270వ రోజు పాదయాత్ర డైరీ | 270th day padayatra diary | Sakshi
Sakshi News home page

270వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Sep 26 2018 7:02 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

ఈరోజు కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ఎల్‌.కోట మండలం రంగరాయపురం వరకు పాదయాత్ర సాగింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాసింది. మండు వేసవిని తలపించింది. అంత వేడిలోనూ ఉక్కపోతలోనూ జనం బారులుతీరి నిల్చున్నారు. యాత్ర ముగింపు సమయంలో మాత్రం వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది. కొత్తవలస నుంచి వచ్చిన పేదలు నన్ను కలిశారు. వారంతా టీలు, పండ్లు, తినుబండారాలు లాంటివి అమ్ముకుని బతికే బడుగుజీవులు. కొత్తవలస జంక్షన్‌ వద్ద 30 ఏళ్లుగా చిన్నచిన్న దుకాణాలు నడుపుకుంటున్నారు. క్రమం తప్పకుండా పంచాయతీ వారికి, రైల్వే వారికి రుసుం చెల్లిస్తూనే ఉన్నారు. కానీ రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం నెపంతో గత నెలలో రాత్రికిరాత్రే బలవంతంగా వారి దుకాణాలన్నీ తొలగించేశారట.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement