అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు.