komatireddy venkatareddy
-
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
రెండు దశల్లో మామునూరు విమానాశ్రయ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ శివారులోని మామునూరులో విమానాశ్రయాన్ని రెండు దశల్లో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తొలుత చిన్న విమానాలను నడు పుతూ, భవిష్యత్లో ఎయిర్బస్ లాంటి పెద్ద విమా నాలను నడిపేలా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద విమానాలు దిగేందుకు కావాల్సిన రన్వేను ముందుగానే సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎనిమిది నెలల్లో చిన్న విమానాల ఆపరేషన్కు వీలుగా, పెద్ద విమా నాల నిర్వహణను ఏడాదిన్నరలో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్కు వచ్చే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని పేర్కొ న్నారు. తదుపరి కొత్తగూడెం, రామగుండం విమా నాశ్రయాలను నిర్మిస్తామని చెప్పారు. హైదరా బాద్–విజయవాడ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఫిబ్రవరి నాటికి టెండర్లు పిలు స్తామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగకుండా జాప్యం జరుగుతూ వచ్చిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను తాము కొలిక్కి తెచ్చా మని, మేడిపల్లి నుంచి నారపల్లి సీపీఆర్ఐ వరకు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామ న్నారు. శ్రీశైలం రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ను చేపట్టే యోచనలో ఉన్నామని, కేంద్రం సహకరిస్తే దాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఢిల్లీ–ముంబై, ముంబై–నాగ్పూర్, చెన్నై–కన్యాకుమారి ఎక్స్ ప్రెస్వే తరహాలో రీజినల్రింగురోడ్డు దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేయబోతోంద న్నారు. విమానాశ్రయం, ప్రతిపాదిత ఫోర్త్ సిటీతో దీనిని అనుసంధానిస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి అలైన్మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు. నిధుల కోసం జైకా, వరల్డ్ బ్యాంకు, ఏడీబీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొ న్నారు. ఉత్తర భాగానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ భూసేకరణ పరిహారాన్ని ఖరారు చేయలేదని, ఇంకా టెండర్లు పిలవలేదన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేక కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.సచివాలయ ప్రధాన గేటు పూర్తిగా తొలగింపుసచివాలయం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును అధికారులు పూర్తిగా తొలిగించారు. గతంలో ఈ ప్రధాన గేటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రాకపోకలు సాగించేవారు. అయితే సచివాలయ ప్రధాన గేటు లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ గేటును తొలగిస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రధాన గేటు పూర్తిగా కనిపించకుండా ర్యాక్లు ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉన్న నాలుగో గేటుకు పక్కనే మరో గేటును నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం అక్కడ ప్రస్తుతం ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి రాకపోకలు ఉంటాయని సమాచారం. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్ల మార్పు విషయం చర్చనీయాంశమైంది.తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా నాణ్యత లోపించకూడదని, నిత్యం ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విగ్రహాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. -
మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మీద ఉన్న 930 మర్రి చెట్లను ట్రాన్స్లొకేట్ చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేసే 330 చెట్లకు సంబంధించి నిర్మాణ సంస్థతో వెంటనే తాను మాట్లాడతానని మిగతావాటిì తరలింపు పనులను ఎన్హెచ్ఏఐ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘న్యాక్’లో ఎన్హెచ్ఏఐ అధికారులతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాకులు వెతక్కుండా ఇకనైనా పనులు మొదలుపెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆ రహదారి విస్తరణ పనులకు కొత్త టెండర్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశం మేరకు విజయవాడ హైవే విస్తరణ పనుల టెండర్లు రద్దు చేసి వచ్చేనెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టాలని కోమటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఉప్పల్–ఘట్కేసర్ వంతెన పనులకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా సూచించారు. ఆర్మూరు–మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా, ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రీజినల్ రింగురోడ్డు పూర్తయితే డిస్నీల్యాండ్ సంస్థలు ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడికి ముందుకొస్తాయని, పారిశ్రామిక క్లస్టర్లు, ట్రాన్స్పోర్టు హబ్లు ఏర్పడతాయని మంత్రి వారికి వివరించారు. జూలైలో రాష్ట్రానికి ఉన్నతాధికారుల బృందం జూలైలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి జాతీయ రహదారు ల విభాగం ఉన్నతాధికారుల బృందం వస్తున్నందున, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్–మల్కాపూర్ మధ్య మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న జాతీయ రహదారి మలుపుపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాక ప్రత్యేక కార్యదర్శి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఎన్హెచ్ఏఐ ఆర్ఓ రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్ఓ కుషా్వతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ లోపు ట్రిపుల్ ఆర్ పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను డిసెంబర్లోపు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ట్రిపుల్ ఆర్ పనులు ఇప్పటివరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్టు చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ఆధారంగా స్పోర్ట్స్, హార్డ్వేర్ జోన్లు ‘ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి ట్రిపుల్ ఆర్కు ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నాం. దీనితోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్–విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణ పనులను కూడా డిసెంబర్ నాటికి కొలిక్కి తెస్తాం. రూ.375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. 17 ఫ్లైఓవర్లు, అండర్పాస్ల పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నాం.రూ.5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగుళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగ్పూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తాం. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే, మా ప్రభుత్వం అకౌంటబిలిటీ(జవాబుదారీతనం) కోసం పనిచేస్తుంది..’అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. 3 నెలల్లో అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభం ‘ఎనిమిదేళ్ల క్రితం పనులు మొదలై నిలిచిపోయిన ఉప్పల్ వంతెన పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. అంబర్పేట వంతెనను 3 నెలల్లో ప్రారంభిస్తాం. అల్వాల్ మార్గంలో 14 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఢిల్లీలో ఏపీ భవన్ స్థలంలో మన దామాషా ప్రకారం దక్కే భూమిలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్ను నిర్మిస్తాం. దీనికి సంబంధించి డిజైన్లు పూర్తయ్యాయి. రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రోల్ మోడల్గా తెలంగాణ రోడ్లు తెలంగాణ రోడ్లు రోల్మోడల్గా ఉండేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రహదారుల్లో వేటిని జాతీయ రహదారులుగా మార్చాలో తేల్చి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రస్తుతం 16 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. వాటికి అనుమతులు సాధిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో పాటు ప్రధానిని కలుస్తాం. రాహుల్గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం పార్లమెంటులో విపక్ష కూటమి బలంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తాం. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్ వే, దాని పక్కనే బుల్లెట్ రైలు మార్గం సాధించేందుకు కూడా ఒత్తిడి చేస్తాం. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉస్మానియాకు కొత్త భవనంపై అఖిలపక్ష సమావేశం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి అదే స్థలంలో కొత్త భవనాన్ని, అదే నమూనాలో నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వరలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. దేశంలోనే గొప్ప హైకోర్డు భవనంగా తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తాం. దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో భవనం సిద్ధమవుతుంది..’అని మంత్రి వివరించారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్లైన్స్ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్ను కోరారు.నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘కోకో కోలా’ సానుకూల స్పందన అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్రెడ్డికి సూచించారు. -
రేవంత్ జోలికొస్తే ఊరుకోను
-
కాంగ్రెస్ సంక్షోభంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్ను అధిష్టానం నియమించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ‘కమిటీల్లో మేమిచ్చిన పేర్లను పట్టించుకోలేదు. కమిటీ నియామకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగింది. గాంధీభవన్లో ఉంటూ పైరవీలు చేసే వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాలపై దిగ్విజయ్ విచారణ చేయాలి. తెలంగాణలో పరిస్థితులు ఆయనకు తెలుసు. మా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో విచారణ చేయాలి. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలి. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారించాలి.’ అని డిమాండ్ చేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఆరోగ్య శ్రీ పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ అమలవుతోందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ కాంగ్రెస్పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్ -
Congress Party: చర్యల్లో తేడాలెందుకు? కోమటిరెడ్డికి ఓ రూల్.. మర్రికి మరో రూల్!
కాంగ్రెస్ ఒక విచిత్రమైన పార్టీ. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఒక్కొక్కరి మీద ఒక్కోలా చర్యలుంటాయి. బీజేపీ నేతలతో సమావేశమయ్యారనే ఆరోపణతో ఒక నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. మరి మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చెప్పాడంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? మా వాడయితే ఓకే.! కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని.. తమది ప్రజాస్వామ్య పార్టీ అని చెబుతారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ నాయకుడు శశిథరూర్ను ఘోరంగా అవమానిస్తారు. బీజేపీ నేతలను కలుసుకున్నందుకు సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిని ఆరేళ్ళ పాటు బహిష్కరించారు. ఆయనకు కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఘోరంగా విమర్శించిన పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద నో యాక్షన్. పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్రెడ్డి పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా కనీసం పల్లెత్తు మాట అనలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్రెడ్డికి మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో బయటపడినా ఎంపీ వెంకటరెడ్డి మీద నో యాక్షన్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేదా క్రమశిక్షణా సంఘం ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తోంది? పార్టీలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల నాయకుడెవరు? మాదంతా నిబద్ధత, క్రమశిక్షణ కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ.. అక్టోబర్ 22న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షోకాజ్ నోటీసు పంపారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరికి ఫోన్ చేసి మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకటరెడ్డికి ఏఐసిసి నోటీసు పంపింది. ఈ నోటీసుకు వెంకటరెడ్డి చాలా ఆలస్యంగా సమాధానం పంపారు. తాను రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెబుతున్న వాయిస్ మెసేజ్ తనది కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పులు తనవి కావని వివరణ ఇచ్చినట్లు ఏఐసిసి వర్గాల సమాచారం. తాను నిబద్దత, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఏఐసిసి క్రమశిక్షణ సంఘానికి చెప్పారట. అసలు కారణం అదా.? వెంకటరెడ్డి వివరణతో సంతృప్తి చెందిన ఎఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పట్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదని ఏఐసిసి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సిట్టింగ్ ఎంపీ కావడంతో చర్యలు తీసుకోవడానికి అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది అసలు విషయం. ఇప్పటికే లోక్సభలో తక్కువ సభ్యులతో అధమ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీని వదులుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందో పార్టీ హైకమాండ్కు బాగా తెలుసు. అందుకే క్రమశిక్షణ పేరుతో బెత్తం పట్టుకుంటే లోక్ సభలో మరింత పలచబడతామని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని చూసి చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డిని ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారు. కనీస వివరణ తీసుకోకుండా ఆయనపై బహిష్కరణ వేటును కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సైతం చర్యలు తీసుకుంటే సీనియర్లు రగిలిపోయే అవకాశం ఉందట. పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినా.. ఆయన ఎంపీ కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం. శశిధర్రెడ్డి చట్టసభ సభ్యుడు కాదు కనుకే తేలిగ్గా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటే లోక్సభలో కాంగ్రెస్ కౌంట్ ఒకటి తగ్గుతుంది. అందుకే హైకమాండ్ సైతం ఈయన విషయంలో సైలెంట్ అయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
గడ్కరీకి రాయగిరి రైతుల గోడు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డుతో భూములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమవారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్గడ్కరీ సోమవారం మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆయనతో రీజినల్ రింగ్రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చెప్పారు. రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్మెంట్ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. -
మహిళల మృతి పట్టదా.. బీహార్కు ఎలా వెళ్తారు: కేసీఆర్పై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యంగా నలుగురు మహిళలు మృతిచెందారు. దీంతో, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. కాగా, మహిళల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్, సీఎంపై ఫైరయ్యారు. కేసీఆర్ బీహార్ పర్యటనను ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా సీఎం కేసీఆర్ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమటిరెడ్డి సదరు లేఖలో కేసీఆర్ను ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 అనుకూల మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 -
రాహుల్ సభ.. రైతుల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకే వచ్చే నెల 6న వరంగల్కు రాహుల్గాంధీ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి రైతుల్లో ధైర్యం నింపుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత వర్గాలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో వరంగల్ రైతు సంఘర్షణ సభలో వెల్లడిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేయనుందో కూడా చెబుతారు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ సభ విజయవంతం కోసం పార్టీ నేతలందరమూ కృషి చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సభకు వచ్చి రాహుల్ ఏం చెప్తారో వినాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రచార, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఏది?: భట్టి కాంగ్రెస్కు పోటీగా టీఆర్ఎస్ రుణమాఫీ ప్రకటించినా అమలు చేయకపోవడంతో రూ. లక్ష రుణానికి వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయని, ఇప్పుడు ఆ రుణం తీర్చడం రైతులకు కష్టంగా మారిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.లక్ష లోపు వడ్డీలేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రింకర్లతో పాటు పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూములను టీఆర్ఎస్ సర్కారు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతోనే వరి రైతులు నష్టపోయారన్నారు. మూడేళ్ల క్రితమే ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా యేటా ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూలి కూడా గిట్టట్లేదు: కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని, ఆయన ఇచ్చే మద్దతు ధరతో కూలి కూడా గిట్టడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాహుల్ వరంగల్కు రావట్లేదని, రైతుల కోసం వస్తున్నారని చెప్పారు. వరంగల్ సభ ఏర్పాట్ల నుంచి అన్ని అంశాలపై స్పష్టంగా ముందుకెళ్తామన్నారు. ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ నేతల భేటీ గురించి విలేకరులు ప్రశ్నించగా పీకే గురించి పార్టీ నుంచి తమకు ఎలాంటి వివరణ అందలేదని, ఊహాగానాలపై చర్చ అవసరం లేదని, మీడియా కథనాలపై స్పందించలేమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్బాబు -
తెలంగాణ కాంగ్రెస్లో నయా జోష్
-
సొంత డబ్బా ఎక్కువైంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని రాహుల్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన ఫేస్బుక్, ట్విట్టర్లో ఈమధ్య పెట్టిన పలు పోస్టింగ్లను ఆయనకు చూపించినట్లుగా తెలిసింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి రాహుల్ను కలిశారు. ఈ సందర్భంగా ‘పార్టీలో రేవంత్ ఒక్కరే పవర్ఫుల్’, ‘ఆయన మాటల్నే ఏఐసీసీ వింటుంది’, ‘ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది’, ‘ఇతర నాయకులకు ఏఐసీసీ విలువివ్వడం లేదు’ అన్న తరహాలో రేవంత్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి వివరించారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సీనియర్ నేతలకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్ని అంశాలు పరిశీలిస్తామని రాహుల్ వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పంట చేతికొచ్చే సమయంలో కోతలా? సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి కరెంటు కోతల సమస్య వచ్చి పడిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సరైంది కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘ఇప్పటికే వడ్ల కొనుగోలు గురించి రైతులు గందరగోళంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు. అవసరమైతే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 2 గంటలు విద్యుత్ కోతలు విధించి రైతాంగానికి మేలు చేయండి’అని సీఎంకు రాసిన లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్రెడ్డి హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఇందుకు సంబంధించిన లేఖను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డికి అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని, ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని తెలిపారు. కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కిషన్రెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘ పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మల్కాజ్గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ కాంగ్రెస్లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్ లాంటి నేతలు లేరు. కాంగ్రెస్లోనే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు. తెలంగాణలో కాంగ్రెస్ను ముందుకు నడిపై సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’’నని కోమటిరెడ్డి అన్నారు. -
వైస్ఆర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ లో లేడు : కోమటిరెడ్డి
-
చచ్చినా కాంగ్రెస్ను వీడను: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, జహీరాబాద్: కాంగ్రెస్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, చచ్చినా పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేయడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. పీసీసీ పదవి భర్తీలో జాప్యం వల్లే కొంత మంది సీనియర్లు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలను సాకుగా చూపుతూ ఇంకా జాప్యం చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తోందని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దూకుడు పెంచిన టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో నయా జోష్ వచ్చింది. యాత్రలజోరు పెరిగింది. ముఖ్యనాయకులు ‘నడక మంచిదే’అంటున్నారు. నల్ల వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతుయాత్రలు చేపట్టిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇకముందు కూడా ఇదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ యాత్రల ద్వారా పార్టీ కేడర్లో కదలిక వస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టగలుగుతున్నామని భావిస్తున్న టీపీసీసీ నాయకత్వం 2023 ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేపనిలో పడింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని, జై జవాన్, జై కిసాన్ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టేందుకు టీపీసీసీ ముఖ్యులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రెండు యాత్రలు... రెండు రూట్లు రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్లోని ఇద్దరు ముఖ్యనేతలు ఈ నెలలో యాత్రలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 7న అనూహ్యంగా అచ్చంపేట దీక్షా శిబిరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించి 10 రోజులపాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను ఆయన కదిలించగలిగారు. రోజుకు నాలుగైదు గ్రామాల చొప్పున 40 గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్ర ముగింపు సమయంలో రావిరాలలో భారీ జనసమీకరణతో బహిరంగసభ నిర్వహించి ఒక్కసారిగా పార్టీ కేడర్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానని ప్రకటించారు. మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాతో యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి రోజూ ఆయన కూడా నాలుగైదు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మమేకం అవుతున్నారు. వీలున్నచోటల్లా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ నెల 22 వరకు తన యాత్రను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు పార్టీకి ఉపయోగకరంగానే ఉన్నాయనే భావన టీపీసీసీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ యాత్రల గురించి టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ఇన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయలేకపోయామని, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభమైనందున, దీన్ని కొనసాగించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటేనే పార్టీకి మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్కు త్వరలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికే కొందరిని కలిశారని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. మొత్తంమీద వరుస ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయి యాత్రలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ
సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి -
రసాభాసగా కాంగ్రెస్ నేతల సమావేశం
సాక్షి, యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సలీం హమద్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ముఖ్య నాయకుల ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జనగాంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనగాం ప్రాంత కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ అలా చేస్తోంది : ఉత్తమ్ సాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లను వెంటవెంటనే ప్రకటిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పక్షాన కోర్టులో కేసు వేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ బయపడదని అన్నారు. పౌరసత్వ బిల్లు అమలు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
దొంగనాటకాలు ప్రజలు గమనించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దొంగనాటకాలను ప్రజలు గమనించాలని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. పెద్ద నోట్ల రద్దు నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటా బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకూ అనుమతివ్వడం లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఎన్నార్సీకి వ్యతిరేకంగా ‘సేవ్ ఇండియా’పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ఒక్క తెలంగాణలో తప్ప దేశమంతా అనుమతినిచ్చారని చెప్పారు. ఎన్నార్సీకి నిరసనగా శనివారం గాంధీభవన్లో నిర్వహించిన ‘సత్యాగ్రహ దీక్ష’లో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వం పేరుతో దేశంలో కల్లోల వాతావరణానికి బీజేపీ కారణమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విధానాలకు కట్టుబడి ఉందని, అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు భృతి, రైతు రుణమాఫీ, రైతు బంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు, మూడెకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు... ఇలా అన్ని విషయాల్లో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని చెప్పారు. ప్రజల్ని మోసం చేసిన టీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత కూడా లేదని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తామేమీ మున్సిపల్ ఎన్నికలకు భయపడడం లేదని, రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత నామినేషన్ల దాఖలు కొంత సమయం మాత్రమే అడిగామని చెప్పారు. అయినా ఓటరు జాబితా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఘనత తెలంగాణ ఎన్నికల కమిషన్కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తామన్నా అనుమతించకపోవడం దారుణమని, తెలంగాణలో ఆర్ఎస్ఎస్కి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు వారి పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. దేశంలో, రాష్ట్రంలో నియంత పాలనకు త్వరలోనే స్వస్తి పలుకుతామని ధీమాను వ్యక్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్, ఎంఐఎం పార్టీలు మోదీ కోసం పనిచేస్తున్నాయని, అందుకే తిరంగా ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడం అన్యాయమని, అందుకే ఎన్నార్సీని కాంగ్రెస్ విమర్శిస్తోందని చెప్పారు. అనంతరం టీపీసీసీ నేతలు సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ దీక్షలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్బాబు, షబ్బీర్అలీ, మర్రి శశిధర్రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ వీహెచ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు బల్మూరి వెంకట్రావు, అనిల్కుమార్ యాదవ్, నేరెళ్ల శారద, టీపీసీసీ నేతలు ఇందిరా శోభన్, ఫిరోజ్ఖాన్, గౌస్లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్రికత్తల నడుమ కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అంతకుముందు గాంధీభవన్లో ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ తలపెట్టిన ‘సేవ్ ఇండియా ర్యాలీ’కి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆ పార్టీ నేతలతో కలసి ఆయన గాంధీభవన్లోనే సత్యాగ్రహ దీక్షకు దిగారు. గాంధీభవన్ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. గాంధీభవన్కు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బయటే అడ్డగించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ పతనానికి ఈ దీక్ష వేదిక ప్రతిన పూనాలి: భట్టి టీఆర్ఎస్ పతనానికి సత్యాగ్రహ దీక్ష వేదికగా ప్రతిన పూని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకెళ్లాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశ విభజనకు కారణమవుతున్న చట్టాలను వ్యతిరేకిస్తూ దేశాన్ని ఓ కుటుంబంలాగా ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే ఎన్నార్సీకి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తే టీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడుతుందనే దుర్మార్గపు ఆలోచనతో, ఆందోళనతో ఆ పార్టీ తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. నాటి బ్రిటిష్ పాలనలో కూడా ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేసేందుకు అనుమతి వచ్చిందని, సామాజ్య్రవాద శక్తుల కంటే కేసీఆర్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కలసి బీజేపీ అధికారంలోకి రావడానికి పునాదులు వేస్తున్నాయని, హైదరాబాద్లోని ఈ రెండు పార్టీలను కదిలించకపోతే రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు. ఈ ఒక్కరోజు దీక్ష ఆపినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోలేదన్నారు. ప్రతి ఇంటి గుండెను, గ్రామాన్ని, పట్టణాన్ని పలకరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. -
నీరూ.. నిప్పు!
సాక్షి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం మొదలైంది. నిధులు ఇవ్వడం లేదని, జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిగా.. అసలు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్రా జెక్టుల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు.. ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. అదే మాదిరిగా, నల్లగొండ ఎంపీ, టీ.పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిగా, శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ ఇరువురు ఎంపీల ప్రకటనలపై మండిపడ్డారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఈనెల 26వ తేదీన బ్రాహ్మణవెల్లెంల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ జల సౌధకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికోసం ఆయన పోలీసుల అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు అనుమతిని నిరాకరిస్తే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఇవీ... పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో, రెండోసారి 2018లో ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కూడా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ‘ నీళ్లు–నిధుల–నియామకాలు ’ అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, స్వరాష్ట్రం సిద్ధించాక తమ నినాదాన్ని మరిచిపోయి, జిల్లాలో ప్రాజెక్టులను ఏమ్రాతం పట్టించుకోవడం లేదని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోగా.. నిధులూ అంతంత మాత్రంగానే విడుదల చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే.. నేరుగా శ్రీశైలం రిజర్వాయరు నుంచే నీటిని తీసుకోవడం ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు, అక్కడి నుంచి ఎఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథానికి నీళ్లు అందుతాయనని చెబుతున్నారు. కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఏళ్లుగా కొనసాగుతుండడంపై ఈ ప్రాంత నాయకులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి , బునాదిగాని కాల్వల పనులు పూర్తికావడం లేదు. దీంతో అనుకున్న మేర రైతులకు సాగునీరు అందడం లేదు. ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే నిధులు : గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాం. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ మరో 10.5 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2,150 కోట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్కి కేటాయిం చాం. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ జయప్రకాష్ అండ్ కంపెనీ ఒప్పం దం చేసుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి రిజర్వాయర్ పూర్తి చేశారు. మరో 11 నెలల్లో సొరంగమార్గం పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ప నులకు రూ.260 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరినా ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలోనే యాభై శాతం పనులు పూర్తయ్యాయి. ధనిక రాష్ట్రమని చెబు తున్న సీఎం ఎందుకు బునాదిగాని కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కాంగ్రెస్కు మంచిపేరు వస్తదనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. 5వేల మందితో పాదయాత్రగా జలసౌధకు వెళతా. -
‘కేటీఆర్.. ట్విట్టర్లో ఇప్పుడు స్పందించవా?’
సాక్షి, హైదరాబాద్ : ఓట్ల కోసం శిలా ఫలకం ప్రారంభించిన కేటీఆర్ ఇంతవరకూ రోడ్డు వేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 4 వేల కోట్లకు పైగా దొంగ జీవోలు చేసినా ఎక్కడా పనులు చేపట్టలేదని విమర్శించారు. తట్టి అన్నారంలోని ఇందు అరణ్య అపార్ట్మెంట్ నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వెంకటరెడ్డి ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తాననీ కార్యకర్తలకు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తట్టి అన్నారం క్రాస్ రోడ్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేటీఆర్ ప్రారంభించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ‘ప్రతి దానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఈ అంశంపై స్పందించాలి. తట్టి అన్నారం, పెద్ద అంబర్ పెట్ క్రాస్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. లేని పక్షంలో ఓట్ల కోసమే శిలాఫలకం ప్రారంభించానని తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి’ అని ఎంపీ అన్నారు. -
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా బీజేపీలో చేరతారు!
సాక్షి, హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్గా నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సరికొత్త విషయాలు వెల్లడించి రాజకీయంగా కాక పుట్టించారు. తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరనున్నారనే సంచలన విషయం వెల్లడించారు. అయితే, తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉంటానని వెంకట్రెడ్డి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరినా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయబో నని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళుతున్నారంటే టీఆర్ఎస్కు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పదేపదే చెబుతున్న రాజగోపాల్రెడ్డి మరోసారి దానిని పునరుద్ఘాటించారు. తనలాంటి వాడు చేరితే బీజేపీ మరింత బలపడుతుందని, ఆ పార్టీలో ఎలాంటి పదవి ఆశించడంలేదని ఆయన పేర్కొన్నారు. టైటానిక్లో తనలాంటి హీరో ఉన్నా మునకే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, టైటానిక్లో తనలాంటి హీరో ఉన్నా మునగక తప్పదని రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గడువు ముగిసిన ఔషధం మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసువెళ్లేందుకు ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదన్నారు. కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ అంటే తనకు గౌరవమని, రాష్ట్రంలో నాయకత్వలోపం వల్లే కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చిరుమర్తికి నెలకు రూ.50 వేల జీతమిచ్చా... తమకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్రోహం చేశారని, కష్టాల్లో ఉంటే నెలకు రూ.50 వేలు జీతమిచ్చి బతికిచ్చానని, ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్రెడ్డి అన్నారు. మీ గొంతు మీరు కోసుకున్నట్టే: సోలిపేట అసెంబ్లీ ఆవరణలో రాజగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ‘బీజేపీలో చేరితో మీ గొంతు కోసుకున్నట్టే’అని రాజగోపాల్ను ఉద్దేశించి సోలిపేట వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇప్పటికే ఓవర్లోడై ఉందని, తమది కూడా ఓవర్ వెయిటని, దాంతో మునుగుతారని రాజగోపాల్ బదులిచ్చారు. పార్టీ మారిన ‘చిరుమర్తిని తప్పుపడుతున్నారు, మరి బీజేపీలోకి మీరెలా వెళతారు’అని సోలిపేట ప్రశ్నించగా ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్రెడ్డి సమాధానమిచ్చారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లేదిలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరిన తర్వాత తన సోదరుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉంటానని, మరో జన్మ ఉంటే అప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. -
రాంమాధవ్ ఎవరో నాకు తెలియదు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్కు చెందిన కీలకనేతలు బీజేపీ చేరబోతున్నారని, అందుకు అనుగుణంగా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారబోతున్నారని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, పార్టీ మారేందుకు రాంమాధవ్ను కలిశానని అనడం అవాస్తవమని అన్నారు. అసలు రాంమాధవ్ ఎవరో తనకు తెలియదన్నారు. ఇప్పటివరకు అతన్ని చూడలేదని తేల్చిచెప్పారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా భువనగిరి అభివృద్ది కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ను చూసి కేసీఆర్ పంథా మార్చుకోవాలన్నారు. జగన్ కేబినేట్లో అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చాడని, అది చూసైనా తన కేబినేట్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తక్కువ కాలంలోనే అందరి మన్నలను పొందుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తరహా ప్రజల్లోకి వెళ్తామని, జగన్లా ప్రజల్లో ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు వంద సీట్లు ఖాయమని అన్నారు. చదవండి : తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్! -
కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు
-
కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ..
సాక్షి, నల్గొండ : స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయటంతో గొడవ చెలరేగింది. వివరాల మేరకు.. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నల్గొండ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కోడ్ని ఉల్లఘించారు. పోలింగ్ కేంద్రం పక్కన ఉన్న నల్గొండ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో టీఆర్ఎస్ నాయుకులు బస చేశారు. దీంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ‘‘కోమటిరెడ్డి గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంటర్ బోర్టుపై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెవిన్యూ శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీకాదని స్పష్టం చేశారు. -
పదవులపై రాద్దాంతం ఎందుకు..?
ఇబ్రహీంపట్నం:ఎన్నికల సమయంలోæ పదవులపై రాద్దాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానుబాబుగౌడ్ ప్రశ్నించారు. శనివారం పార్టీ నాయకులు రాఘవేందర్, కిరణప్ప, ఎండీ గౌస్పాషలతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ కార్యదర్శిగా చెప్పుకునే దండెం రాంరెడ్డికి రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావాలని లేదా అని ప్రశ్నించారు. మరో ఐదు రోజుల్లో లోక్సభ ఎన్నికలుంటే దండెం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ పదవులపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కొంతమంది మల్రెడ్డి బ్రదర్స్కు టికెట్ రాకుండా చేసినా వారు కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బతికి ఉందంటే కేవలం మల్రెడ్డి బ్రదర్స్ పుణ్యమేనన్నారు. ప్రత్యర్థులతో ములాఖాత్ కావడంతోనే దండెం రాంరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పార్టీలో గ్రూప్లను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్న దండెం రాంరెడ్డిపై పార్టీ పరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇమ్రాన్, చోటు, రాకేష్ పాల్గొన్నారు. -
రెండు నియోజకవర్గాలే టార్గెట్
సాక్షి, జనగామ: భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ పకడ్బందీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా మెజారిటీ ఓట్లు రాబట్టుకుంటే విజయం సాధించవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. 2009, 2014 ఎన్నికలతో పోల్చుతూ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతో లెక్కలు వేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో జనగామ, ఆలేరు నియోజకవర్గాలపైనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీ లభించింది. దీంతో అప్పుడు బూర నర్సయ్య గౌడ్ గెలుపు సులువుగా మారింది. 2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి 29,084 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి 19,632 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఓట్లు రావడంతో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయింది. ఇప్పుడు మరోమారు జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఓట్లు వస్తే విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. 2018 డిసెంబర్లో జరిగిన శాసన ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,538 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి గొంగడి సునీతకు 33,289 ఓట్ల మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరోమారు ఎక్కువగా మెజారిటీ వచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి తమ ఖాతాలోనే అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తోంది. నాడు తమ్ముడు.. నేడు అన్న.. భువనగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు తమ్ముడు బరిలో దిగగా.. నేడు అన్న ఎన్నికల బరిలో ఉన్నాడు. 2009లో భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రాజగోపాల్రెడ్డి ఆధిక్యత లభించింది. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన రాజగోపాల్రెడ్డి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సైతం జనగామ, ఆలేరు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జనగామ నుంచి లీడ్ లభిస్తే విజయం సాధించవచ్చనే ఆలోచనతో క్యాడర్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జనగామ నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి సోదరులు సుపరిచితులు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆలేరు, జనగామ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేయడం ఆసక్తిగా మారుతోంది. రెండు పార్టీలకు రెం డు నియోజకవర్గాలు ప్రతిష్టగా మారాయి. -
పెండింగ్ కాల్వల పూర్తికి శ్రమిస్తా
సాక్షి, భువనగిరి: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్గా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వివరించారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు ప్రజల సమస్యలు వాటి పరిష్కారం తెలుసన్నారు. ఈనియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఎకరానికి సాగునీరందించడమే నా లక్ష్యం. ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వలను పూర్తి చేసి దాని ఆయకట్టులోని రైతులందరికీ అందిస్తా. తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి రావాల్సిన సాగునీటిని హరీశ్రావు సిద్దిపేటకు తరలించుకుపోయారు. నేను గెలిచిన వెంటనే ఆలేరు నియోజకవర్గ రైతాంగానికి తపాస్పల్లి జలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటా. ఈ ప్రాంతంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలను కలుపుతూ ఐటీ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తా. నేను గెలిచిన ఏడాదిలోనే నిమ్స్ను ఎయిమ్స్గా ప్రారంభింపజేసి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడానికి ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తా. ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద లింక్ రోడ్లను నిర్మిస్తాం. అలాగే అండర్గ్రౌండ్ డ్రెయినేజీలు, పార్క్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తా. భువనగిరిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బస్ డిపో ఏర్పాటుతో పాటు యాదగిరిగుట్ట బస్టాండ్ను మరింత విస్తరింపజేస్తా. భువనగిరి, ఆలేరు, జనగామలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపే విధంగా కృషి చేస్తా. ప్రజలతో ఉన్న అనుబంధమే గెలిపిస్తుంది 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాకు విస్తృతమైన ప్రజాసంబంధాలు ఉన్నాయి. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో ముందున్నా. దీంతోపాటు రైతాంగం, కార్మికులు, యువకులు, విద్యార్థులు, మేధావులు రాజకీయాలతో సంబంధాలు లేకుండా నన్ను గెలిపించడానికి కలిసి వస్తున్నారు. నా సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా గెలిచి చేసిన సేవలు నా గెలుపునకు మరింత దోహదపడతాయి. ప్రస్తుత ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు రాజకీయాలతో సంబంధం లేదు. ఎంపీగా ఉండి ఏ గ్రామానికి వెళ్లలేదు. దీంతో ఆయనకు ఎక్కడికక్కడ వ్యతిరేకత ఎదురవుతుంది. కనీస ఆదాయ పథకం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాదిలోనే 34 లక్షల ఉద్యోగాల నియామకం కలిసి వచ్చే అంశం. -
తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నా
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తిని తానేనని, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొగ్లూర్ గేటు సమీపంలో ఉన్న కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. తాను తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని వదులుకొని పాల్గొన్న చరిత్ర తనదన్నారు. సోనియాగాంధీ పిలిచి మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని వారించినా, తాను పట్టించుకోలేదన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఎల్బీనగర్లో అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని దగ్గరుండి అస్పత్రికి తీసుకెళ్లానన్నారు. భువనగిరి అభివృద్ధి కోసం అన్నివిధాలుగా కృషి చేస్తానని చెప్పారు. ఎవరికీ ఏ అపద వచ్చినా తాము ముందుంటామని అన్నారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించి సేవలందించామని తెలిపారు. చేవెళ్ల, పెద్దపల్లి, మల్కాజ్గిరి, భువనగిరితో పాటు మరో రెండు సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీలు నిరంజన్రెడ్డి, జయమ్మ, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జెడ్పీటీసీ అయిలయ్య, ఈసీ శేఖర్గౌడ్, ఆదిబట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్రాజ్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉన్నారు. -
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎవరి బలమెంత..?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం మొదలు కావడంతో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో విజయం ఎవరిదన్నది జోరుగా చర్చ సాగుతోంది. బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది పార్టీలు ప్రకటించకున్నా ఏ పార్టీ విజయం సాధిస్తుందోనన్న రాజకీయ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. గత పార్లమెంట్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని నేతలు, ఎంపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. 2014లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఆధిక్యత రాగా ఒక్క నియోజకవర్గంలోనే టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చింది. 2014 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన సమీప టీడీపీ ప్రత్యర్థి టి.చిన్నపురెడ్డిపై 1,93,156 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుత్తాకు 4,72,093 ఓట్లు రాగా, చిన్నపురెడ్డికి 2,78,937 వచ్చాయి. టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన పి.రాజశ్వేరరెడ్డికి 2,60,677 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్.నరసింహారెడ్డికి 54,423 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు దేవరకొండలో 10,046, సాగర్లో 23,478, మిర్యాలగూడలో 29,623, కోదాడలో 18,316, హుజూర్నగర్లో 34,646, నల్లగొండలో 26,628 ఓట్ల మెజార్టీ రాగా, టీఆర్ఎస్కు సూర్యాపేటలో 2,652 ఓట్ల ఆధిక్యత వచ్చింది. న ల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సూర్యాపేటను టీఆర్ఎస్, దేవరకొండను సీపీఐ కైవసం చేసుకుంది. ఆ తర్వా త మారిన రాజకీయ సమీకరణాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే హవా.. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఏడు నియోజకవర్గాల్లో హుజూర్నగర్ మినహా ఆరు నియోజకవర్గాలు ఆపార్టీ ఖాతాలో చేరాయి. అయితే ఓట్ల పరంగా చూస్తే ఆరు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్కు 1,07,692 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ హుజూర్నగర్లో మాత్రమే 7,466 ఓట్ల మెజార్టీ సాధించింది. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ అసెంబ్లీ ఎన్ని కల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల పరంగా చూస్తే టీఆర్ఎస్కే మెజార్టీ ఉంది. çహుజూర్నగర్లో కాం గ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఉత్తమ్కుమార్రెడ్డి 7,466 ఓట్ల ఆధిక్యత పొందారు. అలాగే సూర్యాపేట ని యోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజ యం సాధించిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి 5,967 ఓట్ల మె జార్టీ సాధించారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్కు 756 ఓట్ల మెజార్టీ, మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కర్రావుకు 30,652, నాగా ర్జునసాగర్లో నోముల నర్సింహయ్యకు 7,771, దేవరకొండ నియోజకవర్గంలో రమావత్ రవీంద్రకుమార్కు 38,848, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డికి 23,698 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఎవరి అంచనా వారిదే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ రావడం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు రావడంతో నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గాల్లో ఆపార్టీకి.. టీఆర్ఎస్కు మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా తక్కువగా ఉండడంతో విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్గా తీసుకున్నారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. కాంగ్రెస్కు షాక్ ఇవ్వాలని బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ పెరుగుతుందని టీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో సంబంధం లేకుండా పార్లమెంట్ స్థానానికి ఎక్కువ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : భువనగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైంది. తొలుత భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కి భావించినా ..కోమటిరెడ్డి పోటీ చేయాలనుకోవడంతో వెనక్కి తగ్గారు. మధుయాష్కి వెనక్కి తగ్గడం, కోమటిరెడ్డి బలమైన నేత కావడంతో అధిష్టానం కోమటిరెడ్డి వైపే మొగ్గుచూపింది. రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉంది. 2018 తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన కోమటిరెడ్డి పరాజయం పాలైన విషయం తెలిసిందే. గతంలో తన ఓటమిపై ఆయన స్పందిస్తూ.. తనలాంటి నాయకులు ఓడిపోవడానికి పొత్తులే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ బరిలో నిలిచి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
నల్గొండ కాంగ్రెస్లో.. కలకలం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ విసిరిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ వలకు నల్లగొండ జిల్లాలో ఓ చేప చిక్కింది. శాసనసభకు గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్నుంచి విజయం సాధించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరనున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. చిరుమర్తి లింగయ్య శనివారం హైదరాబాద్లో తాను పార్టీ మారతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆయన చేరికకు సంబంధించి ఇప్పటికే లాంఛనాలన్నీ పూర్తయ్యాయని, సీఎం కేసీఆర్తో ప్రత్యేక భేటీ కూడా ముగిసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో విజయం సాధించింది. భువనగిరి లోక్సభస్థానం పరిధిలోని మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని హుజూర్నగర్లో ఆ పార్టీ గెలిచింది. రేపో మాపో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీని వీడనుండడం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం లింగయ్యతో కలిసి పనిచేస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి చేతులు కలుస్తాయా అన్నది ప్రశ్నార్థకమే అని అభిప్రాయం పడుతున్నారు. తెర వెనుక ఏం జరిగింది? ముందుస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి, టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. ఇందులో కోమటిరెడ్డి సోదరుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వారు ఈ ప్రచారాన్ని ఖండిం చారు. వారి వెంటే ఉండే చిరుమర్తి లింగయ్య గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారం జరగలేదు. మరోవైపు కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్కు వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో స్థానానికి కాంగ్రెస్ నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అభ్యర్ధిగా బరిలో పెట్టింది. ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహం రచించిన టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాలం వేసిందంటున్నారు. దీనిలో భాగంగానే, చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికి అధినేత కేసీఆర్ అప్పజెప్పారని తెలుస్తోంది. అన్నీ తామైన ‘కోమటిరెడ్డి’ సోదరులకు ఝలక్ వాస్తవానికి చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులు గీసిన గీత దాటరని ఓ అభిప్రాయం బలంగా ఉంది. కానీ, తాజా పరిణామాలు కోమటిరెడ్డి సోదరులకు లింగయ్య ఝలక్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత డిసెంబర్లో జరిగిన ఎన్నిక సమయంలో మహా కూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ స్థానం కేటాయిస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. టీ.పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఢిల్లీలో ఈ ప్రకటన చేయడంతో కోమటిరెడ్డి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగయ్యకు నకిరేకల్ టికెట్ ఇవ్వకుంటే తాను నల్లగొండ నుంచి పోటీ కూడా చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. లింగయ్యకు మద్దతుగా నార్కట్పల్లిలో నిర్వహించిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పరిణామాల్లో లింగయ్యకే నకిరేకల్ టికెట్ దక్కడం, ఆ ఎన్నికల్ల ఆయన గెలవడం వరుసగా జరిగిపోయాయి. తమ వెంటే ఉంటాడనుకున్న లింగయ్య తమను వీడి గులాబీ గూటికి చేరనుండడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో... ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కాకుండా.. ప్రధానంగా ఎంపీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేసిందంటున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మునుగోడు, నకిరేకల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మెజారిటీ రాలేదు. దీంతో ఏడు సెగ్మెంట్లలో నాలుగు చోట్లా బలహీనంగా కనిపిస్తోంది. పదహారు ఎంపీ స్థానాలపై కన్నేసిన టీఆర్ఎస్ ఈ విషయాన్ని తీవ్రంగానే తీసుకుందంటున్నారు. ఫలితంగా నకిరేకల్ ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించిందని విశ్లేషిస్తున్నారు. -
ఓడినవారికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశమున్నవారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా? – రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. లోక్సభకు పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది సీనియర్లు ఈసారి లోక్సభకు పోటీచేయాలనే ఆలోచనలో ఉండటం, తమకు అవకాశమివ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. బహిరంగంగా కొందరు.. అంతర్గతంగా మరికొందరు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చాలా మంది సీనియర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మహామహులనుకున్న కాంగ్రెస్ నేతలు సైతం ఓటమి పాలుకావడం ఆ పార్టీ కేడర్ను కుంగదీసింది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంతో పాటు కేడర్లో మనోస్థైర్యం నింపాలంటే లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ఒక్కటే మార్గమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. వీరిలో కొందరు తాము లోక్సభకు పోటీచేస్తామని బహిరంగంగానే చెబుతూ దరఖాస్తు చేసుకోగా, మరికొందరు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విషయం చెప్పిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా అదే మాట చెప్పారు. చెప్పడమే కాదు.. తనకు నల్లగొండ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాలంటూ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే నల్లగొండ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ఛరిష్మాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తున్నారు. నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడనుంది. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి పద్మావతిల పేర్లు కూడా వినిపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ సీనియర్లు టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మహబూబ్నగర్ అభ్యర్థి ఎంపిక సంచలనాత్మకమవుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డితోపాటు ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన డి.కె.అరుణ, రేవంత్రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి, అరుణలలో ఎవరైనా టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక, నాగర్కర్నూలు, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, జహీరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలే రేసులో ఉన్నారు. వీరి విషయంలో హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుందా..? కనీసం ఒకరిద్దరికైనా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకునే అవకాశం ఇస్తుందా..? లేదా మూకుమ్మడిగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే...! నెలాఖరుకు ఎంపిక లోక్సభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈనెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పంపనున్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు పేర్లు మాత్రమే హైకమాండ్కు పంపుతారని, అనివార్యమైతేనే మూడోపేరు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. పీఈసీ సమావేశం అనంతరం 20వ తేదీ లోపు అభ్యర్థుల జాబితా అధిష్టానానికి వెళుతుందని, నెలాఖరుకల్లా అభ్యర్థుల అధికారిక ప్రకటన ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
పార్లమెంట్ హడావుడి..షురూ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ప్రధాన పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 45రోజుల్లోగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో ఆయా పార్టీల్లో అప్పుడే ఎంపీ ఎన్నికల ముచ్చట్లు మొదలయ్యాయి. జిల్లాలోని నల్లగొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన విధంగా ఏకపక్షంగా పార్లమెంటు ఎన్నికల తీర్పు ఉండదన్న అంచనాతో ఉన్నారు. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నాలుగు చోట్ల పరాజయం పాలైంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కేవలం హుజూర్నగర్ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదా డ, సూర్యాపేట .. ఇలా ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది తమ కు లాభిస్తుందన్న అంచనాలో అధికార టీఆర్ఎస్ ఉండగా, శాసనసభ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఫలించవని, కచ్చితంగా భిన్నమైన తీర్పే వస్తుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఈ అంశాల నేపథ్యంలోనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తారా..? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో సహజంగానే టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవలే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కూడా నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న మొదట్లో కొంత ప్రచారం జరిగినా, సెప్టెంబరు 6వ తేదీన అభ్యర్థులను ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. పార్లమెంటు ఎన్నికలు అనగానే మరోమారు సీఎం కేసీఆర్ నల్లగొండనుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని కేబినెట్లో అవకాశం కల్పిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఈసారి లోక్సభకు పోటీ చేయపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెరపైకి బండా నరేందర్రెడ్డి పేరు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. 2014 ఎన్నికల్లోనే ఆయన పేరు పరిశీలనలో ఉన్నా, చివరి నిమిషంలో పల్లా రాజేశ్వర్రెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజే శ్వర్రెడ్డి శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్లమెంటుకు జరగాల్సిన ఎన్నికల్లోనూ నల్లగొండనుంచి రాజేశ్వర్ రెడ్డి పేరు అక్కడక్కడా వినిపిస్తున్నా.. ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా చెబుతున్నారు. గతంలో పార్టీ కోసం .. గెలిచే అవకాశం లేకున్నా, నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేయడంతోపాటు, పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయనకు అధినేత కేసీఆర్ దగ్గర గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనుకుంటున్న నేపథ్యంలో, పల్లా రాజేశ్వర్రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్గా ఉండడం, సీఎం కేసీఆర్ నిజంగానే ఇక్కడినుంచి పోటీ చేస్తారా అన్న అంశంలో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బండా నరేందర్రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ..? రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగకుండా ఒకవేళ జమిలి ఎన్నికల జరిగి ఉంటే నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించానని, అసెం బ్లీకి ముందుగానే ఎన్నికలు జరగడంతో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే కోమటిరెడ్డి ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరో రెండు, మూడు నెలల్లోనే లోక్సభకు జరగనున్న ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్లగొండ లోక్సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు ఉన్న పరిచయాలు, సీనియర్ నేతలు జానారెడ్డి, ఆర్.దామోదర్రెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి సహకారంతో ఎంపీగా విజయం సాధిస్తానని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ మేరకు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తన దగ్గరి వారికి సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఆటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో పార్లమెంటు ఎన్నికల ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. -
భావోద్వేగానికి లోనైన కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి వచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆయన.. ప్రజాతీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. నల్లగొండను దత్తత తీసుకోండి... ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు, తాగు- సాగునీటి సమస్యల నివారణకు కృషి చేశాననని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘లోక్సభకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి’
సాక్షి, నార్కట్పల్లి (నకిరేకల్) : ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విఫలం విషయమై త్వరలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చంచి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించి పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో వెళ్తామని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్కు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో నార్కట్పల్లిలో గల వివేరా హాటల్లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొడలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓడిపోవడంతో నాయకులు సంబరాలు జరుపుకునేందుకు ఇష్టపడడం లేదన్నారు. నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేసి అధిక మెజార్టీ సాధిస్తారని జోస్యం చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంతోపాటు జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నట్లు వివరించారు. ఒక గ్రామం నుంచి ముగ్గురు ఒకేసారి అసెంబ్లీకి పోవాలనే ఉద్దేశంతో పోటీచేసినట్లు తెలిపారు. ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మా గెలుపునకు కృషిచేసిన మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు, ప్రజాకుటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రసన్నరాజు, మేకల రాజిరెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, కోమటిరెడ్డి చిన్న వెంకట్రెడ్డి, సాగర్ల గోవర్ధన్, చిలువేరు గిరి, యాణాల రాంరెడ్డి, చిన్న మల్లయ్య, కన్నెబోయిన సైదులు, భూపాల్రెడ్డి, కొండల్రెడ్డి, సమద్, వెంకన్న తదితరులు ఉన్నారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను చౌటుప్పల్ (మునుగోడు) : నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మంగళవారం చౌటుప్పల్కు వచ్చారు. స్థానిక తంగడపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా తన గెలుపుకోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లసింగారం మాజీ సర్పంచ్ సుర్వి నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల వెంకట్రెడ్డి, నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, తిరుపతి రవీందర్, తీగుళ్ల కృష్ణ, ఎస్కె.జానిబాబు, తొర్పునూరి నర్సింహ, ముమ్మడి నవీన్, బాతరాజు మల్లేశ్, పల్చం సత్యం, పెద్దగోని రమేష్, మునుకుంట్ల శేఖర్, వెంకటేశం, చెరుకు యాదయ్య, మల్లేశ్, రమేష్, కృష్ణ, నరేష్, ఎస్.వెంకటేశం తదితరులు ఉన్నారు. -
తమ్ముడు ఇన్...అన్న అవుట్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి గొల్పుతున్నాయి. అనూహ్య విజయాలు, పరాజయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్రవేసుకున్న కోమటిరెడ్డి సోదరులు ఒకేసారి అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. నల్లగొండనుంచి అయిదో విజయం కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలుకాగా, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో తమ్ముడు ఇన్.. అన్న అవుట్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అని చెబుతుంటారు. 2009 ఎన్నికల్లో గురుశిష్యులు ఒకే సారి అసెంబ్లీకి వెళ్లారు. కానీ, ఈ ఎన్నికల్లో శిష్యుడు లింగయ్య విజయం సాధించగా, వెంకట్రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నార్కట్పల్లి మండలం బ్రహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నేతల్లో ఈసారి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మరో వైపు నల్లగొండ జిల్లాలో పలువురు నేతలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రికార్డును రాజగోపాల్రెడ్డి బ్రేక్ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్రెడ్డిని రాజ్యసభ సభ్యుడి పదవి రించింది. రామన్నపేట మాజీ ఎమ్మె ల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేశారు. కాగా, ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. అదేమాదిరిగా, గురు శిష్యుల సంబంధం ఉన్న కె.జానారెడ్డి ఓడిపోగా, ఆయన శిష్యుడిగా పేరున్న ఎన్.భాస్కర్రావు మిర్యాలగూడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా> గెలిచారు. పతి గెలుపు... సతి ఓటమి రాష్ట్ర రాజకీయాల్లో ఒకేసారి శాసన సభకు ఎన్నికైన దంపతుల జాబితాలో చేరిన మూడో జంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. 2014 ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి, ఉత్తమ్కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి గెలిచారు. గతంలో ఇలా.. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలా దేవి, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా నుంచి టీడీపీ పార్టీ తరఫున దయాకర్రెడ్డి, ఆయన భార్య సీతాదయాకర్రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, రెండో సారి కూడా గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలనుకున్న ఉత్తమ్ దంపతులకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసినా, టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి విజయం సాధించారు. -
జానా ఇలాకాలో టీఆర్ఎస్ తొలిసారిగా..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మరో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లాలో టీఆర్ఎస్ తొలిసారిగా నాలుగు నియోజకవర్గాల్లో ఖాతా తెరిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐనుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మిర్యాలగూడ అభ్యర్థి ఎ¯.భాస్కర్రావు, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్లో నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్రెడ్డి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా కంచర్ల రికార్డుకెక్కారు. గత ఎన్నికల్లో కంచర్ల ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పరాజయం పాలు కాగా, ఆయన ఇలాకాలో తొలిసారిగా టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో జానా మీద పోటీచేసి ఓడిన నోముల నర్సింహయ్య ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన జమానాకు తెరదించారు. జానా కోటలో గెలిచిన రెండో నేత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్పైన ఓడిపోయారు. 1994 ఓటమి తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు జానా గెలుపొందారు. తిరిగి ఇరవై ఏళ్ల విరామం తర్వాతా అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన నోమల నర్సింహయ్య చేతిలో జానా ఓడిపోవడం గమనార్హం. రెండు స్థానాలు కోల్పోయిన టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ గెలిచిన రెం డు స్థానాలను ఈ ఎన్నికల్లో కోల్పోయింది. కమ్యూనిస్టులకు అడ్డగా అప్పటి దాకా నిలబడిన నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఇవే నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసిన వేములవీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రెండోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఈ ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించా రు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీ 1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా మునుగోడులో సీపీఐ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఓడిపోయారు. మళ్లీ మూడు ఎన్నికల విరామం తర్వాత రాజగోపాల్రెడ్డి రూపంలో కాంగ్రెస్ను విజయం వరించింది. జానా, కోమటిరెడ్డి పరాజయం... మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్న సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో తొలిసారి టీఆర్ఎస్ఖా తా లో పడ్డాయి. 1983 నుంచి ఒక్క టర్మ్ మినహా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డిదే. 1994 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుస్తూ వస్తోన్న మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్రెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. దివగంత సీఎం వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. అయిదో సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు. మిర్యాలగూడలో కారు హవా ! కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన మిర్యాలగూడ ని యోజకవర్గంలో సైతం కారు జోరు సాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలి చిన ఎన్.భాస్కర్రావు ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన పైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఏడు సార్లు గెలుపొందింది. సీపీఎం ఐ దు సార్లు విజ యం సాధిం చిం ది. అయితే ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్పేరుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జూలకంటిరంగారెడ్డి పదివేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవరకొండలో మూడోసారి రవీంద్ర గెలుపు దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన రవీంద్రకుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా గెలిచిన ఆయన టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారాక, ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రవీంద్రకుమార్ దేవరకొండలో గులాబీ ఖాతా తెరిచారు. 2004, 2014 ఎన్నికల్లో రవీంద్రకుమార్ కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ నుంచి పోటీ చేసిన రవీంద్ర కుమార్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బాలునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి ఈ ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మ¯గా ఎన్నికైన బాలునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటికీ పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో ఆయన సొంతగూటికి వెళ్లి టికెట్ తెచ్చుకుని పోటీ పడినా పరాజయం పాలయ్యారు. నల్లగొండ : కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం : కోమటి రెడ్డి
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. న్యాయవాది కంచనపల్లి జవహర్లాల్ ఆధ్వర్యంలో వార్డెన్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట్నర్సయ్యతోపాటు మాజీ కౌన్సిలర్ బోయినపల్లి గిరికుమార్ బుధవారం కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వెంకట్నర్సయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపుల అభివృద్ధిని విస్మరించిందని, సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. దీంతో తము సంఘం మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గెలిపించేందుకు మున్నూరు కాపులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు సుధాకర్, రఘువీర్, శ్రీకాంత్, మేకల వెంకన్న, నేతి ఉమామహేశ్వర్, తోకల శ్రీనివాస్, సత్యనారాయణ, సిరిగిరి వెంకట్రెడ్డి, ఠాగూర్, వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్, కవిత పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
నల్గొండ: తాగునీరు అందించిన ఘనత కోమటిరెడ్డిదే
సాక్షి, నల్లగొండ రూరల్ : ఎంతో వెనుకబడిన నల్లగొండ ప్రాంతానికి కృష్ణా తాగునీరు అందించిన ఘనత కోమటిరెడ్డిదే అని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సతీమణి సబితారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారని తెలిపారు. ఫ్లోరైడ్ రక్కసితో శారీరక వైకల్యం వస్తుండడంతో కృష్ణా తాగునీటి కోసం కోమటిరెడ్డి నిరాహార దీక్షలతో పోరాటం నిర్వహించారన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు వేయించడంతోపాటు తాగునీటికోసం ట్యాంక్లు నిర్మించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, నిరుద్యోగులను నిం డా ముంచారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్, పీఆర్సీ ఇవ్వకుండా మాటల గారడీతో పాలన సాగించారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారన్నారు. కోమటిరెడ్డి ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకున్నారని, ఎంతోమంది పేద విద్యార్థులకు మెడిసిన్ చదువులకు ఫీజులు కట్టడంతోపాటు ఆర్థికంగా చితికిపోయిన, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక బరోసా కల్పించారన్నారు. ఈ సందర్భంగా వివిధ కాలనీల్లో భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మండల జెడ్పీటీసీ రాధ, బుర్రి మాలతి, సురెడ్డి సరస్వతి, మాధవి, విజయ, పోరెడ్డి హరిత, సుమతి, నాగమణిరెడ్డి, బాబా, ఇంతియాజ్, హుస్సేన్, అమీర్, లతీఫ్, రమేశ్ నేత, గణేశ్, ధర్మభిక్షం, వేమన, లవన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
తిప్పర్తి: ఆపదలో ఆదుకునే వ్యక్తిని ..
సాక్షి, తిప్పర్తి : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే వ్యక్తిగా తనను ఐదవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇండ్లూరు, మామిడాల, యాపలగూడెం, ఆరెగూడెం, గోదోరి గూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోమటిరెడ్డికి పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. గ్రామాల్లోని వీధులగుండా ప్రచార వాహనంపై తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో దుబ్బాక నర్సిం హారెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, టీడీపీ నాయకులు మాదగోని శ్రీనివాస్గౌడ్, చింతకుంట్ల రవీందర్రెడ్డి, లింగారావు, లక్ష్మణ్రావు, వెంకన్న, పాదూరి నాగమణి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణ, శరత్బాబు, ఈదయ్య, అంబేద్కర్, నామచక్రవర్తి, గోదా వెంకట్రెడ్డి, పాపిరెడ్డి, సుధాకర్రెడ్డి, నామ చంద్రయ్య, పాశం సంజీవరెడ్డి, బద్దం సైదులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : ‘నా జీవితం ప్రజలకే అంకితం.. నాకున్న ఒక్కగానొక్క కొడుకు కూడా లేడు.. మీరే నా బిడ్డలు’ అని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన 25వ వార్డు పాతపల్లె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చదువు, ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పాత పల్లె వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి గ్రామస్తులంతా ఇది పాతపల్లెకాదు ఇక నుంచి కోమటిరెడ్డి పల్లె అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు గ్రామస్తులు గ్రామ శివారునుంచి ఆటపాటలతో స్వాగతం పలికారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయన వెంట కూటమి నాయకులు మాదగోని శ్రీనివాస్గౌడ్, రియాజ్, పన్నాల గోపాల్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, మేకల కృష్ణ, భిక్షం, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కోమటిరెడ్డి, సంపత్ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
కోమటిరెడ్డికి ఆర్జేడీ మద్దతు
సాక్షి, నల్లగొండ : ఆర్జేడీ పార్టీ నల్లగొండ నియోజవర్గ ఇన్చార్జ్, తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఆవుల రామన్నయాదవ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. గురువారం అఖిల్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ ఇన్చార్జ్ రామన్న యాదవ్ మాట్లాడుతూ నల్లగొండలో అభివృద్ధి ఆగవద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి విషయంలో కోమటిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నాడని ప్రశంసించారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్న త్యాగశీలి కోమటిరెడ్డి అని కొనియాడారు. ప్రజలు కోమటిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆర్జేడీ పార్టీ తనపై నమ్మకం ఉంచి మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధిలో నల్లగొండను హైదరాబాద్కు ధీటుగా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాదగోని శ్రీనివాస్గౌడ్, దూదిమెట్ల సత్తయ్య, అల్లి సుభాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కేసీఆర్ బీసీ వ్యతిరేకి
సాక్షి,నల్లగొండ : కేసీఆర్ బీసీ వ్యతిరేకి..జాతీయ నేతల జయంతి సందర్భాల్లో వారి విగ్రహాలకు దండలు కూడా వేయకుండా ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బుధవారం జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్లోని పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ బీసీలంటే కేసీఆర్కు గౌరవం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేశాడని ఆరోపించాడు. కాంగ్రెస్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే జయంతితో పాటు వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ వ్యతిరేకి కేసీఆర్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత ప్రాతినిథ్యం ఇస్తోందని అందులో భాగంగానే బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చిందని తెలిపారు. బీసీ లకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి, సత్త య్య,వెంకన్న, జ నార్దన్గౌడ్, ముత్యాలు, జి. వెంకటేశ్వర్లు, కిన్నెర శ్రీను, గుండ్లపల్లి శ్రవణ్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
హ్యాట్రిక్.. వీరులు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకసారి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడమే కష్టంగా భావిస్తున్న క్రమంలో వరసగా మూడు విజయాలు సాధిస్తే.. ఆ విజయాలను తక్కువగా అంచనా వేయలేం. మూడు దాటి నాలుగు, ఐదు, ఆరు, ఏడు సార్లు కూడా గెలుపొందిన నేతలు జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో పదిహేను మంది నేతలు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. రద్దయిన రామన్నపేట నియోజకవర్గంలోనూ ఇద్దరు నాయకులు వరుసగా మూడేసి సార్లు విజయాలు సాధించారు. ఒక్క సూర్యాపేటలోనే వరుసగా మూడు పర్యాయలు గెలిచిన వారు లేకుండా పోయారు. సీపీఎం నుంచి ఉప్పల మల్సూరు ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన వరుస ఎన్నికల్లో గెలవక పోవడంతో హ్యాట్రిక్ దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో వరుసగా మూడో విజయం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధి ఒక్కరూ లేకపోవడం గమనార్హం. మూడో విజయం కోసం ఆశపడుతున్న వారున్నా.. వారు వరుస విజయాలు సాధించిన వారు కారు. కాంగ్రెస్ అభ్యర్థులు జానారెడ్డి వరసగా ఐదో విజయంపై, మొత్తంగా ఎనిమిదో గెలుపు కోసం ఎదురు చూస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం ఈసారి బరిలో పోరాడుతున్నారు. పాల్వాయి గోవర్ధన్రెడ్డి (మునుగోడు) : ఒకే నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయలు విజయాలు సొంతం చేసుకున్న పాల్వాయి గోవర్ధన్రెడ్డి కాంగ్రెస్ తరఫున హ్యాట్రిక్ పొందారు. ఆయన 1967, 1972, 1978, 1983లో వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఉజ్జిని నారాయణరావు (మునుగోడు) : పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తర్వాత మునుగోడు నుంచి ఉజ్జిని నారాయణరావు సీపీఐ తరఫున వరుసగా ఎన్నికల్లో గెలిచారు. ఆయన 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎలిమినేటి మాధవరెడ్డి (భువనగిరి) : జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీ తరఫున భువనగిరి నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచారు. ఆయన 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి (భువనగిరి) : ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల చేతిలో హత్యకు గురి కావడంతో ఈ నియోజకవర్గం నుంచి ఆయన భార్య ఉమామాధవరెడ్డి 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఆమె వరుసగా 2004, 2009 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. నర్రా రాఘవరెడ్డి (నకిరేకల్) : సీపీఎంకు తిరుగులేని విజయాలు సాధించి పెట్టిన నియోజకవర్గాల్లో నకిరేకల్ ఒకటి. ఆ పార్టీ నుంచి నర్రా రాఘవరెడ్డి ఏకంగా వరుసగా ఐదు పర్యాయాలు గెలిచారు. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నర్రా వరుసగా .. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో విజయాలు సాధించారు. రాంరెడ్డి దామోదర్రెడ్డి (తుంగతుర్తి) : మొత్తంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన 1985, 1989లో కాంగ్రెస్ తరఫున, 1994లో ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఆ తర్వాత ఇదే స్థానం నుంచి 2004లో, సూర్యాపేట నుంచి 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆరుట్ల కమలాదేవి (ఆలేరు ) : ఆలేరు నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల నుంచి వరుసగా మూడు సార్లు ఆరుట్ల కమలాదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 1952, 1957 ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా 1962లో సీపీఐ తరఫున పోటీ చేసి విజయాలు సాధించారు. మోత్కుపల్లి నర్సింహులు (ఆలేరు) : ఆలేరు నియోజకవర్గం నుంచి రెండో హ్యాట్రిక్ కూడా నమోదైంది. మోత్కుపల్లి నర్సింహులు ఇక్కడి నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపొందారు. ఆయన 1983, 1985లో టీడీపీ అభ్యర్థిగా, 1989లో ఇండిపెండెంటుగా, తిరిగి 1994 లో టీడీపీ నుంచి, 1999లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. బద్దూచౌహాన్ (దేవరకొండ) : స్థానికేతరుడైన బద్దూ చౌహాన్ ఎస్టీ రిజర్వుడు స్థానమైన దేవరకొండ నుంచి మూడు సార్లు గెలిచారు. సీపీఐ తరఫున ఆయన 1985, 1989, 1994 ఎన్నికల్లో దేవరకొండకు ప్రాతినిధ్యం వహించారు. నిమ్మల రాములు (నాగార్జున సాగర్): నాగార్జున సాగర్ నియోజకవర్గం చలకుర్తిగా ఉండిన సమయంలో నిమ్మల రాములు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 1962లో పెద్దవూర నియోజకవర్గంగా ఉన్నా, 1967లో చలకుర్తి నియోజకవర్గంగా మారింది. నిమ్మల రాములు1967లో ఇండిపెండెంట్గా, 1972,1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. కుందూరు జానారెడ్డి (నాగార్జునసాగర్) : రాష్ట్రంలో మెజారిటీ విజయాలు సాధించిన జాబితాలో తొలి నేతగా ఉన్న కుందూరు జానారెడ్డి మొత్తంగా ఇప్పటి వరకు ఏడు పర్యాలు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1983, 1989 ఎన్నికల్లో టీడీపీ నుంచి, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి హ్యాటిక్ సాధించారు. 2009లో చలకుర్తి రద్దయి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడగా, జానారెడ్డి 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇప్పుడు 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. తిప్పన చిన కృష్ణారెడ్డి మిర్యాలగూడ : కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే ఇప్పటిదాకా విజయాలు సాధించిన మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున తిప్పన చిన కృష్ణారెడ్డి 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఉత్తమ్ కుమార్రెడ్డి హుజూర్నగర్ : టీ పీసీసీ సారథి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తొలుత ఆయన కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004, హుజూర్నగర్ (2009లో ఏర్పాటైంది) నుంచి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. వేనేపల్లి చందర్రావు (కోదాడ) : కోదాడ నియోజకవర్గం నుంచి మొత్తంగా నాలుగు విజయాలు సాధించిన వేనేపల్లి చందర్రావు టీడీపీ నుంచి వరుసగా 1985, 1989, 1994 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ జాబితాలో చేరారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ ) : ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓడిపోలేదు. వరుసగా గెలుపొందారు. ఇప్పుడు ఐదో విజయంపై కన్నేసిన ఆయన కాంగ్రెస్నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయాలు సాధించారు. రద్దయిన రామన్నపేట నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి రామన్నపేట నియోజకర్గం నుంచి కూడా ఇద్దరు నేతలు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కె.రామచంద్రారెడ్డి : రామన్నపేట నియోజకవర్గం నుంచి కె.రామచంద్రారెడ్డి 1952, 1957, ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా, 1962లో సీపీఐ నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.గుర్రం యాదగిరిరెడ్డి : రద్దయ్యే వరకు ఈ నియోజకవర్గం నుంచి కేవలం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే విజయాలు సాధించారు. కాగా, గుర్రం యాదగిరి రెడ్డి సీపీఐ అభ్యర్థిగా .. 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. మరిన్ని వార్తాలు... -
అసత్యాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్ నైజం..
