ఏం జరిగినా సర్కారుదే బాధ్యత! | chalo assembly: congress leaders fire on KCR govt | Sakshi
Sakshi News home page

ఏం జరిగినా సర్కారుదే బాధ్యత!

Published Thu, Oct 26 2017 4:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. 'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement