ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చాలా చక్కగా, పరిణితితో నటించాడని, డైరెక్టర్ కిషోర్ తిరుమల మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని చక్కగా రూపొందించారని, మైత్రి మూవీస్ సంస్థకు తగ్గట్టుగా ఈ సినిమాను వారు నిర్మించారని తెలిపారు. ఈ మూవీలో నటించిన మిగతా పాత్రల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీతంతో సత్తా చాటారని కొనియాడారు.