మాటల్లోనే.... ఎక్కువే సాధించా.. ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్లో నేను చాలా సాధించా. ఇన్ని ఘనతలు సొంతం చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. డబుల్స్లో సుదీర్ఘ కాలం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుతో పాటు ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ అందుకోవ డం చిన్న విషయమేం కాదు. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ను కూడా సాధించా. కొత్తగా నిరూపించుకోవాల్సిందేం లేదు తల్లినయ్యాక ఈ ఏడాది ఆగస్టులోనే మళ్లీ రాకెట్ పట్టాలనుకున్నా. కానీ అది కుదరలేదు. వచ్చే ఏడాది జనవరిలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల నుకుంటున్నా. అది జరిగితే అద్భుతమే. ఇప్పుడు నేను కొత్తగా ఏదో నిరూపించుకోవాల్సిందేం లేదు. ఏది సాధించినా అది బోనస్ మాత్రమే. ఆటపై ప్రేమతో మాత్రమే పునరాగమనం చేయాలనుకుంటున్నా. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే... బిడ్డకు జన్మనిచ్చాక ముందులా ఫిట్నెస్ అందుకోవడం అంత సులువేం కాదు. ఫిట్నెస్ కోసమే శ్రమిస్తున్నా. దానికి మరికొంత సమయం పడుతుందేమో. మరో రెండు నెలల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాకే పోటీలో పాల్గొంటా. ఫిట్నెస్ విషయంలో రాజీపడి పునరాగమనం చేసి గాయాల పాలవడంలో అర్థం లేదు. సెరెనానే స్ఫూర్తి... ఇప్పటివరకు తల్లి అయ్యాక కొందరు మాత్రమే ఆటలో అనుకున్న స్థాయిలో రాణిం చారు. మార్గరెట్ కోర్ట్, ఎవోన్ గూలాగాంగ్, కిమ్ క్లయ్ స్టర్స్ బిడ్డకు జన్మనిచ్చాక కూడా గ్రాండ్స్లామ్స్ గెలిచారు. ఈ తరం లో అతి కొద్ది మంది మాత్రమే ఇలా చేయగలుగుతున్నారు. వారిలో సెరెనా ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకునే క్రీడాకారులకు సెరెనా స్ఫూర్తిగా నిలుస్తుంది. మోకాలి గాయం ఇంకా బాధిస్తోంది 2017లో నేను ఆటకు దూరమయ్యే సమయంలో నే మోకాలి గాయమైంది. అది ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఇలాగే బరిలో దిగి మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోలేను. ప్రతిరోజు 4 గంటలు జిమ్లో గడుపుతున్నా. ఇప్పుడు 26 కేజీల బరు వు తగ్గాను. ఇంకా ఫిట్గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇవ్వాలంటే నాకు ఇంకా సమయం కావాలి. లక్ష్యమేం లేదు ప్రస్తుతానికి పునరాగమనం చేయడమే నా ఆశ. అంతకుమించి ఏదో సాధించాలంటూ పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు. నాపై అంచనాలు ఉంటాయనే సంగతి తెలుసు కానీ రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక ఒక అథ్లెట్గా ఎంత సాధిస్తానో చూడాలి. పునరాగమనం విజయవంతం అయితే నా దృష్టి టోక్యో ఒలింపిక్స్పై సారిస్తా. -
అలీగారికి పెద్ద అభిమానిని
‘‘అలీ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన వినోదాన్ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ‘పండుగాడి ఫోటో స్టూడియో’తో హీరోగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్ హీరోలా అలీగారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అలీ హీరోగా దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ను సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలు కథ తయారు చేసుకుని దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాంబిరెడ్డిగారికి 22 విద్యాలయాలున్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందర్నీ అలరించనుంది’’ అన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాలగారి ఫొటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఇందులో పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తెనాలిలో ఈ నెల 21న నిర్వహించనున్నాం’’ అన్నారు. అలీ, గుదిబండి వెంకట సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
నేను ఔటైన తీరును వివాదం చేయదల్చుకోలేదు: కోహ్లి
అశ్విన్ ఫిట్గా ఉన్నా కూడా నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగేవాళ్లం. రవీంద్ర జడేజా గురించి అసలు ఆలోచనే రాలేదు. పిచ్ను చూసిన తర్వాత ఇది స్పిన్కంటే పేస్కే ఎక్కువగా అనుకూలిస్తుందని మేం నమ్మాం. మొదటి మూడు రోజులు సరిగ్గా అదే జరిగింది. సరిగ్గా చూస్తే గరుకు ప్రాంతం వల్ల పెద్దగా సహకారం లేదు. లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి వేగాన్నే ఎక్కువగా ఉపయోగించుకొని అతను వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భువనేశ్వర్ ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అటు ఉమేశ్ తన ఆఖరి టెస్టులో 10 వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. అందుకే అతడిని ఎంపిక చేశాం. నలుగురు పేసర్లు ఉంటే బ్యాటింగ్ బలహీనంగా మారుతుందని తెలుసు. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని అది ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి కట్టుబడాల్సిందే. మ్యాచ్ ముందుకు సాగుతున్నకొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి కాబట్టి మనకు ఏం కావాలో మొదటి రోజే తేల్చుకోవాలి. అసభ్యంగా దూషించనంత వరకు, వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడనంత వరకు గీత దాటనట్లే. మైదానంలో పోటీతత్వం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఈ విషయంపై చర్చ అనవసరం. తొలి ఇన్నింగ్స్లో నేను ఔటైన తీరును వివాదం చేయదల్చుకోలేదు. మైదానంలో ఒక నిర్ణయం తీసుకున్నాక దాని పని అయిపోయింది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిన హీరోయిన్
ఇడియట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ రక్షిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విలన్’’ సినిమాలో నటి అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారామె. పునీత్రాజ్కుమార్ హీరోగా 2002లో వచ్చిన ‘‘అప్పు’’ సినిమాతో రక్షిత తెరంగేట్రం చేశారు. 2002లో వచ్చిన ‘‘ఇడియట్’’ తెలుగులో ఆమె మొదటి సినిమా. తెలుగులో అగ్రతారలైన చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబులతో పలు సినిమాలలో కలిసి నటించిందామె. 2007లో కన్నడ సినిమా దర్శకుడు ప్రేమ్తో వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె మరోసారి భర్త సినిమా కోసం తన గొంతును సవరించుకున్నారు. రక్షిత మాట్లాడుతూ.. కేవలం తన పాత్రలకు మాత్రమే డబ్బింగ్ చెప్పుకున్న ఆమె ఇలా ఇతరుల పాత్రకు డబ్బింగ్ చెప్పడం కొత్తగా ఉందన్నారు. ఇలా ఇతరులక డబ్బింగ్ చెప్పడం ఇష్టంగా, చాలా సంతోషంగా ఉందన్నారు. -
హీరోగా సెకండ్ ఇన్నింగ్స్కు శరత్కుమార్
నటుడు శరత్కుమార్ కథానాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధం అయ్యారు. ఇటీవల తెలుగు, మలయాళ వంటి ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న శరత్కుమార్ తమిళంలో కథానాయకుడిగా చిత్రం చేసి చాలా కాలమైందనే చెప్పాలి. ఇంతకు ముందు ఆయన నటించిన చెన్నైయిల్ ఒరునాళ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా చెన్నైయిల్ ఒరునాళ్–2 చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. కల్పతరు పిక్చర్స్ పతాకంపై రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జేపీఆర్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ నవలా రచయిత రాజేశ్కుమార్ రాసిన ఒక క్రైమ్ థ్రిల్లర్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చెన్నైయిల్ ఒరునాళ్. ఈ రచయిత రాసిన నవలతో తెరకెక్కిన కుట్రం–23 చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుందన్నది గమనార్హం. శరత్కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ తాజా చిత్రంలో మునీశ్కాంత్, అంజనా ప్రేమ్, రాజసిమ్మన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. నిశ్శబ్దం చిత్రం ఫేమ్ బేబీ సాతన్య ప్రధాన పాత్రలో నటించనుంది. దీపక్ ఛాయాగ్రహణం, రాణా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోవైలో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అన్నారు. ఇందులో శరత్కుమార్ అండర్ కవర్ ఏజెంట్గా నటిస్తున్నారని చెప్పారు. ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ను కోవైలో 30 రోజుల పాటు ఏకాధాటిగా నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
తొలి టెస్టు డ్రానా... డ్రామానా!
-
ఇక డ్రానే!
భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 114 పరుగుల చేసిన ఇంగ్లాండ్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కుక్(46), హసీబ్ హమీద్(62) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఉత్తమ ఆటతీరును కనబరిచిన ఇంగ్లాండ్ 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 488 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేవలం ఒకే రోజు ఆట మిగిలివుండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా తొలిటెస్టులో ఇప్పటికే ఇంగ్లాండు తరఫు నుంచి మూడు సెంచరీలు, భారత్ తరఫు నుంచి రెండు సెంచరీలు నమోదయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ల దూకుడు చూస్తుంటే మరో రెండు సెంచరీలు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు 319-4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్లలో రవిచంద్రన్ అశ్విన్(70) మినహా మిగతా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ కు మూడు వికెట్లు దక్కగా, మొయిన్ అలీకి రెండు, జాఫర్ అన్సారీకి ఒక వికెట్ దక్కింది. -
రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా?
నటి రెజీనాకు వివాహ నిశ్చితార్థం జరిగిందా? తాజాగా చిత్ర వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇదే. కోలీవుడ్లో నిరాదరణకు గురై టాలీవుడ్ను ఆశ్రయించిన నటి రెజీనా. ప్రస్తుతం అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు మళ్లీ కోలీవుడ్లో సెకెండ్ ఇన్నింగ్స్కు సిద్ధం అవుతున్నారు. ఇక్కడి బ్యూటీకి చేతి నిండా చిత్రాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తన చర్యలతో రెజీనా పెద్ద కలకలానికే కేంద్రబిందువుగా మారారు. ఈ జాన ఒక ఆడ మగ చేతులు మాత్రమే కనిపించే లాంటి ఫొటోను తన ఇన్స్ట్రాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తను పేర్కొంటూ ఈ శుభతరుణంలో మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇలా జరగడం కాస్త విచారించదగ్గ విషయయే. అతను ఎవరన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటుందని తెలుసు. అయితే ఆ విషయం గురించి త్వరలోనే వెల్లడిస్తాను. నిజానికి ఇలాంటి సంతోషకరమైన కార్యం జరుగుతుందని నేనూ హించలేదు. అనే వ్యాఖ్యల్ని పొందుపరచిన రెజీనా కొద్ది సేపటికే ఆ ఫొటోనూ, తన వ్యాఖ్యలను తన సైట్ నుంచి తొలగించారు. అయినా సోషల్ మీడియాలో రెజీనా పోస్ట్ చేసిన ఫొటో, తాను పేర్కొన్న భావాలు చాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే రెజీనా క్రికెట్ క్రీడా శిక్షకుడు విక్రమ్ ఆదిత్యతో తీసుకున్న సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక పోతే రెజీనా చాలా కాలంగా ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారన్న వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రెజీనా ఆడ మగ చేతులు కలిపిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటీ? మళ్లీ వెంటనే దాన్ని తొలగించడం ఏమిటీ? అసలు ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం జరిగినట్టా? లేనట్టా? లేక తమిళ చిత్ర ప్రచారంలో ఈ తంతు ఒక భాగమా? అన్న రకరకాల అభిప్రాయాలతో సినీ వర్గాలు అయోమయంలో పడ్డారు. కాగా రెజీనా ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై, నటుడు ఉదయనిధి స్టాలిన్కు జంటగా శరవణన్ ఉరుక్క భయమే, అధర్వతో జెమినీగణేశనుమ్ సురళీరాజావుమ్, మానగరం, రాజతందిరం 2 చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. -
డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది!
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి నేనెప్పుడూ దూరంగా లేను. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది. మధ్యలో రెండు మూడేళ్లు గ్యాప్ వచ్చిందంతే. ఇకపై ఏడాదికి ఓ సినిమా చేస్తా’’ అన్నారు మనీషా కొయిరాలా. ‘ఒకే ఒక్కడు’, ‘బొంబాయి’, ‘క్రిమినల్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈ నేపాలీ భామ సుపరిచితురాలే. క్యాన్సర్ వ్యాధిని జయించిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్లో ‘డియర్ మాయ’ అనే సినిమా చేస్తున్నారు. అల్రెడీ తమిళంలో ‘ఒరు మెల్లియ కోడు’ అనే సినిమా చేశారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు. ‘‘ఈతరం ప్రేక్షకులు అన్ని రకాల సినిమా లను ఆదరిస్తున్నారు. రిస్క్ చేయడానికి కథానాయికలకు బెరుకు ఎందుకు? మంచి ఫ్లాట్ఫార్మ్ ఉంది. కేవలం ఆటపాటలకు పరిమితం కావల్సిన అవసరం లేదు. మంచి మంచి పాత్రలు లభిస్తాయి. డిఫరెంట్, ప్యారలల్ సినిమాలంటూ లేవిప్పుడు. ప్రేక్షకులు అన్నిటినీ చూస్తున్నారు’’ అన్నారామె. -
శ్రీలంక రెండోసారి...
• 17 ఏళ్ల తర్వాత ఆసీస్పై విజయం • 106 పరుగులతో కంగారూలు చిత్తు పల్లెకెలె: స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన శ్రీలంక జట్టు తమ టెస్టు చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో లంక 106 పరుగుల తేడాతో ప్రపంచ నంబర్వన్ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 83/3 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (125 బంతుల్లో 55; 1 ఫోర్) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (5/54) అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, తొలి టెస్టు ఆడుతున్న లక్షణ్ సందకన్ (3/49) అండగా నిలిచాడు. లంక రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ చేసిన కుషాల్ మెండిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం నుంచి గాలేలో జరుగుతుంది. 178 బంతుల్లో 4 పరుగులు! చేతిలో 7 వికెట్లతో విజయానికి మరో 185 పరుగులు కావాల్సిన దశలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వోజెస్ (12) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్మిత్, మార్ష్ (29) నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 18 పరుగుల తేడాతో కంగారూలు మరో 4 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయ్యారు. ఈ దశలో పీటర్ నెవిల్ (115 బంతుల్లో 9), స్టీవ్ ఓ కీఫ్ (98 బంతుల్లో 4) మొండిగా పోరాడారు. పరుగులు చేయకున్నా క్రీజ్లో పాతుకుపోయారు. వర్ష సూచనతో పాటు వెలుతురు తగ్గడంతో లంక శిబిరంలో ఆందోళన మొదలైంది. చివరకు ధనంజయ ఈ జోడీని విడదీయడంతో లంక విజయం దిశగా వెళ్లింది. నెవిల్, కీఫ్ తొమ్మిదో వికెట్కు 178 బంతులు ఎదుర్కొని కేవలం 0.13 రన్రేట్తో 4 పరుగులు మాత్రమే జోడించడం విశేషం! టెస్టుల్లో ఇంత తక్కువ రన్రేట్తో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత ఏడాది భారత్పై ఆమ్లా, డివిలియర్స్ 253 బంతులు ఆడి 27 పరుగులు (0.64 రన్రేట్) చేశారు. టెస్టు చరిత్రలో ఆస్ట్రేలియాపై శ్రీలంకకు ఇది రెండో విజయం మాత్రమే కావడం విశేషం. చివరి సారిగా ఆ జట్టు ఆసీస్ను 1999లో ఓడించింది. మొత్తంగా కంగారూలపై ఆడిన 27 టెస్టుల్లో లంక 17 ఓడింది. -
సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!
‘‘ ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమాతో మా శ్రీదేవి మూవీస్ బ్యానర్ను స్థాపించాను. ఇప్పటికి 28 ఏళ్లు అయింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చేసినా ‘ఆదిత్య-369’ సినిమా నిర్మాతగా ఇప్పటికీ గుర్తుపట్టడం నా అదృష్టం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావా లనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ నా బేనర్లో సినిమా తీయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ను మంచి సినిమాతో ప్రారంభించాననే అనుకుంటున్నా’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏడేళ్ల విరామం తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ ‘జెంటిల్మన్’ కథను తమిళ రచయిత డేవిడ్ నాథన్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. బాగా నచ్చింది. ఎప్పటినుంచో నా మైండ్లో ఈ కథ నలుగుతూనే ఉంది. మోహనకృష్ణ ‘బందిపోటు’ సినిమా అంగీకరించక ముందే నేనాయనతో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆ సినిమా మొదలైంది. సర్లే.. తర్వాత చేద్దా మనుకున్నా. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రిస్క్ అవుతుందని మోహన్ అన్నారు. కానీ ఫ్లాప్లు ఎవరికైనా సహజం. అందుకే పర్లేదని చెప్పగానే కొన్ని కథలు వినిపించారు. అప్పుడు చాన్నాళ్ల క్రితం విన్న కథ గురించి ఆయనకు చెప్పా. నిజానికి మోహనకృష్ణకు సొంతగా కథలు రాసుకోవడం ఇష్టం. అందుకే అయిష్టంగానే వినడానికి అంగీకరించారు. కానీ కథ నచ్చి, సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. నాని చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కథకు కీలకం. రొమాంటిక్ థ్రిల్లర్గా సాగే ఈ సినిమాలోని ప్రతి సీన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో సాంకేతికత పెరిగింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంచి సినిమాలు తీయాలన్నది నా ఆలోచన’’ అని చెప్పారు. -
అవకాశం వస్తే ఆయనతో..
కోలీవుడ్లో నంబర్ఒన్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి నయనతార. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ ఆమెను వరుస విజయాలు టాప్ రేంజ్లో నిలబెట్టాయి. విశేషం ఏమిటంటే ఇటీవల ప్రముఖ నటుల కంటే యువ హీరోలతోనే నయనతార నటించిన చిత్రాలే మంచి విజయాన్ని సాధిం చాయి. దీంతో తను కూడా చిన్నా పెద్ద హీరోలని చూడకుండా కథా పాత్రలకే ప్రాముఖ్యత నిస్తున్నారు. మాయ చిత్రం నయనను లేడీఓరి యెంటెడ్ హీరోయిన్న చేసింది. ఇటీవల ఆమె ప్రముఖ కథానాయకుడి సరసన చిత్రాలు చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇళయదళపతి విజయ్తో రొమాన్స్ చేసి చాలా కాలమైంది. విల్లు చిత్రంలో తొలిసారిగా విజయ్ తో జత కట్టారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత శివకాశి చిత్రంలో ఇళయదళపతితో సింగల్ సాంగ్లో లెగ్ షేక్ చేశారు.ఆ తరువాత విజయ్తో నటించే అవకాశాలు వచ్చినా తను ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం తో వాటిని నయనతార అంగీకరించలేని పరిస్థితి. దీంతో వీరిద్దరు కలి సి నటిస్తే చూడాలన్న ఆకాంక్ష ప్రేక్షకుల్లో నెలకొంది. కరెక్ట్గా అలాం టి కోరికనే నయనతార ఇటీవల వెల్లడించడం విశేషం. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించడానికి మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని నయనతార తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. మరి దర్శక నిర్మాతలు ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ జంట కోసం కథలు రెడీ చేసుకోండి. -
‘సెకండ్ ఇన్నింగ్స్’కు రెడీ...!
రెండో విడత బాధ్యతలకు సిద్దమేనని ఆర్బీఐ గవర్నర్ రాజన్ సంకేతాలు చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్య లండన్: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రెండవ విడత బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమన్న సంకేతాలను రఘురామ్ రాజన్ ఇచ్చారు. వచ్చే సెప్టెంబర్తో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుండడం... ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని సుబ్రమణ్యస్వామిసహా పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో.. రాజన్ లండన్లో ఒక వార్తచానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మూడేళ్లూ ఉద్యోగ బాధ్యతలను పూర్తి సంతృప్తికరంగా నిర్వహించానని అన్నారు. తన పదవీకాలాన్ని పొడిగించరాదని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇంకా చేయాల్సింది చాలా ఉందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థికవృద్ధి పథంలో తగిన చొరవల ద్వారా కొంత ముందడుగు వేయగలిగామని ఆయన అన్నారు. ‘ఒక వేళ మీ బాధ్యతలను పొడిగించకపోతే... సెంట్రల్ బ్యాంకర్గా మీ అజెండా మధ్యలో ఆగిపోతుంది కదా? అన్న ప్రశ్నకు రాజన్ సమాధానం చెబుతూ, ‘ఇది మంచి ప్రశ్న. చాలా చేశామని నేను భావిస్తున్నాను. చేయాల్సింది సైతం ఎంతో ఉంటుందిక్కడ’ అని అన్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో ప్రసంగించేందుకు ప్రస్తుతం రాజన్ లండన్లో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేసిన రాజన్కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్లీవ్’ ప్రొఫెసర్గా ఉన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా కీలక రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. ఎన్పీఏల సమస్య పరిష్కారమవుతుంది... కాగా భారత్లో అమెరికా తరహా ‘లెహ్మాన్ మూమెంట్’ రుణ సంక్షోభ సమస్య తలెత్తే ప్రశ్నేలేదని రాజన్ అన్నారు. ఇందుకు తగిన పటిష్ట ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఇక అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థకు మూడు రక్షణ వలయాలు ఉన్నట్లు వివరించారు. చక్కటి ఆర్థిక విధానాలు, తగిన స్థాయి నిర్వహణలో ఉన్న రుణ భారం, సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలుగా వీటిని అభివర్ణించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు తక్షణ ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టంచేశారు. ద్రవ్యోల్బణం ఇంకా తీవ్రమే...! ద్రవ్యోల్బణం ఇంకా తగిన స్థాయికి దిగిరాలేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనితో తదుపరి రేటు కోతకు ఇప్పట్లో అవకాశం లేదని ఆయన సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. -
రాజకీయాల్లో గౌరవం ఏమీ మిగల్లేదు: రవీనా టాండన్
తన సినిమా కెరీర్ మొత్తంలో వివిధ సామాజిక సమస్యలపై గళమెత్తిన హీరోయిన్ రవీనా టాండన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దూసుకెళ్తోంది. కానీ, ఆమెతో పాటు నటించిన గోవిందా, శత్రుఘ్న సిన్హా లాంటివాళ్లంతా రాజకీయాల్లోకి వచ్చినా.. తనకు మాత్రం ఆ రంగంలోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దానికి కారణం ఏమిటంటే. రాజకీయాల్లో ఇక గౌరవం ఏమీ మిగల్లేదట. తాజాగా 'మాత్ర్ - ద మదర్' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రవీనా.. తనకు రాజకీయాలు ఏమాత్రం సరిపోవని అంటోంది. రాజకీయాల్లో చేరి ఈ ప్రపంచానికి ఏమైనా చేద్దామనుకున్నా కూడా.. మంచివాళ్లకు అన్నీ అడ్డంకులే ఎదురవుతాయని చెప్పింది. పదేళ్ల క్రితం ఉన్నతాధికారులు, నాయకులకు కాస్త గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని, అసలు గౌరవం అన్నది ఎక్కడా మిగల్లేదని తెలిపింది. 'మాత్ర్- ద మదర్' సినిమాలో ఇంతకుముందు స్లమ్డాగ్ మిలియనీర్లో నటించిన మధుర్ మిట్టల్ కూడా ఉన్నాడు. హింస, అత్యాచారాల బాధితులైన మహిళలకు న్యాయం చేయడానికి జరిగే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. బాల నేరస్తుల వయసును చాలా దేశాలు 14-16 ఏళ్లకు తగ్గించాయని, మనం మాత్రం దాన్ని 18 ఏళ్లుగానే నిర్ధారిస్తున్నామని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై జరిగే నేరాలకు ఉరిశిక్ష వేయాలని తాను అడగబోనని, తనకు రక్తదాహం లేదని కానీ.. నేర తీవ్రత ఎంత అనే విషయాన్ని మాత్రం గుర్తించాలని చెప్పింది. -
రైజింగ్లో త్రిష!
సినిమా రంగాన్ని మాయా ప్రపంచం అని ఊరికే అనలేదు. ఇది ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో కూర్చోపెడుతుందో ఊహించడం కష్టం. ఇక తన పైని అయిపోయింది అనుకున్న వాళ్లు అనూహ్యంగా టాప్ లెవల్లో వెలిగిపోతుంటారు.దీనినే సెకెండ్ ఇన్నింగ్స్ అంటుంటారు. నయనతార ప్రస్తుతం ఇలానే దక్షిణాది సినీ పరిశ్రమను దున్నేస్తున్నారు. ఇక ఈ విషయంలో నటి త్రిష ఏమీ తీసిపోలేదు. ఈ మధ్య సరైన హిట్స్ లేకపోవడంతో త్రిష పనైపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నై అరిందాళ్ చిత్రంలో ఒక చిన్నారికి తల్లిగా వైవిధ్య పాత్రలో తనదైన నటనను ప్రదర్శించి మంచి పేరుతో పాటు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నటించిన అరణ్మణై-2 చిత్రం కూడా సక్సెస్ బాటలో పయనించడంతో త్రిష పేరు మరో సారి లైమ్ టైమ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చైన్నై చిన్నది నాయకి చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ధనుష్ కథానాయకుడిగా రాజకీయ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న కొడి చిత్రంలో త్రిష రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.అయితే తాజాగా ఇందులో త్రిషది రాజకీయనాయకురాలి పాత్ర కాదని, రాజకీయనాయకుడైన ధనుష్కు జంటగా నటిస్తున్నారని తెలిసింది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రంలో విజయశాంతి పాత్ర తరహాలో చాలా బలమైన పాత్ర చేస్తున్నారట. ఇది తను ఇంత వరకూ నటించనటు వంటి పాత్ర అని సమాచారం.దీంతో కొడి చిత్రం తన స్థాయిని మరింత పెంచే చిత్రం అవుతుందనే ఆశాభావాన్ని ఆశాభావంతో త్రిష ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే ఈ బ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ మంచి రైజింగ్లో ఉందని భావించవచ్చు. -
జ్యోతికకు అతిథి కానున్న సూర్య
నటి జ్యోతికకు అతిథిగా సూర్య ఏమిటీ, ఆమెకు ఆయన ఏకంగా పతి అయిపోయారుగా అన్న సందేహం మీకు రావచ్చు. సూర్య జ్యోతిక పతి అన్నది రియల్ లైఫ్లో. అతిథి కానున్నది రీల్ లైఫ్లో. సూర్యను వివాహమాడిన తరువాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక సుమారు తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకుని ఇటీవల 36 వయదినిలే చిత్రంలో నటించారు. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీన్ని ఆమె భర్త సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారన్నది తెలిసిన విషయమే. జ్యోతిక తన సెకెండ్ ఇన్నింగ్స్లో సెకెండ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు.దీనికి తొలి చిత్రం కుట్రం కడిదల్తోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందిన బ్రహ్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సూర్యనే నిర్మించనున్నారు.అంతే కాదు ఇందులో ఆయన అతిథి పాత్రలో నటించనున్నారని కోలీవుడ్ సమాచారం. జ్యోతిక, సూర్య జంటగా నటించిన చివరి చిత్రం చిల్లన్ను ఒరు కాదల్. ఇది 2006లో విడుదలైంది. పదేళ్ల తరువాత మళ్లీ ఈ క్రేజీ జంట కలసి నటించడానికి సిద్ధమవుతున్నారన్న మాట. ఇంకో విషయం ఏమిటంటే సూర్య నటించిన పసంగ-2 చిత్రంలో హీరోయిన్గా జ్యోతికనే నటింపచేయాలని ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ భావించారు. అప్పుడు ఆ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపని జ్యోతిక చితరం విడుదలై విజయం సాధించడంతో మంచి చిత్రాన్ని మిస్ అయ్యానని కించిత్ చింతను వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయన్నది గమనార్హం. -
ఆసీస్కు ఇన్నింగ్స్ విజయం
కివీస్తో తొలి టెస్టు వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టును మరో రోజు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెల్చుకుంది. స్పిన్నర్ లియోన్ (4/91), పేసర్ మిషెల్ మార్ష్ (3/73) ధాటికి సోమవారం నాలుగో రోజు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 104.3 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్కు ఇన్నింగ్స్ 52 పరుగులతో ఘనవిజయం లభించింది. కివీస్ జట్టులో లాథమ్ (164 బంతుల్లో 63; 3 ఫోర్లు), నికోల్స్ (134 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా గప్టిల్ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. నాలుగోరోజు 178/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 218 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరుస బ్యాట్స్మెన్ క్రెయిగ్ (64 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) పోరాడగా... టిమ్ సౌతీ (23 బంతుల్లో 48; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) వన్డే తరహా ఆటతీరుతో విజృంభించాడు. వీరిద్దరి మధ్య తొమ్మిదో వికెట్కు 59 పరుగులు వచ్చాయి. ఓవరాల్గా చివరి మూడు వికెట్ల మధ్య 109 పరుగులు జత చేరాయి. హాజెల్వుడ్కు రెండు వికెట్లు దక్కాయి. సిరీస్లో చివరిదైన రెండో టెస్టు 20 నుంచి క్రైస్ట్చర్చ్లో జరుగుతుంది. -
మరో ‘గోడ’లా...
15, 2, 13, 9... నాలుగో టెస్టుకు ముందు అజింక్య రహానే దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో చేసిన పరుగులు ఇవి. అయితే ఏ క్రికెటర్కైనా ఫామ్ శాశ్వతం కాదని, క్లాస్ శాశ్వతమని రహానే మరోసారి నిరూపించాడు. కోట్లా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపికకు నిర్వచనంలా క్రీజులో నిలబడి భారత్ను శాసించే స్థితిలో నిలబెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో చేసిన సెంచరీయే అమోఘమైతే... రెండో ఇన్నింగ్స్లో అతని బ్యాటింగ్ ఇంకా అద్భుతం. రహానే ఆడిన చాలా షాట్లు... తన టెక్నిక్ ద్రవిడ్ను గుర్తు చేశాయి. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసే క్రమంలో అతనికి ఓ లైఫ్ లభించింది. నిజానికి ఆ ఒక్కటి మినహాయిస్తే అతని ఆటతీరు లో వంక పెట్టడానికి లేదు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్ల మీద సహనంతో ఆడాలి. పరుగులు రాకపోయినా... చెత్త బంతి పడేవరకూ ఓపికగా ఎదురు చూడాలి. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా పేసర్లు మోర్కెల్, అబాట్ వైవిధ్యంగా బంతులు వేశారు. ఇక స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించారు. అయితే మిగిలిన భారత బ్యాట్స్మెన్లా కాకుండా... తాను చాలా అద్భుతంగా ఆడాడు. ఎక్కడ దూకుడు చూపించాలో అక్కడ వేగంగా ఆడాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ నెమ్మదిగా ఆడాడు. అందుకే ఓ క్లాసిక్ సెంచరీ చేసి చూపించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో రహానే క్రీజులోకి వచ్చిన సమయంలో భారత్ 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. మోర్నీ మోర్కెల్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఓ ఎండ్లో కెప్టెన్ కోహ్లి బాగానే ఆడుతున్నా... ఈ సిరీస్లో ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ దశలో భారత్ మరో వికెట్ కోల్పోతే ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేరు. నిజానికి అప్పటికే భారత్కు ఆధిక్యం బాగా ఉంది. అయితే కచ్చితంగా మ్యాచ్ గెలిచే ఆధిక్యం మాత్రం కాదు. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన రహానే... అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కట్, డ్రైవ్, గ్లాన్స్... ఇలా అన్ని రకాల షాట్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టిన రహానే... రెండో ఇన్నింగ్స్లో ఇప్పటివరకూ ఐదు బౌండరీలే సాధించాడు. ఓ మంచి భాగస్వామ్యం ఉంటే దక్షిణాఫ్రికా నుంచి మ్యాచ్ను దూరం చేయొచ్చు. కోహ్లితో కలిసి రహానే ఇదే చేశాడు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్పై సెంచరీ భాగస్వామ్యంతో జట్టును డ్రైవర్ సీట్లోకి తీసుకెళ్లాడు. ఈ ఇన్నింగ్స్తో ఊరట 2013లో ఢిల్లీలోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన రహానే... ఈ సిరీస్కు ముందు భారత్లో మరో టెస్టు మ్యాచ్ ఆడలేదు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నాలుగు దేశాల్లో నాలుగు రకాల వైవిధ్యాలతో ఉండే పిచ్ల మీద ఆడాడు. ఏ సిరీస్లోనూ అతను నిరాశపరచలేదు. ఒక్క దక్షిణాఫ్రికాలో మినహాయిస్తే మిగిలిన మూడు దేశాల్లోనూ సెంచరీలు చేశాడు. సఫారీ గడ్డ మీద కూడా ఒకే మ్యాచ్లో రెండు అర్ధసెంచరీలు (అందులో ఒకటి 96 పరుగులు) చేశాడు. దీంతో రహానే భారత టెస్టు లైనప్లో డిపెండబుల్ ఆటగాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్కు ముందు శ్రీలంకలోనూ శతకం చేసిన ఈ ముంబై క్రికెటర్... దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై నిరాశపరిచాడు. ఇది తనని కూడా బాధించే అంశమే. చాలామంది ఉపఖండం ఆటగాళ్లు క్రీజులో నిలబడటానికి కూడా భయపడే చోట మంచినీళ్ల ప్రాయంలా పరుగులు చేసిన క్రికెటర్... సొంతగడ్డపై సరిగా ఆడకపోవడం నిరాశ కలిగించే అంశం. దక్షిణాఫ్రికాతో ప్రస్తుత టెస్టులో ఆడిన రెండు ఇన్నింగ్స్ ద్వారా తనలో టెంపర్మెంట్ను బయటపెట్టిన రహానే... కచ్చితంగా ఊరట పొంది ఉంటాడు. ఇకపై ఏ దేశంలో, ఎలాంటి వికెట్పై టెస్టు ఆడాల్సి వచ్చినా... రహానే ఉన్నాడంటే కెప్టెన్ గుండెమీద చేయి వేసుకుని కూర్చోవచ్చు. అలాంటి ధీమాను తను పెంచాడు. -సాక్షి క్రీడావిభాగం -
స్మిత్, వోజెస్ శతకాలు
ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 258/2 పెర్త్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శతకాల మోత మోగుతోంది. సోమవారం తమ రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (170 బంతుల్లో 131 బ్యాటింగ్; 17 ఫోర్లు), వోజెస్ (180 బంతుల్లో 101 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 63 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 193 పరుగుల ఆధిక్యంతో ఉంది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ను 153.5 ఓవర్లలో 624 పరుగుల వద్ద ముగించింది. రాస్ టేలర్ (374 బంతుల్లో 290; 43 ఫోర్లు) కొద్దిలో ట్రిపుల్ శతకం మిస్ అయ్యాడు. అయితే ఆసీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పర్యాటక జట్టు ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్కు నాలుగు, లియోన్కు మూడు వికెట్లు పడ్డాయి. -
భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ‘ఎ’ 36/2 బెంగళూరు: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్పై భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించగా... మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. మంగళవారం మ్యాచ్కు చివరి రోజు. రాణించిన శంకర్, నాయర్: ఓవర్నైట్ స్కోరు 161/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 5 వికెట్లకు 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శిఖర్ ధావన్ (146 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) తన జోరు కొనసాగించగా, ఆ తర్వాత విజయ్ శంకర్ (110 బంతుల్లో 86; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (97 బంతుల్లో 71; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 108 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో జుబేర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ వ్యవధిలో అనాముల్ (0), సర్కార్ (19) వికెట్లు కోల్పోయింది. ఈశ్వర్ పాండే, జయంత్ యాదవ్లకు ఒక్కో వికెట్ లభించింది. -
బౌన్సరా...నా తలకాయ!
మళ్లీ ఇషాంత్ రగడ కొలంబో: రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ జోరును అడ్డుకోలేక లంక బౌలర్లు భంగపడిన వేళ...ఇషాంత్ శర్మ మళ్లీ తన ఆగ్రహావేశాలతో వారిని కవ్వించి పుండు మీద కారం చల్లాడు! ఈ సారి పేసర్ దమ్మిక ప్రసాద్ వంతు. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న ఇషాంత్కు అతను వరుసగా మూడు బౌన్సర్లు విసిరాడు. కిందికి వంగి వాటిని తప్పించుకున్న ఇషాంత్ బౌలర్ వైపు చిరునవ్వు చిందించాడు. దాంతో ప్రసాద్ మరింత మండిపోగా, తర్వాతి బంతిని సింగిల్ తీసిన శర్మ...మరో బౌన్సర్ వేస్తావా అన్నట్లుగా తన తల వైపు చూపించాడు. అయితే రన్ పూర్తి కాగానే ప్రసాద్ ఏదో అనడంతో ఇషాంత్ బదులిచ్చాడు. ఇంతలో సీన్లోకి వచ్చిన చండీమల్, ఇషాంత్ దగ్గరగా వచ్చి నోరు జారాడు. మరో వైపు ఉన్న అశ్విన్తో పాటు అంపైర్లు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆ వెంటనే కావాలనే ‘నోబాల్’ వేస్తూ ప్రసాద్ మరో బౌన్సర్ వేసినా భారత బౌలర్ ఇబ్బంది పడలేదు. కానీ చివరి బంతికి అశ్విన్ అవుటై అంతా పెవిలి యన్ వెళుతున్న దశలో ప్రసాద్ ముందుకు దూసుకొచ్చి మళ్లీ ఇషాంత్పై నోరు జారాడు. అక్కడ కథ ముగిసినా...చండీమల్ను అవుట్ చేసి ఇషాంత్ మళ్లీ తనదైన శైలిని ప్రదర్శించాడు. చేత్తో తన తలను బలంగా కొట్టుకుంటూ చండీమల్కు సెండాఫ్ ఇచ్చాడు! -
మన చేతుల్లోనే!
-
మన చేతుల్లోనే!
►రెండో ఇన్నింగ్స్లో భారత్ 70/1 ► ఓవరాల్ ఆధిక్యం 157 పరుగులు ► తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 306 ఆలౌట్ ► మ్యాథ్యూస్ సెంచరీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్లో విజయ్, రహానేల సమయోచిత ప్రదర్శనతో మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో టెస్టు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న 157 పరుగుల ఆధిక్యానికి నాలుగో రోజు వీలైనన్ని పరుగులు జోడిస్తే... టీమిండియా మ్యాచ్పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే తొలి టెస్టులో మాదిరిగా లంకేయులు అద్భుతం చేయకుండా జాగ్రత్తపడాలి. కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం దిశగా సాగుతోంది. నాణ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్న టీమిండియా.. ఆతిథ్య బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. ఫలితంగా 140/3 ఓవర్నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్లో 108 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 87 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (167 బంతుల్లో 102; 12 ఫోర్లు) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్లో తిరిమన్నే (168 బంతుల్లో 62; 5 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మిశ్రాకు 4 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విజయ్ (39 బ్యాటింగ్), రహానే (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 157 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెషన్-1: నెమ్మదిగా పరుగులు ఓవర్లు: 28; పరుగులు: 84; వికెట్లు: 0 పేసర్లకు వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో ఓవర్నైట్ బ్యాట్స్మన్ తిరిమన్నే, మ్యాథ్యూస్లు నిలకడగా ఆడారు. ఇషాంత్ వేసిన సెషన్ ఐదో బంతి.. తిరిమన్నే బ్యాట్ ఎడ్జ్ను తాకి ఫస్ట్ స్లిప్లోకి వెళ్లింది. కీపర్ సాహా డైవ్ చేసినా అందలేదు. ఇది మినహా ఈ సెషన్ మొత్తం వీరిద్దరు చాలా మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. అయితే రన్రేట్ పెరగకుండా భారత బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు వేశారు. స్పిన్నర్లు కొద్దిగా ప్రభావం చూపెట్టినా.. బ్యాట్స్మన్ ఆచితూచి ఆడటంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో మ్యాథ్యూస్ 81 బంతుల్లో, తిరిమన్నే 142 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవరాల్గా 73వ ఓవర్లో 200 పరుగులకు చేరిన లంక లంచ్ వరకు 3 వికెట్లకు 224 పరుగులు సాధించింది. ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా భారత్కు వికెట్ దక్కలేదు. సెషన్-2: పుంజుకున్న భారత్ ఓవర్లు: 22; పరుగులు: 74; వికెట్లు: 4 ఈ సెషన్లో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 33 నిమిషాల ఆట వృథా అయ్యింది. ఈ అవకాశాన్ని ఇషాంత్ సూపర్గా సద్వినియోగం చేసుకున్నాడు. అశ్విన్, మిశ్రా కూడా చక్కని సహకారం అందించారు. 85వ ఓవర్లో ఇషాంత్ ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేయబోయి తిరిమన్నే సాహా చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్కు నెలకొన్న 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే చండిమల్ (11)నూ వెనక్కి పంపాడు. రెండో ఎండ్లో మ్యాథ్యూస్ నెమ్మదిగా ఆడి 164 బంతుల్లో కెరీర్లో 6వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ దశలో విరాట్ చికిత్స కోసం బయటకు వెళ్లగా రహానే కెప్టెన్సీ చేశాడు. 99వ ఓవర్లో బిన్నీ.. ఊహించని రీతిలో మ్యాథ్యూస్ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. ఆ వెంటనే దమ్మిక ప్రసాద్ (5)ను మిశ్రా బోల్తా కొట్టించాడు. ఓవరాల్గా 224/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న లంక సెషన్ ముగిసేసరికి 298/7గా మారింది. సెషన్-3: బ్యాట్స్మెన్ నిలకడ ఓవర్లు: 5; పరుగులు: 8; వికెట్లు: 3 (శ్రీలంక) ఓవర్లు: 29.2; పరుగులు: 70; వికెట్లు: 1 (భారత్) టీ తర్వాత మిశ్రా విజృంభించాడు. స్వల్ప విరామాల్లో ముబారక్ (22), తరిండ్ కౌశల్ (6)ను అవుట్ చేశాడు. రెండో ఎండ్లో అశ్విన్... హెరాత్ను పెవిలియన్కు చేర్చడంతో లంక ఇన్నింగ్స్కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఐదో బంతికే లోకేశ్ రాహుల్ (2)ను అవుట్ చేసి దమ్మిక ప్రసాద్ షాక్ ఇచ్చాడు. దీంతో కోహ్లిసేన స్కోరు 3/1గా మారింది. తర్వాత విజయ్, రహానేలు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. పేసర్ల నుంచి ఒత్తిడి ఎదురైనా... భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేషన్తో ఇన్నింగ్స్ను నడిపించారు. ఒకటి, రెండుసార్లు ఎల్బీడబ్ల్యు అప్పీల్ల నుంచి బయటపడి స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదలించారు. ఓవరాల్గా మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడి విజయ్, రహానే రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 1; సిల్వ (సి) అశ్విన్ (బి) మిశ్రా 51; సంగక్కర (సి) రహానే (బి) అశ్విన్ 32; తిరిమన్నే (సి) సాహా (బి) ఇషాంత్ 62; మ్యాథ్యూస్ (సి) విజయ్ (బి) బిన్నీ 102; చండిమల్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 11; ముబారక్ (బి) మిశ్రా 22; ప్రసాద్ (సి) రహానే (బి) మిశ్రా 5; హెరాత్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 1; తరిండ్ కౌశల్ (స్టం) సాహా (బి) మిశ్రా 6; చమీరా నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 13; మొత్తం: (108 ఓవర్లలో ఆలౌట్) 306. వికెట్ల పతనం: 1-1; 2-75; 3-114; 4-241; 5-259; 6-284; 7-289; 8-300; 9-306; 10-306. బౌలింగ్: ఇషాంత్ 21-3-68-2; ఉమేశ్ 19-5-67-1; బిన్నీ 18-4-44-1; అశ్విన్ 29-3-76-2; మిశ్రా 21-3-43-4. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 39; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే బ్యాటింగ్ 28; ఎక్స్ట్రాలు: 1; మొత్తం: (29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 70. వికెట్ల పతనం: 1-3. బౌలింగ్: ప్రసాద్ 4-0-12-1; హెరాత్ 11.2-3-23-0; చమీరా 4-0-14-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 8-0-20-0. -
సెకెండ్ ఇన్నింగ్స్లో భూమిక సక్సెస్ అవుతుందా?
-
వృద్ధురాలిగా..!
‘జజ్బా’లో కిడ్నాప్కు గురైన ఓ బాలిక తల్లిగా నటిస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నారేమో. ఈ చిత్రం చేస్తుండగానే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారామె. ఇందులో ఐష్ 61 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారు. నిజజీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మద్యం మత్తులో ఇండో- పాక్ సరిహద్దు దాటి పాక్ సైనికుల చేతిలో చిక్కుకుని, ఆ తర్వాత జైలులో తోటి ఖైదీల చేతిలో హతమైన సరబ్జీత్ సింగ్ గుర్తున్నాడు కదా! ఆయన జీవితం ఆధారంగానే ఈ సినిమా రానుంది. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలోనే ఐశ్వర్వ నటించనున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న ఐష్ ఆరు పదుల వయసులో ఉన్న వృద్ధురాలిగా ఒదిగిపోవడానికి ఎంతైనా కష్టపడాలను కుంటున్నారట. ఇంకా సరబ్జిత్ సింగ్ పాత్రకు ఎవర్నీ ఎంపిక చేయలేదు. -
ఇంగ్లండ్ విజయలక్ష్యం 455
లీడ్స్: న్యూజిలాండ్ నిర్దేశించిన 455 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు వర్షం అడ్డుపడింది. దీంతో సోమవారం నాలుగో రోజు ఆటలో 13 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు లిత్ (29 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు), కుక్ (49 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. నేడు (మంగళవారం) ఆటకు చివరి రోజు. అంతకుముందు 338/6 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాట్లింగ్ (163 బంతుల్లో 120; 15 ఫోర్లు, 1 సిక్స్), క్రెయిగ్ (77 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వుడ్కు మూడు, అండర్సన్, బ్రాడ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
విజయం దిశగా కర్ణాటక
రెండో ఇన్నింగ్స్లో తమిళనాడు 113/3 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముంబై: రంజీ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 628 పరుగులు వెనుకబడిన తమిళనాడు మ్యాచ్ నాలుగో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 515 పరుగులు వెనుకబడిన ఆ జట్టుకు చివరి రోజు ఓటమి తప్పకపోవచ్చు! ఒక వేళ ఆలౌట్ కాకపోయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా కర్ణాటక రంజీ విజేతగా నిలవడం ఖాయం. అంతకు ముందు 618/7 పరుగుల ఓవర్నైట్ స్కోరు తో ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నిం గ్స్లో 762 పరుగులకు ఆలౌట్ అయింది. రంజీ ఫైనల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. వినయ్ కుమార్ (319 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్లో సెంచరీ, 5 వికెట్లు సాధించిన రెండో ఆటగాడు, తొలి కెప్టెన్గా వినయ్ నిలిచాడు. మరో వైపు రంజీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా గుల్ మొహమ్మద్ (319) రికార్డును అధిగమించిన అనంతరం కరుణ్ నాయర్ (560 బంతుల్లో 328; 46 ఫోర్లు, 1 సిక్స్) నిష్ర్కమించాడు. -
సెకండ్ ఇన్నింగ్స్!
తెలుగులో ఓ వెలుగు వెలిగి... బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకున్న జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్కు రెడీ అవుతున్నట్టుంది. అయితే తెలుగులో కాదు... తన భర్త బిజీగా ఉన్న మరాఠీ స్క్రీన్పై! ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో గ్లామరస్గా కనిపించిన జెనీ... బాలీవుడ్లో తన రీ ఎంట్రీ గురించి చెబుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు భిన్నంగా అమ్మడు... ‘ఇన్నాళ్లూ ఇంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేశాను. స్క్రిప్ట్స్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతానికైతే ఏ సినిమాకీ సైన్ చెయ్యలేదు. అయితే మరాఠీ చిత్రంలో నటించడమంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. రితేష్ అప్కమింగ్ వెంచర్లో జెనీలియా లీడ్ రోల్ చేయనుందనేది సమాచారం. రితేష్ గత చిత్రం ‘లాయ్ భారీ’లో ఈ చిన్నది హోలీ సాంగ్లో కనిపించి మురిపించింది. -
ఆంధ్ర ఇన్నింగ్స్ విజయం
గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇక నాకౌట్ అవకాశాలు హైదరాబాద్ చేతిలో సాక్షి, ఒంగోలు: పేస్ బౌలర్ దువ్వారపు శివ కుమార్ (5/38) హడలెత్తించడంతో... గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 136 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని సాధించింది. ఆంధ్ర బౌలర్ల దూకుడుకు ఈ మ్యాచ్ మూడో రోజుల్లోనే ముగియడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 187/8తో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన గోవా మరో 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయి 198 పరుగులవద్ద ఆలౌటై ఫాలోఆన్లో పడింది. రెండో ఇన్నింగ్స్లోనూ ఆంధ్ర బౌలర్ల ధాటికి గోవా బ్యాట్స్మెన్ ఎక్కువసేపు క్రీజ్లో నిలువలేకపోయారు. తుదకు 81.4 ఓవర్లలో 214 పరుగులవద్ద ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూశారు. గోవా జట్టులో ఓపెనర్ అమోగ్ దేశాయ్ (112 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 57), వేదాంత్ నాయక్ (82 బంతుల్లో 8 ఫోర్లతో 37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా... స్టీఫెన్ మూడు, హరీష్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ను 548/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్తో రంజీ: హైదరాబాద్ 297/1 సాక్షి, హైదరాబాద్: తన్మయ్ అగర్వాల్ (303 బంతుల్లో 14 ఫోర్లతో 105 బ్యాటింగ్), విహారి (229 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్తో 138 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో... హిమాచల్ప్రదేశ్తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్లో 106 ఓవర్లలో వికెట్ నష్టానికి 297 పరుగులు చేసింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (9 ఫోర్లతో 48) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కాలంటే చివరిరోజు ఆ జట్టు మరో 215 పరుగులు చేయాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఈ గెలుపుతో ఆంధ్ర ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి. ప్రస్తుతం ఆంధ్ర మొత్తం 29 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉండగా... హిమాచల్ప్రదేశ్ 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ఆంధ్ర నాకౌట్ ఆశలన్నీ హైదరాబాద్, హిమాచల్ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి హిమాచల్ప్రదేశ్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆ జట్టు 30 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆంధ్ర జట్టు 29 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంటుంది. హిమాచల్ప్రదేశ్ 28 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా అస్సాం జట్టు ఇప్పటికే 35 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందింది. -
నేను ఫుల్ హ్యాపీ!
‘‘గత ఏడాది విభిన్న పాత్రలు చాలా చేశాను. చందమామ కథలు, పరంపర, దృశ్యం, చిన్నదాన నీకోసం తదితర చిత్రాల్లో చేసిన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా ‘పరంపర’ చిత్రానికి అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నాను’’ అని నరేశ్ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, ఇతర విశేషాల గురించి నరేశ్ మాట్లాడుతూ -‘‘హీరోగా ‘నాలుగు స్థంభాలాట’తో నా కెరీర్ ఆరంభమైంది. కథానాయకునిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేశాను. కారెక్టర్ నటుడిగా కూడా ఇప్పుడు ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయడం ఆనందంగా ఉంది. ఆరేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాను. బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నాను. మొత్తం మీద నా కెరీర్ చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతానికి రాజకీయాల గురించి ఆలోచించడంలేదని చెబుతూ -‘‘అనంతపురంలో ‘కళాకారుల ఐక్య వేదిక’ నిర్వహిస్తున్నాను. సినిమా కళాకరులనే కాకుండా వివిధ వృత్తుల్లో నిరాదరణకు గురైన వారికి ఈ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నాను. ఆ విధంగా నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది’’ అని చెప్పారు. -
పద్మప్రియ రీ ఎంట్రీ
నటి పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్కు రెడీ అయ్యింది. ఇంతకు ముందు మృగం, పొక్కిషం, సత్తం పోడాదే తదితర తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ భామ ఆ మధ్య పై చదువుల కోసం అంటూ అమెరికా వెళ్లి నటనకు దూరమైంది. పనిలో పనిగా అక్కడ తనతోపాటు చదువుతున్న యువకుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకుని వచ్చింది. అంతకుముందు సత్తం పోడాదే చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శకుడు వసంత్ పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్ ఛాన్స్ కల్పించారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శివరంజని యుం ఇన్నుం సిల పెంగుళు చిత్రంలో పద్మప్రియ నాయికగా నటిస్తున్నారు. ఆమెకు జంటగా నటుడు కరుణాకరన్ నటిస్తుండగా మరో రెండు కథా నాయికల పాత్రలో పార్వతి మీనన్, రామన్నంబీశన్లను ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందట. ఇది మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత కథా చిత్రం అని తెలిసింది. త్వరలోనే చిత్రం పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు. -
ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ
అగర్తలా: ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది. నాలుగో రోజు 240/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపుర 119.1 ఓవర్లలో 351 పరుగుల వద్ద ఆలౌటైంది. రాకేశ్ సోలంకి (127 బంతుల్లో 85, 12 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 4, అన్వర్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 45 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 6.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి ఛేదించింది. అక్షత్ 27, అగర్వాల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. -
ఆంధ్ర, సర్వీసెస్ మ్యాచ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ బుధవారం డ్రాగా ముగిసింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. అంతకు ముందు 218/4 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 52 పరుగుల ఆధిక్యం లభించింది. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, విజయ్ కుమార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్ మ్యాచ్ కూడా... వాయనాడ్: మరో వైపు ఇదే గ్రూప్లో కేరళతో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ డ్రా చేసుకుంది. 4/0 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (110), అక్షత్ రెడ్డి (104 నాటౌట్) సెంచరీలు సాధించారు. గ్రూప్ ‘సి’లో మూడు రౌండ్ల అనంతరం ఆంధ్ర 8 పాయింట్లతో, హైదరాబాద్ 7 పాయింట్లతో ఉన్నాయి. -
సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ కొనసాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. మురళి విజయ్, శిఖరధావన్లు క్రీజులో ఉన్నారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 109.4 ఓవర్లకు 505 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది. ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులు స్మిత్ 133 పరుగులు, జాన్సన్ 88, రోజర్స్ 55, ఎస్.ఇ.మార్ష్ 32, వార్నెర్ 29, వాట్సన్ 25,ఎంఆర్ మార్ష్ 11, హద్దీన్ 6,స్టార్క్ 52, లియాన్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. హాజల్ఉడ్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. -
హైదరాబాద్ ‘డ్రా’తో సరి
గోవాతో రంజీ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు తడబడటంతో గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆట చివరిరోజు బుధవారం ఓవర్నైట్ స్కోరు 238/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గోవా 269 పరుగులవద్ద ఆలౌటైంది. రవి కిరణ్ (2/36), ఆశిష్ రెడ్డి (2/41), ప్రజ్ఞాన్ ఓజా (2/98) రెండేసి వికెట్లు తీయగా... సీవీ మిలింద్ (3/63) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన హైదరాబాద్ తమ ప్రత్యర్థి గోవా జట్టును ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో గోవా 68 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఓపెనర్ అమోగ్ సునీల్ దేశాయ్ (192 బంతుల్లో 9 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినందుకు హైదరాబాద్కు మూడు పాయింట్లు లభించగా... గోవాకు ఒక పాయింట్ దక్కింది. -
బంగ్లాకు తప్పని ఓటమి
10 వికెట్లతో విండీస్ గెలుపు కింగ్స్టౌన్: బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫిఖర్ రహీమ్ (243 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ ఆ జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయింది. మంగళవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఐదో రోజు 15.3 ఓవర్లలో 58 పరుగులు జోడించిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్లో 314 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో 13 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 2.4 ఓవర్లలో అందుకుంది. రహీమ్ తన పోరాట పటిమతో బంగ్లాను ఇన్నింగ్స్ ఓటమి పాలుకాకుండా మాత్రమే కాపాడగలిగాడు. సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నుంచి సెయింట్ లూసియాలో జరుగుతుంది. -
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిషా
-
టీమిండియా ఆరంభ శూరత్వం
-
‘కెప్టెన్ కూల్’ తప్పటడుగులు!
మహేంద్ర సింగ్ ధోని అంటే మైదానంలో కదిలే కంప్యూటర్లాంటివాడు... ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో అతని ప్రత్యేకతే వేరు. తనదైన శైలిలో కొత్త తరహా వ్యూహాలతో ఎదుటి బ్యాట్స్మెన్ను కట్టడి చేయగల సామర్థ్యం అతని సొంతం. మ్యాచ్ చేజారిపోతున్న క్షణాల్లోనూ కేవలం కెప్టెన్ సూచనలతోనే ఫలితాలు సాధించామని బౌలర్లంతా చెబుతారు. మరి ఇంగ్లండ్ సిరీస్లో ఆ వ్యూహాలు ఏమయ్యాయి? గత రెండు టెస్టుల్లో ధోనికి అంతా రివర్స్లో జరుగుతోంది. సంప్రదాయ వ్యూహాలను దాటి భిన్నంగా చేస్తున్న ఏ ప్రయత్నమూ విజయవంతం కావడం లేదు. అసలు అతనికి తన బౌలర్ల మీద నమ్మకం సడలిందా... లేక ఇక ఏమీ చేయలేమంటూ ముందే చేతులెత్తేస్తున్నాడా... అన్నింటికి మించి అతని వన్డే వ్యూహాలు టెస్టులకు పనికి రావడం లేదా! ధోని వ్యూహాలు విఫలం బౌలర్లపై అనవసరపు ఒత్తిడి సహచరులపై నమ్మకం సడలిందా! సాక్షి క్రీడా విభాగం : లార్డ్స్ టెస్టు...రెండో ఇన్నింగ్స్లో షార్ట్ పిచ్ బంతులు వేయమని ఇషాంత్కు ధోని సూచించాడు. అయితే ఇషాంత్ ఆరంభంలో ఇష్టపడలేదు. కానీ కెప్టెన్ నచ్చజెప్పాక షార్ట్ బంతులతో చెలరేగాడు. ఫలితంగా భారత్కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ విషయాన్ని ఇద్దరూ స్వయంగా వెల్లడించారు. సాధారణంగా తన గురించి తక్కువగా మాట్లాడే ధోని కూడా తనకూ, ఇషాంత్కు మధ్య ఎలాంటి చర్చ సాగిందో, అది ఎలాంటి ఫలితాన్నిచ్చిందో పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే ధోనిలో అతి విశ్వాసానికి కారణమైనట్లుంది. అవసరం లేకపోయినా కెప్టెన్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాగే బంతులు వేయండి! ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో వరుణ్ ఆరోన్ తన కొత్త స్పెల్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అంతలో గల్లీలో ఉన్న విరాట్ కోహ్లి లెగ్స్లిప్కు మారాడు. ఇలా ఎందుకంటూ ఆరోన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే కెప్టెన్ దానిని అంగీకరించకుండా బౌలింగ్ వేయమని ఆరోన్కు సూచించాడు. ఆ తర్వాత జడేజా విషయంలోనూ అదే జరిగింది. ఓవర్ ది వికెట్ వేసేందుకు జడేజా ముందుకొచ్చాడు. అంతే...అతడిని ఆపి రౌండ్ ది వికెట్ వేయమని ధోని చెప్పాడు. ఈ సారి అయితే జడేజా మారు మాట్లాడకుండా కెప్టెన్ చెప్పినట్లే చేశాడు. సాధారణంగా బౌలర్ తన ఆలోచనలను, వ్యూహాలను కెప్టెన్తో పంచుకుంటాడు. దానికి అనుగుణంగా ఫీల్డర్లను పెట్టమని కోరతాడు. ఫీల్డింగ్ ప్రకారమే తాను బంతులు విసిరేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్లో ధోని బౌలర్ల మనసులో దూరి తాను అనుకున్న విధంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. విజయవంతమైనా, విఫలమైనా ఎక్కువ ఆలోచనలు వికెట్ల వెనకనుంచే వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే భారత్ వైఫల్యంలో బౌలర్లను నిందించడంకన్నా ధోని వ్యూహాలనే తప్పు పట్టాల్సి వస్తోంది. తాను కోరుకున్న ఫీల్డింగ్నే పెట్టడం, దానికి అనుగుణంగానే బౌలింగ్ చేయమని ఒత్తిడి తేవడం అనూహ్యం. లెగ్ స్లిప్, ఫైన్ లెగ్, షార్ట్ స్క్వర్ లెగ్ వంటి ఫీల్డింగ్తో ఏ పేస్ బౌలరైనా బౌలింగ్ చేస్తాడా అనేది ఆశ్చర్య పడాల్సిన విషయం. ఊరించే షార్ట్ పిచ్ బంతులు వేస్తే తప్ప లెగ్సైడ్లో వికెట్ వెనక ముగ్గురు ఫీల్డర్లు అనవసరం. కానీ ఇషాంత్ తరహాలో పేస్, దూకుడు లేని భువనేశ్వర్, పంకజ్లాంటి పేసర్ల బౌలింగ్తో ఏం ఫలితం దక్కుతుంది? పైగా లార్డ్స్ టెస్టులో చేసిన తప్పునే ఇంగ్లండ్ మళ్లీ ఎందుకు చేస్తుంది. ఇది చూస్తే ఒకే తరహా మూస వ్యూహంతో ధోని వెళుతున్నట్లు కనిపించింది. అసలు టెస్టుల్లో లెగ్ స్లిప్లో క్యాచ్ లభించడం చాలా అరుదు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ అసలు ఆ వైపు చూడకుండా స్లిప్స్పైనే దృష్టి పెట్టి ఆఫ్ స్టంప్పై బంతులతో విజయవంతమైంది. పైగా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ పదే పదే లెంగ్త్ మార్పుతో మరో కొత్త బంతి వచ్చే సమయానికి తీవ్రంగా అలసిపోయి ప్రభావం చూపలేకపోతున్నాడు. వికెట్లు అవసరం లేదా! ఒక టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే ప్రత్యర్థి జట్టును రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందేననేది ప్రాథమిక సూత్రం. వన్డేల్లోనైతే పరుగులు రాకుండా నిరోధించినా మ్యాచ్లు గెలుచుకోవచ్చు. ఈ సూత్రాన్ని పరిమిత ఓవర్లలో ధోని అత్యద్భుతంగా అమలు చేశాడు. కానీ టెస్టుల్లో అలా కాదు. సౌతాంప్టన్ టెస్టులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు కుక్, బాలెన్స్ క్రీజ్లో ఉన్నప్పుడు ఏడుగురు ఫీల్డర్లను లెగ్సైడ్లో ఉంచి జడేజాతో ధోని బౌలింగ్ చేయించాడు. 