CC camera footage
-
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్కు చెందిన జాన్కిల్బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్కిల్బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్కిల్బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్కిల్బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్కు తరలించారు. -
శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో.. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్తో పై ఫ్లోర్ రూమ్లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్లో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ -
మీరు కెమెరా నిఘాలో ఉన్నారు!
సాక్షి, సిటీబ్యూరో: కమిషనర్ను కలిసేందుకు ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి వచ్చే వారు, పోయే వారు స్క్రీన్లపైనా కనబడేలా కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.. పరిసరాల్లో దాదాపు 40 వరకు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వస్తున్నారో దృశ్యాలు వాటిల్లో నిక్షిప్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో నమోదయ్యే దృశ్యాలు స్క్రీన్లపై అందరికీ కనిపించేలా కూడా మేయర్ ఎంట్రెన్స్, కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న స్క్రీన్పై నగరంలోని ఆయా ప్రాంతాల్లోని దృశ్యాల్ని కూడా వీక్షించే ఏర్పాట్లున్నాయి. వరదలు, గణే శ్ నిమజ్జనం వంటి సందర్బాల్లో మేయర్, అధికారులు నగర పరిస్థితుల్ని పరిశీలించేందుకు సదరు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. -
‘డ్యాష్ క్యామ్’లకు డిమాండ్
తేలికపాటి, భారీ వాహనాలకు డ్యాష్ బోర్డుల వద్ద కెమెరాల ఫిక్సింగ్ 2016 ఫిబ్రవరి 21.... కుషాయిగూడలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు...ఏపీ 29 బీటీ 6615 లారీ వల్ల జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా చీకటిమామిడికి చెందిన భూపతి మధుసూదనరావు చనిపోయారు. అది ప్రమాదంకాదంటూ లారీ డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను అధ్యయనం చేసిన పోలీసులు..మధుసూదనరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ⇒ ఈ ఉదంతం చోటు చేసుకున్న చోట సీసీ కెమెరాలు లేకపోతే..! ‘ఆనవాయితీ’ ప్రకారం లారీ డ్రైవర్ కేసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి వాటితో పాటు డ్రైవర్లకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచి్చనవే డ్యాష్ క్యామ్స్గా పిలిచే డ్యాష్ బోర్డు కెమెరాలు. నగరంలో వీటి వినియోగం ఇటీవల కాలంలో 30 శాతం పెరిగినట్లు కార్ డెకార్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఉదంతాలతో పాటు మోసాలు ఎన్నో... కుషాయిగూడలో జరిగిన మధుసూదన్ రావు తరహా ఉదంతాలతో పాటు ప్రమాదాల పేరుతో కొందరు చేసే మోసాలు అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి. తమ వారిని ఉద్దేశపూర్వకంగా వాహనాలకు ఎదురుగా, పక్కన నుంచి సమీపంలోకి పంపించే వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లిన వాళ్లను ఆ వాహనాలు తాకితే చాలు తక్షణం కింద పడిపోతారు. అక్కడే ఉండే వారి సంబం«దీకులు యాక్సిడెంట్ అంటూ హడావుడి చేస్తారు. మరికొన్ని ముఠాలైతే నిర్మానుష్య, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. ఫలానా చోట యాక్సిడెంట్ చేసి, పట్టించుకోకుండా వచ్చేస్తున్నావంటూ డ్రైవర్లను మోసం చేస్తున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన వారి ప్రధాన ఉద్దేశం..బెదిరించి డబ్బు గుంజడమే. హైఎండ్ వాహనాలకు ఇన్బుల్ట్గా... కీలక సందర్భాల్లో వినియోగించడంతో పాటు ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఉద్దేశించినవే డ్యాష్ క్యామ్లు. ఇటీవల అనేక హైఎండ్ వాహనాల్లో నలు వైపులా దృశ్యాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన కెమెరాలు ఇన్బుల్ట్గానే వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఖరీదు చేసిన వాటితో పాటు పాత మోడల్స్కు చెందిన, సాధారణ వాహనాలను మాత్రం కేవలం వెనుక వైపు మాత్రమే కెమెరా ఉంటోంది. కొన్నింటిలో అసలు కెమెరానే ఉండట్లేదు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ డ్యాష్ క్యామ్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు... ఏది పెద్ద వాహనమైతే దాని చోదకుడిదే తప్పు అన్నట్లు నమోదు చేసే ‘ఆనవాయితీ’ ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి ఈ డ్యాష్ క్యామ్స్ చెక్ చెబుతున్నాయి. డ్యాష్ క్యామ్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో... ఇటీవల కాలంలో వాహన చోదకులు వినియోగిస్తున్న డ్యాష్ క్యామ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఆద్యంతం ఏమి జరిగిందో ఈ వీడియో రుజువులను అందిస్తుంది. తప్పు ఎవరిది అనేది నిర్ధారించడంలో, బీమా క్లెయిమ్లను పొందడానికి ఉపయోగపడుతుంది. వాహనాలను యజమానులకు అప్పగించినప్పుడు వారి ప్రవర్తన తదితరాలను ఎప్పటికప్పుడు యజమానికి తెలిసేలా చేస్తుంది. పార్కింగ్ మోడ్లోనూ పనిచేసే కెమెరాల వల్ల హిట్–అండ్–రన్ కేసుల్లో కీలక సాక్ష్యాలు లభిస్తాయి. కొత్త డ్రైవర్లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ వీటిలో నమోదైన ఫీడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు డాష్ క్యామ్లు ఉన్న వాహనాలకు ప్రీమియంల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పార్కింగ్ మోడ్లో పని చేసేవీ వాడాలి ఈ డ్యాష్ క్యామ్ వాహనం డ్యాష్ బోర్డ్ లేదా విండ్ïÙల్డ్ పైన, రియర్ వ్యూ మిర్రర్ పక్కన/కింద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లు కోఠికి చెందిన కార్ డెకార్స్ నిపుణులు సయ్యద్ ముస్తాఖ్ చెప్తున్నారు. కొన్ని కేవలం ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. వీటి వల్ల వాహనం పార్క్ చేసి ఉన్నప్పుడు చోటు చేసుకునే ఉదంతాల్లో ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ ఆధారంగా వాహనం పార్కింగ్ చేసి ఉన్నప్పుడూ పని చేసేవి బిగించుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత స్టోరేజ్ కెపాసిటీ, మంచి క్యాలిటీ ఉన్న వీడియోను అందించే వాటికే మొగ్గు చూపాలని స్పష్టం చేస్తున్నారు. -
స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్ స్వప్న ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార ఎస్బీఐలో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారం కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏమిటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, బయట వ్యక్తుల జోక్యంపైనా అనుమానాలుండటంతో పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ బాగోతం ఎస్బీఐ బ్రాంచ్లో చోటు చేసుకున్నా జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. నమ్మకాన్ని వమ్ము చేసి.. బయట వ్యక్తుల వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం శ్రేయస్కరం కాదని చాలా మంది బ్యాంకుల్లో తమ ఆభరణాలను కుదవ పెట్టి సొమ్ము తీసుకుంటారు. ఆ నమ్మకాన్ని గార ఎస్బీఐలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు వమ్ము చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో విచారణలో తేలనున్నప్పటికీ రూ.4కోట్లకు పైగా విలువైన 7కిలోల బంగారాన్ని మాయం చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడా ఖాతాదారులంతా గగ్గోలు పెడుతున్నారు. పర్యవేక్షణ డొల్ల.. సాధారణంగా బ్యాంకులో గోల్డ్ లోన్ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. దానికొక అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్న అకౌంటెంట్ ఉంటారు. క్లర్క్ లేదా అప్రైజర్ ఉంటారు. వీరిద్దరు ఖాతాదారుల నుంచి తాకట్టు బంగారాన్ని తీసుకుంటారు. వీరితో పాటు ఇద్దరు కస్టోడియన్లు ఉంటారు. వీరిద్దరి వద్ద స్ట్రాంగ్ రూమ్, సేఫ్ (లాకర్లు)కు సంబంధించిన వేర్వేరు తాళాలు ఉంటాయి. అకౌంటెంట్, క్లర్క్ తీసుకున్న బంగారాన్ని కస్టోడియన్లతో కలిపి సేఫ్లలో భద్రపరుస్తారు. ఆ ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న వేర్వేరు తాళాలను ఉపయోగిస్తే తప్ప భద్రపరచడం గాని, తీయడం గానీ జరగదు. ఇంతటి పకడ్బందీ వ్యవహారం ఉండే బ్రాంచ్లలో దాదాపు 7కిలోల బంగారం పక్కదారి పట్టిందంటే ఇందులో చాలామంది ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బ్రాంచ్లో ఏం జరిగినా సంబంధిత మేనేజర్ బాధ్యత ఉంటుంది. దానితో పాటు ఉన్నతాధికారుల పరిశీలన ఉంటుంది. ఎన్నో సేఫ్లలో ఉన్న బంగారం పెద్ద ఎత్తున మాయమవ్వడంతో బ్రాంచ్ పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. ఎలా బయటకు వచ్చింది.. గార బ్రాంచిలో బంగారం ఆభరణాలు కుదవ పెట్టిన ఖాతాల బ్యాగులు 2500 వరకు ఉన్నట్టు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమమ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనబడటం లేదని సమాధానం రావడంతో వ్యవహారం బయటికొచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయమై మేనేజరు సీహెచ్ రాధాకృష్ణ వద్ద అడుగగా రెండు రోజుల్లో చెబుతామని నచ్చ చెప్పి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26బ్యాగులలో ఉన్న రూ. కోటి 75లక్షల బంగారు ఆభరణాలను తెచ్చి ఇచ్చారు. మిగతా 60బ్యాగుల బంగారు ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో బంగారు ఆభరణాలు గల్లంతు వ్యవహారం మిస్టరీగా మారిపోయింది. అంతవరకు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు తప్పని పరిస్థితుల్లో గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కనిపించని 60బ్యాగుల్లో రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి. కీలకమైన వ్యక్తి చనిపోవడంతో దీంట్లో ఉన్న పాత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఇంతవరకు అంతర్గతంగా తేల్చుకుందామని భావించినా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా, 86బ్యాగుల వ్యవహారం వెలుగు చూడటంతో ఆ బ్రాంచ్లో ఉన్న మిగతా తాకట్టు ఆభరణాల బ్యాగులలో ఏవైనా తేడాలున్నాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గారలో జరిగిన ఘటనతో మిగతా ఎస్బీఐ బ్రాంచ్లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తమ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాల భద్రతపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్టేట్బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం గార: మండల కేంద్రంలోని స్టేట్బ్యాంకులో 7 కిలోల బంగారం మాయమైందని ఫిర్యాదు వచ్చిందని స్థానిక సీఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారంలో ఏడు కిలోలు కనిపించడం లేదని, కొందరు బ్యాంకు సిబ్బందిపై అనుమానం ఉందని గురువా రం బ్యాంకు రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. బంగారం విలువ రూ. 4 కోట్ల 70 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంటెంట్ ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, బంగారం మాయంపై ఆమె పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఉదయం నుంచి గార పోలీస్స్టేషన్లో ఈ కేసు విషయమై ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ ఎన్.సన్యాసినాయుడు, బ్యాంకు ఆర్ఎం రాజు, గార బ్రాంచి మేనేజర్ సీహెచ్ రాధాకృష్ణతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలే కీలకం.. బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమయ్యే సమయంలో లాక్రూంలో ఉన్న సీసీ పుటేజీలే ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఈ పుటేజీలు గమనించారని తెలుస్తోంది. బ్యాంకులో 2500 మంది బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులుండగా, వీరిచ్చిన బంగారానికి ఒక్కో ఖాతాకు ఒక్కో బ్యాగు సిద్ధం చేస్తారు. ఈ బ్యాగుల్లో తొలుత 86 మాయమయ్యాయని అధికారులు గుర్తించగా, వీటిలో 26 బ్యాగులను అకౌంటెంట్ స్వప్నప్రియ మూడు రోజు ల కిందట బ్యాంకు అధికారులకు అందించినట్టు తెలిసింది. మిగిలిన 60 బ్యాగుల వివరాలు ఆధారంగా 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమయ్యాయమని నిర్ధారించారు. నవంబర్ 24వ తేదీన బంగారం మాయమైందన్న ఆరోపణలు రాగా ఇప్పటివరకు అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్ఎం రాజును ప్రశి్నస్తే సమాధానం దాట వేశారు. -
పనిలో పనిఘా.. ఛేదన వడిగా!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాను నిఘా నీడలోకి తెచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం జాతీయ రహదారులు మొదలు గ్రామీణ రోడ్ల వరకు, పట్టణాలు నుంచి పంచాయతీల దాకా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నేరుగా స్థానిక పోలీస్స్టేషన్లు, జిల్లా కమాండ్ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. దీంతో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ద్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణ, నిందితులను పట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ఒక వేళ జరిగినా నిందితులను వెంటనే పట్టుకోవడానికి వీలవుతోందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో 22 కీలకమైన కేసులను పోలీసుల ఛేదించారు అంటే వీటి పనితీరును ఆర్ధం చేసుకోవచ్చు. జిల్లా ఏర్పాటు తర్వాత 1,530 కెమెరాలు... పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వై.రవిశంకర్రెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సున్నితమైన ప్రాంతమైన పల్నాడులో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి ముమ్మరంగా ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు, కమాండ్ సెంటర్ల ఏర్పాటు అయ్యేలా చూశారు. 17 నెలల కాలంలోనే జిల్లాలోని 522 కీలక ప్రాంతాల్లో కొత్తగా 1,530 కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. వీటికి అదనంగా ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నివాస సముదాయాల్లో ఆయా యాజమాన్యాలు, స్వచ్చంధ సంస్థలతో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా అవగాహనకల్పించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు, వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతగా స్వీకరించాలి నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 17 నెలల కాలంలో కొత్తగా 1,530 కెమెరాలను ఏర్పాటుచేశాం. నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్లలో పలు కీలకకేసులను సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. ప్రతి గ్రామంలో కనీసం కీలకవై ున ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు పోలీసుశాఖ కృషి చేస్తోంది. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పట్టాయి. దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం. – వై రవిశంకర్రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య... నరసరావుపేట 195 516 సత్తెనపల్లి 211 798 గురజాల 116 216 జిల్లా మొత్తం 522 1,530 -
సిటీపై కమాండ్.. నేరగాళ్లపై కంట్రోల్!
హైదరాబాద్: ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం...స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం...వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం... విపత్కర పరిస్థితుల్లో సత్వర స్పందన... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్). బంజారాహిల్స్లోని ఐసీసీసీ లో ఇదీ ఓ అంతర్భాగమే. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం ఆవిష్కరించిన ‘2306 సేఫ్ సిటీ ప్రాజెక్టు సీసీ కెమెరాలు’ ఈ కోణా ల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. వీటిలో కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. ‘ప్లేటు’ మారితే పట్టేస్తుంది... నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెబుతుంది. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ద్వారా ఆర్టీఏ సర్వర్తో అనుసంధానించి ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. వాహన ‘మార్గాలను’ చెప్పేస్తుంది... నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. 250 జంక్షన్లలో ఉండే సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్తో సహా చిత్రీకరించి సర్వర్లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతుంది. సీసీసీలోని సిబ్బంది తేదీ, వాహనం నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు.. ఆయా రోజుల్లో సదరు వాహనం ఎక్కడ నుంచి నగరంలోకి ప్రవేశించింది? ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఏఏ మార్గాల్లో ప్రయాణించింది? ఎక్కడెక్కడ ఆగింది? తదితర అంశాలను తెలియజేస్తుంది. కిడ్నాప్, స్నాచింగ్ వంటి నేరాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ అందించే ఆధారాలు కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. జంక్షన్ల వారీగా వాహన కౌంటింగ్... ప్రతి చౌరస్తా నుంచి నిమిషనిమిషానికీ ముందుకు సాగే వాహనాలను లెక్కించే ప్రక్రియ సైతం ఐటీఎంఎస్లోని సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి. ఓ నిమిషం కాలంలో సదరు జంక్షన్ను ఎన్ని వాహనాలను దాటాయి? వాటిలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలతో పాటు భారీ వాహనాలు, బస్సులు ఎన్ని? అనే అంశాన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సాఫ్ట్వేర్ లెక్కిస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీసీసీలో ఉండే సిబ్బందికి తెలియజేస్తుంది. ఫలితంగా ఆయా సమయాల్లో ఏఏ రూట్లు బిజీగా ఉన్నాయో తెలుసుకునే సిబ్బంది ఆ విషయాన్ని జంక్షన్లలో ఉండే ప్రత్యే క బోర్డుల ద్వారా వాహనచోదకులకు అందిస్తారు. వీఎంఎస్లతో నిరంతరం సందేశాలు... ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్లు(వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు) ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్ల్లో ప్రదర్శితమవుతాయి. ఉల్లంఘనులకు ‘ఈ’ చెక్... జంక్షన్లలో ఉన్న ఫ్రీ–లెఫ్ట్ను ఉల్లంఘిస్తూ ఆయా చోట్ల వాహనాలు ఆపినా... వన్వే నిబంధనను ఉల్లంఘించినా, వాహనాలు రాంగ్ రూట్లలో దూసుకువస్తున్నా... ప్రస్తుతం ఆయా చోట్ల ఉండే క్షేత్రస్థాయి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఐటీఎంఎస్ వ్యవస్థలో అన్ని జంక్షన్లతో పాటు రాంగ్రూట్, వన్వే ఉల్లంఘన అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సర్వర్తో అనుసంధానించి ఉండే ఈ కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తారు. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. దీంతో పాటు నో–పార్కింగ్, కమ్యూనిటీ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ ప్రాంతాలనూ జీయో ట్యాకింగ్, ఫెన్సింగ్ ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఐసీసీసీ ఆధీనంలో ఏ కెమెరాలు ఎన్నంటే..? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాక్స్, పీటీజెడ్, ఏఎన్పీఆర్ కెమెరాలు 10 వేలు నగర వ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లోనివి 126 మూడు కమిషనరేట్లలోని 2828 జంక్షన్లలోనివి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి 38 ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు నేను సైతం, కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఏర్పాటైన 4,99,869 (అవసరమైనప్పుడు యాక్సస్ చేయవచ్చు) జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న గస్తీ వాహనాలకు ఏర్పాటు చేసినవి 1322 ట్రాఫిక్ నిర్వహణతో పాటు నేరగాళ్లకూ చెక్ దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా రికార్డు -
మల్లన్నా.. ఏదీ రక్షణ?
కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్వీఆర్) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్ను పిలిపించగా ఎన్వీఆర్ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
మంచిర్యాల: పీఎస్లో కుప్పకూలిన నిందితుడు
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో లాకప్ డెత్ ఘటన కలకలం సృష్టించింది. తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్లో అంజి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా.. స్టేషన్లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడా? లేక నిజంగానే అతనిది సహజ మరణమా తెలియాల్సి ఉంది. కాగా ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన చేసులో అంజీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
దానిమ్మ తోటకు... తుపాకీ, కారంపొడితో గస్తీ
కర్ణాటక: ధరలు భగ్గుమనడంతో మొన్నటివరకు రైతులు టమాట తోటలకు సీసీ కెమెరాలు, పహిల్వాన్లను పెట్టి గస్తీ కాయడం తెలిసిందే. ఇప్పుడు చిక్కబళ్లాపుర జిల్లా కేంద్రం పరిధిలోని నాయనహళ్లి అందార్లహళ్లి, చదలపుర, నంది తదితర గ్రామాలలో దానిమ్మ తోటలను రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. దానిమ్మ పండ్లు మేలిరకం కేజీ ధర రూ.150 నుంచి 200 దాకా మార్కెట్లో ఉంది. తుపాకీ, కారంపొడితో గస్తీ తరచూ తోటల్లోకి దొంగలు చొరబడి పండ్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. నాయనహల్లి గ్రామంలో రైతు చందన్ రెండు ఎకరాలలో రూ. 5 లక్షల ఖర్చుపెట్టి దానిమ్మ పంట పండిస్తున్నాడు. వారం కిందట ఈయన తోటలో దొంగలు పడి సుమారు టన్ను బరువైన దానిమ్మ పండ్లను దొంగిలించుకొనిపోయారు. పక్కనే దేవరాజ్ తోటలోనూ ఇంతేమొత్తంలో దానిమ్మను ఎత్తుకెళ్లారు. చదలపురంలో మునిరాజు అనే రైతు తమ చుట్టాలను ఇంటికి పిలిపించుకొని రాత్రి వేళలో తుపాకీ, కారంపొడి పట్టుకొని గస్తీ కాస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. ఈయన ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఒకవేళ దొంగలు కానీ చేతికి చిక్కితే వారి పని అయిపోయినట్టే అంటున్నారు తోటల యజమానులు. -
మిస్టరీగా డాక్టర్ రాధ హత్య కేసు.. పనిచేయని సీసీ కెమెరాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో సంచలనం కలిగించిన డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో నేరస్తులను పట్టుకునేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం జిల్లాలోని సమర్థులైన పలువురు సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆమెను హత్య చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? అంత పెద్ద పేరు గల ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవటానికి గల కారణాలు? నిజంగానే గుర్తు తెలియని దుండగులా? లేక సమీప బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణాల్లో పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పాత నేరస్తులపై నిఘా.. జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో హంతకులుగా ఉన్న పలువురు పాత నేరస్తులపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆస్పత్రికి సంబంధించిన సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. అయితే జరిగిన హత్యకు సమీప బంధువులకు సంబంధం ఉండి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, చాలా వరకు హత్యకేసుకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు.. డాక్టర్ మాచర్ల రాధా (59) హత్యకేసులో పోలీసులను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రోగులతో నిత్యం రద్దీగా ఉంటే ఆస్పత్రి ఆవరణలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయటం పోలీసులకు ప్రధాన అనుమానంగా మారింది. అలాగే రద్దీగా ఉంటే ఆస్పత్రి ముందు నుంచే నేరస్తులు మూడో ఫ్లోర్లో ఉన్న రాధా ఇంటిలోకి వెళ్లాలి. అలా కాని పక్షంలో సమీప బంధువులు మాత్రమే వేరే మార్గం గుండా పై ఫ్లోర్లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ మార్గం గుండా హంతకులు ఏ విధంగా పై ఫ్లోర్లోకి వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృతురాలి భర్త డాక్టర్ ఉమామహేశ్వరరావు సాయంత్రం 6.00 గంటలకు క్లినిక్లోకి వెళ్లగా రాత్రి 8.15 సమయంలో మృతురాలు రాధా హైదరాబాద్లోని తన కూతరుతో ఆఖరిగా సారిగా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో డాక్టర్ రాధా హత్య 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తుల ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.అలాగే గురువారం డాగ్స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. -
అద్దె ఇంట్లో సీసీ కెమెరా... యువతులు దుస్తులు మార్చుకున్న దృశ్యాల రికార్డింగ్
హైదరాబాద్: ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని...ఆ ఇంట్లో యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను వారికి తెలియకుండా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చూస్తుండటంతో పసిగట్టిన బాధిత యువతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరిలోని హైలం కాలనీలో సయ్యద్ సలీం అనే వ్యక్తి తన ఇంట్లో ఓ గదిని ఇద్దరు యువతులు, ఒక యువకుడికి అద్దెకిచ్చాడు. రెండున్నర నెలల క్రితం వీరు ఈ గదిలో అద్దెకు దిగారు. కాగా సదరు ఇంటి యజమాని అద్దెకిచ్చిన గదిలో మీటర్ బాక్స్ పేరుతో ఓ ప్లాస్టిక్ బాక్స్ను ఏర్పాటు చేసి అందులో సీసీ కెమెరా పెట్టాడు. మరో నాలుగు కెమెరాలు తన ఇంట్లో ఏర్పాటు చేసి..రెండు డీవీఆర్లను బిగించాడు. నాలుగు రోజుల క్రితం తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బాక్సు నుంచి వైరు నేరుగా ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన యువతులు ఇదేమిటని ఆరా తీశారు. తీరా చూస్తే అది సీసీ కెమెరా అని తేలింది. దీంతో బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు సయ్యద్ సలీం సీసీ కెమెరా ఏర్పాటుచేసి యువతులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు వాటిని రికార్డు చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ సీసీ ఫుటేజీలను పోలీసులకు అందజేశాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 355(సి), 509, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
తిరుమల ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
మహిళ గొలుసును కొట్టేస్తూ కెమెరాకు చిక్కిన దొంగలు: వీడియో వైరల్
ఒక మహిళ గొలుసును బెక్ మీద నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. అందుకు సంబంధించిన సీఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. వీడియోలో..దుకాణం వద్ద ఉన్న ఒక మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్పై వస్తున్నట్లు కనిపిస్తోంది. వారిని చూసి అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ.. దుకాణం లోపలికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఆ వ్యక్తులు ఆ మహిళను తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆ దుకాణంలోని వ్యక్తి ఆమెకు సాయం చేద్దామని ముందుకు వస్తాడు కానీ వారి వద్ద ఉన్న తుపాకీని చూసి భయంతో పారిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ దుండగుల ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Caught On Camera: Thieves Snatch Delhi Woman's Chain At Gunpoint pic.twitter.com/VEX5aGSBAJ — NDTV Videos (@ndtvvideos) April 15, 2023 (చదవండి: విమానం గాల్లో ఉండగా విండ్ షీల్డ్కు పగుళ్లు.. సౌదీ ఫ్లైట్ కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..) -
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
‘పిప్పల్కోటి’ వద్ద మళ్లీ పులి
తాంసి: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్ గ్రామాల శివారు అటవీప్రాంతంలో కూలీలకు శనివారం అర్ధరాత్రి పులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వారంతా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవి వైపు వెళ్లింది. పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం కూలీలు అక్కడే ఉంటున్నారు. తమకు సమీపంలోనే పులి కనిపించడంతో పనులను నిలిపివేసిన కూలీలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రేమ్సింగ్ బేస్క్యాంపు సిబ్బందితో వచ్చి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పాదముద్రలను చూసి, కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పులి ఆ ప్రాంతాల్లోనే సంచరించినట్లు రికార్డయి ఉంది. ఐదు రోజుల క్రితం పిల్లలతో కలసి సంచరించిన పులి ప్రస్తుతం ఒక్కటే కనిపించడంతో పిల్లలను వదిలేసిందా.. లేక ఇది వేరే పులా అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు అటవీ సమీప గ్రామాల ప్రజలు, రిజర్వాయర్ నిర్మాణం వద్ద ఉన్న కూలీలు అప్రమత్తంగా ఉండాలని సెక్షన్ అధికారి ప్రేమ్సింగ్ సూచించారు. ఆయన వెంట యానిమల్ ట్రాకర్స్ కృష్ణ, సోనేరావు, బేస్క్యాంపు సిబ్బంది ఉన్నారు. -
సీసీ కెమెరాకు చిక్కిన పులి దృశ్యాలు
-
తిన్నింటికే కన్నం...రూ.40 లక్షలు స్వాహా
బంజారాహిల్స్: తన తండ్రికి సహాయంగా ఉండేందుకు నియమించిన అటెండర్ నమ్మక ద్రోహానికి పాల్పడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ. 40 లక్షల మేర నగదు డ్రా చేసి మోసగించాడంటూ ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఆర్ఆర్ఎస్ అర్ని(94) నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు విద్యుత్ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుండగా కూతురు హాంకాంగ్లో ఉంటున్నది. 2019లో తల్లి చనిపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉండేందుకు జనగామ సమీపంలోని చేల్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ను నెలకు రూ.30 వేల జీతంతో 2017లో అటెండర్గా నియమించారు. ఆ ఇంట్లో ఉదయ్కిరణ్తో పాటు గార్డెనర్, డ్రైవర్, కుక్, పనిమనిషితో సహా నలుగు రు పని చేస్తుంటారు. తన తండ్రికి సేవలు సరిగ్గా లభిస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యుత్ అర్ని, కూతురు కలిసి ఇంట్లో 12 కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. తన తండ్రికి సమయానికి ఆహారం, మాత్రలు ఇస్తున్నారో లేదో కెమెరాల ద్వారానే తెలుసుకునేవారు. తన తండ్రి ఫోన్, కంప్యూటర్, ఐప్యా డ్ తదితర పనులను కూడా ఉదయ్కుమార్ చేసేవారు. ఇదే అదనుగా బ్యాంకు లావాదేవీలు చూసే క్రమంలో ప్రతి నెల ఇంటి ఖర్చులు డ్రా చేసే నిమిత్తం మూడేళ్లలో రూ.40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి తన జేబులో వేసుకున్నట్లుగా తేలిందన్నా రు. తాను ఇటీవల హైదరాబాద్కు వచ్చానని ఇంటి లెక్కలు ఆడిట్ చేయగా రూ.40 లక్షలు అక్రమాలు తేలాయని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉదయ్కుమార్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్ను హైదరాబాద్కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
జూబ్లీహిల్స్ కేసులో నిందితుడి అరెస్ట్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండురోజులుగా పలు మలుపులు తీసుకున్న కేసును జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా కొలిక్కి తీసుకొచ్చారు. గురువారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ స్నేహితుడు సయ్యద్ అఫ్నాన్(19) కారు నడిపిస్తున్నట్లు తేలడం తో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంకు చెందిన సయ్యద్ అఫ్నాన్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మహ్మద్ మాజ్, ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ స్నే హితులు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడితోపాటు మిగతా ఇద్దరూ అక్కడి నుం చి పారిపోవడంతో కారు నడిపిందెవరు అనే విషయంపై అనేక సందేహాలు తలెత్తాయి. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో లేకపోవడం తో దారి పొడవునా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీంతోపాటు సంఘట న జరిగిన వెంటనే కాస్త దూరంలో ఉన్న ఓ కారు డెకా ర్ స్టోర్లో ఉన్న సీసీ ఫుటేజీలో అస్పష్టంగా ముగ్గురు యువకులు పారిపోతున్న దృశ్యా లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కొంత మంది యువకులు కారు నడిపిస్తున్న అఫ్నాన్ను కొట్టిన ట్లు తెలిసింది. శుక్రవారంరాత్రి పోలీసులు అఫ్నాన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించ గా కారు తానే నడిపినట్లు ఒప్పుకున్నట్లు తె లిసింది. అతడిని సంఘటనా స్థలానికి తీసు కెళ్లి సాక్షులకు చూపించగా అతడే కారు నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతోపాటు సైబర్ టవర్స్ సమీపంలో కారు ఎక్కేటప్పు డు వచ్చిన సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించి నిందితుడు అఫ్నాన్ అని గుర్తించారు. -
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్కు పాలశాస్త్రం పూజలు ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్..
గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్ బంకులో ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి పరిస్థితి విషమం
ముంబై: ముంబైలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదర్ ప్రాంతంలో.. బస్సు,ట్రక్ను ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర (53), కాశీరామ్ ధూరీ (57), తాహిర్ హుస్సెన్ (52), రూపాలి గైక్వాడ్ (36), సుల్తాన్ (50), శ్రావణి మోస్కీ (16), వైధేహి బామనీ (17), మాన్సూర్ ఆలీ (52) తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజస్వినీ ట్రావెల్ కు చెందిన బస్సు మారోల్ నుంచి పైడోనీకి వెళ్తుండగా దాదార్ వద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం.. డ్రైవర్ కండక్టర్తో సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పంజాబ్లో మారనున్న రాజకీయ సమీకరణాలు -
Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపింది. నిన్న (సోమవారం) అర్ధరాత్రి విద్యానగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర ప్రణీతారెడ్డి అపార్ట్మెంట్లో ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ముఠా.. సెక్యురిటీ ఇంటికి బిగాలు ఏర్పాటు చేసి మొదటి ఫ్లోర్లో ఉంటున్న విజయలక్ష్మీ ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత , వీరు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మూడెళ్ల తర్వాత మరోసారి చెడ్డిగ్యాంగ్ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో ఉండే వారంతా.. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ముఠాకు సంబంధించి తిరుపతి ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్కు ఇతర నేరస్థులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు -
‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్కు వచ్చి..
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది. ఈ క్రమంలో బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
మోండాలో సెల్ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్ఫోన్ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్డ్రెస్లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.. అయినా పని చేయని మూడో నేత్రం
సాక్షి, అంబర్పేట( హైదరాబాద్): అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు. సాక్ష్యాలు కనుమరుగు పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. నిర్వహణ బాధ్యత స్థానికులదే ‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను. – సుధాకర్, అంబర్పేట ఇన్స్పెక్టర్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
గాంధీ ఆస్పత్రి ఘటన.. సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాంధీ ఆస్పత్రి ఘటన అంతా ఫేక్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు పోలీసులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి అక్కా చెల్లెలకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరూ చాలా స్ట్రెస్లో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు ఈ క్రమంలో ఇద్దరిలో అక్క బయటికి వెళ్ళిపోయిందని, ఇద్దరూ ఎదుట వ్యక్తికి గుర్తు పట్టే స్థితిలో లేరన్నారు. అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని, ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో లైంగికంగా 7వ ఫ్లోర్లో కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మరొకసారి సెల్లార్లో మళ్లీ పరస్పర అభిప్రాయంతో లైంగికంగా ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఇంట్లొ తెలిస్తే బాగోదు అని అమ్మాయి ఇలా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తి తో ఉందని, అక్కడ ఏం జరిగింది అని వివరణ లేదని తెలిపారు. దీనిలో ల్యాబ్ టెక్నీషియన్ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు. కాగా గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటనపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 500కి పైగాసీసీ కెమెరాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. క్రైమ్లో సీన్ రీ క్రియేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తికి పర్సనల్ విషయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లా ప్రకారం.. ఏసీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. చదవండి: తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ -
సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బిరుదుల హన్మక్క (65) వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుమారుడుకాగా అదే గ్రామంలో మరోచోట నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి హన్మక్కను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఇంటి సమీపంలోని మురికికాలువలో పడేశారు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవి గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మృతురాలి కొడుకు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు విచారణ వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను పోలీసులు ఏర్పాటు చేశారు. -
యువ ఇంజనీర్ నిర్వాకం.. బర్త్డేను గ్రాండ్గా జరుపుకోవాలని..
న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్డే వేడుకలను గ్రాండ్గా జరుపుకొని తమ రిచ్నేస్ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్ పార్క్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్ పార్క్కు వాకింగ్కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటం.. బైక్కు నంబర్ ప్లేట్ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్ప్లేట్లేని బైక్తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్ అని.. షాహదారాలోని జ్యోతి నగర్లో ఉంటానని తెలిపాడు. కాగా, బీఎస్ఈఎస్లో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్పై పలు సెక్షన్ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
సీసీ కెమెరాలను పైకి తిప్పేసి.. దర్జాగా దోచుకుపోయాడు..
సాక్షి, సత్తుపల్లి: సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి..ఓ దొంగ దోచుకున్న తీరు సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్లోని చిన్నా సెల్ వరల్డ్ షాపులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ.6.50 లక్షల విలువైన సెల్ఫోన్లను అపహరించాడు. ఆగంతకుడు అర్ధరాత్రి 1.23 గంటలకు మొదటి అంతస్తు లోపల నుంచి కిందకు దిగి ఒక వైపు తాళం వేసిన ఉన్న షట్టర్ను చాకచక్యంగా తెరిచి 1.26 గంటలకు లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత షాపులోని సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు. సుమారు 40 నిమిషాలకుపైగా షాపులో ఉన్న ఆగంతకుడు షో కేసుల్లోని బ్రాండెడ్ సెల్ఫోన్లు మాత్రమే ఎంపిక చేసుకొని ఎత్తుకెళ్లాడు. అయితే, షట్టర్పైన ఉన్న సీసీ కెమెరాను గమనించకపోవటంతో ఆగంతకుడి కదలికలన్నీ రికార్డు అయ్యాయి. ఎత్తుగా, సన్నగా ఉండి తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్ ధరించి ఉండడాన్ని పుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే వచ్చిందా ఒకరా, ఇద్దరా అనేది తేలడం లేదు. కాగా, చోరీ జరిగిన సెల్ పాయింట్ను కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్ గురువారం ఉదయం పరిశీలించారు. అలాగే, ఖమ్మం నుంచి ప్రత్యేక క్లూస్టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించారు. యజమాని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సుమారు 6.50 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. -
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్ని పీఏగా.. ఆపై ఆఫీస్లోనే కసితీరా ముద్దులు -
హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం
-
గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది. ఫార్చూనర్లో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మహేంద్ర కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం సంభవించలేదు. చదవండి: విషాదం: ఐస్క్రీమ్ తిన్న కొద్దిసేపటికే.. Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం -
బ్యాంకుకే కన్నమేశారు..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో లాకర్ను కట్ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఒక్కటే పోలీసులకు దొరికింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్ రూం డోర్ కట్చేశారు. లాకర్ను కూడా గ్యాస్ కట్టర్తో కట్చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ అక్కడే నిచ్చెన తయారీ.. దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్ సిలిండర్ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్ ధ్వంసం.. అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్ ఎత్తుకెళ్లారు. స్వీపర్ సమాచారంతో.. గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ సింగ్వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, లాకర్ కట్చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, ఫింగర్ప్రింట్ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం. చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఐదు రోజుల క్రితమే పికెట్ ఎత్తివేత.. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు చాలెంజ్.. బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానరాని కనీస భద్రత చర్యలు.. ఎస్బీఐ గుంజపడుగు బ్రాంచ్లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్బోర్డ్ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైరల్:ఎటీఎంనే ఎత్తుకుపోయారు!
చెన్నై: తమిళనాడులోని కొయంబత్తురులో దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్కులు ధరించి బ్యాంక్లో చొరబడిన దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఉతుకులిలోని పీఎస్యు బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరి జరిగింది. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం లోపలికి చొరబడిన దొంగలు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను ప్రత్యేక తాళ్ళతో చుట్టి, ఒక ప్రత్యేక వాహనం సహయంతో అక్కడి నుంచి కదిలించారు. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉన్న మరొక వాహనంలో ఎటీఎంను ఎక్కించుకొని రెప్పపాటులో అక్కడి నుంచి పారిపోయారు. కాగా, ఎటీఎం తీయడానికి ఉపయోగించిన పెద్దకారును విజయమంగళం సమీపంలో వదిలిపారిపొయారు. కాగా, ఈ చోరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఉదయాన్నే దీన్ని గమనించిన స్థానికులు సంబంధింత బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. అక్కడికి చేరుకున్న ఉతుకులి పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో వేలిముద్రలను స్వీకరించారు. కాగా, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు -
శంషాబాద్లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి సూచించారు. -
‘సీసీ కెమెరాల ఏర్పాటులో మొదటి స్థానం’
సాక్షి, హైదరాబాద్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆమాన్గల్కుకి చెందిన వినోద్ కుమార్ బీటెక్ చదివి మధ్యలో ఆపేశాడు. కార్ డ్రైవర్గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. ఇతను గతంలో పీడీ యాక్ట్ మీద జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017 జైల్ నుంచి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారు. దీంతో మరోసారి నిందుతుడిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల కోసం నాలుగు జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలించారని, నిందితుల నుంచి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్! అయిదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్తో జరిగిన సమీక్ష సమావేశంలో సీసీ కెమెరాలు ఎక్కువ శాతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గత నెల రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేశానని వెల్లడించారు.సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో 7000 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు 7 లక్షల 36 వేల సీసీ కెమెరాలు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో హైదరాబాద్ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో ఉందన్నారు. చదవండి : ఐడియా సూపర్.. కానీ బుక్కయ్యావ్గా! కాగా గత కొన్ని రోజుల్లో 36 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు అయ్యాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఒకసారి క్రికెట్ బెట్టింగుకు పాల్పడి కేసులో ఇరుక్కుంటే ఇబ్బందులే కాకుండా భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు అన్ని రకాలుగా పిల్లలపై కన్నేసి ఉంచాలన్నారు. అదే విధంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం హైదరాబాద్లో కెమికల్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. -
ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్ అయ్యారు. ఇది గమనించి వారు బైక్ తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. బిగ్బాస్ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో.. నిరంతరం నిఘా
మచిలీపట్నం: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనతో కోవిడ్ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆసుపత్రులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు, నిఘాను పట్టిష్టం చేసేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన 13 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించారు. ఇప్పటికే 11 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రి, మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. లిబర్టీ ఆసుపత్రిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి కోవిడ్ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రుల్లోని కోవిడ్ కేంద్రం మొత్తం సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రధాన గేటు మొదలుకొని కేంద్రంలోని అన్ని గదులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం, వైద్య సేవలు అందించే వార్డులు, నమోదు కేంద్రం ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. వీటిని కోవిడ్ విభాగం ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సీసీ పుటేజీలను భద్రపరచాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు విముఖత చూపే ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, కోవిడ్ నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికల మేరకు 2,89,290 లక్షల మందికి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 12,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 9,665 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇంకా 2,863 మంది కరోనా పాజిటివ్తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా గణాంకాల మేరకు ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాలోనే తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. రికవరీ శాతం కూడా జిల్లాలో బాగానే ఉండటం అధికారులకు ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాలో కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు: 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినవి: 11 కరోనా పరీక్షల సంఖ్య: 2,89,290 పాజిటివ్ కేసులు: 12,760 కోలుకున్న వారు: 9,665 చికిత్స పొందుతున్న వారు: 2,863 -
కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే 104 కాల్సెంటర్ ద్వారా కోవిడ్ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. ► రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ► ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు. ► బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పక్కాగా పర్యవేక్షణ ► ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు. ► కోవిడ్ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా? మందులు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? ఆక్సిజన్, వెంటిలేటర్ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు. ► ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ► డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులు ► రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు ► ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్ ఫోన్ నంబర్ను డిస్ప్లే బోర్డులో ఉంచుతారు. ► ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు. ► సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. -
లాక్డౌన్లోనూ చేతివాటం చూపించాడు!
ఘజియాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో నేరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోలిస్తే చోరీలు, హత్యలు, ఇతర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ అక్కడక్కడ చోరశిఖామణులు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది చోరులు మాత్రం తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. (ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోరీ చేస్తూ ఓ దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానిక గిరి మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు కొనేందుకు ఓ పెద్దాయన స్కూటర్ మీద దుకాణానికి వచ్చాడు. బండిని దుకాణం ఎదుటే పార్కింగ్ చేసి సరుకులు కొనడానికి వెళ్లాడు. ఆయన వెనుకే తాపీగా వచ్చిన చోరుడు అదును చూసి బండితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగ తన పని తాను చేసినట్టుగానే సీసీ టీవీ కూడా చేసిందని ఈ వీడియో చూసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి: డీసీపీ -
ఎవరా నలుగురు..?
పసిడిపురి..పుత్తడిపురం ఈ రెండు పేర్లు వినగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. బంగారు వ్యాపారంలో రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా ప్రొద్దుటూరుకు మంచి పేరుంది. బంగారు వ్యాపారులే గాక ఇతర రంగాల్లో బాగా స్థిరపడిన వారు అనేక మంది సంపన్నులు ఇక్కడ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇక్కడి నుంచే అప్పుగా డబ్బు తీసుకుంటాయి. విడుదలయ్యే ప్రతి చిత్రంలోనూ ప్రొద్దుటూరు ఫైనాన్సియర్ల పెట్టుబడులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతలు సైతం రుణం ఇక్కడి వారి నుంచే తీసుకుంటుంటారు. అలాంటి పసిడిపురిపై ఇటీవల దొంగల కన్ను పడినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : బంగారు వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని గతంలో ఈ పట్టణంలో పలు దొంగ తనాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు దుండగులు ఒక బంగారు వ్యాపారి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో పట్టపగలు వచ్చిన దుండగులు వీధిలోనూ, ఇంటి చుట్టూ సుమారు 15 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించడంతో బంగారు వ్యాపారులు, ఇతరులు ఆందోళన చెందుతున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు షావలి స్కూల్ కాలనీలో ఒక బంగారు వ్యాపారి నివసిస్తున్నాడు. అతను దర్గాబజార్లో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న నలుగురు వ్యక్తులు కారులో అతను ఉన్న కాలనీకి వచ్చారు. వారి కారును కాలనీ ప్రధాన గేటు వద్ద నిలిపారు. ఒక వ్యక్తి అక్కడే నిలబడగా ఇద్దరు వ్యక్తులు కాలనీ లోపలికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి వెనుక వైపు వెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు వ్యాపారి కాంపౌండ్లోకి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. ఆ ఇంటికి ప్రధాన తలుపునకు ముందు భాగాన గ్రిల్స్ అమర్చిన తలుపులు కూడా ఉన్నాయి. ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో యజమాని పేరు పెట్టి దుండగులు పిలిచారు. ఆయన భార్య ప్రధాన ద్వారం తెరచి చూడగా ఎప్పుడూ చూడని ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు. ‘ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు’ అని అడుగగా పలకలేదు వారు. ముందు తలుపు తీయమని దబాయించారు. అనుమానం వచ్చిన ఆమె గ్రిల్స్ తలుపులు తీయలేదు. సుమారు 10 నిమిషాల సేపు అక్కడే ఉన్న నలుగురు దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నలుగురు కాలనీ కాంపౌండ్లో ఉన్నంత సేపు ఫోన్లలో మాట్లాడుకుంటూ కనిపించారు. బంగారు వ్యాపారి ఎంతో కష్టపడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. అందులో దుండగులు సెల్ఫోన్లో మాట్లాడిన సన్నివేశాలు టైమింగ్తో సహా రికార్డు అయ్యాయి. సెల్టవర్ లొకేషన్ ఆధారంగా ఆ నలుగురు ఎవరు..? వారు ఎవరితో మాట్లాడారనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు జాకెట్ వేసుకొని వచ్చారు. వేసవి కాలంలో జాకెట్ వేసుకొని రావడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రింగ్ రోడ్డు గుండా వచ్చారు.. జమ్మలమడుగు బైపాస్రోడ్డులోని రింగురోడ్డు గుండా నలుగురు దుండగులు పట్టణంలోకి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. పెన్నానగర్ నుంచి నేరుగా వ్యాపారి ఉంటున్న కాలనీ వద్దకు వచ్చారు. అతని ఇంటి వద్ద నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కొంత సేపు కారు పార్కింగ్ చేశారు. తర్వాత వన్టౌన్ స్టేషన్ మీదుగా వెళ్లిపోయారు. వారు మాట్లాడిన భాష.. యాస ఆధారంగా వారు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నలుగురు ఎందుకొచ్చినట్లు.. వ్యాపారి ఉంటున్న కాలనీలో సంపన్నులు చాలా మంది ఉన్నారు. నేరుగా అతని ఇంటికే వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చోరీ చేయడానికే వచ్చారను కుంటే.. అదే వీధిలో సుమారు 15 రోజుల నుంచి ఒక ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఉన్న ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారనేది తెలియడం లేదు. పట్టపగలు భయపెట్టి దోచుకొని వెళ్లడానికా.. లేక కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నలుగురు దుండగులకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన రహదారిలో కాకుండా చిన్న పాటి ఇరుకు వీధి నుంచి నేరుగా వ్యాపారి ఇంటికి వచ్చిన విధానం చూస్తే స్థానికులు ఎవరైనా వారికి సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం బంగారు మార్కెట్లో తెలియడంతో వ్యాపారులు భయాందోనలు చెందుతున్నారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలోనూ సీసీ కెమెరాలను అమర్చారు. ఇంత పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థ ఉన్నా దుండగులు ఎలా వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. కారు నెంబర్ ప్లేట్ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. ఫేక్ నెంబర్ వేసుకొని దుండగులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై వ్యాపారి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల వైఎంఆర్ కాలనీలో రెండు భారీ చోరీలు జరిగాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఇంట్లో, మరొకటి గనుల వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. వీటిలో ఒక చోరీ ఘటనలో పురోగతి కనిపించగా ఇంకోటి ఇంత వరకు తేలలేదు. -
అచ్చం దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో..
సాక్షి, దొడ్డబళ్లాపురం : చికిత్స కోసమని వైద్యుని ఇంటి తలుపులు తట్టిన దుండగులు లోపల చొరబడి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మాగడి తాలూకా కుదూరులో చోటుచేసుకుంది. దండుపాళ్యం ముఠాల తరహాలో దోపిడీ జరగడం గమనార్హం. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అపరిచితులు డాక్టర్ సుభాష్ సింగ్ ఇంటి తలుపులు తట్టడంతో తీశారు. ఒక మహిళ చిన్న పాపను ఎత్తుకుని వచ్చి ఆయాసంగా ఉందని, మందులు కావాలని అడిగింది. మహిళను లోపలకు రమ్మనగానే ఆమె వెనుకనే 15 మంది ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీరాగానే వైద్యుడు సుభాష్ సింగ్, భార్య శశికళ సింగ్, కుమారులు లోకనాథ్సింగ్, పృథ్వీ సింగ్ల కళ్లల్లో కారం చల్లారు. తరువాత నలుగురినీ కాళ్లు చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న రూ.50వేల నగదు, బంగారు వెండి ఆభరణాలతో పాటు, ల్యాప్ట్యాప్, ఇతర ఖరీదైన వస్తువులు, డిజిరో కారును దోచుకెళ్లారు. ప్రతిఘటించిన నలుగురినీ విచక్షణారహితంగా కొట్టారు. సీసీ కెమెరాలు, కుక్కలు ఉన్నా.. అనంతరం వైద్యుని కుమారులు అతి కష్టంమీద కట్లు తెంచుకుని బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. వైద్యుని ఇల్లు విశాలంగా ఉంది. చుట్టూ 14 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.15 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయినా దుండగులు నిర్భయంగా వచ్చి దోపిడీ చేసుకుపోవడం ప్రశ్నార్థకంగా ఉంది. తమ చిత్రాలు దొరక్కుండా దుండగులు సీసీ టీవీల ఉపకరణాలను కూడా అపహరించారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.కుదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ.. ప్రతి గదిలో కెమెరా
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలపై కెమెరా కన్ను నిఘా పెట్టనుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలిసారిగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగే తీరును సీసీ కెమెరాల ద్వారా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లూరు (టౌన్): జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 56,789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్లో 28,587 మంది, ఒకేషనల్కు సంబంధించి 1,572 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్లో 25,590 మంది, ఒకేషనల్కు సంబంధించి 1,040 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధనను కూడా అమలు చేయనున్నారు. నూతన ఒరవడికి శ్రీకారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు, ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. వీటిని డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. గతంలో మాదిరిగా హాల్ టికెట్లు కోసం కళాశాలల చుట్టూ విద్యార్థులు తిరగాల్సిన అవసరం ఇక ఉండదు. విద్యార్థి ఇచ్చిన ఫోన్ నంబర్కు పరీక్ష కేంద్ర పేరుతో పాటు గది నంబర్ వివరాలను మెసేజ్ రూపంలో పంపనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఇంటర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు నిఘా నీడలో జరగనున్నాయి. పరీక్షలు జరగనున్న అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలో పరీక్షలు నిర్వహించే ప్రతి గదిలో సీసీ కెమెరాలను బిగించాలని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సీసీ కెమెరాల లైవ్ ద్వారా అధికారులు వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంది. జంబ్లింగ్ ద్వారాఇన్విజిలేటర్ల నియామకం ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ ద్వారా నియమించనున్నారు. పరీక్ష జరగనున్న కళాశాలలో అదే కళాశాలకు చెందిన ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఎవరూ విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు. పరీక్షకు ఇన్విజిలేటర్లు రోజు రోజుకు మారుతుంటారు. పరీక్షలకు 87 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 87 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించనున్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో టాస్క్ఫోర్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వా డ్లు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలను నగరంలోని కేఏసీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చారు. రెండో విడతగా మరో రెండు రోజుల్లో ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లకు చేర్చనున్నారు. అక్కడి నుంచి ఏ రోజుకు ఆ రోజు పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. 26న వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 26న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ పరీక్షలపై అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు, వృత్తి విద్యాశాఖాధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నా రు. అనంతరం ఆర్ఐఓ, డీవీఈఓలు పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించేలా ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్కు ఆదేశాలు జారీ చేశాం. ఈ వారంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నాం. కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడతాం. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
శివారు.. జనం బెంబేలు
కర్నూలు శివారు ప్రాంత ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళితే తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. గార్గేయపురంలో శనివారం రాత్రి ఆరు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించిన విషయం విదితమే. అది కూడా తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసి..కట్టర్తో తాళాలను తెగ్గొట్టి డబ్బు, ఆభరణాలు తస్కరించారు. ఈ చోరీల నేపథ్యంలో శివారు ప్రాంత ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది. కర్నూలు రూరల్ : కర్నూలు నగరం చుట్టుపక్కల సుమారు 20 గ్రామాలు, పది దాకా వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసుల గస్తీ నామమాత్రంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో అసలే ఉండడం లేదు. రాత్రి వేళల్లో గ్రామానికి ఒక పోలీసును డ్యూటీ వేస్తున్నప్పటికీ వారు ఎక్కడా కన్పించడం లేదు. చాలా ప్రాంతాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఈ పరిస్థితిని దొంగలు అనువుగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగలు పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో శివారు ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. బిహార్, చెడ్డీ, రాజస్థాన్ గ్యాంగ్లు చోరీలకు తెగబడుతున్నాయన్న ప్రచారంతో ప్రజలు వణికిపోతున్నారు. గార్గేయపురంలో జరిగిన చోరీలతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న దిగువపాడు, శివరామపురం, నందనపల్లి, మిలిటరీకాలనీ, కేతవరం తదితర గ్రామాల ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్రామాలు కర్నూలు–గుంటూరు మార్గంలో ఉండడంతో దొంగలు సులువుగా చోరీలకు తెగబడుతున్నారు. 10 మంది దాకా వాహనంలో వచ్చి, రోడ్డుపైనే ఆపి తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడుతున్నారు. గార్గేయపురంలో ఇదే తరహాలో చోరీలకు తెగించారు. గతంలో వెంకాయపల్లి, దిన్నెదేవరపాడు, బి.తాండ్రపాడు గ్రా మాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. వారం ముందే రెక్కీ? దొంగలు చోరీలకు పాల్పడడానికి వారం ముందే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పగలు దుప్పట్లు, దుస్తులు అమ్మేవారి లాగా వస్తున్నారు. అనువైన ఇళ్లను గుర్తించి.. రాత్రిపూట చోరీలకు తెగబడుతున్నారు. ఇళ్లకు వేసిన తాళాలను కట్టర్ సహాయంతో ఏమాత్రమూ శబ్దం రాకుండా తెగ్గొడుతున్నారు. తర్వాత తమ వెంట తెచ్చుకున్న దుప్పటిని డోర్కు అడ్డంగా కట్టి..నగదు, నగలు మూటగట్టుకుంటున్నారు. దీనివల్ల ఆ ఇంట్లో ఏమి జరుగుతోందో బయటివారు గుర్తించలేని పరిస్థితి. గార్గేయపురంలో చోరీలకు పాల్పడిన దొంగలు కాసేపు సెంటర్లో కూర్చుని వెళ్లినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మోకాళ్ల వరకు బురఖా, కాళ్లకు చెడ్డీలు వేసుకుని వచ్చారని, తమ వెంట తెచ్చుకున్న వాహనాన్ని గ్రామమంతా తిప్పారని జనం చెబుతున్నారు. తాళం కట్ చేశారు మేము శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లాం. శనివారం రాత్రి చోరీ జరిగింది. తాళాన్ని కట్టర్ సహాయంతో కట్ చేశారు. ఒకవేళ ఆ సమయంలో మేము ఇంట్లో ఉంటే మా ప్రాణాలు కూడా తీసేవారేమో! – మల్లికార్జున, గార్గేయపురం చిన్న శబ్దం కూడా రాలేదు నేను పక్కనే ఉన్న మా అమ్మ వాళ్లింట్లో పడుకున్నా. మా ఇంట్లో దొంగలు పడి రూ.30వేల నగదు, మూడు తులాల బంగారు ఎత్తుకెళ్లారు. ఆ రాత్రి మా ఇంట్లో నుంచి చిన్న శబ్దం కూడా రాలేదు. తాళం, బీరువా పగులగొట్టినా శబ్దం రాకుండా దొంగతనం చేశారు. – కురువ మాధవి, గార్గేయపురం త్వరలోనే పట్టుకుంటాం గార్గేయపురంలో చోరీలపై విచారణ చేస్తున్నాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం.– ఓబులేసు, సీఐ, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ -
వీఆర్వో అనుమతిస్తేనే తహసీల్దార్ దర్శనం
సాక్షి, కరీంనగర్ : అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఉన్న కరీంనగర్రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలకు సోమవారం వివిధ సమస్యలపై బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మానిటర్లో తహసీల్దార్లు కార్యాలయాల్లోకి వచ్చే వారిని, లోపల ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయాల లోపలికి వెళ్లేముందు దరఖాస్తుదారులను అటెండర్లు పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నారు. వీఆర్వోల అనుమతి లేకుండా నేరుగా తహసీల్దార్లను కలువకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ప్రజావాణిలో భూసమస్యలపై జేసీ శ్యాంప్రసాద్లాల్కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ కొందరు బాధితులు మళ్లీ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చారు. అయితే ముందుగా సంబంధిత గ్రామాల వీఆర్వోలు బాధితుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మరికొందరు బా«ధితులను వీఆర్వోలు స్వయంగా తహసీల్దార్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దరఖాస్తు ఎవరి వద్ద ఉంది, సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోకు సూచించారు. అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా అటెండర్ దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. సంబంధిత అధికారి దరఖాస్తుదారుల సమస్యను పరిశీలించి అవసరమైతే తహసీల్దార్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తున్నారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా -
వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల
కురబలకోట (చిత్తూరు జిల్లా):రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసు నిందితుడి సీసీ ఫుటేజీ చిత్రాలను సోమవారం డీఎస్పీ రవి మనోహరాచారి విడుదల చేశారు. ఇటీవల మదనపల్లె సమీపంలోని చేనేత నగర్ కల్యాణ మండపం వద్ద చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సోమవారం కల్యాణ మండపంలో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో నమోదైన చిత్రాలను పత్రికలకు విడుదల చేశారు. ఇలాంటి పోలికలున్న వారి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 9440796738, 9440617891, 9440900705, 8885588558 నంబర్లకు ఆచూకీ తెలపాల్సిందిగా కోరారు. -
నిను వీడని నీడను నేనే..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై, సూరత్లకు దీటుగా రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షలకు చేరుకున్న వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు ముందుకెళ్తున్నారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నింటినీ ఆయాకమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ (సీసీసీ)కు అనుసంధానిస్తున్నారు. ఇప్పుడీ వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించడంపై అధికారులు దృష్టిసారించారు. ‘తేడా’ లేకుండా... 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రత చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసు స్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరికివారు ముందుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినవి వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. అన్నింటికీ అనుసంధానం... ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతా«ధికారులు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో మూడు కమిషనరేట్లలో పోలీసు, కమ్యూనిటీ అన్నీ కలిపి 10 లక్షల సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో కమిషనర్లు ముందుకెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది. ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు ప్రస్తుతం సిటీలో ఎలాంటి నేరం జరుగుతున్నా పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాలపైనే ఆధారపడుతున్నారు. అంతటి ప్రాధాన్యమున్న వీటి ఏర్పాటులో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను పోలీసుస్టేషన్ల వారీగా ఆయా ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వ్యాపారులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వీరు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సిటీలోని కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలని, అన్నింటికీ సీసీసీతో అనుసంధానించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సైబరాబాద్లో లక్షమార్కు... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల బిగింపు లక్ష మార్కును దాటింది. మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో మంగళవారం వరకు 1,00,419 నిఘానేత్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 13,846 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, 86,669 ‘నేను సైతం’ కెమెరాలు ఉన్నాయి. అయితే జోన్ల వారీగా తీసుకుంటే అత్యధికంగా మాదాపూర్ జోన్లో 48,914, బాలానగర్ జోన్లో 26,783, శంషాబాద్లో 24,572 సీసీటీవీ కెమెరాలు బిగించారు. అలాగే పోలీసు స్టేషన్ల వారీగా తీసుకుంటే గచ్చిబౌలి ఠాణా పరిధిలో అత్యధికంగా 7,530 సీసీటీవీ కెమెరాలు బిగిస్తే అత్పల్పంగా చౌదరిగూడ ఠాణాలో 185 నిఘానేత్రాలు అమర్చారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 95,000 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ విషయానికొస్తే దాదాపు మూడు లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. -
ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నారా..
సాక్షి, నిజామాబాద్: దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో గతంలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే 2017లో రాత్రిపూట 192, పగటిపూట 34, 2018లో రాత్రిపూట 206, పగలు 42, 2019లో రాత్రిపూట 120 , పగలు 14 దొంగతనాలు జరిగాయి. ఇలా దొంగతనాల సంఖ్య పెరుగుపోతుంది. జిల్లా కేంద్రంలో ముబారక్నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై దొంగతనానికి ప్రయత్నించారు. ఏకకాలంలో వినాయక్నగర్, శ్రీనగర్ కాలనీలో బంగారు దుకాణాల్లో మహారాష్ట్ర కు చెందిన ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఇటీవల సీతారాంనగర్కాలనీలో ఓ కారును ఎత్తుకెళ్లారు. ఇదే ప్రాంతంలో మరో మూడు ఇళ్లలో వారం రోజుల్లోనే చోరీలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేశారు. సీసీ కెమెరాలు ఎంతో మేలు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగనాలు నివారించవచ్చు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో సీసీ కెమెరాలను గమనించి దొంగలు వెనకడుగు వేశారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ జరిగిన దొంగలను త్వరగా పట్టుకోవచ్చు. సెలవుల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా కూడా చోరీలను అదుపు చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఇదివరకే ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాల ద్వారా రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి, ఊర్లకు వెళ్లే వారు పలు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలి జాగ్రత్తలు తీసుకోండి ఇంటికి తాళం వేసే వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు. అలాగే రాత్రి వేళలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం అందించాలి. – ఏసీపీ శ్రీనివాస్కుమార్ -
దోపిడీ చేసిన వారే రాళ్లేస్తున్నారు
సాక్షి, అమరావతి: మొన్నటి వరకూ ఇసుక దందా ద్వారా దోచుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారే విమర్శలు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అవకాశం లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుకపై సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాక్ యార్డులు పెంచాలని, వరద తగ్గిన వెంటనే రీచ్ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు ఇసుక చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించాలన్నారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ఇందుకు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. కొత్తవిధానం అమలు ప్రారంభించిన వెంటనే వరదలతో రీచ్లు మునగడంవల్ల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను త్వరితగతిన అధిగమించి ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వరదలవల్ల వచ్చిన విరామ సమయాన్ని పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో కూడా అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండరాదన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిదిద్దుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరు ఎక్కడ ఇసుక అక్రమ తరలింపు, తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇసుకకు కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా ముందస్తుగా తెలియజేస్తే నిర్మాణదారులు తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మొత్తం 102 రీచ్లకుగాను 25 రీచ్ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని వివరించారు. తవ్వి నదుల పక్కన పోసిన ఇసుక వరదల కారణంగా కొట్టుకుపోయిందని తెలిపారు. లంక భూములు కూడా మునిగిపోయాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు అధిగమించామని తెలిపారు. -
సిటీ‘లైఫ్’.. ఇస్మార్ట్ ప్రూఫ్
సాక్షి, హైదరాబాద్: ఇస్మార్ట్ ప్రూఫ్లు.. నేరస్థులను ఇట్టే పట్టిస్తున్నాయి. మూడోకన్ను పడిందంటే మూడినట్టే. నేరాల ప్రివెన్షన్, డిటెక్షన్, కన్వెక్షన్లో సీసీ కెమెరాలతోపాటు ట్యాబ్స్, ల్యాప్టాప్స్, యాప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖకు మౌలిక వసతులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చింది. సాంకేతిక సహాయంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది. ఫలితంగా వీటిల్లో శిక్షలు, ముఖ్యంగా జీవితఖైదు శిక్షలు పెరిగాయి. జీవితఖైదు పడుతున్న కేసుల్లో హత్య, పోక్సోయాక్ట్, మహిళలపై నేరాలతోపాటు ఇతరాలు ఉంటున్నాయి. జీవితఖైదు శిక్షలు ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పడిన జీవితఖైదుల్లో 35.8 శాతం ఈ మూడు కమిషనరేట్ల కేసులకు సంబంధించిన తీర్పులే. దీన్ని గుర్తించిన డీజీపీ కార్యాలయం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలోని 21 యూనిట్లలో 67 మందికి జీవిత ఖైదుపడగా వారిలో హైదరాబాద్ పరిధిలో 10, సైబరాబాద్, రాచకొండల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. క్లూస్ టీమ్స్.. నేరం జరిగినప్పుడు ఘటనాస్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించ గలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మూడు కమిషనరేట్లలో కలిపి కేవలం మూడే క్లూస్టీమ్స్ ఉండేవి. ఫలితంగా వారిపై పనిభారంతో పాటు క్రైమ్ సీన్స్కు చేరుకోవడంలో కాలయాపన జరిగేది. జాప్యాన్ని నివారించడానికి పోలీసు శాఖ డివిజినల్ క్లూస్టీమ్స్ను ఏర్పాటు చేసింది. జియో ట్యాగింగ్ ప్రతి పోలీసు అధికారి రోజువారీ నిర్వర్తిస్తున్న విధులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఆన్లైన్ నివేదికలను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. నేరగాళ్ల నివాసాలు, ఆవాసాలను సాంకేతికంగా గుర్తించడానికి సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ఈ–లీవ్ విధానం అమలు వంటివి ప్రతిస్థాయి అధికారి, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయి. సీసీ కెమెరాలు.. నేరాలను నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తేవడం, దోషులను నిర్ధారించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాల సహాయంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ప్రాజెక్టు కింద సాధారణ ప్రజలతో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్య 3 లక్షలకు పైనే. రికార్డు అయిన ఫీడ్ను శాస్త్రీయంగా ఎలా సేకరించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఐఎస్ఎస్.. శిక్షల శాతం పెరగడంలో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్ఎస్) పాత్ర ఎనలేనిది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కేంద్రంగా రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ విభాగం దర్యాప్తు అధికారులకు ఆద్యంతం సహకరిస్తోంది. -
నిఘానే ‘లక్ష్యంగా..!
సాక్షి,సిటీబ్యూరో: ఏప్రిల్ 19 రాత్రి సమయంలో అల్వాల్లోని అక్సిజన్ అర్కెడ్ అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగతలు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ బిల్డింగ్లోని మెట్ల వద్ద, పార్కింగ్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుల ఫొటోలు, వీడియోలు రికార్డయ్యాయి. కానీ వారి ముఖానికి మాస్క్లు ధరించడంతో గుర్తిం చడం కష్టమైంది. అయితే చోరీ చేసి తిరిగి వెళుతున్న దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు చిక్కాయి. దీంతో వారిని రెండు వారాల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకొని నిందితులను జైలుకు పంపారు. ♦ ఆగస్టు 20న సరూర్నగర్ ఠాణా పరిధిలోని బైరాంగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుంచి ఓ చైన్స్నాచర్ బంగారు గొలుసు తెంచుకొని బైక్పై పరారయ్యాడు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కొత్తపేటలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే హర్యానా వాసి కుషరియా దతారామ్గా గుర్తించి ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లోనే కాదు వందల కేసుల్లో నిందితులను గుర్తించడమే కాకుండా వారికి జైలు శిక్షలు పడేలా న్యాయస్థానంలో సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడుతున్న ఈ సీసీటీవీ కెమెరాలను అవశ్యకతను గుర్తించిన సైబరాబాద్, రాచకొండ పోలీసులు ‘లక్ష’ం వైపుగా సాగుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి జోన్లో ఈ సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓవైపు నేను సైతం ప్రాజెక్ట్, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ల ద్వారా ఈ సీసీ కెమెరాల సంఖ్య దాదాపు ఇరు కమిషనరేట్ల అధికారులు లక్ష చేరువలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్లో 96 వేలు, రాచకొండలో 90,700 సీసీ కెమెరాలను బిగించారు. అయితే, నేను సైతం ప్రాజెక్టు ద్వారానే అధిక నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో బడా ఐటీ కంపెనీలు ముందుకొచ్చి పోలీసుల నేను సైతం ప్రాజెక్టుకు విరాళాలు ఇస్తున్నారు. అంతేగాకుండా సీసీ కెమెరాల నిర్వహణకు కూడా కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం ఇస్తూ నేర రహిత సమాజంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ‘చాయ్ పే చర్చ’ ద్వారా జాగృతి లక్షల్లో ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్లోనూ సీసీటీవీ కెమెరాలను మరింత పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీఎస్సీలో సభ్యులుగా ఉన్న ఐటీ కంపెనీలను పోలీసు కమిషనర్ వీసీ సజ ్జనార్ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ అవశ్యకతను వివరిస్తున్నారు. కంపెనీలతో పాటు రహదారులపై ఏర్పాటు చేసే సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ప్ర స్తుతం ఐటీ కారిడార్లో ఉన్న 214 సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్ జోన్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాల ఉండేలా చొరవ చూపుతున్నారు. వచ్చిన విరాళాలతో సైబరాబాద్ ఐటీసెల్ విభాగాధిపతి పి.రవిప్రసాద్ ఆధ్వర్యంలో పాత సీసీటీవీ కెమెరాల నిర్వహణతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ‘మహా’ కమిషనరేట్లో నిఘా విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్గా ఉన్న రాచకొండ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు మిళితమైన ఈ ప్రాంతంలో నేరాలు నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని తొలినాళ్లలోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుర్తించారు. ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను బిగింపును ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. ఈ సీసీటీవీ కెమెరాలు చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను ఈజీగా పోలీసులకు పట్టిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్లో అత్యంత ప్రధానమైన యాదాద్రి ఆలయం ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో ఐటీసెల్ విభాగాధిపతి ఎం.శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు రెండు కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద 305 సీసీ కెమెరాలు తాత్కాలికంగా బిగిస్తున్నారు. సైబరాబాద్లోని హస్మత్పేట చెరువుత, పత్తికుంట చెరువు, మల్లెచెరువు, ఐడీఎల్ చోఎరువు, ప్రగతినగర్ చెరువుల వద్ద 100 సీసీటీవీ కెమెరాలు, రాచకొండలోని సరూర్నగర్, ఎదులాబాద్, ఇమాంగూడ, కాప్రా, సఫిల్గూడ చెరువుల వద్ద 205 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ‘రాచకొండలో నిమజ్జనం జరిగే ప్రాంతాలతో పాటు 35 సున్నితమైన ప్రదేశాల్లో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వివిధ జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి, రాచకొండ సీపీ కార్యాలయానికి అనుసంధానిస్తున్నాం’ అని రాచకొండ ఐటీసెల్ విభాగాధిపతి శ్రీధర్రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘా నేత్రాలు సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్స్నా చింగ్లు, హత్యలు దితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నాయి. హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ సీసీటీవీలకు విరాళం ఇవ్వాలనుకుంటే... సైబరాబాద్: 949061744కు వాట్సాప్ చేయవచ్చు. లేదా itcell& cyb@tspolice.gov.in మెయిల్ చేయవచ్చు. రాచకొండ: 949061 7111కు వాట్సాప్ చేయవచ్చు. లేదా ఆయా పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలను సంప్రదించవచ్చు. -
తిరుపతిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుపతి: చిన్నారి కిడ్నాప్ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మూడేళ్ల చిన్నారిని శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ను గుర్తించి.. ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. చిన్నారిని కిడ్నాపర్ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
ఇసుకపై నిరంతర నిఘా!
సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్ చేసిన ఆర్యాస్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్ వేసిన యాపిల్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–2గా, రూ.1,32,299కి కోట్ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్ ప్యానల్, ఇన్స్టలేషన్ కలిపి సీసీ కెమెరా యూనిట్గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్కు రూ.58,970.5కు ఆర్యాస్ బిడ్ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్కు లోడింగ్, స్టాక్ యార్డుకు రవాణా, అన్ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్కు లోడింగ్) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు. రవాణా టెండర్లు రద్దు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. -
పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు
సాక్షి, మహబూబాబాద్: ఎక్కడ ఏ నేరం జరిగినా నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీపై ఆధారపడిన పోలీసుల చేతికి ఇప్పుడు మరో ఆయుధం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది శరీరాని(చొక్కా)కి అమర్చే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం బేతోలు శివారులో మంగళవారం బాడీ వార్న్ కెమెరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎక్కడైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినా, వారి నుంచి సిబ్బంది డబ్బు తీసుకున్నా ఈ బాడీ కెమెరాల ద్వారా ఉన్నత అధికారులకు సమాచారం చేరుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్కు వీడియో చిత్రాలు అందించే ఈ ఆధునిక కెమెరాలను ఉపయోగపడుతాయని చెప్పారు. ఏమిటీ కెమెరా.. ఎలా పనిచేస్తుంది? ఇప్పటి వరకు సీసీ కెమెరాలు, పెన్ కెమెరాల పేర్లు మాత్రమే మనం విన్నాం. బాడీ వార్న్ కెమెరాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసు తన ఒంటికి ఓ ఆధునిక కెమెరాలను పెట్టుకుని ఉంటాడు. బాడీ వార్న్ కెమెరాను ధరించిన పోలీసు నిల్చున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఏ వాహనదారుడు ఏ రూట్లో వెళ్లాలి? అందుకు విరుద్ధంగా ఎక్కడ వెళ్తున్నాడు? అక్రమ పార్కింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? అన్న పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి, సెంట్రల్ సర్వర్కు పంపుతుంది. ఈ ఆడియో, వీడియోలను ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు స్టేషన్, ట్రాఫిక్ కంట్రోల్ రూంకు చేరడంతో సెంట్రల్ సర్వర్లో డేటా భద్రంగా ఉంటుంది. మెయిన్ సర్వర్లో ఈ డేటాను తొలగించడం ఎవరికి సాధ్యపడదు. అంతేకాకుండా సిబ్బంది ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు. కేవలం 140 గ్రాముల బరువుతో ఉన్న ఈ కెమెరా ఇంటర్నల్ 8 జీబీ, ఎక్స్టర్నల్ 32 జీబీతో మొత్తం 40 జీబీ సామర్థ్యంతో, ఎనిమిది గంటల బ్యాకప్ బ్యాటరీ, హెచ్డీ క్వాలిటీతో వీడియోను చిత్రీకరించడం బాడీ వార్న్ కెమెరాల ప్రత్యేకతలు. కాగా, బాడీ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు రేల జనార్దన్రెడ్డి, శశిధర్, టౌన్ సీఐ సుంకరి రవికుమార్, డీసీఆర్బీ సీఐ రమేష్కుమార్, ఐటీకోర్ సీఐ బి.రాజయ్య, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు సీహెచ్.అరుణ్కుమార్, సిరిసిల్ల అశోక్కుమార్, టౌన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు
సాక్షి, పిట్లం(కామారెడ్డి) : మండల కేంద్రంలోని శాంతినగర్, రాజీవ్గాంధీ, బీజే కాలనీల్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4 గంటలకే ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించారు. దీంతోపాటు కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. మూడు కాలనీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 150 మోటారు సైకిళ్ళు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను ఎస్పీ శ్వేత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి దుకాణదారుడు, ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా చోరీలు జరిగే ఆస్కారం ఉండదన్నారు. ఇటీవలి కాలంలో చోరీలు పెరిగాయని, వాటిలో అధికంగా సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో చోరీలు జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. కొద్ది రోజుల కింద పిట్లం బస్టాండ్ ఎదురుగా ఉన్న బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. పోలీసులు ఎంత పటిష్టంగా కాపలా ఉన్నా చోరీలు జరుగుతుంటాయని, వీటిని నివారించాలంటే సీసీ కెమెరాలు మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. ఇక వాహనదారులు వాహనం నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. దీంతో పాటుగానే ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. తరువాత స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల ధ్రువపత్రాలు పరిశీలించి సరిగ్గా పత్రాలు ఉన్నవాటిని యజమానులకు అప్పగించారు. వాహనాలకు సరైన పత్రాలు లేనివాటికి జరిమాన విధించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి, బిచ్కుంద సీఐ నవీన్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, నవీన్ కుమార్, సాయన్న, అభిలాష్, అశోక్, సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయం ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ శ్వేత తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మంగళవారం ఉదయం ఎస్పీ శ్వేత ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డ్లను పరిశీలించి స్టేషన్ పరిసరాలను చూసి ఎస్ఐ నవీన్ కుమార్తోపాటు సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మిగితా పోలీస్ స్టేషన్లు పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను, సీసీ కెమెరాలు పని తీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ నవీన్ కుమార్, ఏఎస్ఐ మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంట్లోనూ నిఘానేత్రం
- ఒడిశా రాష్ట్రంలో రూ.13.50 లక్షల విలువైన పేపర్ రోల్స్తో బయలుదేరిన లారీ బెంగళూరుకు చేరకుండా దారి మళ్లించి 14 చెక్పోస్టులు దాటుకెళ్లిపోయినప్పటికీ పట్టుకున్న విజయనగరం వన్టౌన్ పోలీసులు అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ అవార్డు)ను అందుకున్నారు. అదేమంటే వారి నేర పరిశోధనలో చెక్పోస్టుల వద్ద ఉన్న క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ)కెమెరాలే కీలకంగా ఉపయోగపడ్డాయి. - కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన షేక్ అబ్దుల్ ఖదీర్(26) హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు కూడా అవార్డు లభించింది. మిస్టరీగా మారిన ఈ కేసులో కూడా వాట్సాప్ చాటింగ్ కొంత క్లూ ఇస్తే నేర స్థలంలో ఉన్న సీసీ కెమెరాలే నేరస్తులను గుర్తించేలా దోహదపడ్డాయి. సాక్షి, అమరావతి: ఇలా సీసీ కెమెరాల పుటేజ్ పోలీసులకు కీలకంగా మారింది. దీంతో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్, జన సంచారం ఉంటే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లతో అనుసంధానించారు. రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో 8,148 సీసీ కెమెరాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు రియల్ టైమ్ గవర్నెన్స్(ఆరీ్టజీఎస్) ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5,200 సీసీ కెమెరాలు ఉండగా మరో 14,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు ప్రతీ ఇంటింటికి నిఘా నేత్రాన్ని విస్తరించేలా రాష్ట్ర పోలీసులు కొత్త ప్రతిపాదనలు చేశారు. తొలుత వీధుల్లో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్ చేసేలా చూస్తారు. అటు తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా దశలవారీ కార్యచరణ చేపట్టనున్నారు. ఎల్హెచ్ఎంఎస్కు సీసీ కెమెరాల కొరత.. రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం(ఎల్హెచ్ఎంఎస్) ఒక మేరకు ఫలితాలు ఇచ్చింది. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఇంటి యజమాని కొద్ది రోజులపాటు తన ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్హెచ్ఎంఎస్ యూనిట్ అమర్చుతారు. తాళం వేసిన ఆ ఇంట్లోకి ఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్కు అలారంతో కూడిన సంకేతాలు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు కోసం 8,12,450 విజ్ఞాపనలు రాగా 3,80,79 విజ్ఞప్తులను పోలీసులు పరిగణలోకి తీసుకున్నప్పటికీ తొలి ప్రయత్నంగా 24,473 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చారు. ఇది మంచి ఫలితాలు ఇచి్చంది. ప్రతి ఇంటికి సీసీ కెమెరా..డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులు గతంలో నేర స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలకోసం వెదికేవారు. ఇప్పుడు నేరస్థలంలో మొదట సీసీ కెమెరా పుటేజీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, జన సంచారం ఉండే చోట సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు ఎల్హెచ్ఎంఎస్ను పోలీసు శాఖ వినియోగంలోకి తెచ్చింది. ప్రతీ ఇంటికి వారే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేల ప్రజలను చైతన్యం చేస్తాం. నేరస్తుడు సీసీ కెమెరా ఉన్న ఇంటికి వెళ్లాలంటే దొరికిపోతాం అనే భయపడే పరిస్థితి రావాలి. దీని వల్ల నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే నేరాలు జరగకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. -
శుభమస్తు షాపింగ్ మాల్లో భారీ చోరీ
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుండగుడు నాలుగో అంతస్తులోని యజమాని కార్యాలయంలో ఉన్న లాకర్ను పగులగొట్టి రూ.16 లక్షల నగదును అపహరించుకుని వెళ్లాడు. శుక్రవారం ఉదయం మాల్ తెరిచిన సిబ్బంది నాలుగో అంతస్తులో సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండటం, యజమాని కార్యాలయంలో లాకర్ తెరచి ఉండడం, బాత్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యానును తొలగించి కిందపడవేసి ఉండటాన్ని గమనించి యజమాని వాసుకు సమాచారమిచ్చారు. యజమాని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ జే.శ్రీనివాసులరెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించగా చోరీ జరిగిన తీరు, నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దాని ఆధారంగా నిందితుడు అదే మాల్లో పనిచేసే మణిగా గుర్తించారు. గురువారం రాత్రి మాల్ మూసివేసే సమయానికి దుండగుడు లోపలికి ప్రవేశించి చోరీ చేసి బాత్రూమ్లో దాక్కున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చి వెళ్లాడు. పోలీసులు సెల్ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొత్తును స్వా«దీనం చేసుకున్నారు. -
కారు డోర్లాక్ పడి.. ఊపిరాడక
నిజామాబాద్ అర్బన్: కారులో కూర్చుని సరదాగా ఆడుకుందామని అనుకున్నారు ఆ చిన్నారులు., కానీ ఆ కారే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని గ్రహించుకోలేకపోయారు. ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులో ఎక్కిన ఇద్దరు చిన్నారులు కార్ డోర్ లాక్ అయి.. ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ముజాహిద్నగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సయ్యద్ రియాజ్ (10) మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇతనికి మహమ్మద్ బద్రుద్దీన్ (5) జత కలిశాడు. ఇద్దరు సమీపంలో ఉన్న పార్కులో కలసి కాసేపు ఆడుకున్నారు. ఈ క్రమంలో అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ కారులోకి సరదా కోసం ఎక్కారు. అయితే వెంటనే కారు డోర్లాక్ కావడంతో ఇద్దరు అందులోనే ఉండిపోయారు. కాసేపటికి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు కారులోనే మృత్యువాత పడ్డారు. సాయంత్రం 6 గంటలు అవుతున్నా చిన్నారులు ఇద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలోని అన్ని చోట్లా వారికోసం వెతికారు. అయినా వారి జాడ దొరకలేదు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కారు యజమాని అబ్దుల్ రహమాన్, తన కారును తెరిచి చూడగా వెనుక సీట్లో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వెంటనే రియాజ్ తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆడుకునేందుకు వెళ్లిన తమ పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఘటనాస్థలానికి చేరుకున్న ఒకటో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా బాలురు ఆడుకుంటూ కారులోకి వెళ్లినట్లు తేలింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన ఇద్దరు పిల్లలు అక్కా చెల్లెళ్ల కొడుకులు. తన కలల రూపం కళ్ల ముందే మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. -
‘కళ్లు’గప్పలేరు!
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం జనవరి 30... బొటానికల్ గార్డెన్స్ సమీపంలో ప్లాస్టిక్ సంచుల్లో గుర్తు తెలి యని మహిళ శరీర భాగాలు దొరికాయి. అత్యంత కిరాతకంగా ఆ హత్య జరిగింది. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక కుండా హంతకులు జాగ్రత్త పడ్డారు. అయినా పది రోజుల్లోనే చిక్కారు. వీరిని పట్టించడంలో కీలక పాత్ర పోషించింది సీసీ కెమెరాలే. ఇలా.. రాజధానిలో ఏటా ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ‘మూడో కన్ను’ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్కు దీటుగా నగరంలో ఇవి ఏర్పాటవుతున్నాయి. అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలెటిక్స్ సైతం జోడించడానికి పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు అన్నింటినీ కమిషనరేట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానం చేయడం ప్రారంభించారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో మొత్తం 10లక్షల కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకెళ్తోంది. -
ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపించకుండాపోయిన తన 19 ఏళ్ల తన కుమార్తెను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అడ్కొనర్వు పిటిషన్ను ఇటీవల దాఖలు చేసింది. పెళ్లయి, పిల్లలు కలిగిన తన మేనమామ లోకనాథన్తోనే ఆమె కుమార్తె వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే యువతిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సినీ నటీమణులు కనిపించకుండా పోతే నే గాలింపు చేస్తారా, సాధారణ యువతులను పట్టించుకోరా అని న్యాయమూర్తులు పోలీసులకు ప్రశ్నించారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచా రణకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో చెన్నై లా అండ్ ఆర్డర్ ఐజీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో చెన్నైలో వివాహేతర సంబంధాల వల్ల 1,459 హత్యలు జరిగాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పదేళ్లు అంటే 3,650 రోజులు. 3,650 రోజుల్లో 1,459 హత్యలు అంటే రెండురోజులకో హత్య జరిగిందన్నమాట. ఈ హత్యలన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన వే కారణం గమనార్హం. యువత పెడదారి పట్టడానికి ఇంట ర్నెట్, సెల్ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్సైట్లే ప్రధాన కారణమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ అవేదన వ్యక్తం చేశారు. ఐజీ కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించి కంగుతిన్న న్యాయమూర్తులు.. సమాజంలో పె చ్చుమీరిపోయిన వివాహేతర సంబంధాల సం స్కృతికి మూలకారణం అరచేతిలో (సెల్ఫోన్లు) అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి రావడమేనని వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రైల్వేస్టేష్టన్లలో ‘మూడో కన్ను’ ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్లకు చేరుకునే జంటలను ఉపేక్షించేది లేదని పోలీస్శాఖ హెచ్చరించింది. 136 రైల్వేస్టేషన్లలో ‘మూడో కన్ను’ ఏర్పాటుతో ప్రేమజంటలపై నిఘా పెడుతున్నామని పేర్కొంది. చెన్నై నగరం, శివార్లలోని పలు ప్రాంతాలను కలుపుతూ పయనించే లోకల్ రైళ్లలో రోజుకు 8 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. చెన్నై నగరంలోని మాంబళం, తాంబరం తదితర పలులోకల్ స్టేషన్లలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం వేరే రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు ప్రయాణికుల వసతి కోసం అనేక కుర్చీలను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కుర్చీల్లో ప్రయాణికుల కంటే ప్రేమ జంటలే ఆక్రమించుకుని ఉంటారు. గంటల తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదే కోవలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో 2016లో స్వాతి అనే ఐటీ ఉద్యోగిని ఒక యువకుడు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆగ్రహం చెందిన యువకుడు వేటకొడవలితో స్వాతిపై దాడిచేసి దారుణహత్య చేశాడు. అలాగే ఈరోడ్కు చెందిన తేన్మొళి అనే ప్రభుత్వ ఉద్యోగినిపై చెన్నై చెట్పట్ రైల్వేస్టేష్టన్లో పదిరోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఈనెల 21వ తేదీన ప్రాణాలు విడిచాడు. చెన్నై లోకల్ రైల్వేస్టేషన్లలో ప్రేమజంటలు గంటల కొద్దీ బాతాఖాని కొట్టే దృశ్యాలను చూస్తున్న నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్కు వచ్చే జంటలపై చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రేమ జంటలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు నిఘాపెట్టి ఎక్కువ సేపు కూర్చుని ఉంటే రైల్లో ఎక్కించడమో లేక స్టేషన్ నుంచి వెళ్లగొట్టడమో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కమిషనర్ కార్యాలయంలో అప్పగించాలని, సదరు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలందాయి. స్వాతి హత్య జరిగిన నుంగంబాక్కం రైల్వేస్టేషన్ సహా 82 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే చెన్నై చేట్పట్లో చోటుచేసుకున్న తాజా హత్యాయత్నం తరువాత ప్రేమజంటల కదలికలపై నిఘా పెట్టేందుకు మరో 136 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. -
నిఘా ‘గుడ్డి’దేనా!
పటాన్చెరుటౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పటాన్చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మొత్తం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. రికార్డు కాని డేటా.. మొత్తం హార్డ్డిస్క్ 931.51 జీబీ ఉండగా మొత్తం 931.51జీబీ ఫుల్ కావడంతో ఫ్రీ స్పేస్ లేదని డిస్ప్లేలో చూయిస్తుంది. ఈ విషయాని గమనించిన అధికారులు గత శుక్రవారం సీసీ కెమెరాల స్టోరేజీ పెంచాలనీ నిర్వాహకులకు సూచించారు. అయితే వారు స్టోరేజీ పెంచకుండా అలాగే వదిలి వేశారు. దీంతో డేటా రికార్డు కాకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్లుగా ఉంది. ఇదే హార్డ్డిస్క్ స్టోరేజీ విషయంపై అధికారుల వివరణ కోరగా ఇప్పటికే ఈ విషయాని నిర్వహకులకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వారు బాగుచేయలేదని చెబుతున్నారు. -
నిద్రపోతున్న నిఘా నేత్రం
నిజామాబాద్ నాగారం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో నిఘా నేత్రం నిద్రపోతోంది. పేరుకే సీసీ కెమెరాలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఏ రోజు కూడా అవి పనిచేసిన దాఖలాలు లేవు. మరోవైపు బస్టాండ్లో దొంగలు రాజ్యమేలుతున్నారు. బస్టాండ్లో పోలీస్ బూత్ ఉన్నా అక్కడ పోలీసులే కనిపించారు. ఈ బస్టాండ్ ద్వారా ప్రతిరోజు సుమారు 80 వేల నుంచి లక్ష వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్లో సుమారు 60 పైగా దుకాణాల సముదాయాలు ఉన్నాయి. బస్టాండ్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బస్టాండ్లో సుమారు ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఇవి పనిచేశాయి. ఆ తర్వాత మానేశాయి. సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసే కంప్యూటర్ సిస్టం సక్రమంగా పని చేయడం లేదు. బస్టాండ్లో ఒక పక్క చోరీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నారని వివర్శలు వస్తున్నాయి. బస్టాండ్లోనే కాకుండా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలోనూ పర్సులు, డబ్బులు, బంగారం చైన్లను దొంగలు కొట్టేస్తున్నారు. రూ. వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్లను సైతం మాయం చేస్తున్నారు.బాధిత ప్రయాణికులు లబోదిబో మంటూ బస్టాండ్లో õఉన్న పోలీస్బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదు. దీంతో బస్స్టేషన్మాష్టార్ కార్యాలయంలోకి వెళ్తే తమకేమీ తెలియని, పోలీస్స్టేషన్కు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. రక్షణ లేకుండా పోయింది బస్టాండ్లో వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల కనీస చర్యలు తీసుకోవడం లేదు. బస్టాండ్లో చాలా మంది ప్రయాణికులు చోరీలకు గురవుతూనే ఉన్నారు. మా బంధువులు సైతం బస్టాండ్లో ఉండగానే చోరీకి గురయ్యారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. –భోజన్న, ప్రయాణికుడు సెల్ఫోన్, పర్సుపోయింది మా స్నేహితులతో కలిసి బస్సుఎక్కుతున్న సమయంలో పర్సు, విలువైన సెల్ఫోన్ చోరీకీ గురైంది. ఈ విషయంలో సంబంధిత స్టేషన్ మాష్టార్కు చెబితే వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని సలహా ఇచ్చారు. సీసీ కెమెరాలు పనిస్తే చాలా వరకు దొంగతనాలను అరికట్టవచ్చు. –కిషోర్, ప్రయాణికుడు -
హజీపూర్ ఘటనతో సీసీటీవీ ఆవశ్యకత..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ ఘటనతో సీసీ కెమెరాల ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. బొమ్మలరామారం నుంచి హజీపూర్కు వెళ్లాల్సిన విద్యార్థిని శ్రావణిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, దారుణం హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొమ్మలరామారం బస్స్టాప్ వద్ద సీసీటీవీ కెమెరాలున్నా పనిచేయకపోవడంతోనే శ్రీనివాసరెడ్డి ఘాతుకాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాదాద్రి, భువనగిరి డివిజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినా స్థానిక అధికారులు వాటిని నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి అటకెక్కాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రతి మండలం, గ్రామ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడమేగాక వాటిని ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించేందుకు సన్నాహాలు చేపట్టారు. ‘మహా’ కమిషనరేట్లో నిరంతర నిఘా... 5091.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్గా గుర్తింపు పొందిన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మిళితమైన ఈ కమిషనరేట్లో నేరాలను నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని గుర్తించిన సీపీ అందుకు అనుగుణంగా ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించే బాధ్యతను ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. తద్వారా చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడమేగాక, వారికి శిక్ష విధించడంలోనూ పోలీసులు సఫలీకృతులయ్యారు. యాదాద్రిపై ప్రత్యేక దృష్టి... యాదాద్రి ఆలయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ డివిజన్లలో 941, 812, 1942 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. మొత్తంగా యాదాద్రి జోన్లో 4773 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో వీటిలో చాలావరకు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెలుగులోకి రావడంతో సీపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయా పోలీసుస్టేషన్ల అధికారులు సీసీటీవీ కెమెరాల మరమ్మతులు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి జోన్లో 38,208 ఎల్బీనగర్ జోన్లో 34,779 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో ఒక్కసారిగా మేల్కొన్న పోలీసు అధికారులు ఇప్పటికే బిగించిన సీసీటీవీ కెమెరాల పనితీరుతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించారు. మూడు జోన్లలో కలిపి 77,760 సీసీటీవీ కెమెరాలుండగా వీటి సంఖ్యను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడం వల్ల సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్స్నాచింగ్లు, హత్యలు తదితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. అయితే హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాల పనితీరుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.–మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది
అతడో ఆటో డ్రైవర్. తన ఆటోను తీసుకెళ్లి ఎంచక్కా ఓ సీసీ కెమెరా కింద ఆపాడు. అటూఇటూ చూసి ఎవరూ తనని చూడకపోవడంతో చకచకా ఆటోపైకి ఎక్కేశాడు. చటుక్కున సీసీ కెమెరా తీగలు కత్తిరించి దాన్ని పట్టుకుని ఉడాయించాడు. అనంతరం దాన్ని ముక్కలు చేసి పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. ఇక బస్తీలో తాను చేసే చిల్లర పనులు ఏ కెమెరా రికార్డు చేయలేదులే అన్న ధైర్యంతో బస్తీకి వచ్చేశాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతగాడిని పట్టుకొని పక్కనే ఉన్న మరో కెమెరాలో ఈయనగారు చేసిన చోరకళను చూపించి బిత్తరపోయేలా చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. వనపర్తికి చెందిన శాంతానాయక్(40) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నం.52లోని నందగిరిహిల్స్ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్లో గుడిసె వేసుకొని బతుకుతూ ఆటో నడుపుతున్నాడు. అతడు మద్యం సేవించడం, పేకాడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు నందగిరిహిల్స్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ సీసీ కెమెరా తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందనే కారణంగా ఏకంగా సీసీ కెమెరానే దొంగిలించి అమ్మేశాడు. అయితే అతడు ఈ కెమెరాను దొంగిలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇంకో కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయం తెలియని శాంతానాయక్ తాను దొంగతనం చేయలేదని బుకాయించగా పోలీసులు ఆ ఫుటేజీలను కళ్ల ముందుంచారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. సీసీ కెమెరా దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడం నగరంలో ఇదే మొదటిసారి. –హైదరాబాద్ -
కిలాడీ బామ్మ
గుంటూరు, తెనాలిరూరల్: ఆ బామ్మ వయసు 71 ఏళ్లు. ఆలయంలో ఉంటే అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుందనుకుంటారు. జాగ్రత్త దొంగలుంటారు అని హెచ్చరిస్తుంటే ఎంతటి పెద్దరికమని ముచ్చట పడతారు. అలా అని ఆ బామ్మను దగ్గరకు రానిచ్చారో.. ఒంటి మీద నగలుపోయి ఘొల్లుమంటారు. వామ్మో బామ్మ.. అంటూ గగ్గోలు పెడతారు.. ఇలా ప్రజలను బురిడీ కొట్టించి నగలు కొట్టేస్తున్న కిలాడీ బామ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఆమె నుంచి రూ. 2.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్ఎస్ కిషోర్కుమార్ ఈ కిలాడి బామ్మగురించి వివరించారు. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన జవంగుల సరోజిని(71) తెనాలిలో నివసిస్తున్న తన కొడుకు వద్దకు వచ్చి పోతుండేది. మార్చిలో వచ్చిన ఆమెకు అదే నెల 13వ తేదీన పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి ధ్వజ స్తంభ ప్రతిష్ట జరుగుతుందని తెలిసింది. 13వ తేదీ ఉదయం గుడికి వెళ్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీరిలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. రద్దీగా ఉండడంతో ‘చోరులతో జాగ్రత్తగా ఉండాల’ంటూ మహిళలతో మాటలు కలిపింది. చీర కొంగులు కప్పుకోవాలంటూ తానే స్వయంగా కప్పింది. ఈ క్రమంలో పట్టణ మోదుకూరి వారి వీధికి చెందిన కొత్తపల్లి అన్నపూర్ణ(65), నందులపేటకే చెందిన పొందూరి సుగుణకుమారి(63)ల మెడలలోని బంగారు నానుతాడులను అపహరించింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కెమెరాల్లో కనపడకుండా నేరాలు.. సరోజిని నేరాలకు పాల్పడిన తీరు గురించి తెలుసుక్ను పోలీసులు నివ్వెరపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ గొలుసులు అపహరించింది. బాధితులు ఫిర్యాదుతో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులకు ఎవరూ ఫుటేజ్లలో కనబడలేదు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటిలో పడకుండా జాగత్తపడింది. ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనుకుని పోలీసుల దర్యాప్తు వేగం తగ్గించారు. అంతలోనే, ధ్వజ స్తంభ మహోత్సవాన్ని స్థానికులు సెల్ఫోన్లు, కెమెరాలతో వీడియో తీశారని తెలుసుకున్నారు. వాటిని తెప్పించి పరిశీలించి నిందితురాలిగా అనుమానం ఉన్న వృద్ధురాలి ఫోటో తీయించగలిగారు. ఈమెపైనే బాధితులూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక నిందితురాలు ఈమేనని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తెనాలి రజకచెరువు వద్ద శనివారం ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకుందని, ఆమె వద్ద నుంచి మొత్తం 72 గ్రాముల రెండు బంగారు నానుతాడులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితురాలు గతంలో విజయవాడలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిసింది. సమావేశంలో ఎస్ఐ గన్నవరపు అంజయ్య, సిబ్బంది ఉన్నారు. -
