వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీరప్రాంతంలో గంటకు 180–200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ పెనుగాలుల దాటికి నిన్న భువనేశ్వర్లో భవననిర్మాణాలకు ఉపయోగించే పెద్ద క్రేన్ ఒకటి నేల కొరిగింది. అంతేకాకండా ఓ పెద్ద బస్సుసైతం గాలుల దాటికి అట్టముక్కలా కొట్టుకుపోయింది.