Hemanth
-
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. శివసేన ఎంపీ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్ తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న వారిని కలుసుకొని హేమంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారి ఉద్యమానికి హేమంత్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అనంతరం.. అక్కడికక్కడే తన రాజీనామా లేఖను స్పీకర్ ఓంబిర్లాకు పంపించారు. కాగా, లేఖలో మరాఠా రిజర్వేషన్ అంశం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. దీనిపై మరాఠా సమాజంలో భావోద్వేగాలు నెలకొన్నాయని పాటిల్ ప్రస్తావించారు. Shiv Sena MP Hemant Patil resigns from the post of MP in support of the ongoing movement in the state demanding Maratha reservation. He sent his resignation written in Marathito Lok Sabha Speaker Om Birla pic.twitter.com/mxI9lDHWTK — MUMBAI NEWS (@Mumbaikhabar9) October 29, 2023 ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని హింగోలి లోక్సభ నియోజకవర్గానికి హేమంత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఓబీసీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. మరోవైపు.. మరాఠా రిజర్వేషన్లపై షిండే ప్రభుత్వం స్పందిస్తూ.. లీగల్ స్క్రూటినీకి లోబడి రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: 'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?' -
ఒక్కసారిగా.. బుల్లెట్ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. నేపాల్కు చెందిన లక్ష్మణ్ రావల్ బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వచ్చాడు. సాయి భగవాన్ ఎన్క్లేవ్ వద్ద నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి కుమారులు హేమంత్ రావల్(03), భాస్కర్ ఉన్నారు. హేమంత్ 8వ తేదీన ఇంటి పక్కన ఉండే పురుషోత్తం బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి తండ్రి లక్ష్మణ్ రావల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
వీజే చిత్ర ఆత్మహత్య కేసులో భర్త హేమంత్ అరెస్ట్
-
సూత్రధారి రాజు.. అమలు యుగంధర్రెడ్డి
గచ్బిబౌలి(హైదరాబాద్): చింత యోగా హేమంత్ కుమార్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా ఉన్నారు. యుగంధర్ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్ పాషా అలియాస్ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్యకు పక్కా స్కెచ్ వేశాడు. రూ.10 లక్షల సుపారీకి రూ.50 వేలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. హేమంత్కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్లెట్, చైన్ను ఎరుకల కృష్ణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అల్లుడు హేమంత్ను అడ్డు తొలగించేందుకు రూ.30 లక్షలైనా ఖర్చు చేసేందుకు లక్ష్మారెడ్డి సిద్ధపడ్డట్టు విచారణలో వెల్లడైంది. లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చి అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అవంతి సోదరుడు అశీష్రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభిస్తే అశీష్రెడ్డిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. ఏ7 విజయేందర్ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్రెడ్డి, 12 కైలా సందీప్ రెడ్డి, ఏ15 షేక్ సాహెబ్ పటేల్తోపాటు గూడూరు సందీప్రెడ్డిలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసు: తొలిరోజు విచారణ) అమ్మకు బాగాలేదని... నిందితులు విజయేందర్రెడ్డి, స్పందన, రాకేష్రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో హేమంత్, అవంతిలను రెండుసార్లు కలిశారు. ‘నీవు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేద’ని నమ్మించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటించారు. మరోవైపు హేమంత్ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్రెడ్డి ప్లాన్ చేశారు. హత్యకు ముందు మరో గ్యాంగ్తో లక్ష్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ ముఠా నుంచి స్పందన రాకపోవడంతో యుగంధర్రెడ్డి ద్వారా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో గ్యాంగ్తో మాట్లాడిన విషయంపైనా విచారణ చేపట్టనున్నారు. ఎస్హెచ్వోతోపాటు మరో ఇద్దరికి కరోనా హేమంత్ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ఎస్హెచ్వో ఆర్.శ్రీనివాస్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో డీఐ క్యాస్ట్రో ఐవోగా ఉంటాడని డీసీపీ తెలిపారు. హత్యకేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషాలకు టెస్ట్లు చేయగా పాజిటివ్ అని తేలినట్లు సామాచారం. (చదవండి: మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను) -
హేమంత్ హత్య: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు విచారణలో భాగంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, యుగేంధర్ రెడ్డిలను విడివిడిగా విచారణ చేశారు. పోలీసులు విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. హేమంత్, అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని అయినా తమని కాదని పెళ్లి చేసుకోవడంతో హేమంత్పై పగతో రగిలిపోయినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక ఈ కేసులో హేమంత్ హత్యకు దారి తీసిన పరిణామాలు, పది లక్షల సుపారీ వ్యవహారంపై విచారణ చేశారు. కస్టడీ ముగియడంతో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిని ఇద్దరిని రిమాండ్కు తరలించారు. చదవండి: అందుకే హేమంత్ని చంపేశాం: లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో అవంతి పెళ్లి తరువాత కాలనీలో తల ఎత్తుకొని తిరగలేకపోయామని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గత 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్తో తనకు సంబంధాలు కానీ, మాటలు కానీ లేవని హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం తమదని, తాము ఉంటున్న కాలనీలో తమ కుటుంబానిదే ఆధిపత్యం ఉంటుందన్నారు. దీంతో అవంతి ప్రేమ విషయంతో కాలనీలో ఒకరికి ఒకరు చర్చించుకుంటుంటే తలదించుకోవాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి విచారణలో తెలిపారు. కస్టడీలో నిందితులు ఇద్దరినీ నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్ కేవలం తను డబ్బులు మాత్రమే సమకూర్చానని, మిగిలినదంతా తన బావమరిది యుగంధర్ రెడ్డినే చూసుకున్నాడని లక్ష్మారెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర పైకూడా విచారణ చేశారు. ఈ కేసులో ఆశిష్ రెడ్డి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. త్వరలోనే ఇతర నిందితులను సైతం కస్టడికి తీసుకోని పోలీసులు విచారించనున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను పోలుసులు అరెస్ట్ చేశారు. నన్ను చంపినా బావుండేది..! నలుగురు నిందితులు అరెస్ట్ హేమంత్ హత్యకు మొదట ఒప్పందం చేసుకున్న సుఫారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నట్లు తేలింది. డబ్బులు అందగానే ఫోన్ ఆఫ్ చేయడంతో, అవంతి మేనమామ యుగేంధర్ బిచ్చు గ్యాంగ్తో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేయగా వీరితో కలిసి 18ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అవంతి, హేమంత్ పెళ్లి తర్వాత వారిని అవంతి తల్లిదండ్రులు గచ్చిబౌలిలో చాలాసార్లు కలిసినట్లు తెలిపారు. ప్రేమపెళ్లి లక్ష్మారెడ్డికి నచ్చలేకపోవడంతో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హేమంత్ను చంపాలని కుట్ర చేశారన్నారు. ఆ తర్వాత అవంతకి మరో పెళ్లి చేయాలనుకున్నట్లు లక్ష్మారెడ్డి విచారణలో తెలిపాడు. కస్టడీ విచారణ అంశాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. అసభ్య ప్రవర్తన, ట్యూషన్ టీచర్ అరెస్ట్ కూకట్పల్లిలోని ట్యూషన్ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. సబ్జెక్ట్లో సందేహాలను నివృత్తి చేస్తానంటూ విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో ట్యూషన్ టీచర్ను అరెస్ట్ చేసిన షీ టీమ్ నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’) ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్య: సీపీ సజ్జనార్ని కలిసిన అవంతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో హేమంత్ కుమార్ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యను గచ్చిబౌలి పోలీసులు పరువు హత్యగా నిర్ధారించారు. తన భర్త హేమంత్ కుమార్ హత్యకు.. తన తండ్రి, మేనమామ కారణమని అవంతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు. పోలీసు కస్టడీకి నిందితులు: ఈ హత్య కేసులో పోలీస్ కస్టడీకి తీసుకున్న ప్రధాన నిందితులు యుగంధర్రెడ్డి, లక్ష్మారెడ్డిలను ఆరు రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్రెడ్డి అని పోలీసుల పేర్కొన్నారు. సూపారీ కిల్లింగ్లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అదే విధంగా గోపన్పల్లి హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డి హత్య స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 21మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి:(హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మాకు ప్రాణహాని ఉంది: అవంతి
సాక్షి, హైదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి డీసీపీ వెంకటేశ్వర్లును కలిశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు చేరుకున్న అవంతి, పోలీసుల వద్దనున్న తన భర్త వస్తువులను తీసుకోనున్నారు. ఆమె వెంట హేమంత్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. కాగా గతంలో తన పట్ల వ్యవహరించిన తీరు, హేమంత్ను దారుణంగా హత్య చేయించిన క్రమంలో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ అవంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి తమకు భద్రత కల్పించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.(చదవండి: హేమంత్ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) కాగా అవంతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హేమంత్ ఈ నెల 25న అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. దీనిని ‘పరువు హత్య’ గా తేల్చారు. పక్కా పథకం ప్రకారమే, తమ పరువు తీశాడనే పగతోనే అవంతి తల్లిదండ్రులు అతడిని హత్య చేయించినట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్తో కలిసి అతడి హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ తమ ముందు అంగీకరించినట్లు వెల్లడించారు. -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
హేమంత్ హత్య: 6 నెలలు అవంతి హౌజ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ కుట్రకు రెండు నెలల క్రితమే పథకం రచించినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్తో కలిసి అవంతి మేనమామ యుగందర్రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించారని విచారణలో నిందితులు అంగీకరించారు. హేమంత్, అవంతి కలుసుకోకుండా.. లక్ష్మారెడ్డి క్రూరంగా వ్యవహరించినట్టు తెలిసింది. పెళ్లికి ముందు తనను నెలలు నిర్బంధంలో ఉంచారని అవంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. (చదవండి: హేమంత్ హత్య: చందానగర్లో ఉద్రిక్తత) అప్పట్లో మిస్సింగ్ కేసు విచారణలో వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. హేమంత్ని కలుసుకోకుండా లక్ష్మారెడ్డి ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు. జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో హేమంత్కి కాల్ చేసిన అవంతి, అతనితో కలిసి బైక్ పైన పారిపోయింది. అయితే ఆ సమయంలో పవర్ లేకపోవడం, సీసీ కెమెరాల్లో రికార్డ్ కాకపోవడంతో.. అవంతి తల్లిదండ్రులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ నమోదైంది. ఆ తరువాత రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పోలీసులు పంపించేశారు. తర్వాత హేమంత్, అవంతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అదే పగతో రగిలిపోతున్న అవంతి తల్లి, హేమంత్ హత్య చేయడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసులో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించగా, మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో కేసులో లోతైన దర్యాప్తు కోసం నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఆధారాలతో సహా విచారణ చేయాలని భావిస్తున్నారు. ఇక జహీరాబాద్లో ఓఆర్ఆర్ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ కన్స్ట్రక్చన్ చేయాలనీ భావిస్తున్నారు. హంతకుల ఇళ్ల వద్ద రక్షణ ఇక హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అవంతి తరుపు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర మీడియాకు తెలిపారు. హంతకుల ఇంటి వద్ద పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని, బాధితుల ఇంటి దగ్గర పోలీసులు లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అవంతి, హేంమంత్ సోదరుడు సుమంత్, అతని స్నేహితులు ఆందోళనకు దిగారు. హేమంత్ ఇంటినుంచి లక్ష్మారెడ్డి ఇంటివైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చందానగర్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య: చందానగర్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్ భార్య అవంతి, సోదరుడు సుమంత్, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈక్రమంలో హేమంత్ ఇంటినుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, చందానగర్కు చెందిన అవంతిరెడ్డి, హేమంత్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా.. అవంతి తల్లిదండ్రులు హేమంత్ను కిరాతకంగా హత్య చేయించారు. అవంతి మేనమామ యుగేందర్రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటికే 14 మందిని జ్యూడిషియల్ రిమాండ్కు తరలించగా.. మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువకపముందే.. హేమంత్ హత్య సంచలనంగా మారింది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) వైఫల్యం కనిపిస్తోంది ‘జస్టిస్ ఫర్ హేమంత్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హేమంత్ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) -
పోలీసుల అదుపులో అవంతి సోదరుడు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ కుమార్ హత్య కేసులో మరో ఏడుగురు కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో అవంతి సోదరుడు అశీష్ రెడ్డి, సందీప్రెడ్డి సహా ఎ5 కృష్ణ, ఎ6 బాషా ఎ17, జగన్ ఎ18 సయ్యద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎ1 యుగంధర్ రెడ్డి కృష్ణతో హత్యకు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత జగన్, సయ్యద్ నిందితులకు సహకరించినట్లు పేర్కొన్నారు. తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. గతంలో సందీప్రెడ్డి హేమంత్ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఇక మరికాసేపట్లో హేమంత్ సోదరుడు, అవంతి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. తమకు ప్రాణహానీ ఉందని అవంతి ఫిర్యాదుచేయనుంది. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) -
హేమంత్ది పరువు హత్యే : పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి పరువు హత్యగా తేల్చారు. హేమంత్ను పక్కా ప్రణాళికతో పరువు కోసమే హత్య చేశారుని గచ్చిబౌలి పోలీసులు సోమవారం వెల్లడించారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్తో కలిసి హత్య చేయించినట్లు తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నారు. అవంతి-హేమంత్ ప్రేమ వివాహం గురించి తెలిసిన లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా తండ్రి తీవ్రంగా కట్టడిచేశాడని వెల్లడించారు. దీంతో జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో అవంతి ఇంట్లో నుంచి పారిపోయి హేమంత్ను కలిసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హేమంత్ హత్య కేసులో మొత్తం 22 మంది నిందితులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..) నిందితులను ఐదు రోజుల పాటు కస్టడి కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సంఘటన స్థలానికి సంబంధించి జహీరాబాద్లో ఓఆర్ఆర్ మీద సీసీ కెమెరా దృశ్యాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ-కన్స్ట్రక్చన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అవంతి, హేమంత్ కుటుంబసభ్యులు సీపీ సజ్జనార్ను కలవనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్యపై గ్రౌండ్ రిపోర్ట్
-
హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!
-
అసలు తప్పెవరిది?
-
హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?
పోలీసుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా..? ప్రేమ వివాహం చేసుకొని..భార్యవైపు బంధువుల చేతుల్లో హతమైన హేమంత్ ఉదంతాన్ని పరిశీలిస్తే ఈప్రశ్నలే ఉదయిస్తున్నాయి. హేమంత్ను కిడ్నాప్ చేసిన కారును..వారి గొడవలను గమనించిన కొందరు స్థానికులు అడ్డుకోకపోగా సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారు. కనీసం పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు. ఇక సరైన సమాచారం అందినా..పోలీసులు వేగవంతంగా స్పందించ లేదని, సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అందువల్లే ఓ యువకుడి నిండుప్రాణాలు గాల్లో కలిశాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : గచ్చిబౌలిలో కిడ్నాప్ అయి..సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ శివారు కిష్టాయిగూడెం వద్ద విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ హత్యోందంతం ఇటు పౌరుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ...అటు పోలీసింగ్ విధానం మారాలనే పాఠాన్నీ చెబుతోంది. గోపన్పల్లి తండా చౌరస్తా వద్ద కార్లు ఆగడం..వాటిలో పెనుగులాట జరిగిన తతాంగాన్ని సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిన జనాలు..కాస్త మానవత్వం ప్రదర్శించి..అడ్డుకుని..పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణ ఘటన జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వాటిని పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల వద్ద ఎటువంటి దాడి చేసే ఆయుధాలు లేవు. అయితే అక్కడ జరిగిన గలాటాను జనాలు చూశారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా దాదాపు 20 నిమిషాలకు పైగానే గడబిడ జరగడం..హేమంత్పై చేయిచేసుకోవడం జరిగింది. ఎలాగోలాగూ వారి నుంచి తప్పించుకొని హేమంత్ కుమార్ తెల్లాపూర్ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు కూర్చొని ఉన్న స్విఫ్ట్ కారు (టీఎస్08 ఈటీ 3031)ను డ్రైవ్ చేసిన అవంతి రెడ్డి మేనమామ యుగంధర్ రెడ్డి చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకొని తెల్లాపూర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎక్కి పటాన్చెరు వద్ద ఆగి అటు నుంచి జహీరాబాద్ వెళ్లారు. (చదవండి : హేమంత్ రిమాండ్లో సంచలన విషయాలు) ఇంతవరకు బాగానే ఉన్నా 3.50 గంటల ప్రాంతంలో అవంతి మామ (హేమంత్ తండ్రి) డయల్ 100కు కాల్చేస్తే 4.30 గంటలకు పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరొచ్చే 10 నుంచి 15 నిమిషాల ముందే హేమంత్ను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే గోపన్పల్లి తండా చౌరస్తా వద్ద 11 మందిని అదుపులోకి తీసుకొని, అవంతిని, ఆమె అత్తమామలను ఠాణాకు తీసుకెళ్లారు. ఇక్కడా హేమంత్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారని తెలిసిన పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సమన్వయం చేసి ఉంటే బాగుండేది... అయితే అక్కడ పట్టుకున్న 11 మందిని విచారించారే తప్ప కిడ్నాప్ అయిన హేమంత్పై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బలవంతంగా లాక్కొని పారిపోయారని హేమంత్ భార్య అవంతిరెడ్డి చెప్పినా మరుక్షణమే పోలీసులు ఆ కారు నంబర్ను చుట్టుపక్కల ప్రాంత పోలీసులకు చేరవేసి ఉంటే దొరికి ఉండేది కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 4.15 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయిన హేమంత్కుమార్ను దాదాపు మూడు గంటలకుపైగా కారులో తిప్పడంతో ఎక్కడోఒక్క దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. కేవలం యుగంధర్రెడ్డి, హేమంత్కుమార్ సెల్ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్పైనే ప్రధానంగా దృష్టి సారించడం...ప్రత్యామ్నాయలుగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సాధ్యమైనంత తొందరగా పరిశీలించకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. హేమంత్ కుమార్ను తీసుకెళ్లిన కారు వెళ్లిన మార్గంలో గస్తీ వాహనాలు ఉండి కూడా పట్టుకోకపోవడం పోలీసుల సమన్వయ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. ‘హేమంత్ కుమార్ను తీసుకెళ్లిన కారు తెల్లాపూర్ వైపు వెళ్లిందని మాత్రమే తెలుసు. అటు నుంచి ఓఆర్ఆర్ మీదుగా పటాన్చెరు నుంచి జహీరాబాద్ వెళ్లిన విషయం తెలియదు. నిందితుడు యుగంధర్రెడ్డి నోరు విప్పితేనే కారు ఏయే మార్గంలో వెళ్లిందో తెలిసింద’ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి : ‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’) నోరు విప్పని లక్ష్మారెడ్డి హేమంత్ కుమార్ను చంపేందుకు సుపారీ ఇచ్చిన విషయాన్ని అవంతి రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పలేదు. అతన్ని 4.30 గంటలకు పట్టుకుని..కొన్ని గంటలపాటు విచారించినా అసలు ఏ విషయం తెలపలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతడు నోరు విప్పి ఉంటే ఇంకాస్త సీరియస్గా తీసుకొని హేమంత్ ఆచూకీ కోసం వెతికేవాళ్లమని గచ్చిబౌలి ఠాణాలోని ఓ అధికారి పేర్కొన్నారు. మామూలుగా గొడవలతో తీసుకెళ్లి ఉంటారని అనుకున్నామనే చెప్పుకొచ్చారు. ‘హేమంత్..ఒక్కసారి కళ్లు తెరు’ శేరిలింగంపల్లి : కిడ్నాప్నకు గురై కిరాతకంగా హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు శేరిలింంపల్లి తారానగర్లోని శ్మశాన వాటికలో అశ్రునయనాల మధ్య శనివారం నిర్వహించారు. అంతకుముందు హేమంత్ మృతదేహాన్ని భద్రపరిచిన కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి తారానగర్లోని హేమంత్ నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే హేమంత్ భార్య అవంతిరెడ్డి, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీరాణి, మురళీకృష్ణలు బోరున విలపించారు. ‘ఒక్కసారి కళ్ళు తెరువు...హేమంత్..’అంటూ అవంతిరెడ్డి భర్త మృతదేహంపై పడి రోదిచడం...అరేయ్... తమ్ముడూ అంటూ ఒక్కసారి పిలువురా. పిలువు.... వాడొచ్చాడురా...చూడురా....వాడి మొహం చూడరా..అంటూ హేమంత్ తల్లి లక్ష్మీరాణి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. అంతకుముందు లండన్ నుంచి హేమంత్ తమ్ముడు సుమంత్ రావడంతో అతన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం తారానగర్లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు తండ్రి మురళీకృష్ణ నిర్వహించారు. హేమంత్ స్నేహితులు ‘అమర్ హై హేమంత్’అంటూ నినాదాలు చేశారు. (చదవండి : వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) రెండు రోజుల క్రితమే ఫోన్లో మాట్లాడా: సుమంత్ హేమంత్ హత్యకు కారణమైన వారికి నూరు శాతం శిక్ష పడాలని అతని తమ్ముడు సుమంత్ డిమాండ్ చేశారు. తారానగర్లో విలేకరులతో మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకుంటే చంపుతారా...? అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటి వరకు కేసు విషయంలో బాగా చేశారని, డబ్బు ఆశ చూపినా పట్టించుకోకపోవడంతో వారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం పెరిగిందని, సీఐ ఎవరో...నాకు తెలియదు...కానీ భవిష్యత్లో కూడా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తారనుకుంటున్నామన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనే ధీమాలో హంతకులు ఉన్నారన్నారు. రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడాను. చిన్నతనం నుంచి అన్నీ నాకు వాడే...వాడిని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భవిష్యత్తును నాశనం చేసిన వారికి శిక్ష పడాలి : అవంతిరెడ్డి హేమంత్తో వివాహమైన నాలుగు నెలలకే ఈ విధంగా చేయడం ఏంటి? అని హేమంత్ సతీమణి అవంతిరెడ్డి ప్రశ్నించారు. 15 మంది కలిసి నా భర్తను హత్య చేస్తారా..? నాపై ప్రేమ ఉంటే నేనుప్రేమించిన వ్యక్తిని చంపుతారా? అని ప్రశ్నించారు. నా భవిష్యత్ను నాశనం చేసి ఈ హత్యలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలన్నారు. యుగంధర్రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
పరువు హత్య
-
హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..
సాక్షి, హైదరాబాద్ : నిందితుల చేతిలో దారుణ హత్యకు గురైన హేమంత్ కేసులో పూటకో విషయం బయటపడుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుల ట్రావెల్స్ హిస్టరీ కీలకంగా మారుతోంది. చందానగర్లోని అవంతి ఇంటి దగ్గర నుంచి హత్య అనంతరం హైదరాబాద్కు వచ్చే వరకు చోటుచేసుకున్న ట్రావెల్స్ హిస్టరీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. అయితే నిందితుల ట్రావెల్ హిస్టరీపైన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. చందా నగర్లోని లక్ష్మారెడ్డి ఇంటి నుంచి మూడు కార్లలో నిందితులు బయల్దేరితే అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హోండా షైన్ వెహికల్పై బయలుదేరారు. తర్వాత రెండు గంటల నలభై నిమిషాలకు చందానగర్ నుంచి బయలుదేరిన నిందితులు.. 40 నిమిషాలు ట్రావెల్ చేసి గచ్చిబౌలిలోని అవంతి ఇంటికి చేరుకున్నారు. చదవండి: (వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) ఇంట్లో ఉన్న అవంతి, హేమంత్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని 15 నిమిషాల్లో గోపనపల్లి చౌరస్తాకు చేరుకున్నారు. గోపన్పల్లి చౌరస్తాలో అవంతిని కిందకు దింపి వేసిన నిందితులు.. హేమంత్తో మాట్లాడి పంపిస్తాను అంటూ యుగేంధర్ అలాగే కారులో తీసుకెళ్లారు. యుగేంధర్తోపాటు అప్పటికే కారులో ఉన్న కిరాయి హంతకులు.యాదవ్, రాజు, పాషా ఉన్నారు. వీరంతా కలిసి ఒకే కారులో జహీరాబాద్ వైపు పయనించారు. ఈ సమయంలో కిరాయి హంతకులు హేమంత్ను పలుమార్లు బెదిరించారు. అవంతిని వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అవంతిని వదిలి పెట్టేందుకు హేమంత్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జహీరాబాద్ వద్ద మద్యంతో పాటు తాల్లు తీసుకున్న యుగేంధర్ 7:30కు సంగారెడ్డి సమీపానికి చేరుకున్నారు. చదవండి: (హేమంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు) కారులోనే హేమంత్ కాళ్లు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేశారు. 7:30 ప్రాంతంలో నీకు ప్రేమ, పెళ్లి ఎందుకని బెదిరించిన యుగేంధర్ హేమంత్ను ఉరివేసి చంపేశాడు. అనంతరం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ముత్తంగి సమీపంలోని దేవాలయం వద్ద మద్యం సేవించారు. 1:30 కు సంగారెడ్డిలోని మిత్రుల వద్ద భోజనం చేశారు. అఖరుకి 2:30కు యుగేంధర్ పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉండగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంనచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్ని హత్య చేయించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్ హత్య చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్రెడ్డి కాగా మొత్తం 18 మంది నిందితుల ప్రమేయం ఉంది. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. (మరో ‘పరువు’ హత్య) -
‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దారుణ హత్యకు గురైన హేమంత్ తమ్ముడు సుమంత్ సాక్షి టీవీతో శనివారం మాట్లాడారు. తన అన్న హత్య కేసులో ప్రమేయమున్నా ఒక్కరినీ వదలొద్దని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి హత్యలు జరగొద్దని కోరుకున్నారు. హత్యోదంతంపై సుమంత్ మాట్లాడుతూ.. మా అన్న హేమంత్ను కొట్టుకుంటూ సంగారెడ్డి తీసుకెళ్లి చంపారట. చివరి సారిగా ఆకలిగా ఉందని చెప్పినా వాళ్లు కనికరించలేదంట. (చదవండి: మరో ‘పరువు’ హత్య) నీకెందుకురా అన్నం అంటూ కొట్టారంట. హత్య వెనకాల అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి అర్చన ప్రధాన పాత్ర పోషించినట్టు తెలసుస్తోంది. నా అన్న చంపిన వారిని వదలొద్దు. ఇలాంటి హత్యలు మళ్లీ జరగొద్దు. యూకేలో హోటల్ బిజినెస్ ప్లాన్ చేశాను. కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాం. ఈ లోపే అన్నయ్యకు ఇంత దారుణం జరగడం కష్టంగా ఉంది. అన్నయ్య సినిమాల్లో ప్రయత్నించాడు. అమ్మ ఇద్దరినీ అందంగా ఉండాలని కోరుకునేది. కానీ చివరిసారిగా అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’అని సుమంత్ కన్నీరుమన్నీరయ్యాడు. (చదవండి: వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) -
వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి
సాక్షి, హైదరాబాద్: హేమంత్ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్ చేశారు. తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. నాపై ప్రేమ ఉంటే నేను ప్రేమించిన వ్యక్తిని చంపుతారా? మా అమ్మానాన్నల కంటే అత్తామామ ఎక్కువగా ప్రేమిస్తారు. మా ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారు. (చదవండి: హేమంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు) హత్యలో మేనమామలు ఇన్వాల్వ్ అవుతారని అనుకోలేదు. మేనమామలు విజేందర్రెడ్డి, యుగేంధర్రెడ్డి, కలిసి చేశారు. నా భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలి’అని అవంతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కాగా, కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్ని హత్య చేయించారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్రెడ్డి. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్ హత్య చోటుచేసుకుంది. (చదవండి: మరో ‘పరువు’ హత్య) -
హేమంత్ రిమాండ్లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ హత్య కేసులో రిమాండ్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవంతి, హేమంత్ను విడదీయడంతోపాటు హేమంత్ను చంపేందుకు ప్లాన్ చేసిన మొత్తం వివరాలను నిందితులు పోలీసుల ఎదుట వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందే హేమంత్ను చంపేందుకు పథకం పన్నినట్లు నిందితులు లక్ష్మారెడ్డి, యుగేంధర్ వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్ను ఎలా చంపాలి, ఎలా కిడ్నాప్ చేయాలనే విషయంపై నెల రోజుల ముందే స్కెచ్ వేసినట్లు యుగేంధర్ తెలిపారు. ఇందుకు కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాలతో పలుమార్లు సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే అవంతికి మాయమాటలు చెప్పి తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. నెల క్రితం హేమంత్ను చంపేందుకు లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి) కులాంతర వివాహం చేసుకున్న కారణానికి హేమంత్ అనే వ్యక్తిని గురువారం అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జూన్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి జూన్ 11న హేమంత్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అవంతి, హేమంత్ వివాహం కారణంగా అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన తన కూతురు వివాహంపై యుగేంర్రెడ్డితో గోడు వెళ్లదీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్ నుంచి విడదీయాలని యుగంధర్రెడ్డి నిర్ణయించుకున్నాడు. నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం ఎలాగైనా అవంతి, హేమంత్ను విడదీయాలని నిర్ణయం తీసుకున్నారు. (హైదరాబాద్లో పరువు హత్య కలకలం) యుగేందర్రెడ్డి అన్న విజయేందర్రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ నిర్వహించి ఈ నెల 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఈ క్రమంలో 12 మంది బంధువులు హేమంత్, అవంతిపై దాడిచేస్తూ వారిని కారులోకి ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్పల్లివైపు బుంధువులు తీసుకెళ్లగా గోపన్పల్లిలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా హేమంత్ దొరకపట్టి సాయంత్ర 7:30కు కారులోనే హేమంత్ను నిందితులు హత్య చేశారు. సీన్లో లేకుండా లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడగా అనంతరం బైక్పై గోపన్పల్లికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్ అయ్యారు. కాగా అర్చన బాధ చూడలేకే హత్య చేశానని యుగంధర్రెడ్డి తెలిపారు. హేమంత్ హత్య కేసులో 18మంది నిందితులు ఉండగా వీరిలోనలుగురు కృష్ణ, బాషా,జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. మిగతా 14 మందిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అవంతిని వదిలేయమని హేమంత్కు ఎంతచెప్పిన వినకపోతేనే హత్య చేశామని ఏ1 నిందితుడు యుగేంధర్ రెడ్డి తెలిపారు.కారులో సైతం చాలా సేపు నచ్చచెప్పినట్లు పేర్కొన్నారు. కాగా యుగేంధర్ రెడ్డితో ఏడు లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని ఏ5 నిందితుడు బిచ్చుయాదవ్ తెలిపారు. అతనితో 10 సంవత్సరాలుగా కలిసి వాటర్ సప్లై బిజినెస్ చేశామని, ఆ పరిచయంతోనే హత్యకు ఒప్పుకొన్నామని వెల్లడించారు. -
ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్న పాపానికి హత్యకు గురైన హేమంత్ సోదరుడు సుమంత్ యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అన్న మృతి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. వదిన అవంతిని పట్టుకుని బోరున విలపించాడు. తన అన్నను చంపిన వారిని ఎవరిని వదలనని, వారందరినీ కఠినంగా శిక్షించాలని సుమంత్ డిమాండ్ చేశాడు. హత్య జరిగే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశాడని, బిజినెస్ సంబంధించిన పలు అంశాలపై చర్చించామని తెలిపాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన అన్నను అతి కిరాతంగా హత్య చేశాడని, చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని చందానగర్ శ్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. (మరో ‘పరువు’ హత్య) అంత్యక్రియల సమయంలో హేమంత్ భార్య అవంతి, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు నన్ను పాడె మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ అంటూ భార్య అవంతి రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు ఈ హత్యలో ప్రధాన సూత్రధారి యుగేందర్ రెడ్డితోపాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
కలకలం రేపిన పరువు హత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రణయ్ పరువు హత్యకేసు ఇంకా మరువకముందే.. జిల్లాలో మరో పరువు హత్య సంచలనం కలిగించింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని గురువారం రాత్రి యువతి తరపు కుటుంబీకులు, బంధువులు అతి కిరాతకంగా హత్యచేసి ఈ జిల్లాలో పడేయడం సంచలనం రేపింది. నగరానికి శివారులో ఉండడంతో.. హైదరాబాద్ నగరానికి జిల్లా శివారులో ఉండడంతో హత్యలు చేయడానికి, హత్యలు నగరంలో చేసి మృతదేహాలు ఇక్కడ పడేయడానికి నిందితులు ఇక్కడ స్థలాన్ని ఎంచుకుంటున్నారు. చందానగర్కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి తరపు కుటుంబీకులు, బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు, కుటుంబీకులు అదను చూసి గురువారం మధ్యాహ్నం అవంతిని, హేమంత్ను కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారు. (ప్రేమే నేరమా..!) ఈ క్రమంలో మార్గమధ్యలో అవంతి కారులోనుంచి తప్పించుకుంది. హేమంత్ను మాత్రం సంగారెడ్డి సమీపంలోని హైదరాబాద్–బీదర్ జాతీయ రహదారి మార్గంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొండాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కిష్టయ్యగూడెం ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హేమంత్ను నగరంలోనే హత్య చేసి ఇక్కడికి తెచ్చి పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా..? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ.. పరువు హత్యలే కాకుండా పాత కక్షలతో జిల్లాలో హత్య చేయడమో..ఇతర ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాలను పడేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఐదు నెలల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తిని అతని బంధువులే పటాన్చెరు సమీపంలోగల రుద్రారం పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై నరికి చంపారు. -
ప్రేమే నేరమా..!
సాక్షి, సిటీబ్యూరో: మరోసారి పరువు పడగ విప్పింది.. ఉన్మాదమై బుసకొట్టింది.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచం గుప్పెట్లోకి వచ్చినా.. మానవ సంబంధాల్లోని బూజు మాత్రం తొలగిపోలేదు. మనిషితనం అదేపనిగా మాయమవుతూనే ఉంది. గచ్చిబౌలికి చెందిన హేమంత్ హత్య మరోసారి అత్యంత అమానవీయమైన కుల ఉన్మాదాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు అవంతి, హేమంత్లు. మైనారిటీ తీరి మేజర్లయ్యారు. కులాలు వేరైనా మనస్సులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. అవంతి కుటుంబానికి ఇది మింగుడుపడలేదు. హేమంత్ను దారుణంగా హతమార్చారు. మిర్యాలగూడ తరహాలో నగరంలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య మరోసారి చర్చనీయాంశమైంది. కుల, మతాంతర వివాహాలకు రక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించకపోవడం వల్లనే నేరాలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, మనస్తత్వ నిపుణులు హేమంత్ హత్యను తీవ్రంగా ఖండించారు. ప్రేక్షకపాత్ర మంచిది కాదు వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. కానీ సమాజంలో పలుకుబడి గల వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందించడం లేదు. తప్పును తప్పు అని చెప్పకపోవడం కూడా నేరమే. పరువు హత్యలను కొంతమంది మనోభావాలకు ముడిపెట్టి ఇలా ప్రేక్షకపాత్ర వహించడం వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా అగ్రకులాలకు చెందిన వారి పిల్లలు, దళితుల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అగ్రకులాల మధ్య కూడా కుల ఉన్మాదం పెరిగింది. (మరో ‘పరువు’ హత్య) ఒక కులాన్ని మరో కులం సహించలేని దారుణమైన కుల ఆధిపత్యం ఇది. చాలా దారుణం. ఇలాంటి హత్యల వల్ల మానవత్వం నశిస్తుంది. నేరస్తులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్ల కూడా నేరాలు పెరుగుతున్నాయి. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడుతుంది. ప్రేమ పెళ్లిళ్లలో ఇష్టమైతే తల్లిదండ్రులు ఆ జంటను ఆశీర్వదించాలి. లేదా వారి ఇష్టానికి వారిని వదిలేయాలి, కానీ ఇలా హత్యలకు పాల్పడటం దారుణం. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు రావాలి కులాంతర, మతాంతర వివాహాలకు సంబంధించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బలంగా లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. 1954లో తెచ్చిన ఈ చట్టం మొక్కుబడిగా కొద్దిపాటి నగదు ప్రోత్సాహం ఇవ్వడానికే పరిమితమైంది. కానీ సరైన రక్షణ కల్పించలేకపోతోంది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు చట్టబద్ధమైన రక్షణ, సామాజిక భద్రత ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే ఇలాంటి హత్యలు జరగవు. ‘ఆడ పిల్లలు కుటుంబ గౌరవానికి ప్రతీక’ అనే పాతకాలం నాటి భావాల్లో కూడా మార్పు రావాలి. ఆడైనా, మగైనా సమానమే. కుల, మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు కూడా సాధ్యమైనంత వరకు ఇరువైపులా తల్లిదండ్రులను, కుటుంబాలను ఒప్పించడం మంచిది. పోలీసుల ద్వారా, ఇతరత్రా సంస్థల ద్వారానైనా సరే ఒప్పించడం ఒత్తిడి తెచ్చి ఒప్పించడం వల్ల ఇలాంటి హత్యలను ముందస్తుగానే అడ్డుకున్నట్లవుతుంది. – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త హత్యలతో పంతం నెగ్గించుకోవడం దారుణం అప్పటి వరకు మనిషిలో నిద్రాణంగా దాగి ఉన్న నేర స్వభావం తన అధిపత్యానికి విరుద్దమైన ఘటనలు జరిగినప్పుడు ఇలా బయటకొస్తుంది. ఈ రోజుల్లో కూడా కులపిచ్చి హత్యలకు పాల్పడే స్థాయిలో ఉండటం చాలా దారుణం. సాధారణంగా కుటుంబంలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. కేరింగ్ అండ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. కేవలం ఒకరిద్దరు వ్యక్తులు తమ పంతాన్ని నెగ్గించుకోవడం, తాము చెప్పిందే చెల్లుబాటుకావాలనుకోవడం హత్యల వరకు దారితీయడం శోచనీయమే. ఇలాంటి దారుణాలు మరోసారి పునరావృతం కాకుండా సమాజం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ రాధికా ఆచార్య, మనస్తత్వ నిపుణులు -
మరో ‘పరువు’ హత్య
సాక్షి, సంగారెడ్డి/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్నదనే నెపంతో కూతురు భర్తనే అతి దారుణంగా హత్య చేశారు. కూతురు కుటుంబంలో కన్నవారే నిప్పులు పోశారు. ప్రణయ్ హత్యోదంతాన్ని తలపించిన మరో ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రధాన నిందితుడు యుగేందర్రెడ్డి ఫోన్ సిగ్నల్ను ట్రేస్ చేసి గచ్చిబౌలి పోలీసులు పట్టుకోవడంతో విగతజీవిగా పడి ఉన్న చింతా యోగా హేమంత్ కుమార్ (28) అచూకీ దొరికింది. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. పరిచయం ప్రేమగా మారి... తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన చింతా యోగా మురళీకృష్ణ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి చందానగర్లో నివాసం ఉంటోంది. మురళీకృష్ణ, లక్ష్మీరాణి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, పెద్దకుమారుడైన హేమంత్ ఇంటీరియర్ డిజైనర్. ప్రస్తుతం విద్యానగర్లో నివాసముండే దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి గతంలో మురళీకృష్ణ ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ఈ సమయంలోనే బీటెక్ పూర్తి చేసిన లక్ష్మారెడ్డి కూతురు అవంతిరెడ్డి... హేమంత్ అమ్మ నిర్వహించే బ్యూటీపార్లర్కు వస్తుండేది. అప్పుడు వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇలా వీరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కలిసి బతకాలని నిర్ణయించుకొని జూన్ 10న ఇంటి నుంచి పారిపోయారు. భర్తతోనే ఉంటానని చెప్పింది.. జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హేమంత్, అవంతి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కావాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ను కలువగా చందానగర్ పోలీస్స్టేషన్కు వెళ్లమని సూచించారు. దీంతో జూన్ 16న హేమంత్, అవంతి రెడ్డిలతోపాటు వారి తల్లిదండ్రులు చందానగర్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అప్పుడే తన పేరిట ఉన్న దాదాపు రూ.ఐదు కోట్ల ఆస్తులను అవంతి తన తల్లిదండ్రులకు రాసి ఇచ్చింది. ఆ తర్వాత గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో అవంతి, హేమంత్ అద్దెకు ఉంటున్నారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాలని అనుకున్నారు. బైక్పై రెక్కీ.. ఆ వెంటనే కార్లలో వచ్చి గురువారం మధ్యాహ్నం 2.00 గంటలప్పుడు లక్ష్మారెడ్డి డ్రైవర్ షేక్ సాహెబ్ పటేల్(48) బైక్పై టీఎన్జీవోస్ కాలనీకి వెళ్లి హేమంత్, అవంతి ఇంట్లోనే ఉన్నారని గమనించి సమాచారాన్ని చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మూడు కార్లలో అవంతి ఇంటికి చేరుకున్నారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పి బలవంతంగా లాక్కొచ్చి కారులోకి అవంతిరెడ్డిని ఎక్కించారు. ఒక్కదాన్నయితే రానని చెప్పడంతో అదేకారులో హేమంత్ కుమార్ను ఎక్కించుకున్నారు. దారి మళ్లించడంతో దిగేశారు... గోపన్పల్లి తండా చౌరస్తాకు వెళ్లగానే 3.42 గంటల ప్రాంతంలో ముందు ఉన్న కారు ఎడమ వైపు తిరిగి ఆగింది. ఆ వెంటనే వెనకాల ఆగిన ఐ20 కారు డోర్ తీసుకొని అవంతి గౌలిదొడ్డి వైపు, హేమంత్ తెల్లాపూర్ రోడ్డుపై పరుగులు తీశారు. ఆ దృశ్యాలను పలువురు స్థానికులు సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారేకానీ, ఏ ఒక్కరూ ఆపేందుకు ముందుకు రాలేదు. కారు దిగి పరిగెత్తిన విషయాన్ని అవంతి తన మామ (హేమంత్ తండ్రి) మురళీకృష్ణకు కాల్ చేసి చెప్పింది. ఆయన వెంటనే 3.50 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేసి చెప్పి బైక్పై భార్య లక్ష్మీరాణితో అక్కడికి వచ్చాడు. సుమారు 4.30 గంటల ప్రాంతంలో గోపన్పల్లి తండాకు చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు 2 కార్లలో ఉన్న 11 మందిని పట్టుకున్నారు. చేజ్ చేసి బలవంతంగా కారులో ఎక్కించి... హేమంత్ కుమార్ను యుగేందర్రెడ్డి కారులో వెంబడించి సినీఫక్కీలో పట్టుకున్నాడు. అప్పటికే ఆ వాహనంలో ఉన్న బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు హేమంత్ పారిపోకుండా మధ్యలో కూర్చోపెట్టుకొని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే హేమంత్ కుమార్ చివరగా తన సెల్ఫోన్ నుంచి ఓ స్నేహితుడికి లొకేషన్ షేర్ చేశాడు. కానీ, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు యుగేందర్ అందరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. హేమంత్ కాళ్లు కట్టి, నోరు, ముక్కుపై గుడ్డ పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న హేమంత్ గొంతు చుట్టూ గుడ్డ బిగించారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాకే మల్కాపూర్ శివార్లలో కిష్టాయిగూడెం సమీపంలోని పొదల్లో రాత్రి 7.30 గంటలకు మృతదేహాన్ని పడేశారు. 20న చంపాలని ప్లాన్ చేశారు ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో ఎంత మాట్లాడించినా అవంతి మనసు మారకపోవడంతోపాటు ఆస్తి, అంతస్తుల్లో తమకన్నా కిందిస్థాయిలో ఉన్న అల్లుడు హేమంత్ను హతమార్చాలని ఈ నెల 20న నిర్ణయించారు. చందానగర్లోని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, ప్రధాన నిందితుడు, మేనమామ గూడూరు యుగేందర్రెడ్డిలు చర్చించుకున్నారు. దీంతో యుగేందర్ రెడ్డి రూ.10 లక్షల సుపారీ ఇస్తే పని అవుతుందని అక్కాబావలకు చెప్పాడు. మరుసటి రోజే ఇంటికి వచ్చిన యుగేందర్ రెడ్డి రూ.లక్ష అడ్వాన్స్గా తీసుకొని సుపారీ మాట్లాడుకున్న వట్టినాగులపల్లి వాసి బిచ్చు యాదవ్, గోపన్పల్లి వాసి ఎరుకల కృష్ణ, మహమ్మద్ పాషాకు రూ.28 వేలు ఇచ్చాడు. మిగతాది పని పూర్తికాగానే ఇస్తానని చెప్పాడు. రావన్ కోల్లో పట్టుబడ్డారిలా... రాత్రి 9.40 గంటల ప్రాంతంలో ఎరుకల కృష్ణ మధ్యలోనే వాహనం దిగిపోగా, బిచ్చుయాదవ్ మాత్రం యుగేందర్రెడ్డితో కలసి రావన్కోల్కు వెళ్లాడు. అక్కడికెళ్లాక యుగేందర్ రెడ్డి మళ్లీ ఫోన్ స్విచ్ఛాన్ చేయడంతో పోలీసులు ట్రేస్ చేసి వారిద్దరిని పట్టుకున్నారు. వారికి భోజనం సమకూర్చిన గూడూరు సందీప్రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ ఆచూకీ లభ్యమైంది. అప్పటికే దొంతి లక్ష్మారెడ్డి, అర్చన, వారి బంధువులు అర్ధం రంజిత్ రెడ్డి›, రాకేష్ రెడ్డి, రజిత, ఎల్లు సంతోష్ రెడ్డి, కైలా సందీప్రెడ్డి, అర్ధం స్పందన, ఎల్లు స్వప్న, సాహెబ్ పటేల్లను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి చేతికి ఉన్న రెండు తులాల బంగారు కడియం తీసుకున్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషాలు పరారీలో ఉన్నారు. అయితే అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. పోలీసులు సకాలంలో వచ్చి ఉంటే హేమంత్ కిడ్నాప్కు గురయ్యేవాడు కాదని పలువురు విమర్శిస్తున్నారు. ముఖంపై గాయాలు.. మెడకు తాడు బిగింపు ముఖంపై బలమైన పిడిగుద్దులతోపాటు మెడకు తాడు బిగించడం వల్లే హేమంత్ కుమార్ ఊపిరాడక మృతి చెందినట్లు శుక్రవారం పోస్టుమార్టం చేసిన ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ డాక్టర్ ఝాన్సీలక్ష్మి సహా ఆరుగురు వైద్యుల బృందం గుర్తించింది. మృతదేహాన్ని చూసి తల్లి, భార్య గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి ఫీజర్ బాక్స్లో భద్రపరిచారు. ఏం సాధించారు? సొంత కూతురి పసుపు, కుంకుమలు పోగొట్టి వారు ఏం సాధించారు.. ఆ తల్లిదండ్రులు అసలు మనుషులేనా.. బిడ్డ విషయంలో ఎవరైనా ఇలా చేస్తారా.. ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు. కొద్దిరోజులు గడిస్తే అంతా సద్దుమణిగిపోతుందని భావించాం. కానీ, ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదు. గురువారం ఉదయం ఫోన్ చేసి అమ్మా.. దోశలు చేసిపెట్టు వస్తున్నా.. అని చెప్పాడు. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేదు. –రాణి, మృతుడి తల్లి ఉరితీయాలి.. తన కుమారుడు హేమంత్ను హత్య చేసిన వారిని, వారి వెనుక ఉన్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డిని తమ కళ్లముందు ఉరితీయాలి. హేమంత్ అవంతిని కులాంతర వివాహం చేసుకున్నా తాము వ్యతిరేకించలేదు. అవంతిని కూడా తమ సొంత బిడ్డలాగే చూసుకున్నాం. పిల్లల ప్రేమ, ప్రాణాల కన్నా డబ్బు, కులమే ముఖ్యమా? ఇలాంటి తల్లిదండ్రులను ఎక్కడా చూడలేదు. –మురళీకృష్ణ, మృతుడి తండ్రి సకాలంలో స్పందించి ఉంటే.. బతికేవారు: అవంతి తన భర్తను హత్య చేసిన వారెవరినీ ప్రాణాలతో ఉండనీయొద్దు. ఇలాంటి పరువుహత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. హేమంత్ను చంపేస్తారని నాకు ముందే తెలిస్తే.. అంతకంటే ముందే నేనే ఆత్మహత్య చేసుకునే దాన్ని. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాననే నా తల్లిదండ్రులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. నా భర్త చావుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. యూఎస్లో ఉంటున్న నా భర్త సోదరుడు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తాం. హేమంత్ తల్లిదండ్రులు మురళీకృష్ణ, రాణి, భార్య అవంతి (మధ్యలో) -
హేమంత్ హత్య: కారులో చిత్రహింసలు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ కుమార్ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, హేమంత్ హత్య కోసం పది లక్షల రూపాయల సుఫారీతో ఇద్దరు వ్యక్తులను రంగంలోకి దించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యుగంధర్ రెడ్డి చందానగర్కు చెందిన ఆ ఇద్దరు కిరాయి హంతకులతో కలిసి హేమంత్ హత్యకు ప్లాన్ రచించాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు గచ్చిబౌలి ఎన్జీవో కాలనీలో హేమంత్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో వేసుకెళ్లిపోయాడు. గోపన్ పల్లికి వెళ్లాక, ఆ కారులో నుంచి దింపి మరో కారులో ఎక్కించారు నిందితులు. తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో పడేసి చిత్రహింసలు పెట్టారు. ( మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి ) ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి తరలించారు. తాడుతో హేమంత్ మెడను బిగేసి హత్య చేశారు. రాత్రి 7:30కే హత్య చేసి సంగారెడ్డి మల్కాపూర్లో పడేశారు. కాగా, హేమంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కుటుంబసభ్యులు మృతదేహం పాడవకుండా ఉండేందుకు గచ్చిబౌలిలోని కాన్టినెంటల్ హాస్పత్రికి తరలించారు. రేపు చందా నగర్లో అంతక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో యూకేలో ఉంటున్న హేమంత్ తమ్ముడు సుమంత్ అన్నయ్య కడసారి చూపుకోసం బయలుదేరాడు. సినిమాలో హీరోగా హేమంత్ మృతుడు హేమంత్ కుమార్ ఓ సినిమాలోనూ నటించాడు. అందమైన మాయ అనే సినిమాలో హీరోగా చేశాడు. 2015 డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిందితుల్లో ఒకరి కరోనా హేమంత్ హత్య కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శుక్రవారం నిందితులకు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
హేమంత్ కేసులో 13మంది అరెస్ట్
-
హేమంత్ కేసులో 13మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : చందానగర్కు చెందిన హేమంత్ కుమార్ హత్యకేసులో మొత్తం 13మందిని అదుపులోకి చేసినట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వైద్య పరీక్షలు నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ హేమంత్ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి ప్రధాన నిందితుడని వెల్లడించారు. హేమంత్ తల్లిదండ్రులు ఫోన్ చేయగానే తాము స్పందించామని, అతడి ఆచూకీ కోసం అన్నివిధాల ప్రయత్నించామన్నారు. (హైదరాబాద్లో పరువు హత్య కలకలం) కేసు వివరాల గురించి డీసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... చందానగర్లోని తారానగర్లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ ఉండేవాళ్లు. అవంతి బీటెక్ చేయగా, హేమంత్ డిగ్రీ పూర్తి చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చందానగర్ పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సిలింగ్ తర్వాత హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మీతో మాట్లాడాలంటూ అవంతి కుంటుంబ సభ్యులు మూడు కార్లులో గచ్చిబౌలిలోని హేమంత్ ఇంటికి వచ్చారు. (మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి) చందానగర్ వెళ్లాలంటూ వారిద్దరినీ కారులో తీసుకెళ్లుతుండగా అనుమానం రావడంతో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. వెంటనే కారులో నుంచి తప్పించుకుని అవంతి తన అత్తమామలకు ఫోన్ చేసింది. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు మరికొందరు హేమంత్ను మరో కారులో తీసుకు వెళ్లారు. హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తం అయ్యారు. హేమంత్ ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. నిన్న రాత్రి గోపన్పల్లిలో తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నాం. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ను సంగారెడ్డిలో హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే పడేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం.’ అని తెలిపారు. నిందితుల వివరాలు.. 1.లక్ష్మారెడ్డి 2.సందీప్ రెడ్డి 3.రంజిత్ రెడ్డి 4. రాకేష్ రెడ్డి 5.సంతోష్ రెడ్డి 6.విజేందర్రెడ్డి 7.యుగేందర్ రెడ్డి 8.స్వప్న 9.రజిత 10.స్పందన 11.అర్చన 12.సాహెబ్ పటేల్ (డ్రైవర్) మూడు కార్లు స్వాధీనం హేమంత్ హత్యకు వినియోగించన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రీజా, ఐ20,షిఫ్ట్ కార్స్ మూడింటిని కిడ్నాప్ హత్యకు నిందితులు వినియోగించారు. హత్యకు మందే పక్కా పథక రచన చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
హేమంత్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు..
-
మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్ను హత్య చేశారని ఆమె తెలిపారు. అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. (హైదరాబాద్లో పరువు హత్య కలకలం) నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); ఇలా ప్రాణాలు తీస్తారనుకోలేదు.. కేవలం కులం అనే కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని మృతుడు హేమంత్ తల్లి లక్ష్మీ భోరున విలపించారు. తన కొడుకుకు ఒక్క చెడు అలవాటు కూడా లేదని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదన్నారు. ‘తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పాను. అయితే వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అర్థరాత్రులు ఫోన్ చేసి బెదరించారు. నా కొడుకును చూస్తే ఎలా చంపాలనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణాలు తీస్తారని ఎప్పుడూ ఊహించలేదని హేమంత్ తండ్రి చింతా మురళి కన్నీటిపర్యంతమయ్యారు. హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్ట్ హత్య కేసులో 13మందిని అరెస్ట్ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అవంతి,హేమంత్ను తీసుకెళ్లారన్నారు. హేమంత్ తండ్రి 100కు కాల్ చేశారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6.30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయానికే హేమంత్ను చంపేశారని, ఈ హత్య కేసులో యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులదే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసుల అలసత్వం ఏమీ లేదని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. హేమంత్ హత్యకు కొద్ది క్షణాల ముందు తీసిన ఫోటో -
సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
-
హైదరాబాద్లో పరువు హత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని అతి కిరాతంగా హత్య చేయించాడో తండ్రి. చందానగర్కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు. కాగా హేమంత్ భార్యతో కలిసి ఉండగానే కిరాయి హంతకులు గురువారం మధ్యాహ్నం వారిద్దరినీ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు హేమంత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతి తల్లిదండ్రులతో పాటు తొమ్మిదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో లభ్యమైన హేమంత్ మృతదేహం యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. గచ్చిబౌలి పోలీసులు నిన్న అర్థరాత్రి మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సంగారెడ్డి క్లూస్ టీమ్ కిష్టాయాగూడెం వెళ్లింది. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్ఎన్ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చిన్నాతో ప్రేమగా’. పీవీఆర్ దర్శకత్వంలో ఎస్.యన్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బి. చండ్రాయుడు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ముఖ్యమైన పాత్ర చేయడంతో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారంలో పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డ్యాన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’అన్నారు పీవీఆర్. ఈ చిత్రానికి కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, సంగీతం: రాజ్ కిరణ్. -
‘సతీష్ను హత్య చేసింది హేమంతే’
-
అప్పటి నుంచి సతీష్పై ద్వేషం పెంచుకున్న హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. (చదవండి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) ‘గత నెల 28న సాఫ్టవేర్ ఇంజనీర్ సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడు హేమంత్ను అరెస్ట్ చేశాం. విచారణలో సతీష్ స్నేహితుడు హేమంత్ పై అనుమానం వచ్చింది. దీంతో అతని ఇంటికి వెళ్లి చూశాం. హేమంత్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తాళం విరగొట్టి చూస్తే సతీష్ బాడీ ఇంట్లో ఉంది. దీంతో హేమంత్ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పకున్నాడు. అప్పటి నుంచి సతీష్పై ద్వేషం పెంచుకున్నాడు సతీష్, హేమంత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి , సాఫ్ట్ వేర్ సోల్యూషన్ లో కోచింగ్ ఇస్తున్నాడు. మరో వైపు హేమంత్ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ మధ్యలోనే మానేసేవాడు. ఓ సందర్భంలో సతీష్ను హేమంత్ కలుసుకొని ఉద్యోగం ఇప్పించమని కోరారు. దీంతో తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత హేమంత్, సతీష్ భాగస్వాములుగా ఓ ఐటీ కంపెనీని నిర్వహించారు. ఈ సందర్భంగా 2016లో తన దగ్గర కోచింగ్ తీసుకొని తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న ప్రియాంకను సతీష్ హేమంత్కు పరిచయం చేశాడు. అంతకు ముందే సతీష్కు ప్రియాంకకు మధ్య సాన్నిహిత్యం ఉండేది. ప్రియాంక కేపీహెచ్బీలో హాస్టల్లో ఉండేది. కాగా కొద్ది రోజుల తర్వాత ప్రియాంకతో హేమంత్కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం హేమంత్ భార్యకు తెలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హేమంత్, ప్రియాంక ఒక గది రెంట్కి తీసుకొని ఉంటున్నారు. గత మూడు నెలలుగా హేమంత్, ప్రియాంక ఒకే గదిలో ఉన్నారు. ఈ విషయం సతీష్కు తెలియడంతో హేమంత్ను హెచ్చరించాడు. ఆ అమ్మాయికి భవిష్యత్ ఉందని, ఆమెతో కలిసి ఉండొద్దని హేమంత్కు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే కంపెనీకి నష్టాలు రావడంతో జీతం కూడా తగ్గించాడు. అప్పటి నుంచి సతీష్పై హేమంత్ ద్వేషం పెంచుకున్నాడు. ప్రియాంక దూరం అవుతుందని, భావించి కక్ష పెంచుకొని సతీష్ను హత్య చేయాలని పథకం పన్నాడు. పక్కా ప్లాన్తో హత్య చేశాడు గత నెల 28న సతీష్ను హేమంత్ తన ఇంటికి ఆహ్వానించారు. పార్టీ చేసుకుందని చెప్పి నమ్మించి ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సతీష్ను దారుణంగా హత్య చేశాడు. సుత్తెతో సతీష్ తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం బాడీని కారులో తరలించాలని చూశాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. తిరిగి రూమ్లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడు హేమంత్ అని తేల్చాం’ అని డీసీపీ మీడియాకు వివరించారు. -
ప్రియాంక కోసమే సతీష్ను హత్య చేశాడు
-
వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణలో భాగంగా హేమంత్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సతీశ్ను తానే హతమార్చినట్లు అంగీకరించిన హేమంత్..ఈ హత్యతో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా అందరూ భావిస్తున్నట్లుగా సతీశ్- ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం లేదని హేమంత్ తెలిపాడు. కాగా కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో సతీశ్ దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార భాగస్వామి హేమంత్ అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చదవండి : సతీశ్ హత్యకేసులో కొత్త కోణాలు ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా సతీశ్, హేమంత్లకు పరిచయమున్న ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్య జరిగిందని భావించారు. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్ను... ప్రియాంకతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలని సతీశ్ హెచ్చరించినందుకే అతడి హత్య జరిగిందని అనుమానించారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో సతీశ్ కాల్డేటా పరిశీలించిన అనంతరం హేమంత్ను అదపులోకి తీసుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం హేమంత్ నేరం అంగీకరించడంతో.. అతడికి ఎవరు సహకారం అందించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పోలీసుల అదుపులో హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసు నిందితుడు హేమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో హేమంత్ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. సతీష్ను తాను ఒక్కడినే హత్య చేశానని, ఇందులో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గత నెల 27న సతీష్ను హేమంత్ దారుణంగా హత్య చేశాడు. స్నేహితురాలు ప్రియాంకను హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సతీష్.. రాత్రి 8 గంటలకు హేమంత్ రూమ్కి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మాటల మధ్యలో ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయితో హేమంత్కు ఉన్న అక్రమ సంబంధ విషయం చర్చకు వచ్చింది. అక్రమ సంబంధం మానుకోవాలని హేమంత్ను సతీష్ హెచ్చరించాడు. (చదవండి : సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు) దీంతో భయపడిన హేమంత్.. ఈ విషయాన్ని సతీష్ అందరికి చెబుతాడని, ఎప్పటికైనా తనకు అడ్డుతగులుతాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో సతీష్ మెడ కోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని భావించాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. అనంతరం రూమ్లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. మరుసటి రోజు స్నేహితులతో గడిపాడు. అనంతరం హత్య విషయాన్ని తన సన్నిహితులకు చెప్పాడు. వారు పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చారు. కానీ హేమంత్ మాత్రం లొంగిపోకుండా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సతీష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం పోలీసులకు పట్టుబడిన హేమంత్.. నిజాన్ని ఒప్పకున్నాడు. హత్యతో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని, ఒక్కడినే హత్య చేశానని హేమంత్ పోలీసులు ఎదుట ఒప్పకున్నాడు. -
సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు బయటపడుతున్నాయి. స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకనే హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే హత్య చేసిన రోజు హేమంత్ ఇంటికి సతీష్ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సీసీ పుటేజ్ను పోలీసులు సేకరించారు. ప్రియాంకను హాస్టల్లో డ్రాప్ చేసిన తర్వాత సతీష్ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది. (చదవండి : ఆమె’ కోసమేనా హత్య?) ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. గత నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే సతీష్ను హత్య చేయడానికి హేమంత్కు ఎవరు సహాయం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆమె’ కోసమేనా హత్య?
సాక్షి, కూకట్పల్లి: ఐటీ సంస్థ నిర్వాహకుడు మైలా సతీష్ బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్ను పోలీసులు గుల్బర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సతీ‹Ùబాబు హత్యకు ఆర్ధిక లావాదేవీలతో పాటు ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని ఐటీ స్లేట్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారించారు. సంస్థ ఆరి్ధక పరిస్థితులతో పాటు ఇద్దరు భాగస్వాముల నడుమ వివాదాలకు కారణాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం! విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన సతీ‹Ùబాబు ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్ధులకు తరగతులను బోధించడంతో పాటు కన్సల్టెన్సీ నిర్వహించడం ద్వారా ఐటీ సేవలు అందిస్తున్నారు. స్నేహితుడైన హేమంత్ను భాగస్వామిగా చేసుకున్న అతను విద్యార్ధులకు శిక్షణ అందించే బాధ్యతలు అప్పగించాడు. క్లాస్ వర్కులో సతీ‹Ùబాబు, ట్రైనింగ్ వర్క్లో హేమంత్ ఉమ్మడి సేవలు అందిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా సతీ‹Ùబాబు హత్యకు గురికావడం, స్నేహితుడైన హేమంత్ గదిలోనే శవం లభించడం, హేమంత్ పరారీలో ఉండటంతో అతనే నిందితుడిగా నిర్దారించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తనకు దూరమవుతుందని.. సతీష్ బాబు, హేమంత్ నిర్వహిస్తున్న ఐటీ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సతీష్ తరగతులు బోధించగా హేమంత్ ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె ఇద్దరితోనూ స్నేహంగా, చనువుగా ఉండేది. ఈ నేపథ్యంలో సదరు యువతితో హేమంత్ వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె కోసం ఏకంగా తన కుటుంబాన్ని సైతం దూరం పెట్టి ఆఫీసు సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. తరచూ ఆ యువతి హేమంత్ ఇంటికి వచ్చి వెళ్లేదని, వారు కలిసిమెలిసి ఉండటం చూసినట్లు స్థానిక కాలనీవాసులు సైతం పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె సతీష్ బాబుతో చనువుగా ఉండటాన్ని గుర్తించిన హేమంత్ స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు. తనకు సొంతమని భావిస్తున్న యువతి సతీష్ బాబు కారణంగా దూరమవుతుందని భావించి అడ్డు తొలగించుకునేందుకు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సతీష్ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసుకు సంబంధించి ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సతీష్, హేమంత్కు సన్నిహితంగా ఉంటున్న ఓ యువతికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్నేహితుల ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సతీష్ బాబు హత్య జరిగిన సమయంలో ఆమె కూడా హేమంత్తో ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులు ఇద్దరు నెలకొల్పిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెతో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం! ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సతీష్ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్యకేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ స్నేహితుడు హేమంత్ పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా స్నేహితుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్లు ప్రియాంక పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...వాళ్లిద్దరూ బాల్య స్నేహితులు... చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసి ఏడాది క్రితమే వ్యాపారం ప్రారంభించారు. ఏమైందో ఏమో గానీ వ్యాపార భాగస్వామిగా ఉన్న స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేయడమేగాక ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్తో పార్శిల్ చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆ శవాన్ని ఇంట్లోనే వదిలేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. చదవండి: కేపీహెచ్బీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య ప్రకాశం జిల్లా, మార్టూరుకు చెందిన మైలా సతీష్బాబు (35), భీమవరానికి చెందిన హేమంత్ కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన సతీష్బాబు.. ఏడాది క్రితం హేమంత్తో కలసి కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్లో ఐటీ స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సతీష్బాబు తన భార్య ప్రశాంతితో కలసి మూసాపేట ఆంజనేయనగర్లో ఉంటున్నాడు. హేమంత్ కుటుంబం ఆల్వాల్లో నివాసం ఉంటుండగా, అతను కేపీహెచ్బీలోని 7వ ఫేజ్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఐటీ విద్యార్థులకు తరగతులు చెప్పే సతీష్ బాబు.. ఐటీ సంస్థ కార్యకలాపాలు చూసుకునేవాడు. బుధవారం రాత్రి క్లాస్ ముగిసిన అనంతరం కార్యాలయానికి వచ్చాడు. 10.30 గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో ప్రశాంతి అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. గురువారం అతని ఆచూకీ తెలియకపోవడంతో కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హేమంత్ సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అనుమానం.. సతీష్ బాబుతో పాటు హేమంత్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ప్రశాంతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు హేమంత్ కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. సెల్ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా ఆధారంగా అతను కేపీహెచ్బీ 7వ ఫేజులో ఉన్నట్లు గుర్తించారు. హేమంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు దుర్వాసన రావడంతో తాళం పగులగొట్టి చూడగా సతీష్ దారుణంగా హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి ఉండటంతో పాటు కడుపు, కాళ్లపై కత్తిగాట్లున్నాయి. కుడికాలు మోకాలు వరకూ కట్చేసి ఉంది. ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, పొడవాటి టీవీ అట్టపెట్టెలు కనిపించాయి. మృతదేహంపై ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. దీంతో హేమంతే ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితమే ఆఫీస్ సమీపంలో ఇండిపెండెంట్ హౌస్ను అద్దెకు తీసుకోవడం మొదలు సతీష్ బాబును ఇంటికి రప్పించి హత్య చేసే వరకూ పథకం ప్రకారమే సాగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో హేమంత్తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం
సాక్షి, విజయవాడ : ప్రముఖ టీవీ యాంకర్, నటుడు, ఆర్జే హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద హేమంత్ కారు ఓ గేదెను ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టైమ్పాస్ లవ్
హేమంత్, సురేంద్ర, అంజలి, లీజా హీరో హీరోయిన్లుగా వి. భానుమురళి దర్శకత్వంలో ఎమ్. చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘గాడీ నెం–143’. ‘ది ట్రావెల్ ఫర్ టైమ్పాస్ లవ్ అండ్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘భానుమురళి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను. ఈస్ట్ గోదావరి, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి మూడు షెడ్యూల్స్లో షూటింగ్ పూర్తి చేశాం. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక సిన్సియర్ లవ్లోకి టైమ్పాస్ లవ్ ప్రవేశించి ఎలాంటి సంఘర్షణ రేపింది? అనేది చిత్రకథాంశం. క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటుంది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఉగాది సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్, టీజర్లను డిజిటల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాం’’ అన్నారు వి. భాను మురళి. ఈ సినిమాకు త్రినాథ్ మంతెన సంగీతం అందించారు. -
ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్మీట్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంతోశ్ పి జయకుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్తో తయారైన ఈ చిత్రం 2 రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయలను రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడిగా హ్యాపీగా ఉంది. సపోర్ట్ చేసిన యూనిట్కు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి సమాధానం చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. బి, సిలలో ఆడే సినిమా ఇది అన్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్ షాట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. హీరోయిన్ నిక్కి తంబోలి చిత్రవిజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మా సినిమా యూత్కు మాత్రమే
ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ– ‘‘17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు కాదు.. యూత్కి మాత్రమే’’ అన్నారు. ‘‘ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్ అన్నకు థ్యాంక్స్. ’’ అని ‘తాగుబోతు’ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీ తంబోలి పాల్గొన్నారు. -
ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘టాపర్’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్.కామ్ కో–ఫౌండర్ హేమంత్ గోటే టీ. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీ సీట్ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్లో స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్ అనే ఫోన్కామర్స్ స్టార్టప్లో ప్రిన్సిపల్ ఇంజనీర్గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్లో సహోద్యోగీ జీశాన్ హయత్తో కలిసి 2013 ఏప్రిల్లో కోటి రూపాయల ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్స్తో ముంబై కేంద్రంగా టాపర్ను ప్రారంభించాం. 50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు.. 5–12 తరగతి వరకు బోర్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, పోటీ పరీక్షల సిలబస్లు, మెటీరియల్స్ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్ఈఈ, బిట్శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్తో పాటూ ఆన్లైన్లోనే ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్, లైవ్ చాట్లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం.. ప్రిపరేషన్ మెటీరియల్స్ ఏడాది, ఐదేళ్ల సబ్స్క్రిప్షన్స్ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్స్క్రిప్షన్స్ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్పూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నాం. జోద్పూర్కు చెందిన ఈసీప్రిప్ను, ముంబైకి చెందిన మంచ్.. రెండు ఎడ్యుకేషన్ స్టార్టప్స్ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్లకూ విస్తరిస్తాం. రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్ ప్రిపరేషన్ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్ క్యాపటలిస్ట్లు ఆసక్తి చూపిస్తున్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
-
కిడ్నాప్ కథ సుఖాంతం..
తణకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల కింద పాఠశాలకు వెళ్లి కిడ్నాప్కు గురైన హేమంత్(5)ను ఆగంతకులు గురువారం ఆటోలో వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించిన విషయం తెలిసిందే. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలించారు. దాంతో భయపడిన ఆగంతకుడు బాలున్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాడు. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
గుంటూరు జిల్లాకు పాకిన గన్ కల్చర్
గుంటూరు : గన్ కల్చర్ గుంటూరు జిల్లాకు పాకింది. ప్రత్యర్థులను హతమార్చేందుకు హేమంత్ అనే యువకుడు తుపాకీని కొనుగోలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ పోలీసులు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అతడిని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే....గుంటూరు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన ఇంజినీర్ హేమంత్ కుమార్ మూడు రోజుల కిందట బీహార్ నుంచి దేశవాళీ పిస్టల్ తీసుకొస్తుండగా రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ స్వగ్రామం అమీన్ సాహెబ్ పాలెంలో రెండు వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. వినాయక చవితి పండుగ అనంతరం నిమజ్జనం సందర్భంగా గొడవలు రేగి ప్రత్యర్థి వర్గం హేమంత్ మేనమామపై దాడి చేసింది. అప్పటి నుంచి రెండు వర్గాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ నిర్మాణ కంపెనీలో సైట్ ఇంజినీర్గా చేరిన హేమంత్ విధుల నిర్వహణలో భాగంగా బీహార్ వెళ్లాడు. మేనమామ వర్గీయుల కోరిక మేరకు అక్కడ దేశవాళీ పిస్టల్ కొనుగోలు చేశాడు. దానిని తనవారికి ఇచ్చేందుకు మూడు రోజుల కిందట రైల్లో విజయవాడ చేరుకున్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి బస్టాండ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హేమంత్ను అదుపులోకి తీసుకుని పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కక్షల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు పిస్టల్ తీసుకొస్తున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
భయపెట్టే మాయ
చిరుసాయి, హేమంత్, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలుగా దినకరన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అందమైన మాయ’. పాటల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానుసారం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేశాం. మరో పది రోజులు జరిపే షూటింగ్తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెల చివరి వారంలో పాటలు విడుదల చేయనున్నాం. ఈ పాటల్లో ఉన్న ఓ ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక...’ స్థాయిలో హిట్టవుతుంది’’ అని చెప్పారు. ‘‘దాదాపు ఏడు నెలలు కథాంశాన్ని డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్కి వెళ్లాం’’ అని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మణీంద్రన్ తెలిపారు. -
విశాఖలో బాలుడి కిడ్నాప్కు యత్నం
విశాఖ : విశాఖ గాజువాకలోని హిమాచల్ నగర్లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హేమంత్ అనే బాలుడిని దుండగుడు కిడ్నాప్కు యత్నించగా దీన్ని గమనించిన స్థానికులు అతడి బారి నుండి రక్షించారు. కాగా కిడ్నాపర్ హేమంత్ని చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
అనూహ్య ఫ్రెండ్ మాత్రమే.. హత్యతో సంబంధం లేదు
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య, తాను స్నేహితులం మాత్రమేనని.. ఆమె హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమంత్ స్పష్టం చేశాడు. అనూహ్యతో కలసి తాను ఒకే రైల్లో ముంబైకి వెళ్లినట్టు వచ్చినా వార్తలు అవాస్తమమని తెలిపాడు. మచిలీపట్నం అమ్మాయి అనూహ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ 'సాక్షి'తో మాట్లాడాడు. ఆమెతో పరిచయం నుంచి హత్యకు ముందు వరకు జరిగిన పలు విషయాల్ని వెల్లడించాడు. గత నెల 5న ముంబైలో అనూహ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనూహ్య హత్యకు ఓ రోజు ముందు అనగా జనవరి 4 మధ్యాహ్నం 1.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెను చివరిసారి కలిసినట్టు హేమంత్ చెప్పాడు. అనూహ్యతో కలిసే ఒకే రైల్లో వేరే కంపార్ట్మెంట్లో ముంబై వెళ్లినట్టు పోలీసులు చెప్పిన విషయం అవాస్తవమని చెప్పాడు. అదే రోజు సాయంత్రం వేరే రైల్లో షిర్డీకి ప్రయాణం చేసినట్టు చెప్పాడు. షిర్డీ ఎక్స్ప్రెస్లో వెళ్లినట్టు ఆధారాలు చూపించాడు. మరుసటి రోజు దర్శనం చేసుకుని అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చానని హేమంత్ చెప్పాడు. కాగా సికింద్రాబాద్లో అనూహ్యను కలిసిన మాట వాస్తవమేనని, ఆ తర్వాత వెనక్కి వచ్చేశానని తెలిపాడు. కావాలంటే ఫుటేజిలో చూసుకోవచ్చని హేమంత్ చెప్పాడు. అనూహ్య బంధువుల సూచన మేరకు ముంబై వెళ్లి పోలీసులను కలిశానని తెలిపాడు. పోలీసులు రెండు రోజుల పాటు ఆరు గంటలు తనను ప్రశ్నించారని, తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానని వివరించాడు. తాను చెప్పిన సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందారని హేమంత్ తెలిపాడు. అనూహ్య రైల్లో వెళ్లిన కాసేపటికి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నామని, ఆ తర్వాత తమ మధ్య మాటలు లేవని చెప్పాడు. అనూహ్య ఇంటి నుంచి వస్తుండటంతో డిప్రెషన్లో ఉందని, అంతకుమించి ఇతర సమస్యలు, ఆందోళనలో ఉన్నట్టు కనిపించలేదని తెలిపాడు. ఆరో తేది మధ్యాహ్నం అనూహ్య హత్య గురించి తెలిసిందని హేమంత్ చెప్పాడు. కాకినాడలో అనూహ్యతో కలిసి బిటెక్ చదవడం వల్ల ఆమెతో పరిచయం ఏర్పడిందని హేమంత్ వివరించాడు. ఏడాదిన్నరగా అనూహ్య ముంబైలో ఉద్యోగం చేస్తోందని తెలిపాడు. ముంబైలో ఆమెకు చాలామంది స్నేహితులున్నారని, అయితే వారి వివరాలు తనకు తెలియవని చెప్పాడు. తామిద్దరం ఫోన్లో తమ సంగతులు తప్ప ఇతర విషయాలు మాట్లాడుకునే వారం కాదని తెలిపాడు. అనూహ్య అంత్యక్రియల్లో తాను పాల్గొన్నానని, ఆమె కుటుంబ సభ్యులతో హత్యకు సంబంధించి చర్చించానని తెలిపాడు. వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదని, తనపై వారికి అనుమానం లేదని హేమంత్ చెప్పాడు. -
'అనూహ్యతో కలిసి ట్రైన్లో ప్రయాణించలేదు'