ఈ మధ్య రాజకీయ హత్యలు దేశంలో ఏదో ఒక మూల నిత్యం జరుగుతున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ నేతలే లక్ష్యంగా వరుసగా జరుగుతున్న ఉదంతాలు మాత్రం ఆ వర్గ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పంజాబ్లోని అమృత్సర్లో ఆర్ఎస్ఎస్ నేత హత్య కలకలం రేపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం హిందు సంఘర్ష్ సేన జిల్లా అధ్యక్షుడు విపిన్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. భరత్నగర్లోని ఓ మార్కెట్ సముదాయంలో ఆయన్ని నిన్న మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. తన స్నేహితుడితో ఆయన మాట్లాడుతన్న సమయంలో ఓ వ్యక్తి గన్ గురిపెట్టి కాల్చాడు. మొదటి బుల్లెట్కు ఆయన నేల మీద పడిపోగా.. మరో ఆగంతకుడు అతనికి జత చేరి ఇద్దరూ కలిసి విపిన్పై కాల్పులు జరిపారు.
కళ్ల ముందే కాల్చి చంపారు
Published Tue, Oct 31 2017 8:04 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement