వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సునీత | Gopalapuram Ex MLA Maddala Sunitha Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సునీత

May 18 2018 2:36 PM | Updated on Mar 21 2024 7:48 PM

గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌​ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు  వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement