ఎన్నికల ముంగిట ‘పసుపు–కుంకుమ’ పేరుతో మరోసారి మోసగించేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబును డ్వాక్రా మహిళలు ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారు. పదే పదే మోసం చేసే ఆయన్ను నమ్మం గాక నమ్మం అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయే దుస్థితికి కారణమైన చంద్రబాబు మోసాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.