‘గాయత్రి’ పైరసీపై మోహన్‌ బాబు ఆగ్రహం | actor Mohan babu reaction for gayatri movie piracy | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 16 2018 8:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement