287వ రోజు పాదయాత్ర డైరీ | 287th day padayatra diary | Sakshi
Sakshi News home page

287వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Oct 17 2018 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఈ పాలనలో సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రమే. అరకొరగా అమలయ్యే ఆ కొన్నింటిలోనూ రాజకీయ వివక్షే. ఇక అర్హులైన పేదలకు న్యాయం జరిగేదెలా? గజరాయునివలసకు చెందిన కృష్ణ అనే సోదరుడికి రెండు కళ్లూ లేవు. అంధుడైన అతనికి దివ్యాంగుల కోటాలో ఎస్సీ కార్పొరేషన్‌ లోను మంజూరైంది. కానీ పార్టీ వివక్షతో జన్మభూమి కమిటీలు లోన్‌ రానీయకుండా చేస్తున్నాయట. లోచర్లకు చెందిన శంకరరావుదీ అదే పరిస్థితి. వృత్తిరీత్యా బైక్‌ మెకానిక్‌. బీసీ కార్పొరేషన్‌ లోన్‌ తీసుకుని చిన్న మెకానిక్‌ షాపు పెట్టుకోవాలని ఆశించాడు. ఆ లోను కోసం నాలుగేళ్లుగా చేయని ప్రయత్నమే లేదు. ప్రతిసారీ జన్మభూమి కమిటీలు సైంధవుల్లా అడ్డుపడుతూనే ఉన్నాయి. అర్హులైన పేదవారిని ఆదుకోని ఆ కార్పొరేషన్లు ఉండి ఏం లాభం?  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement