Sai Dharam Tej
-
సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం సరికాదు: మెగా హీరో
రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదంటున్నాడు హీరో సాయిదుర్గ తేజ్ (Sai Durga Tej). పాలిటిక్స్ అనేవి పెద్ద సబ్జెక్ట్ అని.. అందులో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తున్నాడు. బుధవారం నాడు నంద్యాల జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఈ క్షణంలో బతికే మనిషిని. రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకవసరం లేదు. ఇప్పుడు ఈ పూటకు భోజనం చేశానా? లేదా? నలుగురికి సాయం చేశానా? లేదా? అన్నదే చూస్తాను. తర్వాతి క్షణాల గురించి ఆలోచించను. రాజకీయాలనేవి చాలా పెద్ద సబ్జెక్ట్.రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదుచాలా నేర్చుకోవాలి. చాలా చదువుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు. అనుకున్నంత ఈజీ కానే కాదు. జనాల సమస్యలు తెలుసుకోవాలి.. ఇంకా చాలా ఉంటాయి. దయచేసి నన్ను సినిమాల నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయితేజ్.. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.చదవండి: బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి -
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ టైటిల్ ఈవెంట్లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతిలకు అవార్డ్స్ (ఫోటోలు)
-
30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్తో వారు షేర్ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో ‘గాంజా శంకర్’గా రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
సందీప్, సాయి ధరమ్తేజ్తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్ గురించి తాజాగా రివీల్ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్తో పాటు సాయి ధరమ్ తేజ్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్మీడియాలో వైరల్ అయింది. అయితే, సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్ అయ్యారు.'సందీప్, సాయి ధరమ్తేజ్ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్ పర్సన్. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బిజినెస్మేన్తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాను షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది. -
ఈ బ్యూటీ డ్యాన్స్కు ఆ మెగా హీరో అభిమాని! ఎవరంటే..? (ఫోటోలు)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.పావలా శ్యామలతో సాయిధరమ్ తేజ్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్ ధరమ్ తేజ్తో వీడియో కాల్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు రూ.5 లక్షలు సాయిధరమ్తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.We extend our heartfelt thanks to the mega supreme hero, @IamSaiDharamTej Garu, for donating 5 lakhs to our @FilmJournalistsWe are grateful. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu through our association, keeping the promise made by you… pic.twitter.com/1FYiUAKoOL— Telugu Film Journalists Association (@FilmJournalists) July 26, 2024 -
'సాయి ధరమ్ తేజ్ పోస్ట్.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్ బాబు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024 -
'ఇలాంటివి చాలా భయానకం'.. మెగా హీరో మరో ట్వీట్!
సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో ట్వీట్ చేశారు. పేరేంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి, తన చిన్నారి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.స్పందించిన భట్టి విక్రమార్కతాజాగా ఈ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. చిన్నపిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క ట్వీట్లో పేర్కొన్నారు.Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024This is beyond gruesome, disgusting and scary.Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.Child Safety is the need of the hour 🙏🏼I sincerely request Hon'ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 -
పేరెంట్స్కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్ తేజ్
సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. 'పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న మానవ మృగాలను నియంత్రించడం, అడ్డుకోవడం కష్టమైపోతోంది. కాబట్టి మీ పిల్లల పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అని హెచ్చరిక జారీ చేశాడు.కాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ వారిమీద మండిపడుతూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ట్వీట్పై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతే తొలి ప్రాధాన్యతగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చిన్నారులపై అసభ్య కామెంట్లు చేస్తూ వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. To whom so ever it may concern, my kind request to all the parents is to please use some sort of discretion when you post a video or photos of your kids as the world of social media has become ruthless and dangerous and is very difficult to control or stop these animals from…— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 Sai dharam tej ki ame ante chala istam https://t.co/dqs5QQ9Y5B pic.twitter.com/sV1byFiksT— Mani #SSMB29 (@PokiriTweet) July 7, 2024 Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024 i remember a youtuber being jailed for a similar joke few weeks back. https://t.co/Jv8ce4GhGw pic.twitter.com/eFXZXGMS4W— Ab (@thebottlegourd) July 5, 2024 చదవండి: అంబానీ ఇంట సంగీత్.. బాద్షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే? -
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్డీటీ 18' పేరుతో పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ను నిర్మాతలు విడుదల చేశారు.ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.MY NEXT #SDT18 ✊This one will be more than special.Need all your love & blessings 🙏🏼All the best to us @rohithkp_dir 🤗 Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024 -
అల్లు అర్జున్ను అన్ ఫాలో చేసిన మెగా హీరో!
మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహను ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అన్ఫాలో చేసినట్ తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.కాగా.. బన్నీ గతంలో నంద్యాలకు చెందిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తరువాత సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పెద్ద ఎత్తున వార్ జరిగింది. అందువల్లే సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని ఎక్స్, ఇన్స్టాలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అప్పట్లోనే నాగబాబు చేసిన ట్వీట్ సైతం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్ను తొలగించారు. -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024 -
పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్తగా..
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయిదుర్గ తేజ్గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లి పేరు మీదట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలన్న కలను సైతం నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ బ్యానర్ ద్వారానే సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవే మార్చి 8న ఉమెన్స్ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్ ఆఫ్ సత్య ప్రత్యేక ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును వెల్లడించాడు. రామ్చరణ్తో మల్టీస్టారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు.. మొన్నే పవన్ కల్యాణ్తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబుగారితో చేశాను. నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవిగారే! మా చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్ చేస్తాను అని తేజ్ చెప్పుకొచ్చాడు. వెబ్సైట్లో రాస్తేనే తెలిసింది గాంజా శంకర్ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్న ప్రశ్నకు.. 'సినిమా ఆగిపోయిందని ఓ వెబ్సైట్లో వార్త చూశాకే నాకూ తెలిసింది. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్సైట్స్ చెప్తే కానీ తెలియదు' అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం సత్య. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. చదవండి: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్ నిర్ణయం! -
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్సీరీస్ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్మేన్ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
ఒక్క మెసేజ్తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్ సర్వీసులో కూడా ముందుంటాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను ఆయన చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్మీడియా వేదికగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్మెంట్ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్ తేజ్ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ మనసు చాటుకున్నారు. బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్'చేస్తున్నారు. కానీ గాంజా అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7 — I.Andrew babu (@iandrewdop) February 22, 2024 -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు బ్రేక్
-
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారంది. పాజిటివ్ మైండ్సెట్తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్ఫుల్గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్తో సరిసమానమైన క్రేజ్తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
Sai Dharam Tej Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
-
ఎంత పని చేశావ్ వరుణ్ తేజ్.. పెళ్లిపై మెగా హీరో పోస్ట్ వైరల్!
ఇటీవలే టాలీవుడ్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్తో సహా నితిన్ కూడా పాల్గొన్నారు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూస్తే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ ఓ రేంజ్లో హంగామా చేసినట్లు కనిపిస్తోంది. పెళ్లిలో వరుణ్ తేజ్ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫోటో చూస్తే చాలా ఫన్నీగా కనిపిస్తోంది. అతన్ని చూసిన వరుణ్ తేజ్ చిరునవ్వుతో కనిపించాడు. ఆ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. సాయి తన ఇన్స్టాలో రాస్తూ..' ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం అలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకు అన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. కాగా.. సాయి ధరణ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
ఊర మాస్ శంకర్
‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్లు.. సూపర్ మ్యాన్లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. -
ఊరమాస్గా సాయి ధరమ్ తేజ్.. గత్తరలేపిన ‘గాంజా శంకర్’ గ్లింప్స్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 15) సాయి తేజ్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అని టైటిల్ ఖరారు చేశారు. మాస్కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్’ వీడియో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. -
సాయి ధరమ్ తేజ్ కి ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి
-
Month Of Madhu Trailer Launch Photos: ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ట్రైలర్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ మరియు కలర్ స్వాతి క్యూట్ మూమెంట్స్
-
బ్రో ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రో. ప్రియ ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్. మాతృకలో సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలోనూ విఫలమైంది. డైరెక్టర్ సినిమా కథను లైట్ తీసుకుని హీరోను హైలైట్ చేసేందుకే ఎక్కువ కష్టపడ్డాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ మూవీ ఆగస్టు 25 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. అంటే ఈ శుక్రవారం ఓటీటీలో ల్యాండ్ అయ్యేందుకు బ్రో సిద్ధమయ్యిందన్నమాట! థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు, లేదంటే మరోసారి బ్రోను చూడాలనుకునేవారు ఈ ఫ్రైడే ఓటీటీలో ఎంచక్కా చూసేయండి. బ్రో సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం, రోహిని, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, మాటలు అందించాడు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరించాడు. #Bro Coming to Netflix on this Friday ....#BroMovie#BroOnNetflix pic.twitter.com/1lxuAawGPe — The South Movies (@TheSouthMovies1) August 20, 2023 చదవండి: సాయిధరమ్ తేజ్ రీల్ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో! -
నిహారికను తిట్టిన నెటిజన్కు సాయిధరమ్ తేజ్ వార్నింగ్
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారింది. చాలామంది ట్రోలర్లు ఇదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. విడాకుల వ్యవహారం తర్వాత ఇది పీక్స్కు వెళ్లింది. తను వెకేషన్కు వెళ్లినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. ఏం చేసినా సరే తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నెగెటివిటినీ నిహారిక లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ 'సత్య' అనే షార్ట్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో ఒక పాటను ఆగస్టు 15న విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన అప్డేట్లను సాయిధరమ్ తేజ్ ఎప్పటికప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ పోస్ట్పై నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ఈ పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను అని కామెంట్ చేసింది. దీనికి రిప్లైగా ఓ నెటిజన్.. వీటి మీద ఉన్న శ్రద్ధాసక్తులు కుటుంబం మీద లేకపాయె అని సెటైర్ వేశాడు. దీంతో సాయిధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు అదుపులో పెట్టుకో, వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయ్ అని వార్నింగ్ ఇచ్చాడు. నిహారిక కోసం తేజ్ అండగా నిలబడడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే నెటిజన్ కామెంట్తో పాటు తేజ్ తన కామెంట్ను సైతం డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: జైలర్లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
సాయిధరమ్ తేజ్ ‘ది సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ
టైటిల్: బ్రో నటీనటులు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, . కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ , బ్రహ్మానందం తదితరులు నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ స్క్రీన్ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సముద్రఖని సంగీతం: తమన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 28, 2023 ‘బ్రో’కథేంటంటే.. మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్ వారియర్, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదే తనలోకం. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే చూసుకుంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం డబ్బు సంపాదన మీదే పెడతాడు. చివరకు తన ప్రియురాలు రమ్య(కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేడు. అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న మార్క్ ఓ రోజు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ అంధకారంలోకి వెళ్తుంది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్ టైటాన్(పవన్ కల్యాణ్) ప్రత్యక్షమవుతాడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని, కొన్ని రోజులు బతికే చాన్స్ ఇవ్వమని టైటాన్ని వేడుకుంటాడు మార్కండేయ. టైటాన్ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. మరి ఈ 90 రోజుల్లో మార్కండేయ తన బాధ్యతలు నెరవేర్చాడా? ఈ క్రమంలో అతను ఏం నేర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. జీవితంలో ఓ వ్యక్తికి రెండో చాన్స్ వస్తే ఎలా ఉంటుంది? దానిని సద్వినియోగం చేసుకుంటాడా? ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతాయా? లేదా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే మాతృకకు, తెలుగు ‘బ్రో’కు చాలా వ్యత్యాసం ఉంది. పవన్ కల్యాణ్ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు. అక్కడ రెండో చాన్స్ వయసు అయిపోయిన ఓ ముసలాయనకు వస్తే.. ఇక్కడ రెండో చాన్స్ ఓ యువకుడికి వస్తుంది. అలాగే అక్కడ టైంగాడ్ పాత్ర నిడివి చాలా తక్కువ, కానీ తెలుగులో టైంగాడ్ దాదాపు సినిమా మొత్తం ఉంటాడు. అయితే ఈ మార్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. లుక్స్ పరంగా మాత్రం వింటేజ్ పవన్ కల్యాణ్ని తెరపై చూస్తారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథ ప్రారంభమవుతుంది. సాయితేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ భూమి మీదకు వచ్చకా..అక్కడ జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ సోసోగా ఉంటాయి. ప్రతిసారి పవన్ని ఎలివేట్ చేస్తూ చూపించడం ప్యాన్స్ని అలరిస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి అతిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పాత పాటలను పెట్టడం కూడా మైనస్సే. ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటే చూసే ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఫ్యాన్స్ కోసమే చేశారు. సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. అయితే సాయితేజ్ పాత్ర పడే సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ, కథనం బాగున్నప్పటికీ.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో హీరో సాయి తేజ్ అయినప్పటికీ సినిమా మొత్తం పవన్ కల్యాణ్ పాత్ర ఉంటుంది. టైంగాడ్ టైటాన్గా పవన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై వింటేజ్ పవన్ను చూస్తారు. ఇక మార్క్ పాత్రకు తేజ్ న్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తేజ్ బాడీలో మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా అయ్యాడు.అది స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ కూడా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు. మార్క్ లవర్ రమ్యగా కేతికా శర్మ ఉన్నంతలో పర్వాలేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ చక్కగా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్గా వెన్నెల కిశోర్తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం జస్ట్ ఓకే. కొన్ని పాటలు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. స్క్రీన్ప్లే, డైలాగ్స్లో తివిక్రమ్ మార్క్ అంతగా కనిపించదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్లో..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది) మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే 'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్మార్, అన్నవరం, గబ్బర్సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్లు కావడం విశేషం. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) -
కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్.. డైలాగులే మైనస్!
సాధారణంగా ఓ మూవీ ట్రైలర్లో ది బెస్ట్ సీన్స్ని మాత్రమే చూపిస్తారు. సినిమా మొత్తంలో అవే కీలకం అనేలా ట్రైలర్ని కట్ చేస్తారు. ఎందుకంటే ఓ ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించడంలో పాటలతో పాటు ట్రైలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిలో ‘బ్రో’మూవీ విఫలమైంది. తమన్ అందించిన పాటలపై తొలి నుంచి విమర్శలే వచ్చాయి. తమ హీరోకి సరైన పాటలు అందించలేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్సే తమన్ను ట్రోల్ చేశారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ఫ్యాన్స్ని కాస్త నిరాశకే గురి చేసింది. పవన్ నోట ఒక్కటంటే ఒక్కటి గుర్తించుకునే డైలాగ్ ట్రైలర్లో చూపించలేదు. ‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని పవన్తో సెట్ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్. ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు. తొలుత మాటల కోసం సాయి మాధవ్ బుర్రా అనుకుంటే.. త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్ప్లే అందించాడు. ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్గా తీసుకున్నారని టాలీవుడ్ టాక్. (చదవండి: ఓపెన్హైమర్ సినిమా రివ్యూ) కేవలం స్క్రీన్ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే నిన్నటి ట్రైలర్లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించలేదు. ట్రైలర్లోనే అలాంటి డైలాగ్స్ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే. పాటలు, ట్రైలర్ యావరేజ్గా ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే.. జులై 28వరకు ఆగాల్సిందే. -
డాన్స్ లో గ్రేస్, మాటల్లో మార్పుపై క్లారిటీ ఇచ్చిన సాయి తేజ్
-
సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాల నుంచి ఆరు నెలలపాటు బ్రేక్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తేజ్, పవన్ కల్యాణ్ బ్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో ఇటీవల రిలీజైన ఓ పాటపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పాట ట్యూన్ బాలేదంటే సాయిధరమ్ తేజ్ స్టెప్పులు అంతకన్నా బాలేవని నెటిజన్లు పెదవి విరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ ట్రోలింగ్పై స్పందించాడు. తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే గ్రేస్తో డ్యాన్స్ చేయలేకపోతున్నానని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'బ్రో సినిమాలోని పాటలకు సరిగ్గా డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయం వల్ల ఎనర్జీతో స్టెప్పులేయకపోతున్నాను. గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నాను. దెబ్బ తగిలితే ఆగిపోకూడదు. ఏదేమైనా మందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. డ్యాన్స్ దగ్గరి నుంచి మాట్లాడటం వరకు తడబడుతున్నాను. బ్రో సినిమాలోని పాటలో నా డ్యాన్స్ చూసి ప్రజలే కాదు నేను కూడా నిరాశచెందాను. నేను సరిగా చేయలేకపోతున్నానని బాధపడ్డాను. నిజానికి నేను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారు. దానివల్ల చాలా బరువు తగ్గాను. ఫిట్నెస్ కూడా కోల్పోయాను. అకస్మాత్తుగా స్టెరాయిడ్స్ మానేయడం, వర్కవుట్స్ చేయకపోవడం వల్ల మళ్లీ బరువు పెరిగాను. ఇప్పుడు నేను బరువు తగ్గి ఫిట్నెస్పై దృష్టిపెట్టాలని ఆలోచిస్తున్నాను. బ్రో తర్వాత సినిమాలకు విరామం ఇద్దామనుకుంటున్నా. ఒక చిన్న సర్జరీ ఉంది. దాన్నుంచి కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాతే సంపత్ నందితో సినిమా చేస్తాను' అని చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. చదవండి: జీవిత రాజశేఖర్కు ఏడాది జైలు శిక్ష బాలీవుడ్ ఎంట్రీకి కీర్తి సురేశ్ రెడీ -
Sai Dharam Tej Photos: శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించిన సాయిధరమ్ తేజ్ (ఫోటోలు)
-
వివాదంలో మెగా హీరో.. అసలేం జరిగిందంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ఇటీవలే విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి వివాదం మొదలైంది. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. అక్కడ సుబ్రమణ్యస్వామివారికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే హీరోకు తలనొప్పిగా మారింది. అయితే నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) -
ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!
పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్ ఎంతో హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. దానికి రెండు కారణాలు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలన్నీ రీమేక్లు కావడం. గతంలో నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం. అందుకే పవన్ సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా సరిగా కావడం లేదు. తాజాగా పవన్ నటించిన ‘బ్రో’ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఈ చిత్రానికి నైజాం నుంచి దాదాపు రూ.35 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ రాబట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇది పవన్ గత చిత్రం భీమ్లా నాయక్ కంటే రెండు కోట్లు ఎక్కువనే చెప్పాలి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు ‘బ్రో’ని కొనేందుకు విముఖత చూపిస్తున్నారట. అసలే ‘బ్రో’ మూవీ రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి తెలుగు రీమేక్. ఈ మధ్యకాలంలో రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు. (చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అందుకే దిల్రాజు ‘బ్రో’ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే పవన్ కల్యాణ్కి నైజాంలో మార్కెట్ పెరగడం లేదు. ఈ విషయంలో కూడా దిల్రాజు భయపడుతున్నారట. సినిమా తన చేతుల్లో నుంచి పోయినా పర్లేదు కానీ అంత భారీ మొత్తానికి కొని, కోట్లలో నష్టపోవడం ఎందుకనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ దిల్ రాజు ముందుకు రాకపోతే మైత్రీ మూవీస్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ పెట్టాలనే ‘బ్రో’ నిర్మాత భావిస్తున్నారట. 'బ్రో' సినిమా విషయానికొస్తే.. రెండేళ్ల క్రితం సముద్రఖని దర్శకత్వం వహించిన `వినోదయ సీతం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంచనాలకు తగ్గట్లుగానే బాక్సాఫీస్ను షేక్ చేసింది. చదవండి: మరో వ్యాపారరంగంలోకి లేడీ సూపర్స్టార్ నయనతార ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలె రూ. 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ సూపర్హిట్ అయిన ఈ మూవీ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం అర్థరాత్రి నుంచే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్స్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్ -
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్కి సాయి ధరమ్ తేజ్
-
మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు నుంచే సూపర్హిట్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్ను షేక్చేసి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం ఈ విజయంపై సాయితేజ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్స్టాలో పోస్టును షేర్ చేశాడు. కాగా ఇప్పటికే థియేటర్లలో సూపర్ హిట్ అయిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.ఈనెల 21 నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. Supreme Hero @IamSaiDharamTej's #Virupaksha celebrates the Spectacular Commercial Triumph 🥳🥁#BlockbusterVirupaksha amasses Incredible 1️⃣0️⃣0️⃣ Crores with Immense Love from audience ♥️@iamsamyuktha_ @karthikdandu86 @Shamdatdop @AJANEESHB @SVCCofficial @SukumarWritings pic.twitter.com/UcftHOtRPv — SVCC (@SVCCofficial) May 18, 2023 -
ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీ పార్ట్నర్ ఖరారు చేసుకున్న విరూపాక్ష రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకుంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!) #Virupaksha to stream on #Netflix from May 21, 2023.#AjaneeshLokanath Musical pic.twitter.com/zFEWrOtGdF — Filmy Corner (@filmycorner9) May 16, 2023 -
Manchu Manoj: కొత్తింట్లో సాయి ధరమ్ తేజ్కు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్ (ఫొటోలు)
-
మెగా హీరోకు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్
హీరో మంచు మనోజ్కు టాలీవుడ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. అతనితో మనోజ్ చాలా సన్నిహితంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ కొత్తింట్లో సాయిధరమ్ తేజ్, నరేష్ కొడుకు నవీన్విజయ్ కృష్ణ సహా పలువురు స్నేహితులు సందడి చేశారు. స్వయంగా బిర్యానీ వండుకొని నైట్ పార్టీని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను స్వయంగా మనోజ్ తన ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. రీసెంట్గా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయితేజ్కు మరోసారి అభినందనలు తెలిపాడు. చదవండి: సమంత బోల్డ్ సీన్స్ వల్లే విడాకులా? క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య లవ్ యూ బ్రదర్స్ అంటూ మనోజ్ షేర్ చేసిన ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే వాట్ ది ఫిష్ (What the Fish) అనే ఓ కొత్త సినిమాను మనోజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించనున్న విరూపాక్ష
-
విరూపాక్ష హిట్.. ఇది నాకు సవాల్ లాంటిది: దిల్ రాజు
సాయిధరమ్తో నేను మూడు సినిమాలు తీశాను. తన కెరీర్లో విరూపాక్ష హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇది నాకు సవాల్ లాంటిదే. తనతో నేను సినిమా తీస్తే విరూపాక్ష కంటే ఇంకా పెద్ద సినిమాను, దాన్ని మించి హిట్ కొట్టే మూవీ తీయాలి అని నిర్మాత దిల్ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరూపాక్ష'. బాపినీడు బి. సమర్పణలో శ్రీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై, హిట్గాగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'విరూపాక్షని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ మాట చెప్పడంలో ఆనందం ఉంది. ఈ సినిమాను ఈ నెల 5న హిందీ, తమిక్, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న కన్నడలో విడుదల చేస్తున్నాం' అన్నారు. "మా బ్యానర్కి విరూపాక్ష లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చిన మా టీమ్కు, ప్రేక్షకులకు థ్యాంక్స్" అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు. బి. "విరూపాక్ష"ని మళ్లీ మళ్లీ చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అన్నారు కార్తీక్ దండు. "విరూపాక్ష ఇతర భాషల్లోనూ అద్భుతాలు సృష్టిస్తుందని భావిస్తున్నాం" అని సంయుక్తా మీనన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటో గ్రాఫర్ శ్యామ్ దత్, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విరూపాక్ష మూవీ పంపిణీదారులు పాల్గొన్నారు. చదవండి: అఖిల్ కొత్త సినిమా.. హీరోయిన్గా జాన్వీ! -
రికార్డు బ్రేక్ చేసిన సాయి ధరమ్ తేజ్
-
నేను మీ వాడినే, ఇక్కడే చదువుకున్నా: సాయిధరమ్ తేజ్
తాను మీ వాడినేనని నటుడు సాయి ధరమ్ తేజ్ చెన్నైలో పేర్కొన్నారు. ఈయన కథా నాయకుడిగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించింది. గత వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో దీనిని స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కేఈ జ్ఞానపీవల్ రాజా తమిళనాడులో మే 5న విడుదల చేయనున్నారు. శక్తి ఫిలింస్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్ర యూనిట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. తాను 35 ఏళ్లుగా తమిళంలో చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్నానని, దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలోనే చిత్రం చేయాలని భావించానన్నారు. ఆ తరువాత అగస్త్రియన్ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేసినా కుదరలేదన్నారు. అలాంటివి విరూపాక్ష చిత్రంతో కోలీవుడ్కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తాను మీ వాడినేనని టీ నగర్లో చదువుకున్నానని చెప్పారు. విరూపాక్ష చిత్రాన్ని కష్టపడి చేశామని తెలుగులో మంచి విజయం సాధించిందని చెప్పారు. చిత్రంలో అన్ని అంశాలు ఉంటాయని, మీ ఆదరణ కావాలని కోరారు. తమిళంలో చిత్రం చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అవకాశం వస్తే నేరుగా తమిళ చిత్రం చేయడానికి సిద్ధం అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, పెళ్లికాకుండానే రెండోసారి -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్
-
నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ రుణపడి ఉంటాను : సాయితేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్ను అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి తరలించి సాయమందించాడు. దీంతో సాయితేజ్ను కాపాడినందుకు మెగా ఫ్యామిలీ అబ్దుల్కు కారు, బైకు, లక్ష రూపాయల వరకు నగదు.. ఇలా వరాలు కురిపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తొలిసారి అబ్దుల్ స్పందించాడు. చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్ తేజ్ నుంచి, ఆయన కుటుంబం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇలా అసత్య ప్రచారం వల్ల గతంలో పనిచేసే చోట జాబ్ కూడా మానేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు అబ్దుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. అది కాస్తా సాయితేజ్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. 'అబ్దుల్ ఫర్హాన్కు సాయం చేసినట్లు నేను, నా టీమ్ ఎక్కడా చెప్పలేదు. కావాలంటే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాను. ఆయన ఫ్యామిలీకి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయమని నా మేనేజర్ నెంబర్ ఇచ్చాను' అంటూ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఇకపై తాను మాట్లాడాలనుకోవట్లేదని కూడా పేర్కొన్నాడు. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ To whomsoever it may concern.. Thank You Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023 -
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
టాలీవుడ్ పై సీక్వెల్ వర్షాలు
-
హారర్ జానర్ కు మల్లి మంచి రోజులు?
-
సాయిధరమ్ తేజ్ నాకు నెంబర్ ఇవ్వలేదు, ఇంతవరకు కలవలేదు: అబ్దుల్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఆయన్ను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి అబ్దుల్ ఫర్హాన్. సకాలంలో తేజ్కు చికిత్స అందేలా చేసిన అతడికి మెగా ఫ్యామిలీ లక్షల రూపాయలు, కారు, బైకు, బంగ్లా బహుమతిగా ఇచ్చిందంటూ ఆ మధ్య ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, ఎలాంటి రివార్డు ఇవ్వలేదని ఇటీవల సాయిధరమ తేజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఏదో ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఏ రివార్డు ఇవ్వలేదని చెప్పాడు. కానీ తన ఫోన్ నెంబర్ ఇచ్చానని.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని చెప్పినట్లు వెల్లడించాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అబ్దుల్ స్పందిస్తూ తన పరిస్థితిని వివరించాడు. 'సాయిధరమ్ తేజ్ను కాపాడిన తర్వాత నన్ను ఎవరూ కలవలేదు. తేజ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కలవలేదు. తేజ్ నన్ను కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే! నాకు మెగా ఫ్యామిలీ సాయం చేసిందంటూ వచ్చిన ఫేక్ న్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదట ఒక షాపులో పని చేసేవాడిని. కానీ మెగా ఫ్యామిలీ నాకు రివార్డు ఇచ్చిందంటూ ప్రచారం జరగడంతో మా కొలీగ్స్, బంధువులు అందరూ.. ఇంకే.. బాగా డబ్బు ఇచ్చారట.. బిల్డింగ్ ఇచ్చారట.. జాక్పాట్ కొట్టావ్ అని టార్చర్ పెట్టారు. అది భరించలేక అక్కడ ఉద్యోగం మానేశా. తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. నాకు ఎవరి నుంచి ఏ సాయం అందలేదు, ఎవరి నుంచీ ఫోన్ రాలేదు, ఎవరూ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అయినా ఇప్పటికీ నా గురించి ఫేక్ ప్రచారం జరుగుతూనే ఉంది, దీనివల్ల ఇప్పటికే నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ ప్రచారాన్ని ఆపేయండి' అని ఆవేదన వ్యక్తం చేశాడు అబ్దుల్ ఫర్హాన్. చదవండి: ఓటీటీలోకి వచ్చిన దసరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే విశ్వక్ సేన్ కొత్త సినిమా.. ఈసారి రాజమండ్రిలో జరిగిన కథ ఆధారంగా.. -
తేజ్ క్రష్ ఆన్ సామ్...!
-
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ.. సాయి ధరమ్ తేజ్ నాన్నకు ఏంటీ సంబంధం?
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలో ఎవరినీ అడిగినా గుర్తుపట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ ఆయన బాటలోనే ప్రయాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొస్తున్న మరో యంగ్ హీరో, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈనెల 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే కావొచ్చు. కానీ సాయి ధరమ్ తేజ్ తండ్రి గురించి మీకు తెలుసా? అంతే కాదండోయ్ ఆయనొక నిర్మాత అని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తండ్రి జీవీఎస్ ప్రసాద్ ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా తీశారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ప్రేక్షకులందరికీ తెలిసు. కానీ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ నాన్న నిర్మాతగా ఉన్నారన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఇంతకీ ఆయన తీసిన సినిమా ఏదో తెలుసుకోవాలనుందా? పదండి అదేంటో చూసేద్దాం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఓ రేంజ్ ఉండేది. ఆయన సినిమాల్లో చేసే డ్యాన్స్ను అందరూ ఫిదా అయిపోయేవారే. అలా వెండితెరపై ఆయనొక ఎవర్ గ్రీన్ నటుడు. ఆయనతో సాయి ధరమ్ తేజ్ నాన్న జీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'రౌడీ అల్లుడు'. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు మెగాస్టార్. చిరు కెరీర్లో రౌడీ అల్లుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా 1991 అక్టోబర్ 18న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి కళ్యాణ్గా, ఆటో జానీగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత జీవీఎస్ ప్రసాద్ మరో సినిమా నిర్మించలేదు. మొత్తంగా ‘రౌడీ అల్లుడు’ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. -
'విరూపాక్ష' విధ్వంసం.. నాలుగు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సార్ భామ సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్లోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ వంశీ కాక తన ట్విటర్లో షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే విరూపాక్ష బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించటం విశేషం. దీంతో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం.. అది కూడా నాలుగు రోజుల్లోనే యాభై కోట్లు మార్క్ను టచ్ చేయటం ఇదే తొలిసారి అవుతుంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుకుమార్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. #Virupaksha continues the Blockbuster run at Box-office on weekdays too & hits the 50CR+ Milestone at the Box-office in just 4 days 🥳💥#BlockbusterVirupaksha IN CINEMAS NOW 👇https://t.co/VXxU4xmSnk@IamSaiDharamTej pic.twitter.com/pqOzIu3udj — Vamsi Kaka (@vamsikaka) April 25, 2023 -
ప్రేక్షకులు సవాల్ విసిరారు, దానికి సమాధానమే ఇది: సాయిధరమ్ తేజ్
‘‘గత ఏడాది కొన్ని సినిమాలకు ప్రేక్షకులు సరిగ్గా రాలేదు. మమ్మల్ని థియేటర్స్కు రప్పించే సినిమాలు తీస్తేనే వస్తామంటూ ఆడియన్స్ ఓ చాలెంజ్ విసిరారు. ఆ సవాల్కి జవాబే ‘విరూపాక్ష’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 21) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్దో కాదు.. మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విరూపాక్ష’ని హిట్ చేసిన ఆడియన్స్కు థ్యాంక్స్’’ అన్నారు కార్తీక్ దండు. ‘‘ఈ మూవీలో నా పాత్రకి వస్తున్న స్పందనకు కారణం కార్తీక్గారే’’ అన్నారు సంయుక్తా మీనన్. ‘‘ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ మారుతి. ‘‘విరూపాక్ష’ని అందరూ థియేటర్లోనే చూడండి.. గొప్ప అనుభూతి వస్తుంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్, కెమెరామేన్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, సాయిచంద్, అజయ్, కమల్ కామరాజు బ్రహ్మాజీ, రవికృష్ణ పాల్గొన్నారు. -
విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్పై తేజ్ ఫ్యాన్స్ దాడి
ఎక్కడ చూసినా విరూపాక్ష సందడే కనిపిస్తోంది. ఈ హారర్ సినిమాతో థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఈ సినిమాకు వెళ్తున్నారు ప్రేక్షకులు. అయితే హైదరాబాద్ మూసాపేటలో ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసి లోనికి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాయంత్రం ఆరు గంటలకు లోపలకు వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం వేచి చూశారు. కానీ ఎంతకూ షో ప్రారంభమవలేదు. గంటన్నర తర్వాత కూడా షో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన సాయిధరమ్ తేజ్ అభిమానులు థియేటర్పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అటు థియేటర్ యజమానులు సైతం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు తిరిగిచ్చేశారు. అయితే చాలామందికి జీఎస్టీ, పార్కింగ్ ఫీజు అంటూ సగం టికెట్ డబ్బులే ఇచ్చారని, కొద్దిమందికి మాత్రమే పూర్తి మొత్తం డబ్బు వాపస్ చేశారని ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో వాపోయాడు. కాగా సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుండటం విశేషం. మొత్తానికి రీఎంట్రీతోనే సాయిధరమ్ తేజ్ భారీ హిట్ కొట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. చదవండి: నగ్న ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తానన్న ఫ్రెండ్ మాటలకు నటి ఎమోషనల్ -
తేజ్ మీద చాలా కోపంగా ఉంది..
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనగానే సంయుక్త రియాక్షన్ చూడండి..
-
ఫన్నీ స్పీచ్ తో నవ్వులు పూయించిన సోనియా.. తేజ్ రియాక్షన్ చూడండి
-
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్, రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని దక్కించుకుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సాయి తేజ్ రీఎంట్రీతోనే బిగ్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. సాయితేజ్కి జోడిగా సంయుక్త మీనన్ నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
సాయితేజ్ 'విరూపాక్ష' సక్సెస్పై రామ్చరణ్ ట్వీట్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. నిన్న(శుక్రవారం)గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ని సొంతం చేసుకుంది. కార్తీక్దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయితేజ్కు జంటగా సంయుక్తా మీనన్ నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అందుకు తగ్గట్లే వసూళ్లను రాబట్టింది. చాలాకాలం తర్వత సాయితేజ్ విరూపాక్ష చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని మెగా అభిమానులు సహా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సాయితేజ్ సక్సెస్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పటికే చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలుపగా తాజాగా రామ్చరణ్ ట్వీట్ చేశారు. 'కంగ్రాట్స్.. మై బ్రదర్(సాయితేజ్). విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నా' అంటూ చరణ్ పేర్కొన్నాడు. Congratulations brother @IamSaiDharamTej hearing great things about #Virupaksha 😊 @karthikdandu86@iamsamyuktha_ @BvsnP @SVCCofficial @Shamdatdop @bkrsatish @SukumarWritings pic.twitter.com/PIH235uYxM — Ram Charan (@AlwaysRamCharan) April 22, 2023 -
‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..
సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. కార్తీక్ దండు రాసుకున్న కథ రొటీన్గానే ఉన్నప్పటికీ.. సుకుమార్ స్క్రీన్ప్లే సినిమాను నిలబెట్టింది. అలాగే అజనీష్ లోక్నాథ్ నేపథ్యం సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఫస్ట్డే ఫస్ట్ షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. . ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: విరూపాక్ష మూవీ రివ్యూ) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.35కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఏరియా వైజ్గా చూస్తే.. నైజాంలో అత్యధికంగా రూ.1.82 కోట్లు, వైజాగ్ రూ.58లక్షలు, సీడెడ్ రూ. 54 లక్షలు, గుంటూరు రూ. 46 లక్షలు, నెల్లూరు రూ. 20 లక్షలు, కృష్ణా రూ. 32 లక్షలు, వెస్ట్ రూ. 47 లక్షలు, ఈస్ట్ రూ.40 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్తో పాటు మిగిలిన ప్రాంతాలలో రూ. 1. 56కోట్లు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ వర్గాలు అంచానా వేస్తున్నాయి. -
ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ) తాజాగా ఈ చిత్రానికి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఓటీటీకి సంబంధించిన మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మేనల్లుడి 'విరూపాక్ష' హిట్.. చిరంజీవి ఎంత ఆనందంగా ఉన్నారో
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు తెరకెక్కిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో సాయితేజ్కు జంటగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్తో హిట్ టాక్తో థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలిపారు. సతీమణి సురేఖ సాయితేజ్కు కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై అద్భుతమైన స్పందన వస్తోంది. సాయితేజ్ విరూపాక్షతో గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడం, వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. వీరూపాక్ష టీంకు హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి మేనల్లుడు సాయితేజ్ స్పందిస్తూ.. థ్యాంక్యూ అత్తా, మామ. లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm — Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023 -
తేజ్.. ఇది నిజామా? మెగా మేనల్లుడిని ఆడుకుంటున్నారు
-
‘విరూపాక్ష’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల విరూపాక్ష ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విరూపాక్ష’ కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?) సినిమాకు ట్విటర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందట. సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ట్విస్టులు కూడా బాగున్నాయట. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!) #Virupaksha A Good Village Thriller with Horror Elements! Interesting storyline with some spine chilling moments and nice twists. Though the love track in the 1st half is boring and the pace is uneven in parts, the screenplay engages for the most part and works out. Rating:… — Venky Reviews (@venkyreviews) April 21, 2023 #VirupakshaReview Something untitled Story Lineup concept is regular story no extra added fresh mashup @IamSaiDharamTej Done with maximum efforts @iamsamyuktha_ clevage shots highlights movie Director Version of Narration. SDM Overall Rating - 2/5 ⭐⭐ #Virupaksha — South Digital Media (@SDM_official1) April 21, 2023 ప్రీ ఇంటర్వెల్లో చిల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయట. సెకండాఫ్పై ఇంట్రెస్ట్ కలిగేలా ఇంటర్వెల్ సెట్ చేశారట. మొదటిభాగంలో లవ్ స్టోరీ బోరింగ్గా ఉంటుందట. అలాగే సినిమా కూడా స్లోగా సాగుతుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Nice 2nd half. Highly engaging screenplay. Interesting story. It's been quite some time since we saw this kind of story in telugu films. Good watch #Virupaksha https://t.co/oLy3E7Lw6m — Puri stan (@purijagan_stan) April 21, 2023 #Virupaksha has a very good story and almost made well. The climax is bad and could have been much better story wise. This story also deserves a higher budget and could have used VFX better. Overall, I highly recommend watching the movie. @IamSaiDharamTej @SukumarWritings — Telugu Cinemaalaya (@cinemaalayaa) April 21, 2023 Decent watch..bgm aripinchadu..telugu lo chala days tarvatha proper thriller/horror #Virupaksha — Pandagowwww (@ravi_437) April 21, 2023 #Virupaksha is @IamSaiDharamTej’s career best film. Excellent script & wonderful execution by Director Karthik. It’s a big screen spectacle with top notch sounds effects. Rating 4/5. — Deccan Delight (@DeccanDelight) April 21, 2023 Virupaksha review: 2023 version of Chandramukhi Congrats @IamSaiDharamTej vanna.#Virupaksha#VirupakshaInCinemasNow — sri (@sri_pspk_devote) April 21, 2023 -
ఆ హీరోయిన్ని ప్రేమించా.. డేటింగ్కి పిలిచా కానీ..: సాయి ధరమ్తేజ్
ఏ విషయంలోనైనా చాలా ఓపెన్గా ఉంటాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటాడు. ఇక యాక్సిడెంట్ సాయిధరమ్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నది ఒక్కటే జీవితం.. నవ్వుతూ..నవ్విస్తూ బతకాలని డిసైడ్ అయ్యారు. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్వూలోనూ ఇదే విషయాన్ని ఆయన చెబుతున్నారు. జీవితం అంటే కష్టాలు వస్తాయని అని వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అంటున్నాడు. ఇక తన పెళ్లి విషయంలోనూ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, మంచి అమ్మాయి కనిపిస్తే తప్పకుండా చేసుకుంటానని చెబుతున్నాడు. అలాగే గతంలో ఓ అమ్మాయితో బ్రేకప్ అయిన విషయం కూడా చెప్పాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించారు..అమ్మ తర్వాతే ఎవరైనా: సాయి తేజ్) ‘ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారు. నా లైఫ్ లోనూ ఒకరున్నారు. ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు నా ఫస్ట్ హీరోయిన్స్. ఇక నా లవ్స్టోరీ విషయానికొస్తే.. ఇంటర్లో ఉన్నప్పుడు నా బెస్ట్ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకున్నాం. కట్ చేస్తే.. డిగ్రీలో నేనే దగ్గరుండి ఆమెకు పెళ్లి చేశా. ఎందుకంటే అప్పటికీ నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా(నవ్వూతూ...). ఇక సినిమాల్లోకి వచ్చాక.. .. 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్ షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రపోజ్చేశా. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్ చేద్దాం’అని డైరెక్ట్గా అడిగేశా. కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది. సారీ తేజ్.. నాకు ఆల్రెడీ బాయ్ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. బాధతో వెళ్లిపోయా. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్నట్లు బ్రతుకుతున్నా. ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడు పెళ్లి అవుతుంది’ అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. -
మూవీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి నానా కష్టాలు పడుతున్న అఖిల్, తేజ్
-
యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది..అమ్మ తర్వాతే ఎవరైనా..: సాయిధరమ్ తేజ్
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన కుటుంబాల కోసమైనా హెల్మెట్ పెట్టుకోవాలి. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ కాపాడింది’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘భారీ యాక్సిడెంట్ తర్వాత విడుదలవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లే ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది’’ అంటూ మరిన్ని విశేషాలను సాయిధరమ్ తేజ్ ఈ విధంగా చెప్పారు. ►1989–90 మధ్య ఓ గ్రామం అనుమానాస్పద హత్యలతో భయానకంగా మారుతుంది. హత్యలు ఎవరు చేశారు? గ్రామానికి చేతబడి ఎందుకు చేశారన్న వాటిని వెతుకుతూ హీరో చేసే ప్రయాణమే ‘విరూపాక్ష’ సినిమా. నేను చేతబడిని నమ్మను. ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను అని అర్థం. శివుడి పేరు. రూపం లేని వాటితో హీరో చేసే సంఘర్షణ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ►యాక్సిడెంట్ తర్వాత నేను సినిమాలు చేస్తానా... లేదా అని చాలామంది సందేహించారు. యాక్సిడెంట్ నాకు చాలా నేర్పింది. మా అమ్మ నన్ను ఈ వయసులో చిన్న పిల్లోడిలా చూసుకుంటూ నా మాటలు తడబడుతున్నా ధైర్యం నింపి ప్రోత్సహించారు. 36 ఏళ్ల వయసులో నాకు మళ్లీ మాటలు నేర్పించారు. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాతే ఎవరైనా. ► ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి అంత బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అడ్జస్ట్ అయ్యారు. మా నిర్మాతలు ఎంతో సపోర్టివ్గా నిలిచారు. ► ‘విరూపాక్ష’ని ‘కాంతార’తో పోల్చలేం. ‘కాంతార’ ఓ క్లాసిక్. ‘విరూపాక్ష’ సస్పెన్స్ థిల్లర్గా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకుడు కార్తీక్ కథ చెబుతున్నప్పుడే కొత్త అనుభూతికి గురయ్యాను. కథలో కొత్త క్యారెక్టర్స్ రావడం.. ట్విస్ట్లతో చిత్రం వేగంగా వెళుతుంది. ప్రతి 20 నిమిషాలకు కొత్తదనంతో కథ సాగుతుంది. ► 1989లలో అబ్బాయి–అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో, ఆ సమయంలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చూపించాం. చేతబడులు, మూఢనమ్మకాల గురించి చెప్పాం. నాకు హర్రర్ సినిమాలంటే భయం. ఆ భయానికి విరుగుడుగా నేను హనుమంతుణ్ణి నమ్ముతాను. ► తెలుగు సినిమా స్టామినాని ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. ‘విరూపాక్ష’ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. ముందు ఇంట గెలవాలని అనుకుంటున్నాం. తెలుగులో రిలీజ్ చేశాక అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాం. ► జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే. యాక్సిడెంట్ తర్వాత మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సిరివెన్నెల గారి పాటలోని స్ఫూర్తి నింపే ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ మెసేజ్ చేశారు. అందరి ఆదరాభిమానాల వల్ల యాక్సిడెంట్ తర్వాత మీ ముందు ఇలా ఉన్నాను. నా జీవితం దాదాపు సవాళ్లతోనే నిండింది. సవాళ్లు లేకుంటే లైఫ్ చప్పగా అనిపిస్తుంది. ► ఇప్పుడు నా మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీ. రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకోవడంలేదు. ఎందుకంటే ప్రతీ వారం ఓ రికార్డ్ బ్రేక్ అవుతుంటుంది. చదవండి: అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్తో యాక్షన్ సీక్వెన్స్ ఆదిపురుష్లో భాగం కావడం అదృష్టం: ప్రభాస్ -
తేజ్ చిలిపిగా సంయుక్త ని ఎలా ఏడిపిస్తునాడో చుడండి