YS Jagan Mohan Reddy Padayatra
-
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్లలో వాట్సప్ స్టేటస్లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్ను అంతే స్థాయిలో పొయెటిక్గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
మహేశ్బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
'ప్రజలతో మమేకం కావడం వైఎస్ కుటుంబానికే సాధ్యం'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు
-
ప్రజాసంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు
-
రాష్ట్రంలో అద్భుతమైన పాలనకు ప్రజాసంకల్పయాత్ర నాంది పలికింది
-
చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు చూశారు
-
‘మానవత్వమే నా మతం’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా అప్పుడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాంధీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం ,ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ తెలిపారు. (జీవితకాల మధుర‘యాత్ర’) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ పాల్గొన్నారు. (ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’) -
పృథ్వీతేజ్ సంకల్పం.. వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, ద్వారకాతిరుమల: ప్రజలకు సేవ చేయాలన్న ఆ యువకుడి సంకల్పం.. రూ.కోటి జీతాన్ని వదులుకునేలా చేసింది. పట్టుదలతో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి తొలి ప్రయత్నంలో ఐఏఎస్ అయిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారికి, పుట్టిన గడ్డకు మంచి పేరు తెచ్చి, ఇటీవల కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్ సబ్కలెక్టర్గా పోస్టింగ్ పొందిన ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్ విజయగాథ.. సివిల్స్లో 24వ ర్యాంక్ బంగారు నగల వ్యాపారి యిమ్మడి శ్రీనివాసరావు, రాణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏకైక కుమారుడు పృథ్వీతేజ్ చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. ప్రజాసేవ చేసే ఉన్నత ఉద్యోగం చేయాలనే లక్ష్యాన్ని చిన్నతనంలో ఎంచుకున్నారు. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ లక్ష్య సాధనవైపు దూసుకెళ్లారు. 24 ఏళ్ల వయసులోనే సివిల్స్లో 24వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆయన ఇటీవల కడప జిల్లా రెవెన్యూ డివిజన్ సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ పొందారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ జగన్ ప్రశంసలు పొంది.. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో 2018 మే 19న ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పృథ్వీతేజ్, ఆయన తండ్రి శ్రీనివాసరావు కలుసుకున్నారు. అప్పటికే సివిల్స్లో సత్తాచాటిన పృథ్వీతేజ్ను జగన్మోహన్రెడ్డి అభినందించారు. రూ.కోటి ప్యాకేజీని వదులుకుని.. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే సౌత్ కొరియాలోని సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఏడాదిపాటు పృథీ్వతేజ్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం, సంపాదన ఆయనకు సంతృప్తి కలిగించలేదు. తాను కోరుకున్నది సాధించాలన్న దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్ దిశగా అడుగులు వేశారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ విద్యాభ్యాసం పృథ్వీతేజ్ 3వ తరగతి వరకు ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో, ఆ తర్వాత 6వ తరగతి వరకు డీపాల్ పాఠశాలలో చదివారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్ గూడవల్లి శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 2011లో ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్ఇండియా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముంబైలో ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కోచింగ్ తీసుకోకుండానే.. ఐఏఎస్ సాధించేందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే పృథ్వీతేజ్ సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో చదివి, పరీక్ష రాసిన ఆయన 2018లో విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియాలో 24వ ర్యాంక్ను సాధించారు. ఐఐటీలో ర్యాంకు సాధించిన పృథ్వీతేజ్ అనతికాలంలోనే సివిల్స్లో సత్తాచాటుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం గెలుపును ముందే ఊహించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నమ్మకం, పృథ్వీతేజ్ పట్టుదల, కృషి ఆయన్ను ఈస్థాయిలో కూర్చోబెట్టింది. -
‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవచ్చు. అలాగే సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ను కూడా సరైన సమయంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్: సీఎం జగన్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) డిజిటల్ రిజిస్టర్ను నిర్వహించడం, ఆర్బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్బోర్డ్లో ఆర్బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్బికె పెర్ఫార్మ్న్స్ డాష్బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్) రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు) -
వ్యవసాయంపై అవగాహనలేని లోకేష్ మాట్లాడుతున్నారు..
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల రోజుల పాలనలో ఎన్నో ప్రజా ప్రయోజన నిర్ణయాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని సర్వేపల్లి ఎం.ఎల్.ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను సద్వినియోగ పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. భద్రత పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదు. ఆయనకు నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. వ్యవసాయం పై కనీస అవగాహన లేని లోకేష్ మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. -
వైఎస్ జగన్కు పట్టుదల చాలా ఎక్కువ
-
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?
చేనుకి పోయిన మనిషి ఇంటికి ఏ రూపంలో తిరిగొస్తాడో తెలియదు. రైతు తనని తాను చంపుకోవాల్సిన పరిస్థితులు కొన్నయితే విధాన నిర్ణేతల తప్పిదాలు మరికొన్ని. ఈ కోవలోదే చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన విద్యుత్ సరఫరా హామీ... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు వంకద్వత్ అంజి నాయక్ మిర్చి పంట పండిస్తుంటాడు. వాన మొఖం చాటేసింది. మబ్బులు కిందికి దిగిరానంటున్నాయి. బోరు బావులే దిక్కయ్యాయి. వీటికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో సర్కారు వారి దయ. దీంతో అంజి నాయక్ ఇటీవల ఓరోజు అర్ధరాత్రి దాటింతర్వాత చేనుకి నీళ్లు కట్టుకుందామని వెళ్లాడు. వెళ్లినవాడు పొద్దు బారెడెక్కినా ఇంటికి రాలేదు. ఏమైందో తెలియక తల్లడిల్లిన ఇల్లాలు చేనుకి పోయి చూసేసరికి గుండె గుభిల్లుమంది. విద్యుద్ఘాతం అంజిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో... కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేని గ్రామంలో ఒకేరోజు ముగ్గురు రైతులు మబ్బుల్లో పొలానికి పోయి మళ్లీ తిరిగి రాలేదు. ఆ చీకట్లో తెగిపడిన కరెంటు తీగె వారి ప్రాణాలను మిగేసింది. రైతు వ్యథాభరిత చిత్రానికి ఇవన్నీ రుజువులు.వేళకాని వేళల్లో ఇచ్చే కరెంటు కోసం వెళ్లి రైతులు చచ్చిపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే తీరు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు ఓ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే నవరత్నాలలో భాగంగా పగటిపూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మాటను అన్నదాతలు విశ్వసించారు. ఎందుకో తెలుసా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్పై సంతకం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. పాత బకాయిలు రద్దు చేసిన పెద్దమనసు ఆయనది. ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్ను సరఫరా చేసి మాట నిలుపుకున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో ఆయా రైతులకు భూమి ఎంత, ఎటువంటి పంట, పంప్సెట్ సామర్థ్యం ఎంత, పేదరైతా? పెద్ద రైతా అనేది చూడలేదు. కస్టమర్ సర్వీస్ చార్జీలనూ నయాపైసా వసూలు చేయలేదు. రాష్ట్ర ఖజానాకు అది భారమవుతుందేమో అని యోచించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేసిన మహానేత వైఎస్సార్. అటువంటి ఆయన కడుపున పుట్టిన జగన్ మాట తప్పడన్న ధీమా రైతన్నది. అందుకే పాదయాత్రలో అంతలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 16 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. వీళ్లందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. ఆక్వా రైతులకు యూనిట్కు రూపాయిన్నరకే విద్యుత్ వస్తుంది. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
జన యాత్ర
-
విజయ శంఖారావం
-
వైఎస్ జగన్ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
-
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
వైఎస్ జగన్ను కలిసిన కవిటి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు
-
‘సేవారత్న’ పుస్తకావిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిపై ‘సేవా రత్న’ (ప్రేరణ, ప్రాణం, వైఎస్ అనేది ట్యాగ్ లైన్)అనే పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి, వైఎస్ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని.. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రచురించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రాయచోటి, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్బాషా పాల్గొన్నారు. -
తూర్పున సంకల్ప సూరీడు
-
పశ్చిమ ఒడిలో రాజన్న బిడ్డ
-
కృష్ణమ్మ ఒడిలో జన్ పరవళ్ళు
-
ఏ పార్టీతో పొత్తు ఉండదు : వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ ఇంటర్వ్యూ : మేం ఎవరితో పొత్తు పెట్టుకోం..
-
కరువు నేల ప్రకాశించేలా..
-
వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: అందుకే అసెంబ్లీ బహిష్కరించాం
-
సింహపురిలో సింహనాదం
-
వైఎస్ జగన్ను కలిసిన రాజమండ్రికి చేందిన రుద్ర కుటుంబం
-
సింహంలా సింగిల్గానే : వైఎస్ జగన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
జగన్ ఇంటర్వ్యూ : హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామా
సాక్షి, శ్రీకాకుళం : త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాదయాత్రలో ఎదురైన అనేక అనుభవాలతో పాటు రాజకీయాలు, తానిచ్చిన హామీలు, అధికార పార్టీ వైఫల్యాల వంటి అనేక విషయాలెన్నింటినో ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంలోని ఆంతర్యాన్ని విడమరిచి చెప్పారు. చంద్రబాబు నాయుడు చవకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రత్యేకహోదా విషయంలో మాటమార్చడం, నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి అధికారం పంచుకుని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో కలిసి కాపురం చేయడం వంటి చంద్రబాబు ద్వంద వైఖరులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఏపీలో చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు. ప్రస్తుతం సాక్షి టీవీలో ప్రసారం అవుతున్న ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఇక్క డ క్లిక్ చేయండి. లైవ్.. వైఎస్ జగన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. స్పెషల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అందుకే అసెంబ్లీ బహిష్కరించాం.. ‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగన్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్ కల్యాణ్తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతో జతకట్టిన చంద్రబాబు.. వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు అని మా పై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు. కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు. కేసీఆర్ ముందుకు రావడం హర్షణీయం.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. ఇక ఏపీలో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. హోదా ఇవ్వగలిగే స్థానంలో ఉండి ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడిన దానిని స్వాగతించాలి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ముందుకు రావడం హర్షణీయం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాటం చేసి కేసీఆర్ గెలిచారు. గత ఐదేళ్లలో కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీతో ఎక్కడా సంసారం చేయలేదు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని.. కలిసి పోటీ చేద్దామని కేటీఆర్తో చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఒప్పుకున్నారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకోం.. చంద్రబాబుకు ఓటేయమని పవన్ కల్యాణ్ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్ ముగ్గురికి పాత్ర ఉంది. మేం గతంలో ఎవరితోను పొత్తు పెట్టుకోలేదు.. ఈ సారి కూడా ఎవరితోను పొత్తు పెట్టుకోము. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం ఉంది. ఇప్పటికీ చాలాసార్లు మోసపోయాం. నేను ఏపీ ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇస్తాం.. ఇస్తాం.. అని చెప్పి చాలా మంది మోసం చేశారు. కాంగ్రెస్ చేస్తామని చేయలేదు.. పవన్, మోదీ వచ్చి అదే మోసం చేశారు. అందుకే ఏపీ ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే స్థితిలో లేరు. 25 మంది ఎంపీలను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ఎవరు హోదాకు సంతకం పెడతారో వారికే మద్దతిస్తాం. హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామా చేస్తా.. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. రైతు రుణమాఫీని సమర్ధించను అని ఎప్పుడు చెప్పను. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా సంతోషించేది నేనే. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. పాదయాత్ర మొదలు పెట్టక ముందే.. రైతు భరోసా గురించి చెప్పాను. ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో రూ.12,500 ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు చొప్పున ఇస్తాం. మన రాష్ట్రంలో చిన్న కమతాలు ఉన్న రైతులే ఎక్కువ. అందుకే రైతు భరోసా రైతు కుటుంబాన్ని ఒక యునిట్గా తీసుకున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని.. చంద్రబాబు తన హెరిటేజ్ ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నాలుగేళ్లు కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా.. చంద్రబాబు పొగుడుతూ వచ్చారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నా.. మన భాగస్వామియే కదా అని మోదీ వదిలేశారు.’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన కడప జిల్లా ఉల్లి రైతులు
-
3600 కి.మీ పౌలురాయిని దాటిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
కాసేపట్లో 3600 కి.మీ చేరుకోనున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
ప్రజాసంకల్పయాత్రలో మరో కీలక ఘట్టం
సాక్షి, శ్రీకాకుళం : ప్రజాసంకల్పయాత్ర మరో కీలక ఘట్టానికి చేరుకుంది. అలుపెరుగుని పాదయాత్రికుడు మరో చరిత్రకు నాంది పలికారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి అరాచక పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా చేస్తున్న ప్రజాసంకల్పయాత్రలో శనివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర@3600 : వెల్లువలా జనం వెంటనడువగా... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జననేత.. ఈ మైలురాయికి గుర్తుగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కీలక ఘట్టంలో భాగమయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు జననేత అడుగులో అడుగేశారు. శనివారం ఉదయం వైఎస్ జగన్ సోంపేట మండలంలోని తురకశాసనం నుంచి 337వరోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాజన్నతనయుడి పాదయాత్ర పాలవలస, కొర్లాం మీదుగా బారువ కూడలి వరకు కొనసాగింది. అక్కడి నుంచి లక్కవరం చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తోంది. జనం మద్దతుతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న జగన్ పాదయాత్ర.. 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. -
ఇడుపులపాయ - ఇచ్ఛాపురం విజయసంకల్పం
-
వైఎస్ జగన్ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
-
వైఎస్ జగన్ను కలిసిన జీడిపిక్కల కార్మికులు
-
వైఎస్ జగన్ను కలిసిన యాదవ సంఘాల నాయకులు
-
ముగిసిన 334వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్ను కలిసిన ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు
-
వైఎస్ జగన్ను కలిసిన ఆశా వర్కర్లు
-
శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు : వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ను కలిసిన నవ్వులరేవు గ్రామ మత్స్యకారులు
-
పలాస శ్రీకాకళం జిల్లా వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
వైఎస్ జగన్ను కలిసిన ఆగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు
-
‘అందరి ఆరోగ్యం చూసుకొనే తమకే భద్రత లేదు’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆరోగ్యమిత్రలు ఆదివారం కలిశారు. 2003 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడం లేదని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమను రెగ్యులర్ చేయకపోగా ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయడంలేదని చెప్పారు. ఫలితంగా అందరికీ ఆరోగ్యం అందించేందుకు పనిచేసే తమకే ఆరోగ్య భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు తమ గోడును తెలియజేస్తూ జననేతకు వినతిపత్రం ఇచ్చారు. నేటి పాదయాత్ర ఇలా.. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 333వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం పలాస నియోజకవర్గంలోని ఉండ్రుకుడియ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం, మహదేవిపురం క్రాస్, గరుడఖంది వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్ విరామం తీసుకుంటారు. విరామం అనంతరం చినబాదాం మీదుగా పలాస-కాశిబుగ్గ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం పలాస-కె.టి రోడ్డులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
వైఎస్ జగన్ను సన్మానించిన కళింగ వైశ్యులు
-
ముగిసిన 332వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
గిరిజన సంక్షేమ సంఘాల జేఏసీ శిబిరాన్ని సందర్శించిన వైఎస్ జగన్
-
ఆటోవాలా పథకంపై జననేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆటోడైవర్లు
-
332వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 332వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలోని రంగడి ఘాటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తూముకొండ, పెద్దమాడి స్కూల్, హేరాపురం, పెద్దమాడి గ్రామం మీదుగా చీపురుపల్లి వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్ విరామం తీసుకుంటారు. విరామం అనంతరం పలాస నియోజవర్గంలోని రేగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి మీదుగా ఉండ్రుకుడియా క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు నేను తోడుగా ఉంటాను..
-
చంద్రబాబు హయాంలో అన్నీ గోవిందా..
-
ముగిసిన 329వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్ను కలిసిన విశ్వ బ్రాహ్మణులు
-
వైఎస్ జగన్ను కలిసిన టెక్కిలి ఆర్టీసీ కార్మిక సంఘాలు
-
పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశంచిన ప్రజా సంకల్పయాత్ర
-
వైఎస్ జగన్ను కలిసిన సమస్యలు చెప్పుకున్న గూడెం గ్రామస్తులు
-
వైఎస్ జగన్ చేతుల మీదుగా వడ్డెర సంఘం ప్రారంభించిన ప్రతినిధులు
-
ముగిసిన 328వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే
-
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ టెక్కిలి
-
బాబు నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు
-
సిపిఎస్ రద్దు చేస్తామని పకటించిన వైఎస్ జగన్
-
పచ్చ చొక్కాలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు
-
చంద్రబాబు.. ప్రత్యేకంగా శాటిలైల్ను ఆకాశంలోకి పంపారా?
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, టెక్కలి/శ్రీకాకుళం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులు శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కోలగట్ల వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 328వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపడ క్రాస్, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం టెక్కలిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరో మైలురాయి.. ప్రజాక్షేత్ర యాత్రికుడు, జననేత వైఎస్ జగన్ అలుపెరుగని పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. రావివలస వద్ద 3500 కిలోమీటర్ల మార్క్ను దాటింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి మొక్కను నాటారు. -
‘జగన్ అన్న ఫర్ సీఎం’
సాక్షి, అమరావతి: ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నవరత్న కార్యక్రమాలు సహా అనేక పథకాలను అమలు చేయడానికి నిర్ణయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వీటిపై సమగ్ర సమాచారంతో ‘జగన్ అన్న ఫర్ సీఎం’ అనే నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్సైట్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించింది. నవరత్నాలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర, వైఎస్సార్ కుటుంబం, జగన్ స్పీక్స్ విభాగాలుగా ఇందులో ఆయా అంశాలను పార్టీ పొందుపరిచింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు ద్వారా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని పంచేందుకు వీలుగా అందరి తోడ్పాటుకు పిలుపునిచ్చింది. ఆయా కార్యక్రమాలపై సవివరంగా సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచారు. వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, మద్యవిధానం ఇలా ఆయా అంశాలను వివరించారు. ఈ వెబ్సైట్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అభిమానులు, ప్రజాశ్రేయస్సుకోరే వారంతా కార్యక్రమాల అమలుకు చేయూతనందించవచ్చు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుడి ఆశీస్సులు లభించాలని వేదపండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మిధున్రెడ్డి, పీఏసీ సభ్యులు పాలవలస రాజశేఖరం, ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ పాతపట్నం, ఎచ్చెర్ల, టెక్కలి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, పార్టీ నేతలు నర్తు రామారావు, ప్రధాన రాజేంద్ర, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, దువ్వాడ వాణి, చింతాడ మంజు, హనుమంతు కిరణ్కుమార్, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన రామ్మనోహర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి భారీగా టీడీపీ శ్రేణులు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కలమట వెంకటరమణ మరదలు, టీడీపీ నాయకురాలు కలమట సుప్రియ తన అనుచరులతో కలిసి పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. సుప్రియ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. కాశీపురంలో కలమట సుప్రియకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రతిపక్ష నేత కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడి చేరిక అలాగే మాజీ ఎంపీ మిథున్రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.మునుస్వామి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
327వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
జనధాత్రిపై జగన్ కేతనం
జననేత వైఎస్ జగన్ జన్మదినం నేడు. ఓ ఉత్సాహం... పట్టుదల, పోరాటాల బాట, అకుంఠిత దీక్షకు సంకేతం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తెలుగు ప్రజలకు ఆయన ఒక ఆశాజ్యోతి. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని ఎదిగిన పోరాట యోధుడు జగన్. ఒకానొక సందర్భంలో ఆళ్లగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తూ తనపై దాడి చేయవచ్చని తన కాళ్లు, చేతులు విరగ్గొట్ట వచ్చని తనను విగతజీవిని చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చని.. అయినా, తాను సముద్రం లోని కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడుతూ మళ్లీ ప్రజ లతో కలసి పోరాటం చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నేడు జన్మదినం జరుపుకుంటున్న జగన్ను భారత న్యాయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని రీతిలో 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఆయనను నిర్బంధించాయి. ఒకవైపు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ వైఎస్సార్సీపీని బలమైన ప్రతిపక్షంగా జగన్ తీర్చిదిద్దారు. తొమ్మిదేళ్ల రాజ కీయ ప్రస్థానంలో ఇంత విస్తృతంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపిస్తారు. ఆయన ఓదార్పుయాత్ర, రైతు భరోసాయాత్ర, ప్రత్యేక హోదాపై పోరు ఇందుకు నిదర్శనం. 10 కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర ఎవరికీ లేదు. ఆయన జరుపుతున్న ప్రజాసంకల్పయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకహోదా ఆవశ్యకతను జగన్ గుర్తించినంతగా వేరే ఏ పార్టీ నాయకులు గుర్తించలేదు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన పార్టీకే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను జగన్ ఎండగట్టినంతగా మరెవరూ వెలుగులోకి తేలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అనేక విభజన హామీలు అమలుపరచలేదని కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్న నిఖార్సైన నాయకుడు జగన్. రాజధాని నిర్మాణంలో అవి నీతి అక్రమాలను ప్రశ్నించిన నాయకుడు కూడా వైఎస్ జగనే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య సమతుల్యత జరగాలని నినదించిన నాయకుడు జగనే. నేడు పోరాటాలకే జగన్ స్ఫూర్తి. కాంగ్రెస్ పార్టీని ఆయన వదిలిన తీరూ, తను, తన తల్లి పార్లమెంట్, అసెంబ్లీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి నేడు ఒక బలమైన పార్టీగా ఎదిగి వచ్చిన తీరు రాజకీయ పార్టీలకు ఓ ఆదర్శం. తన పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బాబు కొనుగోలు చేసి జగన్ను దెబ్బతీయాలనుకున్నా ఆయన చలించలేదు. తనపై భౌతి కంగా దాడి జరిగినప్పుడు కూడా ఆయన నిబ్బరంగా వ్యవహరించారు. రాష్ట్రంలో జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.. ఇదే నేడు మనకు కనిపిస్తున్న వాస్తవం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని రైతులకు ద్రోహం చేయడాన్ని, నిరుద్యోగ యువతను మోసగించడాన్ని, డ్వాక్రా మహిళలకు ద్రోహం చేయడాన్ని ఆయన వందలాది సభలలో బట్టబయలు చేశారు. వైఎస్సార్ తనయుడిగా ఆ మహా నుభావుడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దివిటీని కొనసాగించే ధీశాలిగా జగన్ ఎదిగారు. నేడు జగన్ నిరంతరం ప్రజల్లో ఉండి రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక వాతావరణం కల్పించగలిగారు. ప్రజలల్లో వైఎస్సార్సీపీ పట్ల సానుకూల వాతావరణ కల్పించారు. నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. ఈ భావనతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమన్వయకర్తలు పని చేయాలి. రాష్ట్ర ప్రజలు జగన్ను ఆశీర్వదించి సీఎంగా ఎన్నుకోవడానికి కృషి చేయాలి. దివంగత నేత వైఎస్కు నివాళిగా తనయుడు జగన్ను సీఎం చేయడం ద్వారా ఆయనకు శుభాభినందనలు అందించినవారమవుతాం. వ్యాసకర్త : ఇమామ్, కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
326వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 326వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దుర్గమ్మ పేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. నైట్క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. -
‘జగన్కు జనాదరణ చూడలేకే ఇలా చేస్తున్నారు’
సాక్షి, ఆముదాలవలస: ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణను ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేస్తున్ననిరాధార ఆరోపణలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆముదాలవలస బహిరంగ సభలో వైఎస్ జగన్ అసత్యాలు మాట్లాడారన్న ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. ‘సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు మా నాయకుడిపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. అందుకే న్యాయదేవత ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దైర్యముంటే కూన రవి అక్రమాలపై విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి బహిరంగ విచారణకు రావాలి. టీడీపీ నేతల ఆరోపణలపై చర్చించడానికి మేము సిద్దం. ల్యాండ్ మాఫియా, స్యాండ్ మాఫియా చేసిన చరిత్ర తెలుగుదేశం నేతలది. వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేసారు’ అని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
ఆముదాలవలసలో అవినీతి రాజ్యం : వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం : ఆముదాలవలసలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 319వ రోజు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్.. ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా.. ‘చంద్రబాబు సీఎం కాగానే ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్లింది. ఆదుకోవాల్సిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీని రూ. 6.40 కోట్లకు కావాల్సిన వారికి అమ్ముకున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. రైతులంతా కోర్టు మెట్లు ఎక్కితే.. హైకోర్టు ఆపమని ఆర్డరిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. మళ్లీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ కేసును సుప్రీం నుంచి ఉపసంహరించారు. 2014 ఎన్నికల్లో ఆ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి ఆ హామీని నిలబెట్టుకోలేదు. మీ అందరి దీవెనెలతో అధికారంలోకి రాగానే ఆ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాను. అవినీతిలో చంద్రబాబు డాన్ అయితే.. ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడున్న ఎమ్మెల్యే చోటా డాన్. జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఈ దోపిడీ బయటకు తెలియజేయడానికి వంశధార నది ఉగ్రరూపం దాల్చి వరదతో ముంచెత్తింది. అక్రమంగా ఇసుకు తీసుకెళ్లడానికి ఉన్న లారీలు, జేసీబీలు.. నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ఇసుక లూటీ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయినా ఆ లూటీ చేసిన ఎమ్మెల్యే, చిన్నబాబుల మీద ఏలాంటి చర్యలుండవు. ఖాళీ స్థలం కనబడితే పాపం.. కొత్త ఉద్యోగాల గురించి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనబడితే కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వస్థలాన్ని కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టాలని చూస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ ఆందోళన చేయాల్సి వచ్చింది. వంశాధార, నాగవళి అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. వైఎస్సార్ తర్వాత కరకట్టల నిర్మాణం కోసం కనీసం చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదు. నారయణపురం ఆనకట్టతో 37 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. శిథిలావస్థకు చేరిన ఆనకట్టను పునర్ నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఆనకట్ట పునర్నిర్మాణం కనిపించిందా? చంద్రబాబు పాలనలో అంతా మోసం.. తిత్లీ తుపాన్ వస్తే రూ. 3435 కోట్ల నష్టమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. బాధితుల కోసం చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ. 520 కోట్లేనని, బాధితులను పూర్తిగా ఆదుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. నిజంగా తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకున్నారా? జాబు రాకుంటే నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు రూ. 1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో రైతులను దగా చేశారు. డీలర్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మెలను మోసం చేశారు. ఆరోగ్య శ్రీని పాతరేశారు. జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని దోచేస్తున్నాయి. ఆముదాలవలస నియోజవర్గంలో పెన్షన్లలో అక్రమాలు పెరిగాయి. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలంటే మీ సహకారం కావాలి.’ అని అధికారంలోకి రాగానే నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
‘ఆయన పాలనెప్పుడు ముగుస్తుందా అని చూస్తున్నారు’
సాక్షి, తణుకు/పశ్చిమగోదావరి : నాలుగు సంవత్సరాల టీడీపీ అరాచక పాలనలో ప్రజలందరూ విసిగి పోయారనీ, చంద్రబాబు పాలనెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడానికే తమ నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. గత 13 నెలలుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్కు తెలుగుదేశం పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలు చెప్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని సుబ్బారెడ్డి అన్నారు. తణుకులో జరిగిన కార్తీక వన సమారాధన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడాలి. కానీ, ఏపీలో పచ్చ చొక్కా లీడర్లు దోచుకోవడానికే పథకాలు తెస్తున్నారు’అని విమర్శలు గుప్పించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.