గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి నివాసంలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. కొంపల్లిలోని తన నివాసానికి సోదాల పేరుతో పోలీసులు రావడంతో తనన వేధిస్తున్నారంటూ వారి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో అర్థరాత్రి ఆయన నివాసంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతాప్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనన ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.