సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.