
భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి పండు మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు( మార్చి 1) విరూపాక్ష టీజర్ రిలీజ్ కానున్నట్లు చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే! కానీ సాయిధరమ్తేజ్ వీరాభిమాని మృతి చెందడంతో టీజర్ రిలీజ్ను వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
'భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి పండు మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ విరూపాక్ష టీజర్ విడుదలను వాయిస్తున్నాం' అని తెలిపింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే అందించి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇదివరకే రిలీజైన గ్లింప్స్కు మంచి స్పందన లభించింది.
We are shocked to hear about the untimely demise of Ravuri Pandu Garu ( Mega Fan and Sai Dharam Tej Fans president, Bhimavaram )
— SVCC (@SVCCofficial) March 1, 2023
As a mark of respect, The teaser release of #Virupaksha stands postponed.
Get ready to Enter the World of #Virupaksha 👁️🔍
— SVCC (@SVCCofficial) February 26, 2023
'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME
చదవండి: ఇండియన్ 2లో విలన్గా వెన్నెల కిశోర్, ఇదిగో క్లారిటీ