అంతా క్షణాల్లో జరిగిపోయింది | Mumbai Woman crushed by crane after she loses scooter balance | Sakshi
Sakshi News home page

అంతా క్షణాల్లో జరిగిపోయింది

Published Wed, Oct 25 2017 3:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం సాయంత్రం జరిగిన దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ఊహించనివిధంగా ప్రాణాలు కోల్పోయింది. ఖార్గార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతురాలు సుజాత పూరి(34)గా గుర్తించారు. నెరుల్‌లో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమె స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా నియంత్రణ కోల్పోయి బండి ఒక్కసారిగా పక్కకు జారిపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. సుజాత వెనుకే వచ్చిన క్రేన్‌తో కూడిన వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కికడ్కడే ప్రాణాలు వదిలారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement