హాంకాంగ్ ఓపెన్లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సైనా 8-21, 21-18, 19-21 స్కోరుతో చైనా ప్లేయర్ యి చెంగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్లో ఓడిపోయిన హైదరాబాదీ రెండో గేమ్ను గెలిచినా.. నిర్ణాయక మూడో గేమ్తో పాటు మ్యాచ్ను కోల్పోయింది.