సాక్షి, నల్లగొండ : పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమ నేత కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అనూప్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ రాధ, పార్టీ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్యలు ఆరోపించారు. శనివారం కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 ఏళ్లుగా కోమటిరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. కోమటిరెడ్డి వేయించిన సీసీ రోడ్లమీద నడుచుకుంటూ ప్రచారం చేస్తూ అభివృద్ధి చేయలేదని అసత్య ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కోమటిరెడ్డి చేసిన అభివృద్ధి కళ్లముందే కనబడుతున్నా కళ్లు లేని కబోదుల్లా అబద్ధపు ప్రచారాన్ని చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సబ్స్టేషన్ ఏర్పాటుకు కృషి.. ఓల్టేజీ సమస్యతో రైతుల మోటార్లు కాలిపోయి, పొలాలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే దాన్ని పరిష్కరించేందుకు కోమటిరెడ్డి రెండు గ్రామాలకు ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లతోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను సాధించింది కోమటిరెడ్డి కాదా అని ప్రశ్నించారు. అపర భగీరథుడు వెంకట్రెడ్డి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి 610 గ్రామాలకు తాగునీరు అందించిన అపర భగీరథుడు వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మ బలిదా నం చేసుకుంటుంటే తట్టుకోలేక మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదిలేసి పదిరోజుల పాటు తెలంగాణ కోసం గడియారం సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. పానగల్ రోడ్డులోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్గ్రౌండ్ డ్రైయినేజీ, కోమటిరెడ్డి ప్రతీక్ పేరుమీద రూ.10 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించి విద్యార్థుల చదువులకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి నీటిట్యాంక్, రోడ్లు, బ్రిడ్జిలు అన్నీ కోమటిరెడ్డి హయాంలో జరిగినవేనన్నారు. అభివృద్ధి చేశాడు కాబ ట్టే ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. కోమటిరెడ్డిని అభివృద్ధే ఎన్నికల్లో గెలిపిస్తుందని, ప్రజలంతా కోమటిరెడ్డి వెంటే ఉన్నారన్నారు. సోమవారం కోమటిరెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించే బైక్ర్యాలీలో కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు. అనంతరం కోమటిరెడ్డి చేసిన అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో అల్లి సుభాష్, సమి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
బరిలో హేమాహేమీలు.. ఎన్నికల పోరు హోరాహోరీనే
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రంగం వేడెక్కింది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులో... ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. మెజారిటీ స్థానాల్లో ఈసారి ద్విముఖ పోటీలే కనిపిస్తున్నాయి. కాగా, కొన్నిచోట్ల మాత్రం బహుముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ పదకొండు, కాంగ్రెస్ పదకొండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరిలో ఇప్పటికే అత్యధికులు నామినేషన్లు కూడా వేశారు. చివరి రోజు అయిన 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలు కానున్నాయి. టీఆర్ఎస్ కోదాడలో, కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా హేమాహేమీలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ కూడా హోరాహోరీగా సాగనుంది. ఆ.. ఐదుగురు నేతలు టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన పది మంది రెండో సారి అంతకంటే ఎక్కువ పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే. ఇక, కాంగ్రెస్లో నలుగురు నాయకులు, ఒక ఇండిపెండెంట్ మొత్తంగా ఐదుగురు అభ్యర్థులు నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయం కోసం నాగార్జున సాగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కొందరు తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న వారే. హుజూర్నగర్లో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ఐదో విజయంపై కన్నేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తొలి సారిగా ఎస్.సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి రెండో సారి పోటీలో ఉన్నారు. నల్లగొండలో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీల నుంచి సీనియర్లే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్.దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఈసారి మరో మారు ఈ ముగ్గురు నేతలూ తలపడుతున్నారు. ఆలేరు బరిలో బీఎల్ఎఫ్ మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కూడా అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన నేతనే కావడం గమనార్హం. ఇక్కడనుంచి ప్రభుత్వ విప్గా పనిచేసిన గొంగిడి సునిత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి పోటీ పడుతున్న నేతల్లో అత్యధికులు రెండో సారి, అంత కంటే ఎక్కువ సార్లు పోటీ పడుతున్న వారే. అసెంబ్లీ బరిలోకి తొలిసారి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు) ఎమ్మెల్యే పదవి కోసం తొలిసారి పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున కుంభం అనిల్ కుమార్రెడ్డి, హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎస్.సైదిరెడ్డి మొదటిసారి పోటీ పడుతున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్, సీపీఎం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో నిలిచిన వారిలో అత్యధికులు సీనియర్లే కావడంతో పోటీ కూడా హోరా హోరీగా సాగనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
టీఆర్ఎస్.. కాపీ కొట్టింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాం గ్రెస్ మేనిఫెస్టోలోని అం శాలనే టీఆర్ఎస్ తమ మేనిఫెస్టో అంటూ కాపీ కొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గత నాలుగేళ్లుగా నిలబెట్టుకోని కేసీఆర్ను ప్రజలు నమ్మరని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి సాధ్యం కాదన్న కేసీఆర్, కేటీఆర్లు ఇప్పు డు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు. సీపీఎస్ రద్దుపై టీఆర్ఎస్ ఎందు కు స్పందించలేదని ప్రశ్నించారు. గత ఎన్ని కల్లో రూ.లక్ష రుణమాఫీని 4 దఫాలుగా చేయడంతో రైతులపై వడ్డీభారం పడిందని, మళ్లీ ఇప్పుడు రూ.లక్ష రుణమాఫీ చేస్తామం టే రైతు లు నమ్మరన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని, తమ మేనిఫెస్టోనే ప్రజలు నమ్మి పట్టం కడతారన్నారు. -
దామరచర్ల పవర్ప్లాంటు ఆపుతాం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్లాంటును ఆపి తీరుతామని టీపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.80 వేల కోట్ల భారం పడుతోందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టి నల్లగొండ జిల్లా ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారన్నారు. సిమెం టు, ఫార్మా పరిశ్రమలతో ఇప్పటికే నల్లగొండలో కాలుష్యం పెరిగిపోయిందని, తాగు, సాగునీటి లో ఫ్లోరైడ్ ఉందని, పంటల దిగుబడి కూడా తగ్గి పోతోందన్నారు. మళ్లీ ఇప్పుడు సల్ఫేట్లు, నైట్రేట్లు, మెర్క్యురీ, కోల్, ఫ్లైయాష్ కలిసే ప్లాంటు నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణా లకు ముప్పు తెస్తారా.. అని ప్రశ్నించారు. థర్మల్ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని, పర్యావరణానికి చేటు తెస్తుందని ప్యారిస్ సమ్మిట్, జాతీయ మీడియాలో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంటు విషయంలో గుడ్డిగా ముందుకు పోతోందని విమర్శించారు. ప్లాంటు ఆపాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇదే విషయాన్ని పార్టీలో చర్చించి ఒప్పిస్తానన్నారు. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి- లీడర్
-
కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాకోరు అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ గెలవలేదన్న అభద్రతాభావంతోనే ఆశీర్వాద సభలో ఇష్టానుసార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. శుక్రవారం నల్లగొండలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజె క్టు గురించి ఊసే ఎత్తుకుండా మూసీకి కొన్ని నిధులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ జిల్లా ప్రజలను చంపడానికి పెడుతున్నాడని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుతో జిల్లా ప్రజలకు నష్టమేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పొట్టివాడు గట్టివాడు అని మంత్రి జగదీశ్ రెడ్డిని గురించి కేసీఆర్ వ్యాఖ్యానించారని, గట్టివాడు కాదు తిక్కలోడు అని అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలిస్తే జగదీశ్రెడ్డి విజయం సాధిస్తారా అని వ్యంగంగా అన్నారు. జిల్లాలో ఫ్లోరిన్ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. తాను 11 రోజులు తెలుగుదేశం ప్రభుత్వం హ యాంలో నిరాహార దీక్షచేశానని పేర్కొన్నారు. మాయ మాట లు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తే నమ్మరన్నారు. ఎలాంటిì మచ్చలేని వ్యక్తి జానారెడ్డి అని, అలాంటి వ్యక్తిని దొంగ అంటున్న నీవే గజదొంగవన్నారు. 60 లక్షల గొర్రెలు ఇస్తే అవి 30 లక్షల పిల్లలు పెట్టినవి అంటున్నాడు పిల్లలు లేవు తల్లులేవని అంతా అవినీతి ప్రాజెక్టు అని ఆరోపించారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని అలాంటి నీకపట ప్రేమ ప్రజలకు తెలియంది కాదన్నారు. కేసీఆర్ చేస్తే సంసారం...ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు మరిచి పోలేదన్నారు. సమావేశంలో నాయకులు వంగాల స్వామి గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, సంపత్ రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కోమటిరెడ్డి కనగల్ (నల్లగొండ) : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దర్వేశిపురం, కనగల్, అమ్మగూడెం, ల చ్చుగూడెం, కురంపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేతకాక ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ పారిపోయిండన్నారు. వైఎస్సార్ హయాంలో శ్రీశైలం సొరంగం పనులకు రూ. 2వేల కొట్లు, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు నిర్మిణానికి రూ.7వందల కోట్లు, జిల్లాకేంద్రంలో యూనివర్సిటీని మంజూరు చేయిం చినట్లు పేర్కొన్నారు. తాము అధికారంలో వస్తే రైతులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. మేనిఫెస్టో వైస్ చైర్మన్గా చెబుతున్నా.. ఇచ్చిన హహీలను నెరవేర్చి తీరుతామన్నారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధులకు పింఛన్ రూ. 2వేలు, వికలాంగులకు రూ.3వేల పింఛన్, నిరుద్యోగుల కు భృతి నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. సొంత భూమిలో మీ ఇష్టమొచ్చిన చోట కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో రూ.4లక్షలతో మండలకేంద్రంలో వాటర్ ప్లాం ట్ను ప్రారంభించారు. కనగల్ క్రాస్రోడ్డులోని దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు దర్వేశిపురం, కనగల్, అమ్మగూడెం, లచ్చుగూడెం తదితర గ్రామాల్లో భారీగా వివిధ పార్టీల నుంచి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా గ్రామాలతోపాటు కురంపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దర్వేశిపురం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బైక్ర్యాలీ నిర్వహింస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం మధ్యలోనే కనగల్లో భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో వంగాల స్వామి గౌడ్, కనగల్ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, పెం టయ్య, సత్తయ్య, సైదులు, మహేశ్, వెంకన్న పాల్గొన్నారు. -
కేసీఆర్ను జైలుకు పంపుతాం..
సాక్షి, హైదరాబాద్ : ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్న కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకుంటామని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు, ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘మొన్న నన్నూ, సంపత్ను.. నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్రెడ్డిపై కేసులు పెట్టి వేదిస్తున్నార’ని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో దామోదర రాజనరసింహతో కలిసి గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నియంతృత్వానికి కాలం చెల్లిందనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్పై ఉన్న కేసులను తిరగదోడి జైలుకు పంపుతామన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. ఉద్యోగుల కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ను రద్దుచేస్తామని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ తెలిపారు. ఉద్యోగులకు అనుకూలంగా ఐఆర్, పీఆర్సీని అమలు చేస్తామని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు నష్టపోకుండా 4వేల కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ ఇవ్వాలనే విజ్ఞప్తులు వచ్చాయనీ, అధికారంలోకి రాగానే అనుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రాకు వెళ్లిన తెలంగాణ ఉద్యోగుల గోడును టీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. -
మా పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కర్లేదు
నల్గొండ జిల్లా: పూటకో మాట, గడియకో చిత్తం ఉండే కోమటి రెడ్డి బ్రదర్స్ తమ పార్టీ(టీఆర్ఎస్)కి అక్కర్లేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ నూతన భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..కోమటిరెడ్డి లాంటి బ్రోకర్లు, జోకర్లను మా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగాలేమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతిస్థిమితం లేక ఏదేదో మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి పోతే మంచిదని సూచించారు. తెలంగాణా యావత్తూ సీఎం కేసీఆర్కు అండగా ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఏమీ కాదని, తెలంగాణ ఇవ్వకుండా వందల మంది విద్యార్థులను చంపింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్పై మండిపడ్డారు. రాహుల్ పర్యటనకు ప్రజలు లేరు..ప్రజలు కాంగ్రెస్ను పట్టించుకోరని ఎద్దేవా చేశారు. -
‘బహిష్కరణ’ కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి, సంపత్లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తాము తీర్పునిచ్చినా వారిని శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సింగిల్ జడ్జి ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏప్రిల్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు అప్పీళ్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పునివ్వగా, 61 రోజుల తర్వాత వారు ఈ అప్పీళ్లు దాఖలు చేయడం గమనార్హం. కోర్టు తీర్పును పట్టించుకోవద్దన్న వైఖరితో.. కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు.. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఆశ్చర్యకరంగా ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత వారం జరిగిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఇద్దరు కార్యదర్శులు కూడా నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కోరగా.. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు బుధవారం ఉదయం ఈ అప్పీళ్ల గురించి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ముందు ఈనెల 10న కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తుందని, ఈ కేసులో స్పీకర్ను ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చేందుకు సింగిల్ జడ్జి సిద్ధమవుతున్నారని, అందువల్ల ఈ అప్పీళ్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం కేసు పూర్వాపరాల గురించి తెలుసుకుంది. అప్పీళ్ల దాఖలులో ఎన్ని రోజుల ఆలస్యం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. 61 రోజుల ఆలస్యం జరిగిందని అదనపు ఏజీ బదులివ్వగా, మరి ఇన్ని రోజుల ఆలస్యంతో అప్పీళ్లు దాఖలు చేసినప్పుడు, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. కనీసం గురువారమైనా విచారించాలని అదనపు ఏజీ అభ్యర్థించగా ససేమిరా అన్న ధర్మాసనం, ‘గతంలో అసలు కోర్టుకు విచారణ పరిధి లేదని చెప్పినట్లున్నారు..? ముందు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోండి. సింగిల్ జడ్జి ఫారం–1 నోటీసు జారీ చేస్తే అప్పుడు దానిపై ధిక్కార అప్పీల్ దాఖలు చేసుకోండి. పరిస్థితిని బట్టి అప్పుడు విచారణ జరుపుతాం’అని తేల్చి చెప్పింది. కోర్టులిచ్చే తీర్పు విషయంలో ఉదాసీనంగా ఉండరాదంటూ పరోక్షంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 61 రోజుల ఆలస్యంగా అప్పీళ్లు దాఖలు చేయడంపై తాము తమ అభ్యంతరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోమటిరెడ్డి న్యాయవాది తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
భద్రత పునరుద్ధరణపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేసినా, భద్రతను పునరుద్ధరించలేదని, తమకు గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలను తమ ముం దుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. శాసనసభ్యత్వాల రద్దును కోర్టు తప్పుపడుతూ, రద్దు తీర్మానాన్ని కొట్టేసిందని తమ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తమకు 2+2 గన్ మెన్లు ఉండేవారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను పునరుద్ధరించడం లేదన్నారు. -
కోర్టు తీర్పును కావాలనే ఉల్లంఘించారు
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసినా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి ఆ తీర్పును పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వక ధిక్కారమే. కనుక వారిపై చర్యలు తీసుకోండి’’అని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యు లు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. తమ శాసనసభ్యత్వాలపై హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి తమ సభ్యత్వాలను పునరుద్ధరించడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనన్నారు. ‘‘మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని, మా అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. దానిపై 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా చేయలేదు. దాంతో సింగిల్ జడ్జి తీర్పే అంతిమం. కేసుతో సంబంధం లేని 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం అనుమతినివ్వలేదు. అప్పీల్ వేయాల్సింది అసెంబ్లీ కార్యదర్శేనని స్పష్టం చేసింది. ఆయన రాజకీయ కారణాలతో కావాలనే ఇప్పటిదాకా వేయలేదు. పైగా కోర్టు తీర్పునూ అమలు చేయలేదు. ఈ వ్యవ హారంలో అన్ని విషయాలూ న్యాయ శాఖ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలివ్వండి’’అని కోర్టును వారు కోరారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం విచారించే అవకాశముంది. -
హైకోర్టు తీర్పు అమలుకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్కుమార్ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ గవర్నర్ను కోరనుంది. వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ కోర్టు తీర్పునిచ్చి 20 రోజులవుతున్నా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కార్యనిర్వహక అధికారులను ఉపయోగించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంతోపాటు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు అసెంబ్లీ పక్షాన కానీ మళ్లీ కోర్టులో అప్పీల్ చేయలేదని, అలాంటప్పుడు తీర్పును ఆమోదించినట్టే అవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. అలాగే తమ పార్టీ ఇద్దరు శాసనసభ్యుల పేర్లను అసెంబ్లీ వెబ్సైట్లో ఎమ్మెల్యేలుగా చూపించడం లేదని, సీఎస్, డీజీపీ అధిపతులుగా ఉన్న శాఖల్లో ఆ ఇద్దరికీ కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారాలను ఉపయోగించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరనున్నట్టు చెప్పారు. -
యాత్రకు పోదాం చలో చలో..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు జోరుమీదున్నారు. యాత్రలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర ఉత్సాహపూరితంగా కొనసాగుతుండటంతో ఆ పార్టీ నేతలు ఎవరికివారే పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, యువనేత ఎ.రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తమ తమ పాదయాత్రల షెడ్యూల్ తయారు చేసుకుంటున్నారు. భట్టి ఒక అడుగు ముందుకేసి బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలోనే అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి తన పాదయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సుయాత్ర మే 14 వరకు ఉంటుందని, ఆ తర్వాతే నేతలు పాదయాత్రలకు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి చెబుతుండటం గమనార్హం. ముందు ముగ్గురు.. ఆ తర్వాత ఇద్దరు వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన బస్సుయాత్ర చేయాలని నిర్ణయించినప్పుడే కొందరు నేతల పాదయాత్రలు కూడా ఉంటాయని టీపీసీసీ ప్రకటించింది. భట్టి, రేవంత్, పొన్నం ప్రభాకర్లకు ఏఐసీసీ అనుమతినిచ్చిందని, అప్పుడే ఉత్తమ్ చెప్పారు. పాదయాత్ర చేయాలనుకుంటున్న నేతలు ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపవచ్చని ఉత్తమ్ సూచించారు. దీంతో తాము అనుకుంటున్న రూట్లతో కూడిన ప్రతిపాదనలను అందరు నేతలు ఏఐసీసీ అనుమతికి పంపినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి అనుమతి రాగానే పా దయాత్రలు ప్రారంభమవుతాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. జూన్1న ముగింపు సభ ఈ యాత్రలన్నీ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 1న భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ లేదా వరంగల్లో నిర్వహించే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రానున్నారు. ఈ యాత్ర ద్వారా పూర్తిస్థాయిలో ఎన్నికల శంఖారావం పూరించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. డిసెంబర్లో లేదా ఏప్రిల్లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బహిరంగసభ తర్వాత పూర్తిస్థాయిలో ఎన్నికల గోదాలోకి దిగాలని, అప్పటి నుంచే అభ్యర్థుల ఎంపి క కసరత్తు, పొత్తుల ప్రతిపాదనలు, చర్చలు, సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభిస్తామని టీపీసీసీ వర్గాలంటున్నాయి. నారూటు నాఇష్టం నేతల పాదయాత్రలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తామని భట్టి, అరుణ, కోమటిరెడ్డి అంటున్నారు. భట్టి తన మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవెల్లి నుంచి ఇప్పటికే యాత్ర షెడ్యూల్ తయారు చేసుకున్నారు. 14న ‘తెలంగాణ కాంగ్రెస్ ఆత్మగౌరవ పాదయాత్ర’పేరుతో ముదిగొండ నుంచి సత్తుపల్లి, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలను దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెళ్లి అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు తన నియోజకర్గంలోని స్థానిక పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు సమాచారం. భట్టి యాత్రకు పూర్తిస్థాయిలో అనుమతి వస్తే అరుణ, కోమటిరెడ్డి తమ తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ వరకు యాత్ర చేసే అవకాశాలున్నాయి. రేవంత్రెడ్డి ఆలంపూర్ జోగులాంబ దేవాలయం నుంచి ఇంద్రవెల్లి అమరుల స్థూపం వరకు పాదయాత్ర చేస్తానని చెపుతున్నారు. పొన్నం ప్రభాకర్ కూడా రాజీవ్ జాతీయ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
‘గన్మెన్లను తొలగించడం దారుణం’
సాక్షి, హైదరాబాద్ : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బోడెపల్లి శ్రీనివాస్ను హత్య చేశారని, ఇప్పుడు ఆయనకు ఏమైన అయితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డికి ప్రాణ హాని ఉందని గతంలోనే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి కక్ష్యపూరిత నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వపు నీతిమాలిన చర్య అసెంబ్లీలో జరిగిన సంఘటనలో కేవలం కోమటిరెడ్డి విసిరిన విజువల్స్ మాత్రమే చూపిస్తున్నారని, స్వామిగౌడ్కి తాకిన విజువల్స్ని చూపించడంలేదని శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వపు దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ నీతిమాలిన చర్యతోనే అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. న్యాయంగా వీడియో ఫుటేజ్లను ఇస్తామని చెప్పిన ప్రకాశ్ రెడ్డిని ప్రభుత్వం అవమానించిదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయంగానే సస్పెండ్ చేస్తే సాల్వే వంటి అత్యంత ఖరీదైన అడ్వకేట్ ఎందుకని ప్రశ్నించారు. బీసీలు అయినా మధుసూదనాచారి, స్వామిగౌడ్లను పావులుగా మార్చుకొని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. -
‘హత్య చేసేందుకే గన్మెన్లు తొలగించారు’
శంషాబాద్ : అర్ధరాత్రి గన్మెన్లను తొలగించడం మమ్మల్ని హత్య చేసేందుకేనని అనర్హత వేటుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్కుమార్లు ఆరోపించారు. కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వారు కేంద్ర ఎన్నికల కమిషనర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఎయిర్పోర్టులో విలేకరులతోమాట్లాడుతూ.. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కాంట్రాక్టులు ఆంధ్రాప్రాంత నాయకులకు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గవర్నర్ కుర్చీలను లాగేసి, శాసనమండలిలో టేబుల్పై ఎక్కి కొట్టినప్పుడు ఎవరినీ కూడా అనర్హులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు ఈయనకు ఎక్కడిదని సూటిగా అడిగారు. -
బహిష్కరణ వెనుక రాజకీయ దురుద్దేశాలు
సాక్షి, హైదరాబాద్: బహిష్కరణ వేటు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ఇందులో అసెంబ్లీ స్పీకర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్ హైకోర్టుకు నివేదించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభలో చర్చించకుండా ప్రభుత్వం అనుకున్నదే తడువుగా తమ బహిష్కరణ పూర్తి కావడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్కు వర్తమానం పంపడం వేగంగా, ఏకపక్షంగా సాగిందని తెలిపారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. నిబంధనల ప్రకారం ఇటువంటి వ్యవహారాల్లో ప్రివిలేజ్ కమిటీలో, సభలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ వ్యవహారాల కిందకు రాదని, ఆయన ప్రసంగ సమ యంలో ఎవరైనా సభ్యుడు హుందాగా వ్యవహరించకపోతే అతనిపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్కు మాత్రమే ఉందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ తమపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారని, ఇలా చేయడం స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రభుత్వ వాదనల నిమిత్తం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతో పాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్ల గొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటి షన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. ఇందులో స్పీకర్ జోక్యం తగదు.. కోమటిరెడ్డి, సంపత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సభా వ్యవహారాల కిందకు రాని వాటి విషయంలో జోక్యం చేసుకునే అధికారం స్పీకర్కు లేదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన దానికి స్పీకర్ చర్యలు తీసుకోవడానికి సభావ్యవహారాల నిబంధనలు అంగీకరించవన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఇలాగే జరిగినప్పుడు అందుకు బాధ్యులైన సభ్యులను గవర్నరే బహిష్కరించారని తెలిపారు. నిబంధనల ప్రకారం బహిష్కరణ ఆ సెషన్కు మాత్రమే పరిమితం అవుతుందని, అయితే స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులను ఉదహరించారు. ఇటువంటి వ్యవహారాల్లో న్యాయసమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తర్వాత కూడా ఉల్లాసంగానే గడిపారు మండలి చైర్మన్ పిటిషనర్లు విసిరిన ఇయర్ ఫోన్ వల్ల గాయపడ్డారన్నది ప్రధాన ఆరోపణ అని, ఇయర్ ఫోన్ విసిరిన చాలాసేపటి వరకు మండలి చైర్మన్ ఉల్లాసంగా గడిపారని, గవర్నర్, స్పీకర్తో సరదాగా మాట్లాడారని, గవర్నర్ వెళ్లేటప్పుడు కారు వరకు వెళ్లి సాగనంపారని వెంకటరెడ్డి, సంపత్ తెలిపారు. తర్వాత 20 నిమిషాలకు కన్నుకు దెబ్బతగినట్లు బ్యాండేజీ వేసుకున్నారని, మొదట కుడికన్నుకు గాయమైనట్లు చెప్పారని, ఆ తర్వాత ఎడమ కన్నుకు గాయమైందన్నారని తెలిపారు. దీని సంబంధించిన వీడియో ఫుటేజీని బహిర్గతం చేయలేదన్నారు. -
అసెంబ్లీ స్పీకర్కు కాంగ్రెస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తమను ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని శాససభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ ఆరోపించారు. వీరిద్దరూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. స్పీకర్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం చూపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, 12 గంటల్లోనే గెజిట్ ప్రచురించారని వెల్లడించారు. తమపై చేసిన ఆరోపణలకు సంబంధించిన విజువల్స్ ఇవ్వడం లేదని, కొన్ని విజువల్స్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని ఆరోపించారు. శాసనసభలో గందరగోళ ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు స్వామిగౌడ్ గవర్నర్తో పాటే ఉన్నారని గుర్తుచేశారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు: షబ్బీర్ శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ తెలిపారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చేసేందుకు కేసీఆర్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ‘ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు కాబట్టి చర్య తీసుకునే హక్కు గవర్నర్కే ఉంటుంది. ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయకుండా, అప్రజాస్వామికంగా వేటు వేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మమ్మల్ని సభ నుంచి పంపించార’ని షబ్బీర్ అలీ విమర్శించారు. -
కేసీఆర్, కేటీఆర్ తోడుదొంగలు
మిర్యాలగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లు అధికారం పోతుందనే భయంతో మితిమీరి మాట్లాడుతున్నారని, వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలుగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభివర్ణించారు. గురువారం మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్రను జానా దొంగల బండిగా వర్ణించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధానిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని నోటికొచ్చిన పదజాలంతో విమర్శిస్తే, కేటీఆర్ జానారెడ్డిని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం తగదన్నారు. కేసీఆర్తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించి 10 శాతం కమీషన్లు తీసుకున్నారని అన్నారు. దోచుకున్న సొమ్ముతో బెంగుళూరు, హైదరాబాద్లలో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. 500 కోట్ల రూపాయలతో పూర్తి చేసే ఫైబర్ కేబుల్ వైరుకు కేటీఆర్ బా వమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి రూ. ఐదు వే ల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. భూముల కుంభకోణంపై ఆధారాలతో సహా బయటపెడుతాం హైదరాబాద్లో జరిగిన జిడీమెట్ల, మియాపూర్ భూముల కుంభకోణాలను రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేటీఆర్ ఒక బ్రోకర్లా మాట్లాడుతున్నాడని, మున్సిపల్ మంత్రికి కనీసం మున్సిపాలిటీలపై అవగాహన కూడా లేదని, విదేశాలు తిరగడం తప్పా ఆయన ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. నాగారం హత్య కేసులలో నిందితులుగా ఉన్న మంత్రి జగదీశ్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి కేటీఆర్ భోజనం చేస్తూ జానారెడ్డిని, కాంగ్రెస్ నాయకులను విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై గతంలో నకిలీనోట్ల కేసు, దొంగపాస్ పోర్టు కేసులున్నాయని, ఆయనకు గతంలో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్ముకున్న చరిత్ర కూడా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, అవినీతిపై ఈడీ కేసులు పెడతామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్నాయక్, పీసీసీ సభ్యులు స్కైలాబ్నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, గడ్డం వేణుగోపాల్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, నాయకులు సంపత్రెడ్డి, రామకృష్ణ, కోడిరెక్క శౌరి, మామిడాల ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ రౌడీయిజం పెరిగిపోతోంది
నల్లగొండ టౌన్ : జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల రౌడీయిజం పెరిగిపోతోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాదయ్యను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించి కారణాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఆహ్మహత్యాయత్నా నికి పాల్పడినట్టు తెలిపారు. కాలువ నీటి విషయంలో జరిగిన తగాదాలో యాదయ్యను టీఆర్ఎస్ నా యకులు కొట్టి బెదిరించారని ఆరోపించారు. కాలువలంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు తెల్వదని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ల పేరుతో డబ్బులను సంపాదించే పనులకు పరిమితమాయ్యరన్నారు. ప్రగతిభవన్ వదిలి వెళ్లని ముఖ్యమంత్రికి రైతుల సమస్యలు ఎలా తెలు స్తాయని ప్రశ్నించారు. యాదయ్యకు ఏమైనా జరిగి తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్రావులే బాధ్యత వహించాలన్నారు. ఆయన ను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నా యకులు పాశం సంపత్రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గు మ్ముల మోహన్రెడ్డి, జూకూరు రమేష్, తఖీ, అల్లి సు భాష్యాదవ్, సట్టు శంకర్ కిన్నెర అంజి ఉన్నారు. -
కోమటిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో కాంగ్రెస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సొంత తమ్ముడని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో అతడి భార్య లక్ష్మికి నల్లొండ అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతున్న కోమటిరెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కోమటిరెడ్డికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. -
‘టీఆర్ఎస్లో చేరనందుకే హత్య చేశారు’
హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి రానందుకే కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ను హత్య చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యేనన్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కాల్ డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని..ఆ మాట హోం మంత్రి లేదా డీజీపీ చెప్పాలని అడిగారు. సీఎం హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మార్చిలోపు 50 శాతం అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి కుంతియాకు చెప్పానని తెలిపారు. హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పాదయాత్ర చేయాలని చెప్పానని, బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్గొండలో అన్నీ స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగానే ఉన్నాడని తెలిపారు. తన కంటే ముందు రాజీనామా చేసిన వాళ్లవి స్పీకర్ ఇంకా ఆమోదించలేదని, తనది కూడా పెండింగ్లో పెడతారేమోననే ఉద్దేశంతో ఆగాడని స్పష్టం చేశారు. ముందు ఇచ్చిన వారివి ఆమోదిస్తే తక్షణం రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. -
'హత్య చేసింది కూడా కోమటిరెడ్డి అనుచరుడే..'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయవిచారణ జరపాలని టీఆర్ఎస్ఎల్పీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ హత్యకు కారకులు ఎవరో తేలాలంటే గత కొంతకాలంగా హత్యకు గురైన శ్రీనివాస్ ఎవరితో మాట్లాడారో చూడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు రాంబాబు కూడా కోమటిరెడ్డికి శిష్యుడేనని టీఆర్ఎస్ పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని పేర్కొంది. నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన సంచలనం రేపింది. హత్య కేసులో ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే, వీరి వెనుక అధికార పార్టీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు విచారణ జాగ్రత్తగా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, పొంగులేటి, వీహెచ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు కలిశారు. -
శ్రీనివాస్ హత్యకేసులో నిందితుల లొంగుబాటు
నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్కు ఫోన్ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కోమటిరెడ్డి అనుచరుడి దారుణహత్య
-
కోమటిరెడ్డి అనుచరుడి దారుణహత్య
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డ్రైనేజీ పడేసి.. బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్కు ఫోన్ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బోరున విలపించిన కోమటిరెడ్డి హత్య సమాచారం తెలుసుకున్న వెంటనే గురువారం తెల్లవారుజామున కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మృతుడు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్యా పిల్లలను చూసి బోరున విలపించారు. కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు. 3 గంటల పాటు ధర్నా.. ఉద్రిక్తత శ్రీనివాస్ హత్యకు నిరసనగా కోమటిరెడ్డి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. క్లాక్టవర్ సెంటర్లో కోమటిరెడ్డి మూడు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. కాగా, పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని మధ్యాహ్నం సావర్కర్నగర్లోని అతని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ విషణ్ణ వదనంలో మునిగారు. జానా, గట్టు, మల్లు రవి ఖండన ఈ హత్యను సీఎల్పీ నేత జానారెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. నిందితులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉన్నాడని గట్టు అన్నారు. శ్రీనివాస్ మృత దేహంపై పూలమాల వేసి గట్టు నివాళి అర్పించారు. శ్రీనివాస్ మృతదేహంపై తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. హత్య వెనుక అధికారపార్టీ నేతలు: కోమటిరెడ్డి ►గతంలో నయీం ముఠా సభ్యులు చంపుతామన్నారు ►టీఆర్ఎస్లో చేరాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించారు ►హత్య కేసును సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి సోదరులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసు అధికారుల వైఫల్యం ఉందని ఆరోపించారు. శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ క్లాక్టవర్ దగ్గర నిర్వహించిన ధర్నాలో.. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గురువారం మాట్లాడారు. శ్రీనివాస్ హత్య జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్పల్లిలోని వివేరా హోటల్కు పిలిపించి, టీఆర్ఎస్లో చేరాలని శ్రీనివాస్ను బెదిరించాడన్నారు. శ్రీనివాస్ కాల్డేటా ఆరాతీస్తే హత్యకు వెనుక ఎవరి కుట్ర దాగి ఉందనేది బయటపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం సోదరుడు తుపాకుల వ్యాపారం చేస్తూ సిద్దిపేట పోలీసులకు పట్టుబడితే.. వీరేశం కిరాయి హత్యలు చేయిస్తున్నాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నయీం ముఠా సభ్యులు శ్రీనివాస్ను ఏకే 47 గన్తో చంపుతామని బెదిరించారని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడి బొడ్డుపల్లి దంపతులు గన్మన్ కల్పించాలని గతంలో ముఖ్యమంత్రిని కూడా కోరినట్లు పేర్కొన్నారు. హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీసీఐడీతో సమగ్ర విచారణ చేయించాలని, డీఎస్పీ సుధాకర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారనన్నందుకే శ్రీనివాస్ను హత్య చేశారన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. తన భర్తను టీఆర్ఎస్ నాయకులు పథకం ప్రకారమే చంపారని మున్సిపల్ చైర్పర్సన్, మృతుడి భార్య బొడ్డుపల్లి లక్ష్మి ఆరోపించారు. గోపి, మోహన్లు అమ్ముడుపోయి తమను నమ్మించి మోసం చేసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. తమకు భద్రత కావాలని 15 రోజుల క్రితం కూడా కలెక్టర్, గతంలో ఎస్పీని కలసి విజ్ఞప్తి చేశామని, గన్మన్లను కేటాయించకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారన్నారు. -
హత్యలకు బదులు చెబుతాం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యాకాండలు, దాడులకు తగిన బదులు చెబుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఈ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమన్నారు. శ్రీనివాస్ది రాజకీయ కక్షలతో కూడిన హత్యగానే భావిస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ గతంలోనే శ్రీనివాస్ పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. ఈ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య దిగ్భ్రాంతికరమని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై దాడులు జరగడం అలవాటుగా మారిందన్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా టీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దోషులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మీరే కోటిసార్లు సిగ్గు పడండి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలోని ఓ గురుకుల హాస్టల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ఓ విద్యార్థి బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి మృతి చెందాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి చెబుతున్నట్లుగా కెనాల్లో పడి చనిపోయిన విద్యార్థికి గురుకులాలు, హాస్టళ్లతో సంబంధం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన నిర్వాకం వల్లే ఇప్పటికీ తెలంగాణను సమస్యలు పీడిస్తున్నాయి. హాస్టళ్లు ఇట్లున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. బడుగు బలహీనవర్గాల ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. దీనికి వారు ఒకసారి కాదు కోటిసార్లు సిగ్గుపడాలి. నల్లగొండలో ఓ విద్యార్థి కాలువలో పడి చనిపోయాడంటున్నారు కదా.. ఇక్కడి నుంచి నల్లగొండ వరకు ముక్కు నేలకు రాసుకుంటూ పోవాలి. చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి’’అని డిమాండ్ చేశారు. ‘కార్పొరేట్’కు దీటుగా.. గురుకులాల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను పర్మినెంట్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, ఈలోగా ఎవరి ఒత్తిడి వల్లో వారు కోర్టుకెళ్లారని, అక్కడ తీర్పు రిజర్వ్ చేసినందున అది తేలాక చర్యలు తీసుకుంటామని జగదీశ్రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కాలేజీలను తలదన్నే స్థాయిలో కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు వసతుల కోసం రూ. 347 కోట్లు, 18 బీసీ గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం, అసంపూర్తి వాటిని పూర్తి చేసేందుకు కలిపి రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు పర్యాయాలు చికన్, రెండుమార్లు మటన్, ఐదుసార్లు కోడిగుడ్డు, నిత్యం పప్పు, కూర, చా రుతో పౌష్టికాహారం పెడుతున్నామన్నారు. -
టాయిలెట్లు లేనందుకు సిగ్గుపడాలి
సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ పథకంలో భాగంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాటికి సొంత భవనాలుండవు. అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి సమస్య పరిష్కరించరు. అంతా గందరగోళం. పాత హాస్టళ్లను పూర్తిగా గాలికొదిలేశారు. వాటిల్లో టాయిలెట్లు సరిగాలేవు. ఉస్మానియా హాస్టల్లో విద్యార్థులు చెట్ల కింద స్నానం చేస్తున్నారు. నల్లగొండలో ఓ హాస్టల్ విద్యార్థి టాయిలెట్ లేక ఆరుబయటకు వెళ్లి కెనాల్లో పడి చనిపోయాడు. ఇంతకంటే దారుణమేమన్నా ఉంటుందా. ఇలాంటి దుస్థితికి సిగ్గుపడాలి’అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే లేదని తీవ్రంగా విమర్శించారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా రెగ్యులర్ సిబ్బంది లేరని, సొంత భవనాలూ లేవని, తన వెంట వస్తే వాస్తవాలు కళ్లకుకట్టేలా చూపిస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలోని బాలికల హాస్టల్లో చిన్న హాలులో 25 మంది ఉన్నారని, వారికి ఇరుకైన ఒకే టాయిలెట్ ఉందని, ఫ్యాన్లు, లైట్లు లేవని.. ఇదేమని కలెక్టర్ను అడిగితే బడ్జెట్ లేదని చెప్పారని కోమటిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సాయంతో వాటిల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ‘మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు’ అని అధికారపక్ష సభ్యుల నుంచి ప్రశ్న రావటంతో.. సమైక్య రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని నిధులు అడిగినా ఇవ్వకపోతే మంత్రి పదవిని కూడా వదులుకున్నానన్నారు. మూడున్నరేళ్లు గడిచినా అవే సమస్యలు వేధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియాకు రూ.100 కోట్లేవి? గురుకుల పాఠశాలల ఏర్పాటు మంచి పథకమని, దశలవారీగా అన్ని వసతులతో వాటిని ప్రారంభించాలని కోమటిరెడ్డి సూచించారు. హాస్టళ్లలో సన్న బియ్యం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి.. కొత్త సచివాలయానికి ఖర్చు చేసే రూ.500 కోట్లతో పాత, కొత్త హాస్టళ్లన్నింటికీ మంచి భవనాలు, వసతులు ఏర్పాటవుతాయన్నారు. పాత హాస్టళ్లను తొలగించాల్సిన పనిలేదని, వాటిని వదులుకునేందుకు విద్యార్థులూ సిద్ధంగా లేరని, వసతులు కల్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయిస్తానని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం హామీ ఇచ్చారని, ఆ నిధులేమయ్యా యని ప్రశ్నించారు. ఇప్పటికైనా దీనిపై సీఎం సమీక్షించి రూ.1,000 కోట్లు కేటాయిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాగా గురుకులాలు, పాత హాస్టళ్లపై అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం తో కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. -
మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. తొలుత శ్రీనివాస్ను పలకరించిన కోమటిరెడ్డి.. ‘శ్రీనన్నా.. మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..? ఉద్యమ సమయంలో మీరు, స్వామిగౌడ్ లాఠీ దెబ్బలు తిన్నారు కదా. మీకు మంత్రి పదవి వస్తే బాగుండేదన్నా..’అని అన్నారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. ‘అదేం లేదన్నా.. మంత్రి పదవి వచ్చే టైమ్లో వస్తుంది.. అయినా మా ప్రభుత్వం వచ్చింది కదా? సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కదా..’అని అన్నారు. ‘ఉద్యమం చేసిన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు వచ్చాయి కదా..’ అని కోమటిరెడ్డి చమత్కరించారు. ‘ఇదంతా ఎందుకు? మీరెప్పుడు మా పార్టీలోకి వస్తున్నరో చెప్పండి..’అని శ్రీనివాస్ గౌడ్ ఎదురు ప్రశ్నవేశారు. ‘ఎక్కడికీ రాను. తెలంగాణ వచ్చింది అదే సంతోషం. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న’ అని కోమటిరెడ్డి అన్నారు. -
పీసీసీ అడిగాను.. హైకమాండ్ ఇష్టం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు కావాలని అధిష్టానాన్ని అడిగానని, దీనిపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లనుంచి ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా పనిచేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా అధిష్టానం చెప్పినట్టు చేస్తానన్నారు. నల్లగొండలో తనపై గెలిచేస్థాయి ఎవరికీ లేదన్నారు. గత ఎన్నికల్లో భూపాల్రెడ్డి భార్యా, పిల్లలు, కుటుంబసభ్యులు అంతా ప్రచారం చేసుకున్నా ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.