Manchu mohan babu
-
సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట
జర్నలిస్ట్పై దాడి కేసులో టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్బాబుకు సుప్రీం కోర్టు(preme Court)లో భారీ ఊరట లభించింది.ఈ కేసులో మోహన్బాబు(Mohan Babu)కి ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. గురువారం ఉదయం ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సుదాంత్ దులియా ధర్మాసనం.. మోహన్బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది?మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్ను సీఎం భూపేంద్ర పటేల్కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్బాబు, శరత్కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
అడవిలో జంతువుల వేట.. వివాదంలో 'మోహన్ బాబు' సిబ్బంది
సినీ నటుడు మంచు మోహన్ బాబు సిబ్బంది నిర్వాకం వల్ల ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్పల్లిలో మోహన్ బాబు నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన సిబ్బంది అడవి పందులను వేటాడారు. తన కుమారుడు మనోజ్ హెచ్చరించినా వారు మాట వినలేదని తెలుస్తోంది.అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మనోజ్ అన్నాడు. ఆయనతో పాటు ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ కూడా ఉన్నాడని తెలిపాడు. వారిద్దరి చర్యలను తప్పుపడుతూ మంచి మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పారట. అడవి పందులను వేటాడొద్దని వారిద్దరినీ హెచ్చరించినప్పటికీ మాట వినలేదని మనోజ్ తెలుపుతున్నాడు. అయితే, ఆ సమయంలో మోహన్ బాబు అక్కడ లేరని తెలుస్తోంది.మంచు ఫ్యామిలీలో గొడవల వల్ల జల్పల్లి నివాసం గురించి తెరపైకి వచ్చింది. అక్కడ జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్బాబు మీద కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్బాబు అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. -
మోహన్బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మోహన్ బాబు 24వరకు టైమ్ అడిగారు: రాచకొండ సీపీ
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలో తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిని మోహన్బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్ 24 వరకు టైమ్ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.లైసెన్స్డ్ గన్స్ సరెండర్ చేసిన మోహన్ బాబుమోహన్బాబు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్తో పాటు స్పానిష్ మెడ్ గన్ ఉంది. -
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
మంచు ఫ్యామిలీలో ‘పంచదార’ గొడవ
ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్బాబు నివాసంలో మనోజ్, విష్ణుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తన తల్లి పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చి ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జర్నలిస్ట్పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్పై దాడి.. రంజిత్కు మోహన్బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
మా నాన్న దేవుడు: మంచు మనోజ్
సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)కాగా, సీనియర్ నటుడు మోహన్బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. -
‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి
మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. (చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)‘మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ వ్యవహార శైలీ మోహన్ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు. కొనసాగుతున్న సస్పెన్స్మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్ బాబుపై ఇటు మనోజ్పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్తో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్హౌస్ ‘మంచు టౌన్’కి మనోజ్తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. -
చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్పోర్ట్కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు కొడుకు మనోజ్పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.తండ్రి ఫిర్యాదుపై మనోజ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టారు. -
మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్ ఇదే..
సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్బాబు కోరారు. దీంతో పోలీసులు మనోజ్పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆపై క్రైం నెంబర్ 644/2024 పహడి షరీఫ్ పోలీసులు కేటాయించారు. తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా మంచు మనోజ్ సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేశారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను.నా సోదరుడు దుబాయ్కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. ఫిర్యాదులో నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ను ధృవీకరించాల్సిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను.ఈ గొడవలోకి నా 7నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి..?కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం.ఇంట్లో పనిచేసే మహిళాలపై మా నాన్న చాలా ఎక్కువగానే తిడుతూ ఉంటారు. దీంతో వారు భయపడిపోవడమే కాకుండా తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు కూడా.. ఇంట్లో మా నాన్న అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో జీవిస్తారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాం.విష్ణుకు సహచరులు విజయ్రెడ్డి, కిరణ్లు సీసీటీవీ డ్రైవ్లను ఎందుకు తొలగించారు..? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు..? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు… ఇప్పటికీ నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. నా జీవితం, నా స్వంత యోగ్యతతో కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటుంన్నందుకు నేను గర్వపడుతున్నాను.విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటంతోనే ఈ ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను.నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. నేను పైన చెప్పిన వాటి విషయంలో అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024 -
పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిదగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తనపై జరిగిన దాడిపై పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. కాగా.. అంతకుముందు ఆదివారం మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తన కాలికి గాయం కావడంతో భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. చికిత్స అనంతరం ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిన ఘటనపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు. తన తండ్రి మోహన్ బాబు పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించలేదు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు.కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు..పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డిఅయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ గురువారెడ్డి వెల్లడించారు. డయల్ 100కు కాల్ రావడంతో తాము ఘటనాస్థలికి వెళ్లామని పహాడీ షరీఫ్ సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని.. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. -
‘మంచు’ కుటుంబంలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు ఇంట్లో ఆదివారం హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు మనోజ్పై మోహన్బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఉదయం డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని చెప్పడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ నడలేని పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది.మనోజ్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, మెడికో లీగల్ కేసుగా పరిగణిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం ఈ అంశంపై తమకు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని మాత్రం చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హోరెత్తిన సోషల్ మీడియా 5పహడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని జల్పల్లిలో ఉన్న ఇంట్లో తనతో పాటు తన భార్యపై దాడి జరిగిందంటూ మనోజ్ పంపినట్లుగా ఉన్న ఓ సందేశం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జల్పల్లిలోని ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మోహన్బాబు, మనోజ్ తదితరులు ఇది తమ ఇంటి విషయమని, కుటుంబ వివాదమని చెప్పారని, దాంతో వెనుతిరిగినట్లు సమాచారం.కొద్దిసేపటికే మోహన్బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఒక ప్రకటన బయటకు వచి్చంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటిది ఏం జరగలేదని మంచు కుటుంబం పేరుతో మరో ప్రకటన వచి్చంది. దీంతో మనోజ్పై దాడి ఊహాజనితం అయి ఉండచ్చని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే మనోజ్ తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. కాలికి, మెడపై స్వల్ప గాయాలు భార్య, సహాయకుడి సహకారంతో మనోజ్ కుంటుతూ లోనికి వెళ్లడంతో ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమయ్యింది. భూమా మౌనిక మాత్రం సాధారణంగానే కనిపించారు. మనోజ్ కాలికి గాయమైందని, మెడపై కూడా స్పల్ప గాయాలున్నట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి కొందరు సినీ, రాజకీయ పెద్దలు మంచు కుటుంబ సమస్యల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలన్నింటిపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. -
మోహన్బాబు@50
నటుడు–నిర్మాత మంచు మోహన్బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్బాబు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. -
అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు
‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్ యాక్షన్ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్బాబు, విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
మోహన్ బాబు విద్యాసంస్థలపై ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలపై ఫిర్యాదు అందింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబుకు విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారత సాంకేతిక విద్యామం డలి (ఏఐసిటిఈ)కి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది.మోహన్ బాబు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేరెంట్స్ కమిటీ పేర్కొంది. విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం మెస్లోనే చేయాలని రూల్ పెట్టడం ఏంటి అని తల్లిదండ్రుల కమిటీ ప్రశ్నిస్తుంది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని ఏఐసిటిఈకి ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. నాణ్యతలేని చదువులు బోధిస్తున్నారని వారు తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. -
కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్లో వారి లుక్ ఫెరోషియస్గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప" అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్ను డిసెంబర్లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మోహన్బాబు చేతిలో రాజదండం.. ఫోటో వైరల్
భక్తవత్సలం నాయుడు అనగానే కొద్దిమందికే తెలుసు. అదే మోహన్బాబు అనగానే వెంటనే కలెక్షన్ల కింగ్ అనేస్తారు. అలా ఆయన పేరు ప్రేక్షకుల మదిలో సుస్థిరంగా నిలబడిపోయింది. నటుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలు ఆయన చేశారు. నటనలో రాణించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెహన్బాబు ఎన్నో అవరోధాలను అధిగమించి ఎనలేని కీర్తిని గడించారు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటో నెట్టంట ట్రెండ్ అవుతుంది.సుమారు 50 ఎళ్లకు పైగా మోహన్బాబు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రాజదండం చేత పట్టుకుని ఉన్న తన ఫోటోను మోహన్బాబు అభిమానులతో పంచుకున్నారు. 'ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తాను.' అని తన ఎక్స్ పేజీలో ఆయన పేర్కొన్నారు.1980 దశకంలో మోహన్బాబు సినిమా విడుదలైంది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్లు నమోదు కావాల్సిందే. అలా ఆయన నుంచి వచ్చిన సినిమాలు నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఆయన నటుడే కాదు మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా అలా తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై 90కి పైగా చిత్రాలు నిర్మించారు. ఇప్పడు కన్నప్ప చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్తో మోహన్బాబు నిర్మిస్తున్నారు. మోహన్బాబుకు విద్యారంగం అంటే గౌరవం. అందుకే ఆయన 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక స్కూల్స్, కాలేజీలు స్థాపించారు. ఈ క్రమంలో మోహన్బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో 2007లో సత్కరించింది. ఇప్పుడు ఆయన చేతికి అందిన రాజదండం ప్రత్యేకత ఏంటో అనేది త్వరలో మోహన్బాబు వెళ్లడించనున్నారు.ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజ దండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. pic.twitter.com/bRTK1j7m9X— Mohan Babu M (@themohanbabu) July 11, 2024 -
రాజకీయాలపై 'మంచు మోహన్బాబు' సంచలన లేఖ
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ విలక్షణ నటులు, నిర్మాత మంచు మోహన్బాబు ఒక లేఖ విడుదల చేశారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన ఇలా విజ్ఞప్తి చేశారు. 'ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నాను.శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.' అని మంచు మోహన్ బాబు ఒక లేఖను తన ఎక్స్పేజీలో విడుదల చేశారు. విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5 — Mohan Babu M (@themohanbabu) February 26, 2024 -
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఇంద్ర భవనమే.. ఎలా ఉందో చూశారా?
యాంకర్, నటి మంచు లక్ష్మి కొన్ని నెలల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా యూనిక్గా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్లోని తన ఇంటితో పాటు మోహన్బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది. ఎక్కడున్నా ఎవరికైనా ఇల్లే స్వర్గం.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ఫైనల్గా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఉద్దేశించి దీనిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. కానీ అక్కడ వస్తువులన్నీ చాలావరకు హైదరాబాద్లోని తన ఇంటి నుంచి తెచ్చుకున్నవే అని ఆమె తెలిపింది. ఎంతో అద్భుతంగా ఉన్న మంచు లక్ష్మీ ఇంటిని మీరూ చూసేయండి. ముంబైకి షిఫ్ట్ అయ్యాక లక్ష్మి ఏం చెప్పింది అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. అని గతంలో తెలిపింది. -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్బాబు,శరత్కుమార్లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్లో 'మహాభారతం' సిరీస్ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్బాబు, శరత్కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మంచు విష్ణుకు గాయాలు.. అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డట్లు ప్రచారం జరిగింది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ క్యాన్సిల్ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్ బాబు.. మంచు విష్ణు హెల్త్ అప్డేట్ గురించి ట్వీట్ చేశాడు. 'కన్నప్ప షూటింగ్లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటాడు' అని ట్వీట్ చేశాడు. ఇకపోతే బుల్లితెరపై మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు. Grateful for all the love, wishes, and concern during @iVishnuManchu accident on the set of #Kannappa in New Zealand. By God's grace, he's on the road to recovery and will be back to shooting soon. Thank you for your support. 🙏 Har Har Mahadev! — Mohan Babu M (@themohanbabu) November 1, 2023 చదవండి: ఎనిమిది నెలల గర్భిణి.. బిడ్డను చూడకుండానే కన్నుమూసిన నటి -
ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, అవకాశాల కోసమే!
యాంకర్, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. అయితే టాలీవుడ్లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్ అయినట్లు పేర్కొంది. ఆఫీసుకు రమ్మన్నా వస్తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. నాన్న అలాగే భయపడ్డాడు కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్డే పార్టీ ఇచ్చింది. చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా -
కష్టపడాలి అన్న మనస్తత్వం ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు
-
దురదగా ఉంది, గోకుతారా?: మంచు మనోజ్ వెటకారం
ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా తయారైంది మంచు కుటుంబం. వీరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మనోజ్ షేర్ చేసిన వీడియోతో ఈ వివాదాలు నిజమేనని రుజువైంది. ఇందులో విష్ణు.. మనోజ్ అనుచరుడి ఇంటికి వచ్చి దాడి చేసినట్లు ఉంది. తర్వాత మోహన్బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేశాడు. అటు విష్ణు కూడా ఇదంతా అన్నదమ్ముల మధ్య ఉండే చిన్నచిన్న తగాదాలేనని క్లారిటీ ఇచ్చాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మనోజ్.. కళ్లముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడం నయం అంటూ పెద్దపెద్ద కోట్స్ షేర్ చేశాడు. దీంతో మంచు వారి ఇంట్లో కుంపటి అంటూ జోరుగా వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో ఈ పోట్లాట అంతా నిజం కాదంటూ షాకిచ్చాడు విష్ణు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట రియాలిటీ షో ఉండబోతుందని ప్రకటించాడు. అందుకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశాడు. తాజాగా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వమంటూ మంచు మోహన్బాబు, మనోజ్ను ప్రశ్నించింది మీడియా. దీనికి మనోజ్ వెకిలిగా నవ్వుతూ.. దురద వస్తుంది, గోకుతారా? అంటూ దురుసగా జవాబిచ్చాడు. అటు మోహన్బాబు.. 'మీ ఇంట్లో నీ భార్యకు, నీకు సంబంధం ఏంటో చెప్పగలవా? తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరంతా! ఎప్పుడో ఏది అడగాలో అది అడగాలి. సమయం, సందర్భం చూసుకోవాలి. నేను హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చాను. ఇది అద్భుతంగా ఉండాలి' అంటూ సమాధానం దాటవేశాడు. -
విష్ణు-మనోజ్ వీడియోపై స్వయంగా స్పందించిన మోహన్ బాబు!
మంచు ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్నాయంటూ కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్-విష్ణు గొడవ పడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. అది స్వయంగా మనోజ్ షేర్ చేయడంతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. దీంతో మంచు వారసుల మధ్య విభేదాలు నిజమేనని అంతా అభిప్రాయపడ్డారు. అయితే కాసేపటికే మనోజ్ ఈ వీడియో డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోపై బిగ్ ట్విస్ట్ ఇస్తూ మంచు విష్ణు గురువారం ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: హాలీం కోసం మాసబ్ ట్యాంక్కు నాగ చైతన్య.. ఫొటో వైరల్ మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఓ రియాలిటీ షోలో భాగంలోనిదే ఆ వీడియో అని పరోక్షంగా హింట్ ఇచ్చాడు విష్ణు. దీంతో మరోసారి అంతా అయోమయంలో పడిపోయారు. ఆ వీడియో నిజమా? కాదా? అని నెటిజన్లంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారసుల గొడవపై తాజాగా మోహన్ బాబు స్వయంగా స్పందించారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మోహన్ బాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన స్వగ్రామం మోదుగులపాళెంకు ఆయన అందిస్తున్న సేవల నేపథ్యంలో ఈ ఇంటర్య్వూ సాగింది. ఈ సందర్భంగా ఆయనకు విష్ణు-మనోజ్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో స్పందించారు. చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా అన్నదమ్ముల గొడవను ఉద్దేశిస్తూ భారతం గురించి ప్రస్తావించారు. ‘అన్నదమ్ముళ్లు.. చిన్నపాటి అపార్థాలే. చిలికి చిలికి గాలివానగా మారాయి. గొడవల వల్ల ఏం వస్తుంది. చివరికి అన్ని కొల్పోయారు. నిజ జీవితంలో కూడా అంతే. ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు వచ్చినా..చివరికి ఏం రాదు. ఆనందాలు దూరమైపోతాయి. నేను ఒక్కోసారి ఏం జరిగినా ఇలా ఎందుకు జరిగిందా? అని బాధపడుతుంటాను. అలా జరిగి ఉండకపోతే బాగుండు అనుకుంటా. ఇది ఎంతకాలం అని చెప్పలేం. ఆవేశాలు, మనస్పర్థలు వస్తాయి. రావని కాదు. కానీ ఇవి ఎందుకు వస్తాయంటే మాత్రం సమాధానం చెప్పలేం’ అంటూ విష్ణు-మనోజ్ గొడవ గురించి ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం మోహన్ బాబు కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ.. యూనివర్సిటీగా మారడానికి విష్ణునే కారణం అన్నారు. తనే ఎంతో కష్టపడి విద్యానికేతన్ను యూనివర్శిటీగా మార్చడని చెప్పారు. -
మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!
ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్ బాబు బర్త్డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. -
మంచు బ్రదర్స్ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది..
మంచు వారసుల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్ మారింది. అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటకీ ఈ విషయం బయటపడకుండ మంచు ఫ్యామిలీ జాగ్రత్త పడింది. కానీ, తాజాగా మా అధ్యక్షుడు, నటుడు విష్ణు తీరుతో సహనం కొల్పోయిన మనోజ్ అసలు గుట్టు రట్టు చేశాడు. విష్ణు తన అనుచరుడైన సారథిపై దాడి చేసిన వీడియో షేర్ చేసి అసలు విషయం చెప్పేశాడు. కాగా అన్నదమ్ముల వివాదంలో సారథి అనే వ్యక్తి కీలకంగా మారాడు. దీంతో ఇంతకీ ఈ సారథి ఎవరన్నది ఆసక్తిగా మారింది. చదవండి: Manchu Vishnu Vs Manoj: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్ మనోజ్- విష్ణు వివాదంలో మొదటి నుంచి ఇతడు ముఖ్య పాత్రధారి అని తెలుస్తోంది. చెప్పాలంటే అతడి వల్లే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి విష్ణు అనుచరుడిగా ఉన్న సారథి ప్రస్తుతం మనోజ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి సారథి మోహన్ బాబు సమీప బంధువట. అదే చోరవతో కొంతకాలంగా మంచు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటు అన్ని వ్యవహరాల్లో సారథి చురుగ్గా ఉంటున్నాడని సమాచారం. మా ఎన్నికల సమయంలోనూ సారథి విష్ణుతో పాటే ఉన్నాడు. మొదటి అతడు విష్ణుతోనే ఉండేవాడట. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేసిన బలగం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ ఆ తర్వాత పలు కారణాల వల్ల విష్ణుకు దూరమైన సారథి మనోజ్కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో తమ అన్నదమ్ముల మధ్య సారథి మనస్పర్థలు సృష్టించాడని విష్ణు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన గురించి అనుచితంగా మాట్లాడాడనే సారథిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో అతడు స్వల్పంగా గాయపడంతో ఆస్పత్రి చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఇదే వీడియోను మనోజ్ సోషల్ మీడియా షేర్ చేశాడు. దీంతో తండ్రి మోహన్ బాబు కల్పించుకోని కొడుకులపై సీరియస్ అయ్యాడు. ఆయన చెప్పడంతోనే మనోజ్ విష్ణు వీడియో డిలిట్ చేసినట్లు సమాచారం. -
వీడియో షేర్ చేసిన మనోజ్.. సీరియస్ అయిన మోహన్బాబు
మంచు ఫ్యామిలీలో చిచ్చు రేగింది. అన్నాదమ్ములు మంచు విష్ణు, మనోజ్ మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు అంటీముట్టనట్టుగా ఉన్నాడని ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ.. అన్నాదమ్ముల మధ్య విభేదాలకు సంబంధించి ఓ వీడియో బయటికొచ్చింది. తన అనుచరుల పట్ల విష్ణు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ‘విష్ణు తన ఇంటికి వచ్చి తన మనుషులను ఇలా కొడతాడు’ అంటూ మనోజ్ ఓ వీడియో పోస్టు చేశాడు. (చదవండి: మనోజ్ పెళ్లి వేడుకలో విష్ణు చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు) అది కాస్తా వైరల్ కావడంతో ఇంటి గుట్టు రచ్చకీడ్చారని కుమారులపై మోహన్బాబు సీరియస్ అయినట్టుగా సమాచారం. వీడియో డిలీట్ చెయ్యమని మనోజ్ను మోహన్ బాబు ఆదేశించాడు. తండ్రి ఆజ్ఙానుసారం మనోజ్ వీడియో డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? సారథి ఇంట్లో ఏమి జరిగింది అనే విషయంపై మోహన్ బాబు ఆరా తీస్తున్నారట! అన్నదమ్ముల మధ్య వివాదాలు ఏనాడు బయట పడలేదు.. ఇప్పుడేకంగా సోషల్ మీడియాలో వీడియో బయటకు రావడం చర్చనీయాంశమైంది. (చదవండి: మంచు మనోజ్, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్ వీడియో వైరల్) -
మోహన్ బాబు బర్త్డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్డే సెలబ్రెషన్స్లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్ అవుతున్న ఫ్యాన్స్ మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్డే సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి
మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా -
సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా
మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈరోజు(శుక్రవారం)8.30 నిమిషాలకు వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే పెళ్లి వేడకు జరగనుంది. ఇప్పటికే మనోజ్ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య ఫోటోను షేర్ చేస్తూ.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ పెళ్లిపై ప్రకటన చేశాడు. ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంసభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. చాలాకాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి కూడా మనోజ్ హాజరయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆమెనే మనువాడబోతుండం విశేషం. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకోగా మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. కొంతకాలంగా మనోజ్- మౌనికలు రిలేషన్లో ఉండగా ఇప్పుడు పెల్లిబంధంతో ఒక్కటి కానున్నారు. -
మంచు వారి ఇంట పెళ్లి సందడి? ఆమెతో మనోజ్ పెళ్లి ఫిక్స్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కానీ వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందని, రేపు(మార్చి 3వ తేదీ) వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మనోజ్-మౌనికలు ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం. కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా గతంలో మనోజ్, మౌనికలు పలుమార్లు జంటగా ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆ మధ్య మీడియాతో మాట్లాడిన మనోజ త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ హింట్ ఇచ్చాడు. అతడి రెండో పెళ్లి గురించే అంటూ అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. అయితే గతంలో మనోజ్కు ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటూ మౌనికకు కూడా ఇదివరకే పెళ్లై, విడాకులైన విషయం విధితమే. ఇక మనోజ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు. చదవండి: HYD: కేబీఆర్ పార్క్లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ.. 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి -
తారకరత్న నాకు చాలా ఆత్మీయుడు: మంచు మోహన్ బాబు
నందమూరి తారకరత్న మరణం పట్ల మంచు మోహన్బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను లండన్ లో, విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నాం. నా అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు అయిన తారకరత్న నాకూ, నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు. తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు. టీవీల్లో అతని మరణ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే బాధతో గుండె తరుక్కుపోతుంది. తారకరత్న మరణం ఒక్క నందమూరి కుటుంబానికే కాదు ....యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని మంచు మోహన్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించాడు. #TarakaRatna 💔. I hate this. I am not able to believe this. Numb. 💔 — Vishnu Manchu (@iVishnuManchu) February 18, 2023 -
మోహన్బాబు, మంచు లక్ష్మీ కలిసి నటించిన సినిమా షూటింగ్ పూర్తి
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. ఇందులోని ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చేలా ఉంటుంది అన్నారు. సముద్ర ఖని, సిద్ధిక్, విశ్వంత్, చైత్రా శుక్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి -
అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఆ ఫోటోలో గోరు ముద్దలు తింటున్న పిల్లాడు ఇప్పుడు స్టార్ హీరో. టాలీవుడ్ పలు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు. అయితే కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించినా ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. ఇంతకీ ఎవరో గుర్తుకు వచ్చారా? తాజాగా ఆ టాలీవుడ్ హీరో మదర్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో కాదు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మంచు మనోజ్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ..' నా ప్రాణానికి ప్రాణం అయిన అమ్మ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. అయితే మంచు మనోజ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ మనోజ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల ‘అహం బ్రహ్మాస్మి’ గురించి అప్డేట్ అడగ్గా.. మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మనోజ్ తప్పుకున్నాడా? లేక మరైదేనా సినిమా అనౌన్స్ చేయనున్నాడా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మోహన్బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు,ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల సమయంలో మోహన్ బాబు ఆయన కుమారులతో కలిసి తిరుపతిలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తిరుపతి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ మోహన్బాబు ఇటీవలె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల పాటు విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు ఆయన మాత్రమే.. మోహన్బాబు ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: ఆత్మీయులు ఎంతో మంది దూరమైనా ఏనాడు సంతాప సభకు వెళ్లింది లేదని.. తొలిసారిగా సంతాప సభకు వచ్చానంటూ మోహన్బాబు ఎమోషనల్ అయ్యారు. మంగళవారం ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, జీవిత, కె.ఎస్ రామారావు, కె.ఎల్ నారాయణ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. ‘నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు కృష్ణంరాజు. నన్ను మొట్టమొదట బెంజికారు ఎక్కించింది ఆయనే’ అంటూగుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నానంటూ మోహన్బాబు భావోద్యేగానికి గురయ్యారు. ఇలాంటి సభలో ఏనాడు మాట్లాడుతానని అనుకోలేదని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు తనతో చెపచెప్పారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు నాన్నగారు వద్దన్నా.. వారించి మరీ నన్ను పోటీ చేయించారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించేది కృష్ణంరాజు గారినే. నెల రోజుల కిందట ఆయనను కలిశాను. మా అసోసియేషన్లో జరిగే ప్రతి పనిని పదో తేదీ కల్లా చెప్పేవాళ్లం. ఇప్పుడు ఆయన మనకు భౌతికంగా దూరమైనా సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారని' మంచు విష్ణు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!) -
కృష్ణంరాజు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టిహుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించింది. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు మరణం టాలీవుడ్కు తీరని లోటని పలు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్, పెదనాన్నను కోల్పోయిందని మంచు విష్ణు సైతం ట్వీట్ చేశాడు. Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d — Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022 Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 -
తనికెళ్ల భరణికి లోక్నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్లను కూడా సత్కరించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు. -
తిరుపతి కోర్టుకు నటులు మోహన్బాబు, విష్ణు, మనోజ్
సాక్షి, తిరుపతి: నటుడు మంచు మోహన్బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో 2019లో అప్పటి ప్రభుత్వం మోహన్బాబుపై కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 2019లో మదనపల్లి హైవేపై మోహన్బాబు ఫ్యామిలీ ఆందోళన చేసింది. దీంతో ఆరోజు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది. చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని) -
అవి డిలీట్ చేయండి.. లేదంటే రూ.10 కోట్ల దావా: మంచు ఫ్యామిలీ వార్నింగ్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల అనంతరం మంచు కుటుంబంపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ ట్రోల్స్ మరింత శృతి మించాయి. సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసిన విష్ణు మంచు, లక్ష్మి ప్రసన్నలపై ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. చదవండి: భీమ్లా నాయక్కు ఓటీటీల పోటీ, భారీ డీల్కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు! నిన్న(ఫిబ్రవరి 18) విడుదలైన సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సినిమాలోని మోహన్ బాబు నటన, డైలాగ్స్పై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నలతో పాటు మంచు ఫ్యామిలీ మెంబర్స్ను కూడా వదలడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు ట్రోల్స్పై స్పందించి గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన ట్రోల్స్ ఆగకపోవడం తాజాగా మంచు ఫ్యామిలీ స్పందించింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇకనైన ట్రోల్స్ ఆపకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు మంచు ఫ్యామిలీ టీం తరపున శేషు కుమార్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తక్షణమే టోల్స్కు సంబంధించిన వీడియోలు, మీమ్స్ పోస్ట్లు డిలిట్ చేయాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. -
రాజకీయాలకు గుడ్బై, ఈ జన్మకు వద్దనుకుంటున్నాను
‘‘ఎలాంటి తప్పు చేయని ఓ సాధారణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కారణంగా జైలుకి వెళతాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారు? అతను జైలు నుంచి ఎలా బయట పడ్డాడు? తనలాగే ఏ నేరం చేయకుండా జైలులో మగ్గిపోతున్న వారికి ఎలా అండగా నిలిచాడు? అనే కథాంశంతో ‘సన్నాఫ్ ఇండియా’ ఉంటుంది’’ అని హీరో మంచు మోహన్బాబు అన్నారు. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో మోహన్బాబు లీడ్రోల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా మోహన్బాబు విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ► ‘సన్నాఫ్ ఇండియా’ మొదలు పెట్టి దాదాపు మూడేళ్లు అయింది. ఈ సినిమా కథని ‘డైమండ్’ రత్నబాబు చెప్పినప్పుడు ఒక విభిన్న కథ, చాలా బాగుందనిపించింది. మా గురువుగారు(దాసరి నారాయణరావు) కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు.. నేను కూడా చూద్దామని ఈ చిత్రం చేశాను. మా మూవీ సూపర్ హిట్ అవుతుందని చెప్పను. కానీ ప్రేక్షకులు చాలా మంచి సినిమా అని అంటారు. మా చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది. ► ‘సన్నాఫ్ ఇండియా’ ని తొలుత ఓటీటీ కోసం తీశాం. కథకు అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. వీటిని విష్ణు ఒప్పుకోలేదు. కానీ, కథకు ఉన్న ప్రాధాన్యత మేరకు పెట్టాల్సి వచ్చింది. ► ‘రాయలసీమ వాళ్లకు భాష తెలియదు’ అనే మాటలు నా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్నాను. నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగు భాష పుట్టింది తిరుపతిలోనే. ఆయా ప్రాంతాల్లో యాసలు వేరు ఉండొచ్చు కానీ భాష ఒక్కటే. భారతదేశంలో విలన్గా ఎక్కువ మేనరిజమ్స్ చూపించిన వ్యక్తి నేనే. ఈ విషయంలో నటులు అమ్రిష్ పురిగారు నన్ను అభినందించారు. ► ఈ మూవీలో నాది చాలా వైవిధ్యమైన పాత్ర. డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అందరూ అభినందించేలా ఉంటాయి. నా పాత్రని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ► సమాజంలో హత్యలు, మానభంగాలు చేసేవాళ్లను సమాధి చేయాలి. సొసైటీలో ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్, బస్లు, విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్ జైళ్లు కూడా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నాం. ► నేను డైరెక్షన్ చేయడానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.. సినిమా తీసేటప్పుడు షూటింగ్కి సమయానికి రానివారిని ఎక్కడ కొట్టాల్సి వస్తుందేమోఅని భయంగా ఉంది. నా జీవితంపై రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. నా బయోపిక్తో సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. లక్ష్మి–నేను కలిసి చేస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. విష్ణుతో కూడా ఓ మూవీ చేస్తా. తిరుపతిలో నాలుగున్నర కోట్లతో సాయిబాబా గుడి నిర్మిస్తున్నాం. ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుంది. ► ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదు. ఈ జన్మకు వద్దనుకుంటున్నాను. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుగార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నాను. ► ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్ఫాస్ట్కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే కానీ మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్గారితో జరిగిన భేటీ గురించి కానీ ఎలాంటి చర్చ జరగలేదు. అప్పుడప్పుడూ కలుద్దాం అనుకున్నాం. అంతే.. దానిపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. నానీకి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్ను కూడా తప్పుబట్టారు. -
మోహన్బాబుతో మంచు లక్ష్మీ సినిమా.. ముహూర్తం ప్రారంభం
Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film: తండ్రీకూతురు మోహన్బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమయింది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్’’ అన్నారు దర్శకుడు. మలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కథ–మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం, కెమెరా: సాయిప్రకాశ్. Today is a day I have always dreamt of living and here it is. I ll be sharing the screen with none other than my dad for the very first time. I am so grateful to the universe, my angels and my ancestors for guiding me and making me so capable enough for this day. #blissed pic.twitter.com/UwsaNzCwSI — Lakshmi Manchu (@LakshmiManchu) February 12, 2022 -
మంచు లక్ష్మిని ఎత్తిపడేసిన తండ్రీకొడుకులు
సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండేవారిలో మంచు లక్ష్మి ఒకరు. నిత్యం అభిమానులతో టచ్లో ఉండే ఆమె తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మంచు విష్ణు తన కుటుంబ సభ్యులను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది లక్ష్మి. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు. వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడిచాడు. దీంతో విషయం అర్థమైన లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మోహన్బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్లలో పడేశారు. తండ్రి కూడా తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసి పూల్లో ఎత్తేసినందుకు ఆమె కాస్త కోపంతో అరిచింది కూడా! అంతా నా కర్మ అంటూ సదరు వీడియోను పంచుకోగా మీ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
మంచు మోహన్బాబు కీలక ప్రకటన.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
Mohan Babu University: విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. ఇలా వెండితెరపై రాణిస్తున్నానే.. మరోవైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. “మోహన్ బాబు యూనివర్సిటీ” ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘శ్రీ విద్యానికేతన్లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity pic.twitter.com/K8HZTiGCUA — Mohan Babu M (@themohanbabu) January 13, 2022 -
మోహన్ బాబు హోంటూర్: ఎన్నో ఇంట్రెస్టింగ్ వివరాలు రివీల్ చేసిన లక్ష్మీ
Lakshmi Manchu Shares Mohan Babu Full Home Tour Video: మంచు లక్ష్మీ ఇటీవల యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా తన ఛానెల్లో అప్లోడ్ చేసిన మంచు మోహన్ బాబు హోం టూర్ ప్రోమో వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్లోడ్ చేసిన కాసేపటికే వీడియో ట్రెండింగ్లో నిలిచింది. తాజాగా మోహన్ బాబు ఇంటికి సంబంధించిన ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఇది తన తండ్రి 6వ ఇల్లని.. దీని గురించి తలుచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుందని మంచు లక్ష్మీ పేర్కొంది. ఎక్కడో మొదుగులపాలెం ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి స్వయంకృషితో నిలదొక్కుకొని ఈ ఇల్లు నిర్మించారని తెలిపింది. చెట్లను ఎక్కువగా ఇష్టపడే తన తండ్రి వాటికి దగ్గరగా ఉండేలా ఇల్లు తీసుకున్నారని పేర్కొంది. ఇక ఇంట్లో కిచెన్, జిమ్, స్టీమ్ రూమ్, గార్డెన్ ఏరియా, చిన్నారుల ఆన్లైన్ క్లాస్ల కోసం ప్రత్యేక రూమ్, ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎంతో విలసవంతమైన మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి.. -
ఇంద్రభవనం లాంటి మంచు మోహన్బాబు ఇంటిని చూశారా?
Manchu Mohan Babu Home Tour Video : మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబర్గా అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్ వీడియాలతో ఆకట్టుకుంటుంది. లక్ష్మీ మంచు పేరుతో ఉన్న ఆమె యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికే లక్షా 60వేలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. తన ఛానెల్ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్, ఫోటో షూట్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేసింది. ఇది తన తండ్రి 6వ ఇల్లని పేర్కొంది. ఇక కిచెన్, ఆఫీస్, హోం థియేటర్ సహా ఇల్లు మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని అడగ్గా..ఆల్రెడీ వాళ్లు చూశారు కదా నాన్న అని లక్ష్మీ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఫోటోలు తీయకూడదు..ఇల్లు చూపించకూడదు అంటూ మంచు లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకోబోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సకల సౌకర్యాలతో ఇంద్ర భవనంలా మెరిసిపోతున్న మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి. -
సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు. కాగా తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు. -
మంచు మోహన్బాబు ఇంట తీవ్ర విషాదం
సాక్షి, తిరుపతి: టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నమూత కాగా మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 8-9 గంటల మధ్య తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. -
బాలయ్య టాక్ షో: చిరంజీవిపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ఇటీవల లాంచ్ చేసిన ఈ టాక్ షో తొలి ఎపిసోడ్కు డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ షో ఎపిసోడ్ గురువారం విడుదలైంది. ఇందులో మోహన్ బాబు, బాలయ్య ఫుల్ సందడి చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచారు. ఈ క్రమంలో మోహన్ బాబు, బాలయ్య ఒకరిపై ఒకరూ ప్రశ్నల సంధించుకున్నారు. దీంతో ఈ టాక్ షో మరింత ఆసక్తిగా సాగింది. ఇలా ఆసక్తిగా సాగుతున్న షో మధ్యలోకి మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది, బాలయ్య, మోహన్ బాబు ఏమేం చర్చించుకన్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. చదవండి: మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్ చేసిన బన్నీ ఈ సందర్భంగా మోహన్ బాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకరోజు ఎన్టీఆర్తో నేను ‘అన్నయ్యా.. మీతో నేను ఓ సినిమా చేస్తా’మ అని అడిగాను. దానికి ఆయన రాజకీయాల్లో ఫేయిల్ అయ్యాను. ఇక సినిమాలు ఎవరు చూస్తారు అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దు’ అంటూ బదులిచ్చారు. అలా నాకు సలహా ఇచ్చి మరోసారి తన గొప్పతనాన్ని పంచుకున్నారు’’ అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. సినిమా కేరీర్ తాను వ్యక్తిగతం చాలా ఇబ్బందులు పడ్డానని, తన బ్యానర్లో వరస సినిమాలు ప్లాప్ అయితే భూములు అమ్మి డబ్బులు చెల్లించానంటూ కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత ఆ తర్వాత ‘అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, పెదరాయుడు, బ్రహ్మ’ చిత్రాల విజయాలతో మళ్లీ నిలదొక్కుకున్నానని చెప్పారు. అనంతరం షోలో భాగంగా చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటని బాలయ్య అడగ్గా.. ‘వ్యక్తిగతంగా చిరంజీవిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఆయన మంచి నటుడు. అంతకుమించి అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. అల్లు రామలింగయ్యగారి కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు.. కాబట్టే అతను బాగున్నాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు: మోహన్బాబు
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ బైక్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన నటుడు సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు. చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి’ ఆదివారం తేజ్కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి -
‘మా’ బిల్డింగ్ నిర్మాణంపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భనన నిర్మాణంపై సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన ‘మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. మా భవనం కోసం స్థలం కొని మళ్లీ అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. (చదవండి: అన్నగా పుట్టినప్పటికీ తండ్రిలా సాకారు.. పవన్ ఎమోషనల్ పోస్ట్) బిల్డింగ్ కోసం కూడబెట్టిన డబ్బుతో స్థలం కొని దాన్ని సగం ధరకు అమ్మడంపై పెద్దలు ఆలోచించాలని కోరారు. అతి త్వరలో మా ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని చెప్పిన మోహన్ బాబు... దీనిపై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వాడివేడిగా జరిగిన మా అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఎన్నికలపై మా సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే వారంలోగా ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని కృష్ణంరాజు, మురళీమోహన్ పేర్కొన్నారు. మరోవైపు 'మా' అసోసియేషన్ భేటీ జరిగిన 21 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 12 లేదా 19న 'మా' ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ సైతం ఎన్నికలు ఎంత తొందరగా పెడితే అంత మంచిది అని పేర్కొన్నారు. -
‘మంచు’ వారి ఇంట్లో మోహన్లాల్ సందడి, ఫోటోలు వైరల్
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబుకు మలయాళ, తమిళ సీనియర్ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్లాల్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికి మోహన్బాబుతో టచ్లో ఉంటారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా మోహన్బాబుని కలిసి వెళ్తుంటారు. తాజాగా మలయాళీ ప్రముఖ నటుడు మోహన్లాల్.. మంచువారి ఇంట్లో సందడి చేశాడు. మంచు కుటుంబంతో కలిసి మోహన్లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. మోహన్లాల్ నటిస్తున్న ‘బ్రో డాడీ’మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
పేద ప్రజల దైవం మా బావగారు: మోహన్బాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మహానేత జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజన్నకు నివాళులర్పిస్తున్నారు. ‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీనియర్ నటుడు మంచు మోహన్బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, రచయిత కోన వెంకట్, దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విటర్ వేదికగా వైఎస్సార్కు నివాళులర్పించారు. Remembering former chief minister of #AndhraPradesh Shri YSR garu on his birth anniversary. #YSR 🙏#YSRJayanthi #YSRajasekharaReddy pic.twitter.com/XYYDHDD2TV — BANDLA GANESH. (@ganeshbandla) July 8, 2021 Remembering Dynamic leader #YSRajasekharaReddy Garu on his birth anniversary 🙏🙏 pic.twitter.com/yJczHRjBXo — Gopichandh Malineni (@megopichand) July 8, 2021 Dr. Y.S.R 🙏 A legendary leader who became immortal with his services to the people through various innovative schemes and welfare programs. Let’s remember him on his Birth Anniversary 🙏#YSRJayanthi pic.twitter.com/mGQ0cFYXpH — Kona Venkat (@konavenkat99) July 8, 2021 -
Son Of India: ‘జయ జయ మహావీర’ సాంగ్ వచ్చేసింది
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. -
‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ వచ్చేస్తోంది..
ఐదు వందలయాభైకి పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మంచు మోహన్బాబు నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను జూన్ 4న విడుదల చేయనున్నారు. ‘‘వాస్తవ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్బాబు గారి ఇమేజ్కు తగ్గట్లు ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మోహన్ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజుకి లక్షలాది పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుంది. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలో మొదటి డోస్ తీసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్బాబు తాజాగా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మోహన్బాబు నవ్వించడంలోనూ దిట్ట
‘మా వంటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు... మా బట్టలుతికేవాడు భారతీయుడు’... అని ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్బాబు చెప్పిన బ్రిటిష్ అధికారి డైలాగుకు ప్రేక్షకులు పదేపదే నవ్వుకున్నారు. ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగును బాగా పలుకుతారన్న పేరు మోహన్బాబుకు ఉంది. కాని ఆ డైలాగును ఉద్వేగానికి, రౌద్రానికి, సెంటిమెంటుకు ఎంత బాగా ఉపయోగించగలరో కామెడీకి కూడా అంతే బాగా ఉపయోగించగలరు అని ఆయన అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులకు నిరూపించారు. ‘దేవత’ సినిమాలో ‘కామెడీ విలన్’గా ఆయన పెద్ద పేరు సాధించారు. అందులో నిర్మలమ్మ జులాయి మనవడిగా నవ్వులు పూయించారు. ఊళ్లో అల్లరి పనులు చేసి ఊరి పెద్ద రావుగోపాలరావు చేతిలో తిట్లు తింటూ ఉంటారు. ఆయన ‘ఔ’ మేనరిజమ్ హిందీలో విలన్ శక్తికపూర్ అదే సినిమా రీమేక్ కోసం వాడి నేటికీ ఆ మేనరిజమ్తోనే గుర్తింపు పొందుతున్నాడు. ‘వారసుడొచ్చాడు’, ‘కొదమసింహం’, ‘శ్రీనివాస కల్యాణం’.. ఇలా చాలా సినిమాల్లో ఆయన కామెడీ విలన్గా ప్రేక్షకులను అలరించారు. కొదమసింహంలో రోజుల తరబడి స్నానం చేయని కౌబాయ్గా, తిండిపోతుగా ఆయన కేరెక్టర్ అందరినీ తెగ నవ్వించింది. హీరో అయ్యాక ఈ కామెడీ అంశను ఆయన వదల్లేదు. ‘అల్లుడు గారు’ మోహన్బాబు కామిక్ టైమింగ్కు మంచి ఉదాహరణ. ‘నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం’ అంటూ రకరకాల మోసాలు చేస్తూ నవ్విస్తారాయన. చంద్రమోహన్ను ‘ఉలవల బస్తా’ అంటూ శోభనను పిచ్చిపిచ్చి తిట్లు తిడుతూ ఆయన ఇంటిల్లిపాదికీ నచ్చేశారు. ఇంత మంచివాడికి ఉరిశిక్ష ఏమిటని ప్రేక్షకులు చివరలో భోరున ఏడ్చారు కూడా. దర్శకుడు రాఘవేంద్రరావు మోహన్బాబు కామెడీని బాగా ఉపయోగించుకున్నారు. ‘అల్లరి మొగుడు’లో ఇద్దరు భార్యల భర్తగా ఆయన చేత కామెడీ పండించారు. ‘అన్నమయ్య’ సినిమాలో ఆయన పాత్రను ఆహ్లాదానికి ఉపయోగించారు. ‘భంగభంగారి భంగ’ అని మేనరిజమ్ పెట్టారు. పరుచూరి బ్రదర్స్ ‘అసెంబ్లీ రౌడీ’లో ‘అరిస్తే చరుస్తా’ లాంటి డైలాగులు రాసి కామెడీ పండించారు. ఆ సినిమాలో విలన్ బాషా దగ్గరకు వెళ్లి మోహన్బాబు ఎగతాళి చేయడం కూడా బాగా నవ్వించింది. దాసరి సినిమాలలో ‘దీపారాధన’, ‘అద్దాలమేడ’ సినిమాలలో మోహన్బాబు చాలా క్లాసిక్ కామెడీ చేస్తారు. ఆయనతో కలిసి కామెడీ చేసిన చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఇవివి సత్యనారాయణ మోహన్బాబుతో ‘అదిరింది అల్లుడు’, ‘వీడెవడండీ బాబూ’ సినిమాలు చేసి తన స్టయిల్లో నవ్విస్తే దర్శకుడు వంశీ ‘డిటెక్టివ్ నారద’గా మోహన్బాబును చూపించి నవ్వించారు. అందులో మల్లికార్జున రావుతో ‘అల్లావుద్దీన్’ అంటే అతను ‘ఎస్బాస్’ అనే మేనరిజం బాగుంటుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘తప్పు చేసి పప్పుకూడు’ కూడా కామెడీయే. అల్లరి నరేశ్తో ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశారు. మంచి కామెడీ చేసినవాడే మంచి నటుడు అంటారు పెద్దలు. ఆ విధంగా చూస్తే తాను గొప్ప నటుణ్ణి అని మోహన్బాబు అనిపించుకున్నారు. ఆయన మరిన్ని ఆహ్లాద పాత్రలు చేయాలని కోరుకుందాం. చదవండి: చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం' టీజర్ విడుదల నాన్న.. మీరు లేకుండా నేను లేను: మంచు లక్ష్మీ -
స్నేహం.. యాక్షన్.. థ్రిల్
‘‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను శుక్రవారం వైజాగ్ మెలోడి థియేటర్లో ప్రేక్షకులకు చూపించారు. అనంతరం విలేకరులతో మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘విశాఖలో అభిమానులతో ఈ ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది. ఈ చిత్రంలో స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయి’’ అన్నారు. నవదీప్ కూడా పాల్గొన్నారు. -
మోసగాళ్లు వచ్చేది అప్పుడే!
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీని ప్రకటించి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు నటుడు మంచు మోహన్బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘అమెరికాలో జరిగిన ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ భారీ స్కామ్ వల్ల అక్కడి కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. 4వేల కోట్ల స్కామ్ చేసిన వారు దొరికారా? లేదా? దోచుకున్న డబ్బుని ఎక్కడ దాచిపెట్టారు? అనే కథతో చిత్రాన్ని రూపొందించాం. చిరంజీవిగారు విడుదల చేసిన ట్రైలర్కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. నవదీప్, నవీన్ చంద్ర, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సి.ఎస్, షెల్డన్ చౌ. -
మంచు మనోజ్ రెండో పెళ్లి?
హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడాకుల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. టాలీవుడ్కి చెందిన ఓ హీరోయిన్ని మనోజ్ ఇష్టపడుతున్నట్లు వార్తలు వచ్చినా అవి అవాస్తవమేనని సన్నిహితులు తెలిపారు. మోహన్బాబు కుటుంబానికి దగ్గరి బంధువైన అమ్మాయితోనే మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా మే నెలలలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ప్రణతిరెడ్డితో మంచు మనోజ్ కాగా 2015లో ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్..మనస్పర్థల కారణంగా విడిపోయారు. పెళ్లి అయిన తర్వాత ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం, ఇటు మనోజ్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్యా విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. పర్సనల్ లైఫ్లో తలెత్తిన కొన్ని సమస్యలతో దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు మనోజ్..సినిమాలకు దూరంగా గడిపాడు. అయితే సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. చదవండి : (రెండో పెళ్లిపై మనోజ్ ఆసక్తికర కామెంట్.. ) (తాజ్మహల్లో వాలిపోయిన స్టార్ కపుల్) -
మాల్దీవుల్లో వాలిపోయిన 'మంచు' ఫ్యామిలీ
షూటింగులతో బిజీబిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం వీలు కుదిరినా సేదతీరడానికి విదేశాలకు వాలిపోతుంటారు. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్తోనే సరదాగా వెకేషన్ ట్రిప్కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అలా వెళ్లిన వారిలో రానా-మిహిక, నిహారిక-చైతన్య,కాజల్-కిచ్లు జంటలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మాల్దీవులు సెలబ్రిటీలకు ఫేవరెట్ ప్లేస్గా మారినట్లు తెలుస్తోంది. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా మాల్దీవుల్లో వాలిపోయారు. మంచు మోహన్బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. చదవండి : (ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు) మాల్దీవులు భూతలస్వర్గంగా ఉందని.. ఆకాశం, బీచ్లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని మంచు లక్ష్మీ పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది. ఇక డైలాగ్కింగ్ మోహన్బాబు తన సతీమణితో సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్లుక్లో కనిపిస్తున్నారంటూ మోహన్బాబు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తన్నారు. చదవండి : (మజా మాల్దీవ్స్ ) ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Beaching until further notice! 😉 Enjoying the beautiful sunset with nana and amma! 🌅❤️❤️❤️ It's so good to be finally out of the house and relish some quality time with the fam at @LUXSouthAri!✨ We are in heaven 😍🌊🌴🐚👙🐬🐋 pic.twitter.com/WH2zmbNWr2 — Lakshmi Manchu (@LakshmiManchu) January 21, 2021 View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
ఇద్దరూ ఇద్దరే!
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ కలిసి, కాసేపు మాట్లాడుకుంటే కచ్చితంగా అది హాట్ టాపిక్కే. పైగా మంచు విష్ణు కూడా చిరంజీవిని కలవడంతో పాటు ‘ఈరోజు బిగ్బాస్ని కలిశాను.. ఎందుకు కలిశాననేది త్వరలోనే చెబుతాను’ అని ట్విస్ట్ ఇచ్చారు. బుధవారం ‘ఆచార్య’ సెట్లో చిరంజీవిని కలిశారు మోహన్బాబు. సరదాగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇక మోహన్ బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నారు. మరి... తండ్రీతనయులిద్దరూ చిరంజీవిని ఎందుకు కలిశారు అనేది తెలియాలంటే విష్ణు చెప్పేవరకూ ఆగాల్సిందే. -
సన్ ఆఫ్ ఇండియా షురూ
డాక్టర్ మోహన్ బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంచు విష్ణు సతీమణి విరానికా మంచు, కుమార్తె ఐరా, కుమారుడు అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, ఆమె కుమార్తె విద్యానిర్వాణ క్లాప్ ఇచ్చారు. హీరో విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కలిసి స్క్రిప్టును డైరెక్షన్ టీమ్కు అందించారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ, ఈ జానర్ సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని కూడా శుక్రవారమే మొదలుపెట్టాం. మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాశారు. సుద్దాల అశోక్తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్ బాబుకు స్టైలిస్ట్గా విరానికా మంచు వ్యవహరిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: సర్వేష్ మురారి. -
‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి’
నటిగా, యాంకర్గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న, తండ్రి మోహన్బాబు వారసత్వాన్ని అంది పుచ్చుకుని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో నటిగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తరువాత ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’, ఊకొడతారా ఉలిక్కిపడతారా, లక్ష్మి బాంబ్ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు. ఈ రోజుతో ఆమె 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి లక్ష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు ఈ క్రమంలో లక్ష్మీ మంచు తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్బాబు కూతురుకి ప్రత్యేక బర్త్డే విషెస్ తెలిపారు. ఎన్ని జన్మలైన లక్ష్మీనే కూతురిగా పుట్టాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో ‘నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచ భూతాలని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్డే టూ మై డియర్ లవ్లీ లక్ష్మీమంచు’ అని మోహన్ బాబు పేర్కొన్నారు. Wishing many happy returns of the day to my priceless treasure @LakshmiManchu. Enni Janmalaina nuvvu naa kuturuga puttalani, aa devudni pradhisthuna. Love you 3000. #HBDLakshmiManchu pic.twitter.com/H1iC4l9Lvx — Mohan Babu M (@themohanbabu) October 8, 2020 -
సన్ ఆఫ్ ఇండియా
మంచు మోహన్ బాబు కథానాయకునిగా తెరకెక్కనున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమా నిర్మించనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో తీక్షణంగా చూస్తున్న మోహన్ బాబు కనిపిస్తున్నారు. ‘‘ఇంతవరకు తెలుగుతెరపై కనిపించని కథ, జానర్ని ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇదివరకెన్నడూ మనం చూడని పవర్ఫుల్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే చెబుతాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మోహన్బాబు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘ఆకాశమే నీ హద్దురా’ కథ నచ్చి, ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
రూ.60 కోట్లతో మనోజ్ సినిమా
సాక్షి, శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): హీరో మంచు మనోజ్తో త్వరలో ప్రతిష్టాత్మక చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత, నటుడు మోహన్బాబు ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో మనోజ్తో రూ.60 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రం నిర్మించనున్నట్లు ప్రకటించారు. దైవ సన్నిధిలో సినిమా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క -
ఆయన్ను నమ్మినందుకు చెప్పులు పడ్డాయ్: మంచు
తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్ బాబు మండిపడ్డారు. తిరుపతిలో మోహన్ బాబు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి మూమ్మాటికీ కారకుడు నారా చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి మాయ మాటలు నమ్మినందుకు తన మీద చెప్పులు పడ్డాయని తెలిపారు. అనంతరం తన తప్పు తాను తెలుసుకుని ఎన్టీఆర్ను కలిశానని చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే బీజేపీకి ప్రచారం చేసిన తాను తర్వాత రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. 2009లో వైవీఎస్ చౌదరీకి చెక్ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పది మంచి పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. పదేళ్లు ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ఆర్ ఆశయాలను, ప్రజల సమస్యలను నెరవేర్చడానికి పోరాడుతోన్న వ్యక్తి వైఎస్ జగనేనన్నారు. వైఎస్ కుటుంబానికి, మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉందన్నారు. చంద్రబాబు మూర్ఖుడని, అతని స్థాయి ఏంటి, తన స్థాయి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తి ఏంటి, తన ఆస్తి ఏంటి..బాబు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలుసునన్నారు. చంద్రగిరి బహిరంగ సభలో తనను ఎవరు అంటావా నీచుడా అని పరోక్షంగా బాబునుద్దేశించి తీవ్రంగా ఏకిపారేశారు. ఓటుకు నోటు కేసులో భయంతో హైదరాబాద్ వదిలి పారిపోయిన సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. కేసీఆర్ కాళ్లు కడిగిన నీళ్లు నెత్తిన పోసుకునేది చంద్రబాబేనన్నారు. చంద్రబాబుకు ఓటమి తప్పదు.. జగన్ సీఎం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టిన దుర్మార్గుడు బాబు ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. తాను, కేసీఆర్, వైఎస్ జగన్ కలిసి కుట్రల పన్నామట..చంద్రబాబు నోట వచ్చే ప్రతి మాట అబద్ధమేనని చెప్పారు. విదేశాల్లో ఉండే తెలుగు వారి మధ్య కూడా చంద్రబాబు కులాలు అంటూ చిచ్చు పెట్టాడని ఆరోపించారు. టీడీపీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని విమర్శించారు. చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు లేరని, ఇసుక, మట్టి దోచుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. తాను ఏ పదవులు ఆశించి వైఎస్సార్సీపీలో చేరలేదన్నారు. -
చంద్రబాబు నీచుడు, గజదొంగ: మోహన్బాబు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): చంద్రబాబు నాయుడు నీచుడు.. గజదొంగ.. దొంగల పార్టీకి అధినేతని విలక్షణ నటుడు మోహన్బాబు ఆరోపించారు. తప్పు చేస్తున్న చంద్రబాబును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అన్న ఎన్టీఆర్నే మోసం చేసిన మహా ఘనుడు చంద్రబాబని మండిపడ్డారు. అబద్దాల కోరు చంద్రబాబుకు ఓటు వేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. వంగి వంగి నమస్కారాలు చేస్తున్న ద్రోహిని సాగనంపాలంటూ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆరిలోవ, దక్షిణ నియోజకవర్గ పరిధి 25వ వార్డు లక్ష్మీటాకీస్ జంక్షన్, మధురవాడలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్లను గెలిపించాలని కోరారు. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎక్కడ చూసినా జగన్.. జగన్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారన్నారు. చంద్రబాబు నయవంచకుడు, పరమ దుర్మార్గుడని విమర్శించారు. పిల్లను ఇచ్చిన మామను చంపిన నీచుడని దుయ్యబట్టారు. చంద్రబాబుతో 40 ఏళ్లపాటు తనకు స్నేహం ఉందని, అందుకే ఆయన నీచపు బుద్ధి నాకు తెలుసన్నారు. ప్రజా సంక్షేమం ఘనత వైఎస్సార్దే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేసి పేద యువత ఇంజనీరింగ్ చదువుకోవానికి సహకరించారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసి పేదలకు మెరుగైన వైద్యం అందించారన్నారు. యువత జాగ్రతగా గుర్తుపెట్టుకొని వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేయాలన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయితే యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత చదువులకు అవకాశం కలుగుతుందన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలన్నారు. వైఎస్సార్ చేసిన మంచిపనులు గుర్తించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో అభ్యర్థులతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అధికార ప్రతినిధి జాన్వెస్లీ, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖి, వార్డు అద్యక్షుడు సూరాడ తాతారావు, వార్డు నాయకులు సూరాడ అప్పారావు, షబీర బేగం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్: మంచు
తణుకు: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్ బాబు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కారుమూరితో కలిసి మోహన్ బాబు రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని మహానటుడు అన్న ఎన్టీఆర్దని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ భూస్థాపితం ఖాయం ‘రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయం. అన్న ఎన్టీఆర్ శాపం ఫలిస్తుంది. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకి డ్వాక్రా మహిళలు గుర్తొస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వాళ్ల డబ్బులు వాళ్లకే ఇస్తున్నాడు. ఇన్నాళ్లు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు కలసి ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. మరొక్కసారి బాబును కనుక నమ్మితే ఈసారి ప్రజల రక్తాన్నే పీల్చేస్తాడు. సరిగ్గా మాట్లాడటం రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా’ అని మోహన్ బాబు ప్రశ్నించారు. 130 స్థానాల్లో విజయఢంకా మోగించటం ఖాయం ‘రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్ వెంటే ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 130 స్థానాల్లో విజయఢంకా మోగించటం ఖాయం. వైఎస్ జగన్పై కేసులు గురించి మాట్లాడే బాబుపైనా పదకొండు కేసులున్నాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే పారిపోయి వచ్చింది నువ్వు కాదా.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని నాలుకలతో మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం నిధుల గురించి కేంద్రం లెక్కలు అడిగితే చెప్పటం లేదు.. అదేమైనా బాబు తన అబ్బ మొగుడి సొమ్ము అనుకొంటున్నాడా. చంద్రబాబు లాంటి వ్యక్తిని వేరే దేశంలో అయితే ఉరి తీసేవారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయార’ ని మోహన్ బాబు కొనియాడారు. -
హరికృష్ణకు చంద్రబాబు ఏం చేశారు : మోహన్ బాబు
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ చేతుల నుంచి బలవంతంగా లాక్కున్నాడని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ జగన్ని దొంగ అనటం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఎం చేశారో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని విమర్శించారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ లేదన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు అన్ని కేసుల్లోనూ స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దోచుకోవడానికి ఇసుకను కూడా వదల్లేదని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అమాయకులని.. వారిని బాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు. చంద్రబాబుది కుటుంబ పాలన చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన సాగిస్తున్నారని మోహన్బాబు విమర్శించారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీలో కుటుంబం సభ్యులను రానిచ్చేవాడుకాదన్నారు. కానీ చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు మాత్రమే కీలక పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీకి ఎంతో సేవ చేసిన హరికృష్ణకు చంద్రబాబు ఏం చేశారో ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కోసం టీడీపీలో ఎవరూ పనిచేయడం లేదని.. ఎన్టీఆర్పై అభిమానంతోనే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలు అయిన చేస్తాడని ఆరోపించారు. పసుపు కుంకుమ పేరుతో మీ డబ్బే మీకు ఇస్తున్నారని ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మోద్దని కోరారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఏపీ ప్రజలను మోహన్బాబు కోరారు. -
హరికృష్ణకు చంద్రబాబు ఎం చేశాడు : మోహన్ బాబు
-
నన్ను పెద్ద కొడుకు అనేవారు
‘‘నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దాసరి అయితే నా కుటుంబానికి నెత్తిన పాలు పోసింది ఈ క్షీరపురి ప్రజలే’’ అని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్బాబు అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక గాంధీబొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్ బాబు మాట్లాడుతూ – ‘‘గురువు గారు దాసరి నారాయణరావు ‘నాకు ఏదైనా అయితే నా పెద్ద కొడుకు మోహన్ బాబు ఉన్నాడు’ అనేవారు. సినీ నటుడిగా జన్మనిచ్చిన తండ్రి విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో ఆవేదనతో కూడినది. నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నాను.. ఈ కార్యక్రమానికి నేను ఆనందంతో రాలేదు. ఎంతో బాధతో తప్పని పరిస్థితుల్లో వచ్చాను. భక్తవత్సలంనాయుడు నామకరణంతో ఇండస్ట్రీలో ప్రవేశించిన నాకు 1975లో మోహన్ బాబుగా పేరు పెట్టారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్ గా, హీరోగా ఇలా అనేక క్యారెక్టర్లకు ఎంపిక చేసి నాకెంతో గుర్తింపును తీసుకువచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ల పక్కన నటించే చాన్స్ కల్పించారు. ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆయన బతికుండగానే నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ లో దాసరి పేరున ఆడిటోరియాన్ని నిర్మించి ఆయనకు అంకితమిచ్చాను. పదిమందికి ఉపయోగపడి భారతదేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి దాసరి. నటుడిని శాసించిన వ్యక్తి. కొమ్ములు తిరిగిన నటుడైనా దాసరి వద్దకు వచ్చి మీ సినిమాలో నాకు ఒక చాన్సు ఇవ్వండని అడిగారే తప్ప నా వద్ద కథ ఉంది.. నా సినిమాలో పనిచేస్తారా అని ఏ నటుడినీ అడగని దర్శకుడు. ఇలాంటి మహానుభావుడికి ప్రభుత్వం 5 గజాల స్థలం కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లి గజం స్థలం అడగలేదు. గతంలో పాలకొల్లులో లలితకళాంజలి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాను. ఏటా ఒక విద్యార్థికి నా పాఠశాలలో 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకూ ఉచితంగా విద్యనందిస్తానని చెప్పాను. ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, తణుకు వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఎంపీలు గోకరాజు గంగరాజు, ఎం.మురళీమోహన్, సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, రవిరాజా పినిశెట్టి, దవళ సత్యం, రేలంగి నరసింహారావు, దాసరి కుమారుడు తారకప్రభు, సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.