21 ఓవర్ల ఆ స్పెల్లో జడేజా 30 పరుగులే ఇచ్చాడు. కానీ బ్యాట్స్మెన్ ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడంతో పరుగులు రాలేదు కానీ వారిపై ఒత్తిడి తగ్గిపోయింది. ఆ తర్వాత కుక్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. సెంచరీకి ముందు కుక్ అవుటైనా అప్పటికే సమయం మించిపోయింది. అసలు జడేజా వికెట్లు తీయగలడని ధోనికి నమ్మకం లేదా! వాస్తవానికి మొయిన్ అలీ అటాకింగ్ బౌలింగ్తో పోలిస్తే జడేజా, అశ్విన్లు ఆత్మ రక్షణ ధోరణిలో బంతులు విసరడంతోనే వారికి వికెట్లు దక్కలేదు. మూడో టెస్టులో భారత్ 163.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తే ధోని 52 సార్లు బౌలింగ్ మార్పులు చేయడం విశేషం! నిజాయితీగా ఆలోచిస్తే భారత్లో మూడు లేదా నాలుగో రోజు పిచ్లపై స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. బౌలర్ కొంత కష్టపడితే పిచ్ అండగా నిలుస్తుంది. కానీ సౌతాంప్టన్, మాంచెస్టర్లాంటి మైదానాలు అలా కాదు. కాబట్టి ఇక్కడి దాని కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం. ఇప్పుడు సిరీస్ గెలిచే అవకాశమైతే లేదు కానీ చివరి టెస్టు నెగ్గాలంటే కెప్టెన్ కూల్ తన మేధస్సుకు మరింత పదును పెట్టాల్సి ఉంది. కాస్త ఓపిక పడదాం: గవాస్కర్ న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత జట్టు సంధికాలంలో ఉన్నందున ఫలితాల గురించి ఆందోళన చెందకుండా, కాస్త ఓపిక పట్టాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిమానులకు సూచించారు. ‘కొద్ది కాలం క్రితం ప్రపంచ ప్రసిద్ధ ఆటగాళ్లు భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం టీమిండియా సంధికాలంలో ఉంది. దిగ్గజ ఆటగాళ్ల స్థానాలను యువ ఆటగాళ్లు అంత సులువుగా భర్తీ చేయలేరు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. అయితే ఇటీవల టెస్టు ఫార్మాట్లో జట్టు ఇబ్బంది పడుతుందనే విషయం వాస్తవం’ అని గవాస్కర్ అన్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ అద్భుత బంతులేమీ వేయలేదని, పరుగులు తీయాలనే తొందరలో భారత ఆటగాళ్లు అవుటైనట్టు చెప్పారు. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత్పై సహజంగానే చాలామందికి అసూయగా ఉంటుందని, అందుకే జట్టును తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నారు. అయితే భారత ఆటగాళ్లు టెస్టులు ఆడదలుచుకుంటే కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాల్గొనేలా చూడాలని టీమ్ మేనేజ్మెంట్కు, బీసీసీఐకి సన్నీ సూచించారు. -
శ్రీలంకదే తొలి టెస్టు
చెలరేగిన హెరాత్ - రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలిన పాక్ - ఏడు వికెట్లతో శ్రీలంక గెలుపు గాలె: ‘డ్రా’ ఖాయమనుకున్న మ్యాచ్ను శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ తన స్పిన్ మాయాజాలంతో మలుపు తిప్పాడు. ఊహించని విధంగా శ్రీలంకకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. నిలకడలేని బ్యాటింగ్కు పర్యాయ పదంగా మారిన పాకిస్థాన్ మరోసారి కీలకదశలో చేతులెత్తేసి మూల్యం చెల్లించుకుంది. చివరిరోజు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తొలి టెస్టులో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రంగన హెరాత్ (6/48) సుడులు తిరిగే బంతులకు మిస్బా సేన చివరి రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్లో 80.2 ఓవర్లలో180 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (70 బంతుల్లో 52; 5 ఫోర్లు), అజహర్ అలీ (151 బంతుల్లో 41; 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత 21 ఓవర్లలో 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక వేగంగా ఆడి 16.2 ఓవర్లలో 3 వికెట్లకు మ్యాచ్ను ముగించింది. వెంటనే భారీ వర్షం కురవడంతో లంక ఊపిరిపీల్చుకుంది. మేఘావృత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న కెప్టెన్ మాథ్యూస్ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగాడు. జునైద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 4/1 ఓవర్ నైట్ స్కోరుతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ తొలి సెషన్లోనే మూడు వికెట్లను కోల్పోయింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మిస్బా (64 బంతుల్లో 28; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి అజర్ అలీ ఐదో వికెట్కు 56 పరుగులు జోడించాడు. ఈదశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెరాత్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను వణికించాడు. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు గురువారం నుంచి కొలంబోలో ప్రారంభమవుతుంది. -
ఎస్బీహెచ్ ఘనవిజయం
హడలెత్తించిన విశాల్, అశ్విన్ ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: విశాల్ శర్మ (4/15), అశ్విన్ యాదవ్ (4/38) హడలెత్తించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో కేంబ్రిడ్జ్ ఎలెవన్పై ఘనవిజయం సాధించింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్లో శుక్రవారం 17/1 స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్లోనూ చేతులెత్తేసింది. 46.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. హైదర్ అలీ (111 బంతుల్లో 56, 10 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ల్లో ఎస్బీహెచ్ 353, కేంబ్రిడ్జ్ ఎలెవన్ 154 పరుగులు చేశాయి. ఇన్నింగ్స్ విజయంతో ఎస్బీహెచ్ 16 పాయింట్లు సంపాదించగా, కేంబ్రిడ్జ్కు 2 పాయింట్లు దక్కాయి. నగరంలోని వివిధ మైదానాల్లో వర్షం వల్ల రెండు ఇన్నింగ్స్ల పాటు ఆట సాధ్యపడని మిగతా మ్యాచ్లన్నీ డ్రాగా ముగిశాయి. ఇతర మ్యాచ్ల స్కోర్లు ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 202 (మహంతి 42, రాధాకృష్ణ 45; సీవీ మిలింద్ 3/53, షాదాబ్ తుంబి 3/59, రాజేంద్ర 3/52), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 218/7 (అక్షత్ రెడ్డి 56, పార్థ్జాల 52 , పరాశర్ 3/81). కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 503/3 (ఆరోన్ పాల్ 151 నాటౌట్, వైభవ్ 101 నాటౌట్; ఇంద్రశేఖర్ 2/104), ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 189/8 (భగత్ వర్మ 50, విజయ్ గౌడ్ 43; వైభవ్ 3/22, చందన్ సహాని 2/30, సూర్యప్రసాద్ 2/37). ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 221, రెండో ఇన్నింగ్స్: 130 (విష్ణు తివారి 41, పెంటా రావు 48; శబరీష్ 2/48) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 117 (సాయిచరణ్ 46; దివేశ్ 3/32, రితేశ్ నేగి 3/30, కోటేశ్వర్ రావు 2/10). -
పట్టు చేజారినట్టే (నా)!
భారత్ రెండో ఇన్నింగ్స్లో 169/4 పోరాడుతున్న విజయ్, ధోని ఇంగ్లండ్తో రెండో టెస్టు భువనేశ్వర్ ఆరు వికెట్లతో విజృంభించినా... ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఆపై బ్యాట్స్మెన్ సహనంతో ఆడితే పట్టు సాధించే అవకాశమున్నా... మూడో రోజే నాలుగు కీలక వికెట్లు కోల్పోయారు. అర్ధసెంచరీతో మురళీ విజయ్, తోడుగా ధోని పోరాడుతున్నా... ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో రెండో టెస్టులో భారత్ ఆత్మరక్షణలో పడింది. గెలుపు మాట అటుంచి... మ్యాచ్ను కాపాడుకోవాలంటే ఆదివారం ఆట కీలకం కానుంది. లండన్: భారత్ పట్టు సాధించగలదనుకున్న రెండో టెస్టులో ‘డ్రా’ కోసం ప్రయత్నించే దిశగా పయనిస్తోంది. బౌలింగ్లో రెండో రోజు సాధించిన పట్టును సడలించడంతో... శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 319 పరుగుల దాకా వెళ్లింది. బౌలర్ ప్లంకెట్ (79 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ఇంగ్లండ్కు 24 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. భువనేశ్వర్ (6/82) రాణించాడు. ఆపై రెండో ఇన్నింగ్స్లో తడబడిన భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ప్లంకెట్ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టగా... మురళీ విజయ్ (190 బంతుల్లో 59 బ్యాటింగ్; 7 ఫోర్లు), ధోని (51 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. మొత్తంగా టీమిండియాకు 145 పరుగుల ఆధిక్యం లభించింది. సెషన్-1: భువీ హవా ఓవర్నైట్ స్కోరు 219/6తో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ప్లంకెట్, ప్రయర్లు జాగ్రత్తగా ఆడారు. ఏడో వికెట్కు 51 పరుగులు జోడించాక ప్రయర్ (42 బంతుల్లో 23; 4 ఫోర్లు)ను అవుట్ చేసి షమీ... భారత్కు బ్రేక్నిచ్చాడు. ఆ వెంటనే భువనేశ్వర్ మరోసారి చెలరేగుతూ ఒకే ఓవర్లో స్టోక్స్, బ్రాడ్లను అవుట్ చేశాడు. దీంతో 15 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ప్లంకెట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి వికెట్గా జడేజా బౌలింగ్లో అండర్సన్ (21 బంతుల్లో 19; 3 ఫోర్లు) అవుటయ్యాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 4 ఓవర్లు ఆడి 11/0తో లంచ్కు వెళ్లింది. ఓవర్లు: 23.5; పరుగులు: 111; వికెట్లు: 4 (భారత్: ఓవర్లు: 4; పరుగులు: 11; వికెట్లు: 0) సెషన్-2: విజయ్ నిలకడ లంచ్ విరామం తర్వాత భారత ఇన్నింగ్స్ను కొనసాగించిన ధావన్, విజయ్లు క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. నాలుగు ఫోర్లతో ధావన్ దూకుడు ప్రదర్శించినా... స్టోక్స్ వేసిన బంతిని పాయింట్లో రూట్కు క్యాచ్ ఇచ్చి మరోసారి శుభారంభాన్ని ధావన్ (45 బంతుల్లో 31; 4 ఫోర్లు) వృథా చేసుకున్నాడు. దీంతో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్లు: 27; పరుగులు: 73; వికెట్లు: 1 సెషన్-3: చెలరేగిన ప్లంకెట్ టీ విరామం తర్వాత భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. రెండో వికెట్కు 35 పరుగులతో విజయ్-పుజారా జోడి సాఫీగా సాగుతున్న తరుణంలో ప్లంకెట్ అనూహ్యంగా దెబ్బతీశాడు. 44వ ఓవర్లో వరుస బంతుల్లో పుజారా (83 బంతుల్లో 43; 7 ఫోర్లు), విరాట్ కోహ్లి (0)లను అవుట్ చేశాడు. ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని తన స్వభావానికి విరుద్ధంగా ఆడిన పుజారా... కీపర్ ప్రయర్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కోహ్లి... ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డయ్యాడు. తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని అంచనా వేయడంలో విఫలమై కోహ్లి బ్యాట్ను పెకైత్తాడు. బంతి బెయిల్స్ను తాకుతూ వెళ్లింది. ఇక ప్లంకెట్కు రహానే హ్యాట్రిక్ను నిరాకరించినా... కొద్దిసేపటికే అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. దీంతో 123 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని... విజయ్కి అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ల ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో విజయ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఐదో వికెట్కు వీరిద్దరు అజేయంగా 46 పరుగులు జోడించారు. ఓవర్లు: 32; పరుగులు: 85; వికెట్లు: 3 స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 59; ధావన్ (సి) రూట్ (బి) స్టోక్స్ 31; పుజారా (సి) ప్రయర్ (బి) ప్లంకెట్ 43; కోహ్లి (బి) ప్లంకెట్ 0; రహానే (సి) ప్రయర్ (బి) బ్రాడ్ 5; ధోని బ్యాటింగ్ 12; ఎక్స్ట్రాలు 19; మొత్తం (63 ఓవర్లలో 4 వికెట్లకు) 169 వికెట్ల పతనం: 1-40, 2-118, 3-118, 4-123. బౌలింగ్: అండర్సన్ 18-7-36-0; బ్రాడ్ 14-5-41-1; స్టోక్స్ 13-2-35-1; ప్లంకెట్ 12-5-24-2; అలీ 6-1-14-0. రహానే... బ్యాడ్లక్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి ఫామ్లో ఉన్న రహానేను రెండో ఇన్నింగ్స్లో అంపైర్ తప్పుడు నిర్ణయం బలి తీసుకుంది. బ్రాడ్ వేసిన షార్ట్ పిచ్ బంతి రహానే ఆర్మ్గార్డ్ను తాకుతూ వెళ్లి కీపర్ చేతిలో పడింది. కానీ, ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీలు చేయగానే... బంతి గ్లవ్స్ను తాకినట్లుగా భావించిన అంపైర్ ఆక్సెన్ఫోర్డ్ వేలిని పెకైత్తాడు. రహానే అసంతృప్తితో క్రీజును వీడాడు. -
సెకండ్ ఇన్నింగ్స్లో జోరు పెంచిన నయన్
-
దేవుడు నాకు అన్నీ ఆలస్యంగానే ఇస్తాడు...
తెలుగింటి మధ్యతరగతి ఇల్లాలంటే ఎలా ఉంటుంది? కొంచెం కారంగా... ఇంకొంచెం గారంగా... మరికొంచెం మమకారంగా... కాస్తంత వెటకారంగా... అసలు ఇదంతా ఎందుకు? అచ్చం ఆమనిలా ఉంటుందంటే సరిపోతుందిగా. నిజమే... ఆమె చేసిన పాత్రలన్నీ అలాంటివే. శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం, ఆ నలుగురు... కన్నడ అమ్మాయి అయిన ఆమని ఇలాంటి సినిమాలతో తెలుగింటి పిల్ల అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై అప్పుడప్పుడూ తళుక్కుమంటోన్న ఆమని గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చదివితే కొంతలో కొంతైనా ఆ లోటు తీరుతుంది. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది? తృప్తికరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలకు అవకాశం వస్తోంది. ‘ఆ నలుగురు’ తర్వాత ‘దేవస్థానం’కి దాదాపు ఎనిమిదేళ్లు విరామం తీసుకున్నారు. మళ్లీ రెండేళ్లకు ‘చందమామ కథలు’ చేశారు. ఎందుకీ గ్యాప్? ‘ఆ నలుగురు’ తర్వాత నాకు మంచి పాత్రలు రాలేదు. వచ్చినవి కూడా నా వయసుకు మించిన పాత్రలు కావడంతో నేనే ఆసక్తి కనబరచలేదు. నాలుగు పదుల వయసులో ఉన్నా మరీ ముసలి వయసు పాత్రలు చేయడం సరిగ్గా అనిపించలేదు. అందుకే తిరస్కరించా. ఒకవేళ నేను వృద్ధ పాత్ర చేసినా, సినిమాలో దానికో అర్థం ఉండాలి. అలాంటివైతే తప్పకుండా చేస్తా. రానున్న మీ ‘చందమామ కథలు’లో మీకు నచ్చిన అంశాలేంటి? నా కెరీర్లో ఇప్పటివరకు నేనిలాంటి సినిమా చేయలేదు. ఒక సినిమాలో ఎనిమిది కథలు అనగానే, భలే అనిపించింది. అన్ని కథలూ బాగుంటాయి. పెద్ద నరేష్ గారిది, నాదీ ఒక కథ. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందనీ, ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలనీ మా కథ చెబుతుంది. తెలుగులో నా తొలి హీరో నరేష్. ‘జంబలకిడి పంబ’ తర్వాత ఇద్దరం కొన్ని సినిమాలు చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. కథానాయికగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అది తొందరపాటని ఎప్పుడైనా అనిపించిందా? లేదు. అప్పటికే చాలా సినిమాలు చేసేశాను. ఇక, జీవితంలో స్థిరపడితే బాగుంటుందనే ఆలోచన బలంగా ఉండటంతో పెళ్లి చేసుకున్నాను. ‘ఇన్నేళ్లూ తీరిక లేకుండా సినిమాలు చేశావ్ కదా.. ఇక విశ్రాంతి తీసుకో’ అని మావారు అనడంతో, సినిమాలు చేయలేదు. మీది ప్రేమ వివాహం... పైగా మతాంతర వివాహం కాబట్టి, అత్తగారింట్లో సర్దుకుపోవడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నాకు కుల, మతాల పట్టింపు లేదు. కానీ, అత్తగారింటి వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పట్టింది. ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇది సహజమే కదా. అయితే, మా ఇల్లు సర్వమత సమ్మేళనం అనొచ్చు. అన్ని దేవుళ్లూ ఒకటే అని మా భావన. దేవాలయాలతో పాటు దర్గాలకూ, చర్చిలకూ వెళతాను. మావారు కూడా నాలానే! గతంలో ఆయన సినిమాలు నిర్మించేవారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని అనిపించడానికి కారణం? కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి తీరిక లేనంతగా పని చేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీగా ఉంటే, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బోర్ కొట్టడం, బాధ కలగడం రెండూ జరుగుతాయి. అలాంటి పరిస్థితిలోనే నేను మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్నాను. సినీ ప్రపంచంలోని జోష్కి దూరం కావాలని దాదాపు ఎవరూ అనుకోరు. మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని మావారితో అనగానే ‘ఓకే’ అన్నారు. మీ వైవాహిక జీవితంలో ఏవో ఆటుపోట్లు ఎదురయ్యాయని వార్త వచ్చిందే! నా వైవాహిక జీవితం బాగుంది. నాకూ, మావారికీ మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. హైదరాబాద్కు మారిపోవచ్చు కదా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. మావారు స్థిరపడింది చెన్నై అని తెలిసిందే. మా అత్తగారింటిని వదులుకుని నేను హైదరాబాద్కు రాలేను. కానీ, నా కారణంగా షూటింగ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అందుకే, హైదరాబాద్కు మారకపోయినా ఫరవాలేదు. ఒకవేళ నా వైవాహిక జీవితం గనక సరిగ్గా లేకపోతే, నేను హైదరాబాద్కు షిప్ట్ అయిపోయి ఉండేదాన్ని కదా! సినిమాలపరంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న మీరు ఆ మధ్య వివాదాల్లో నిలిచారు. మీరు తనను హింసించారంటూ మీ మరదలు పేర్కొన్నారు కదా? డబ్బులు ఆశించి ఆడిన డ్రామా అది. నా సోదరుడు, అతని భార్య విడిపోవాలనుకున్నారు. కానీ, నన్ను కూడా వివాదంలోకి లాగితే డబ్బులు తీసుకోవచ్చు కదా! వాళ్లు అనుకున్నది సాధించారు. అది సాధించే క్రమంలో లేనిపోని దుష్ర్పచారంతో నన్ను చెడ్డదాన్ని చేశారు. నేనేంటో, నా స్వభావం ఎలాంటిదో సినిమా పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు. షూటింగ్ లొకేషన్లో ఎంత క్రమశిక్షణగా ఉంటానో, అందరినీ ఎలా గౌరవిస్తానో కూడా తెలుసు. నేను వరకట్నం కోసం వేధించానని నిందించారు. కథానాయికగా ఓ ఏడెనిమిదేళ్లు విరామం లేకుండా సినిమాలు చేసి, చాలా డబ్బు సంపాదించుకున్నాను. ఇక, నాకు వేరేవాళ్ల డబ్బు ఎందుకు? ఒక్కసారిగా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధపడ్డా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడేది. నిజానికి తాను నన్ను నిందించలేదనీ, అదంతా మీడియా వాళ్ల సృష్టే అనీ ఆ తరువాత ఓ సందర్భంలో పేర్కొంది. కానీ, పనిగట్టుకుని అలా చేయాల్సిన అవసరం మీడియాకు ఎందుకుంటుంది? నన్ను బజారుకీడ్చడానికి ప్రయత్నం చేయలేదంటూ ఆమె నన్ను నమ్మించే ప్రయత్నం చేసింది. నేనేమీ అనలేదు. అంతా ఆ పైవాడు చూసుకుంటాడని వదిలేశాను. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా మా మధ్య గొడవలేం లేవు. తను, నా సోదరుడు నాతో బాగానే ఉంటున్నారు. వాళ్ల పిల్లలను నా సొంత పిల్లల్లా చూసుకుంటాను. మరి.. మీ పిల్లల గురించి..? ఇంకా లేరు. ఆ దేవుడు నాకన్నీ ఆలస్యంగానే ఇస్తాడు. ఇది కూడా అంతే అనుకుంటున్నాను. కానీ, ఆలస్యంగా ఇచ్చినవన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. కాబట్టి, ఈ ఆనందాన్ని కూడా చవి చూస్తాననే నమ్మకం ఉంది. అన్నీ ఆలస్యంగా అంటే.. సినిమాల్లో అవకాశాలకి చాలా కష్టాలు పడ్డారా? కొంతమంది నాయికల్లా సులువుగా హీరోయిన్ను అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డా. అవకాశాలు తెచ్చుకోవడానికి సమయం పట్టింది. అందుకే నాకు ఆ విలువ తెలుసు. సినిమా మీద ప్రేమే కాదు భక్తి కూడా ఉంది నాకు. హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? మా నాన్నగారు చలనచిత్రాల పంపిణీదారుడిగా చేసేవారు. కానీ, నేను పెరిగి పెద్దయ్యేసరికే విరమించుకున్నారు. దాంతో సినిమా రంగంలో ఉన్నవాళ్లతో టచ్లో లేరు. నాకేమో చిన్నప్పటి నుంచీ హీరోయిన్ కావాలని ఉండేది. కానీ, హీరోయిన్గా అంటే నాన్న ఒప్పుకోలేదు. అమ్మ ప్రోత్సహించడంతో చెన్నైలో ఉన్న మా బంధువు ఇంటికెళ్లాను. ఆయన కూడా సినిమా రంగానికి చెందినవారే. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి. చివరికి ‘పుదియ కాట్రు’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసినా, తెలుగులో వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇక్కడ ‘మిస్టర్ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’, ‘శుభలగ్నం’... ఇలా మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చింది. మాతృభాష కన్నడంలో కన్నా తెలుగులో పేరు రావడం పట్ల మీ ఫీలింగ్? ఇక్కడ గొప్ప గొప్ప పాత్రలు చేశాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘శుభలగ్నం ఆమని’ అంటున్నారు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిలా ప్రేక్షక జనం భావిస్తున్నారు. ఏ నటికైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. ఇంతకీ మీ అసలు పేరు? వెండితెరపై మిమ్మల్ని ‘ఆమని’ని చేసిందెవరు? నా అసలు పేరు మంజుల. దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ గారే నా పేరును ‘ఆమని’ అని మార్చారు. ‘నీ పేరు మార్చేశాం’ అని ఒకరోజు ఆయన చెబితేనే తెలిసింది... ‘ఆమని’ అని పెట్టారని. సినిమా రంగంలో మీకు అత్యంత సన్నిహిత మిత్రులెవరు? సౌందర్య, నేను ప్రాణ స్నేహితురాళ్లలా ఉండేవాళ్లం. ఇద్దరం బెంగళూరు వాళ్లమే. మా మధ్య స్నేహం పెరగడానికి అదో కారణం కావచ్చు. ఎందుకంటే, ఎప్పుడైనా షూటింగ్స్లో విరామం దొరికి, బెంగళూరులో ఉన్నామనుకోండి... తప్పకుండా కలిసేవాళ్లం. సౌందర్య వాళ్ల అమ్మ నన్ను కూడా ఓ కూతురు అనుకుంటారు. నేను, సౌందర్య వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేంత ఆప్తమిత్రులం. ఆమె మరణం నిజం కాకపోయి ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఆ మధ్య ఓ టీవీ షో చేశారు. మళ్లీ అలాంటి ఆలోచన ఉందా? అది సరదాగా చేశాను. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి, టీవీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఇప్పుడూ అంతే. కాకపోతే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. - డి.జి. భవాని -
ఇష్టమైనవి దూరం
క్రేజీ భామ నయనతారకు ఇష్టమయినవి ఒక్కొక్కటి దూరం అవుతున్నాయి. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్లోను సక్సెస్ పరంపర కొనసాగిస్తున్నారు. అయితే వ్యక్తి గత జీవితంలో మాత్రం కోరుకున్నవి చాలా కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రేమలో ఇప్పటికీ రెండు సార్లు ఘోరంగా ఓడిపోయారు. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ చివరి దశకు చేరి ఊహించని విధంగా విఫలం అయ్యింది. దీంతో ఇక ప్రేమ జోలికి పోరాదని ధృడ నిర్ణయం తీసుకున్న నయనతార నటనపైన పూర్తిగా దృష్టి సారించారు. ఈ సారి మరో ఇష్టమయిన దానికి ఆమె దూరం కావలసిన పరిస్థితి. ఇది వ్యక్తిగత అంశమే. నయనతారకు రొయ్యలు, చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ప్రతి రోజు ఆమె ఆహారంలో ఈ వంటకాలు భాగం కావలసిందే. అవుట్ డోర్ షూటింగ్లకు వెళ్లినా ఆమె ఇష్టమెరిగిన ప్రొడక్షన్ బాయ్స్ రొయ్యలు, చేపల పులుసు కోసం నానాతంటాలు పడయినా ఏర్పాటు చేస్తుంటారు. నయన అంత ఇష్టంగా భుజించే సీఫుడ్స్కు దూరం కావలసిన పరిస్థితి ఎదరయ్యింది. దీనికి కారణం ఆమె నాజూకయిన మేనులో తేడా రావడమే. స్కిన్ సమస్యకు గురయిన నయనతార పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించగా వారు పేల్చిన బాంబు సీ ఫుడ్స్కు దూరం కావాలన్నది. ఎంత ఇష్టమయిన రొయ్యలు, చేపల పులుసు కూడా దూరం కావలసి రావడంతో నయన చింత అంతా ఇంతా కాదట. కోట్లున్నా కోరుకున్నది తినలేని పరిస్థితి అంటే ఇదేనేమో. -
మంచు ముంచకుండా...
బంగ్లా ప్రపంచకప్లో మంచు ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. రాత్రి మ్యాచుల్లో టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ బౌలింగ్కు మొగ్గు చూపడం తప్పనిసరిగా మారిపోయింది. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ సమయంలో బంతిపై బౌలర్లకు ఏ మాత్రం పట్టు చిక్కడం లేదు. ఆటగాళ్లు పదే పదే కర్చీఫ్తో బంతిని తుడుస్తూ తిప్పలు పడుతున్నారు. దాంతో మంచు మ్యాచ్ ఫలితాన్నీ మార్చేస్తోంది. మరి దీనిని ఎదుర్కోవడం ఎలా? అసలే పేలవ బౌలింగ్ వనరులు ఉన్న ఇంగ్లండ్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించింది. కివీస్తో మ్యాచ్కు ముందు రోజు ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్ పక్కన ఒక పెద్ద బకెట్ నిండా నీళ్లు తెచ్చి పెట్టారు. అందుబాటులో ఉన్న బంతులన్నీ అందులో వేసేశారు. అంతే...నెట్స్లో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా నేరుగా అక్కడినుంచే బంతిని అందుకోవాలి. తుడిచే ప్రయత్నం చేయకుండా అలాగే తడిగా ఉన్న బంతితోనే బౌలింగ్ చేయాలి. ఈ తరహా ప్రాక్టీస్తో మ్యాచ్లో బంతి తడిగా మారినా పట్టు దొరుకుతుందని వారి ప్రయత్నం. అయితే శనివారం కివీస్తో మ్యాచ్లో తర్వాత బౌలింగ్ చేయాల్సి వచ్చినా మంచు సమస్య రాకుండానే మ్యాచ్ ముగిసిపోయింది! -
నా రెండో ఇన్నింగ్స్ మొదలైంది!
క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్య కాన్పూర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తన రెండో ఇన్నింగ్స్ ఆరంభమైందని చెప్పాడు. విజయవంతమైన రాజకీయవేత్తగా తాను ఎదుగుతానని అతను అన్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కైఫ్, ఉత్తరప్రదేశ్లోని ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నాడు. ‘ఇక్కడి అలహాబాద్లోనే నేను పుట్టి పెరిగాను. గల్లీల్లో క్రికెట్ ఆడాను. నేను భారత్కు ఆడినప్పుడు ఇక్కడివారంతా ఎంతో సంతోషించారు. ఎన్నికల్లోనూ వారు నాకు మద్దతుగా నిలుస్తారని నమ్ముతున్నాను’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్లో తాను మంచి ఫామ్లో ఉన్నానని, క్రికెట్కు గుడ్బై చెప్పే విషయంపై ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. రాజకీయాలు చెడ్డవి కావని అభిప్రాయపడిన కైఫ్ 13 టెస్టుల్లో, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 33 ఏళ్ల కైఫ్ ఆఖరిసారిగా 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. -
ఐష్ సెకండ్ ఇన్నింగ్స్ డౌటే ?
-
గె(ని)లుస్తారా!
ఇక బ్యాట్స్మెన్దే భారం భారత్ లక్ష్యం 407 ప్రస్తుతం 87/1 రెండో ఇన్నింగ్స్లో కివీస్ 105 ఆలౌట్ తొలి టెస్టులో ఒక్కసారిగా చెలరేగిన బౌలర్లు భారత్ను మ్యాచ్లో నిలబెట్టారు. అయితే కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను బ్యాట్స్మెన్కు వదిలేశారు. దీంతో రసవత్తరంగా సాగుతున్న టెస్టులో కుర్రాళ్లు గె(ని)లుస్తారా! అన్నది ఆసక్తికరంగా మారింది. ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తొలిసారి తమ పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించారు. ఇన్నింగ్స్ బ్రేక్లో ధోని ఏం చెప్పాడోగానీ అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో కివీస్ బ్యాట్స్మెన్ను వణికించారు. 105 పరుగులకు ఆలౌట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పి బ్యాట్స్మెన్పై భారం వేశారు. దీంతో ఈడెన్పార్క్లో జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. విజయ్ (13) విఫలమైనా.... శిఖర్ ధావన్ (70 బంతుల్లో 49 బ్యాటింగ్; 5 ఫోర్లు), పుజారా (61 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్సర్) నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు 130/4 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 60 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్కు 301 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (120 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (44 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. రాస్ టేలర్ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఊ 72 పరుగులకు 6 వికెట్లు షెడ్యూల్ కంటే మ్యాచ్ అరగంట ముందుగా ప్రారంభం కావడంతో పిచ్పై ఉండే తేమను కివీస్ బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న రహానే (26), రోహిత్లను ఆరు బంతుల వ్యవధిలో అవుట్ చేశారు. సౌతీ బంతిని ఆడబోయి తొలి స్లిప్లో రహానే క్యాచ్ ఇవ్వగా, రోహిత్ ఓ పేలవమైన షాట్కు వెనుదిరిగాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోని (10) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే రెండో ఎండ్లో జడేజా మాత్రం మొండిగా పోరాడుతూ... జహీర్ (14)తో కలిసి ఫాలో ఆన్ మార్క్ను దాటించాడు. చివర్లో ఇషాంత్ (0), షమీ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓవరాల్గా భారత్ 72 పరుగులకు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు. ఊ స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ (బి) బౌల్ట్ 72; రహానే (సి) టేలర్ (బి) సౌతీ 26; ధోని (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 10; జడేజా నాటౌట్ 30; జహీర్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 14; ఇషాంత్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 0; షమీ (సి) ఫుల్టన్ (బి) వాగ్నేర్ 2; ఎక్స్ట్రాలు: 17; మొత్తం: (60 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1-1; 2-3; 3-10; 4-51; 5-138; 6-138; 7-167; 8-188; 9-189; 10-202 బౌలింగ్: బౌల్ట్ 17-2-38-3; సౌతీ 19-6-38-3; అండర్సన్ 5-0-29-0; వాగ్నేర్ 11-0-64-4; సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (సి) జడేజా (బి) షమీ 5; రూథర్ఫోర్డ్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) జహీర్ 3; టేలర్ (సి) రహానే (బి) జహీర్ 41; బి.మెకల్లమ్ రనౌట్ 1; అండర్సన్ (బి) షమీ 2; వాట్లింగ్ (బి) ఇషాంత్ 11; సౌతీ (సి) పుజారా (బి) జడేజా 14; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; వాగ్నేర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 14; బౌల్ట్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1-1; 2-9; 3-11; 4-15; 5-25; 6-63; 7-78; 8-78; 9-80; 10-105 బౌలింగ్: షమీ 12-1-37-3; జహీర్ 9-2-23-2; ఇషాంత్ 10.2-3-28-3; జడేజా 9-4-10-1; రోహిత్ 1-0-3-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ బ్యాటింగ్ 49; పుజారా బ్యాటింగ్ 22; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 87. వికెట్ల పతనం: 1-36; బౌలింగ్: బౌల్ట్ 6-0-28-0; సౌతీ 5-0-18-1; వాగ్నేర్ 6-2-11-0; అండర్సన్ 3-0-8-0; సోధి 4-1-17-0; విలియమ్సన్ 1-0-5-0. ఊ కుప్పకూలిన కివీస్ తన తొలి రెండు ఓవర్లలో రూథర్ఫోర్డ్ (0), ఫుల్టన్ (5)లను అవుట్ చేసిన షమీ కివీస్కు షాకిచ్చాడు. అయితే టేలర్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా... రెండో ఎండ్లో విలియమ్సన్ను జహీర్ కట్టడి చేశాడు. లంచ్కు ముందు జడేజా అద్భుతమైన త్రోకు మెకల్లమ్ రనౌట్ అయ్యాడు. లంచ్ తర్వాత షమీ... అండర్సన్ (2)ను వెనక్కిపంపాడు. దీంతో 25 పరుగులకే సగం జట్టు పెవిలియన్కు చేరడంతో టేలర్పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో సౌతీ (14), వాగ్నేర్ (14) కాపాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తలవంచారు. -
సెకండ్ ఇంనింగ్స్ను ఇరగదీసింది
-
13 ఏళ్ల తర్వాత..!
1990ల్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన హీరోల్లో అరవింద్స్వామి ఒకరు. ఆరడగులుంటారో లేదో తెలియదు కానీ.. ఈ అందగాడితో ఏడడుగులు వెయ్యాలని చాలామంది అమ్మాయిలు కలలు కన్నారు. అప్పట్లో ఆయన పాపులార్టీ అలా ఉండేది మరి. ఈ హ్యాండ్సమ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా, బోల్డంత క్రేజ్ సంపాదించుకున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, వ్యాపారంలో నిమగ్నమయ్యారు అరవింద్స్వామి. ‘కడలి’ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించారారు. ఇప్పుడాయన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నారు. మరాఠీ చిత్రం ‘కక్స్పర్ష్’ చిత్రానికి రీమేక్ ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ మంజ్రేకరే ఈ హిందీ రీమేక్కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా ఉత్తరాది తెరపై కనిపించబోతున్నానని అరవింద్స్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించబోతున్నారట. 2015లో ఈ చిత్రాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. -
గెలుపుబాటలో పాక్
అబుదాబి: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు గెలుపు బాటలో పయనిస్తోంది. సఫారీ బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లోనూ చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. డివిలియర్స్ (11), స్టెయిన్ (0) క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లు ఇర్ఫాన్, జునైద్, అజ్మల్, జుల్ఫీకర్ తలా ఓ వికెట్ తీశారు. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే సఫారీ జట్టు ఇంకా 121 పరుగులు చేయాలి. అంతకుముందు 263/3 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 138.4 ఓవర్లలో 442 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ మన్జూర్ (266 బంతుల్లో 146, 15 ఫోర్లు) కాసేపటికే నిష్ర్కమించగా, కెప్టెన్ మిస్బావుల్ హక్ (187 బంతుల్లో 100, 8 ఫోర్లు) సెంచరీ సాధించాడు. 39 ఏళ్ల మిస్బా పాకిస్థాన్ తరఫున సెంచరీ చేసిన పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. -
సెకండ్ ఇన్నింగ్స్
-
సెకండ్ ఇన్నింగ్స్
-
సెకండ్ ఇంనిగ్స్