నిఘా కెమెరాలను వితరణ చేసిన జీవీ
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ గురువారం పొల్లాచ్చి ప్రాంతానికి 50 సీసీ కెమెరాలను వితరణ చేశారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈయన నటించిన కుప్పత్తురాజా గతవారం తెరపైకి వచ్చింది. ఈ శుక్రవారం జీవీ నటించిన వాచ్మెన్ తెరపైకి వచ్చింది. త్వరలో 100 శాతం లవ్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విజయ్ దర్శకత్వం వహించిన వాచ్మన్ చిత్రాన్ని గురువారం నగరంలోని 300 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించారు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రాన్ని విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ చూశారని ఆ చిత్ర కథానాయకుడు జీవీ.ప్రకాశ్కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సాలిగ్రామంలోని బాలలోక్ పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాచ్మెన్ చిత్ర ఆడియా ఆవిష్కరణ సమావేశంలో పొల్లాచ్చి గ్రామానికి 50 సీసీ కెమెరాలను అందిస్తానని ప్రకటించానని, ఆ విధంగా 50 సీసీ కెమెరాలను ఆ గ్రామానికి అందించినట్లు తెలిపారు. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటన ఆవేదనను కలిగించిందన్నారు. మానసిక రోగులే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారని అన్నారు. విద్యార్థులు అవగాహనతో మెలగాలని, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలని జీవీ పేర్కొన్నారు. అదే విధంగా విదేశాల్లో లైంగిక అవగాహన గురించిన పాఠ్యాంశాలను పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్నారని, అలాంటి అవగాహనతో కూడిన పాఠ్యాంశాలు మన దేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని జీవీ.ప్రకాశ్కుమార్ వ్యక్తం చేశారు. -
సీసీ కెమెరాల అపహరణ
సాక్షి, వీరఘట్టం: ఇప్పటికే అత్యంత సమస్యాత్మక పరీక్షా కేంద్రంగా గుర్తింపు పొందిన వీరఘట్టం పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు.శనివారం ఈ విషయాన్ని గుర్తించిన ఇక్కడ పరీక్షల చీఫ్ అధికారి బి.సొంబర జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ పి.ఇందిరామణి, ఏఎస్ఐ రమణబాబులు వచ్చి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి శుక్రవారం జరిగిన సోషల్ పేపర్–1కు సీసీ కెమెరాలు ఉన్నాయని, శనివారం ఉదయం పరీక్ష గదులు తెలిచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా నాలుగు గదుల్లో సీసీ కెమెరాలు కనబడలేదని వాటిని అమర్చిన వైర్లు కట్ చేసి ఉన్నాయని చీఫ్ అధికారి బి.సొంబర తెలిపారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల్లో వీరఘట్టం బాలురు, బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షాలు కేంద్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు బాలికోన్నత పాఠశాల పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలు దొంగిలించడంపై జిల్లా విద్యాశాఖ మండిపడుతోంది. ఇక నుంచి ఇక్కడ పరీక్షలను పకడబ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో భవిష్యత్లో ఈ కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేయవచ్చునని అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రుల ఆందోళన వీరఘట్టం పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ఆకతాయి కుర్రాళ్లే ఎక్కువ మంది పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నారని, వారిలో ఎవరో చేసిన పనేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమ విద్యార్థులు బలైపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. -
ఆంధ్రాబ్యాంక్లో చోరీకి యత్నం
సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:05 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి టీషర్టు, ప్యాంటు ధరించి ముఖం కనబడకుండా వస్త్రం కట్టుకుని బ్యాంకు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గడ్డపారతో తాళాన్ని పగులగొట్టి షెటర్ను పైకి లేపి లోనికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అగంతకుడు నేరుగా డబ్బు భద్రపర్చి ఉన్న లాకర్ల వద్దకు వెళ్లి పగులగొట్టేందుకు యత్నించాడు. గడ్డపారతో లాకర్ను తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఏటీఎం గది వద్దకు వచ్చాడు. ఏటీఎం గదిని ధ్వంసం చేసి లోనికి వెళ్లడానికి యత్నించే క్రమంలో సైరన్ మోగింది. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ ముంబై నుంచి వన్టౌన్ ఎస్హెచ్వో రాములు, ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ ప్రసాద్కు ఏకకాలంలో వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎస్హెచ్వో సిబ్బందితో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆ లోపే అగంతకుడు పరారయ్యాడు. ఫింగర్ ప్రింట్స్ సేకరణ.. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ అలర్ట్ చేయడంతో ఎస్హెచ్వోతో పాటు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఏకకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోనికి వెళ్లి ఏం జరిగిందో పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు లాకర్లను తెరవడానికి గడ్డపారతో చేసిన తవ్వకాలు, ధ్వంసం చేసిన పరికరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఫింగర్ ప్రింట్స్ను సేకరించారు. తెల్లవారుజామున జాగిలాన్ని రప్పించి వ్యక్తి ఆచూకీ కోసం యత్నించారు. జాగిలం బ్యాంకు పక్కనే ఓ వీధి వరకు వెళ్లి వెనక్కివచ్చింది. అగంతకుడు ఆ వీధిలోంచి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన.. చోరీ జరిగిన తర్వాత పోలీసులు నేరుగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకుడు ఎక్కడి నుంచి బ్యాంకులోకి ప్రవేశించాడు, డబ్బుకోసం యత్నించిన తీరును ఎస్హెచ్వోతో పాటు ఏసీపీ బాలుజాదవ్ సీసీ కెమెరాల్లో చూశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. లావుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కడే బ్యాంకులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాని బయట ఇంకెవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ సాహసానికి ఒడిగట్టాడా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో.. బ్యాంకుల వద్ద గతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహించేవాడు. కాని కొన్నాళ్ల క్రితం నుంచి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును తొలగించారు. దీంతో అగంతకుడు రాత్రిపూట చోరీకి యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలో రాత్రిపూట పోలీసు గస్తీ ఉన్నా అగంతకుడు బ్యాంకు చోరీకి యత్నించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశాడు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్ పెడతాం.. బ్యాంకుల వద్ద భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు ఉంటే అగంతకుడు చోరీకి యత్నించేవాడు కాదన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సెక్యూరిటీ గార్డును నియమించేలా చూస్తామన్నారు. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట బ్యాంకును విధిగా తనిఖీ చేయడానికి పాయింట్ బుక్ పెడతామని వెల్లడించారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. -
సీసీ కెమెరాకు చిక్కిన చిరుత
కడ్తాల్(కల్వకుర్తి): కొన్ని రోజులుగా రైతులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుతపులి మళ్లీ సీసీ కెమెరాకు చిక్కింది. కొన్నిరోజులుగా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల్లోని గానుగుమార్ల తండా, గోవిందాయిపల్లి, ముద్విన్, తాటిపర్తి, కుర్మిద్ద, కొత్తపల్లి, చరికొండ రిజర్వ్ ఫారెస్ట్ జోన్లో చిరుత సంచరిస్తూ పొలాల్లో కట్టేసిన లేగదూడలు, పశువులపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం తెల్లవారుజామున కడ్తాల్ మండలం గానుగుమార్ల తండాలో, చరికొండ గ్రామాల్లోని పశువుల పాకలపై దాడి చేసిన చిరుత రెండు చోట్ల లేగ దూడలను చంపేసింది. ఈ ఘటనపై రైతులు కందుకూరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వివరాలు సేకరించారు. చిరుత అడుగుజాడలను గుర్తించిన అధికారులు గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఆరుచోట్ల బోనులతోపాటు సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సెన్సార్ కెమెరాలను పరిశీలించిన అధికారులకు చరికొండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు చిక్కాయి. శనివారం తెల్లవారుజామున దూడపై దాడిచేసిన దృశ్యాలు, దూడ కళేబరాన్ని గుట్టల్లోకి లాక్కెళ్లి తింటున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆయా ప్రదేశాల్లో బోనులు ఏర్పాటు చేసినా వాటిలోకి వెళ్లకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో సంచరిస్తున్న చిరుత ఒక్కటేనా..లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయేమోనని అధికారులు, రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఆందోళన వద్దు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. చిరుతను బంధించేందుకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి నిపుణులను రప్పించాం. గోవిందాయిపల్లి, చరికొండ, కొత్తపల్లి తదితర గ్రామాల సమీపంలో 6 చోట్ల బోనులు ఏర్పాటు చేశాం. రెండు, మూడ్రోజుల్లో ప్రత్యేకంగా జూపార్కు నుంచి మరో రెండు పెద్దబోనులను తెప్పిస్తాం. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. – సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజర్, కందుకూరు -
పక్కాగా ఈవీఎం ర్యాండమైజేషన్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఈవీఎంల ర్యాండమైజేషన్ల ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నోడల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 15 నుంచి 18వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్కు సంబంధించిన ఏర్పాట్లను 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 17వ తేదీన మొదటి విడత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఉంటుందన్నారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయాలి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుం దని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో, మూడు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేసే ఒక రోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతా ను తెరవాలన్నారు. పోలింగ్ సిబ్బంది 16న శిక్షణ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఈనెల 16న శిక్షణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం సిబ్బం దికి పీలేరులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో, మదనపల్లె వారికి బీటీ కళాశాల, పుంగనూరు వారికి గోకుల్ థియేటర్, చంద్రగిరి వారికి తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా ఆడిటోరియం, తిరుపతి వారికి శ్రీనివాస ఆడిటోరియం (ఎస్వీయూ)లో, శ్రీకాళహస్తి వారికి స్కిట్ కళాశాల, సత్యవేడు వారికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నగరి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీడీనెల్లూరు వారికి జిల్లాపరిషత్ హైస్కూల్, చిత్తూరు వారికి నాగయ్య కళాక్షేత్రం, పూతలపట్టు వారికి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, పలమనేరు వారికి పీఆర్ కన్వెక్షన్ హాలు, కుప్పం వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుం దని తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలోని ఈఆర్వో కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వో కార్యాలయాల్లో, 26 సరిహద్దు చెక్పోస్టులు, కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్, సీ విజిల్ యాప్ ఫిర్యాదుల పరిష్కార విభాగం, మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న బుధవారం ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారాలను పరి శీలించేందుకు జెడ్పీ సిబ్బంది 20 మందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గంగాధరగౌడ్, నోడల్ అధికారులు లక్ష్మి, శ్రీనివాస్, పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. -
అతివకు అండ..
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, సీసీకెమెరాలు వంటివాటితో మంచి ఫలితాలతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పోలీసు శాఖ అతివకు అండగా మరో కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమరవాణా వంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ‘వుమెన్ సేఫ్టీ వింగ్’ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్లోని ఈ విభాగం కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత, డీజీపీ మహేందర్రెడ్డి పాల్గొంటారు. షీటీమ్స్ పోలీసులు, భరోసా కేంద్రాలు (మహిళలు, చిన్నారులకు న్యాయ, వైద్య సాయం అందించే కేంద్రాలు) ఈ విభాగం కింద ఉంటాయి. ఈ కార్యాలయంలో పనిచేసే వారిలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్పీ, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యాలయంలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్) సాయంతో ప్రతీ స్టేషన్ డేటాను అనుసంధానిస్తారు. ఫలితంగా వివిధ కేసుల స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. కేసుల పురోగతి, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతోపాటు ప్రతీనెలా కేసులపై సమీక్ష నిర్వహిస్తారు. తద్వారా కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపడం, చార్జిషీట్ దాఖలు చేయడం సాధ్యమవుతాయి. ఫలితంగా బాధితులకు సత్వర సాయం అందే వీలుంటుంది. నేడు మహిళా ఉద్యోగులకు సెలవు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 8) రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. -
అమ్మ చావలేదు..చంపాడు..!
సాక్షి, రాజంపేట: పెనగలూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఊటుకూరు సిద్ధమ్మ (85)ను హత్య చేసిన కేసులో తనయుడు ఊటుకూరు రామచంద్రారెడ్డి, మనవడు గిరిధర్రెడ్డిలను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ మురళీధర్ తెలిపారు. బుధవారం రాత్రి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నరసింహులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దమ్మను ఆమె చివరి కొడుకు రామచంద్రారెడ్డి హత్య చేసి, తన కొడుకు గిరిధర్రెడ్డి సహాయంతో కువైట్కు వెళ్లిపోయేందుకు ఇన్నోవా వాహనంలో బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారిని విమానంలో ప్రయాణం చేయకుండా నిలుపుదల చేశారు. దీంతో వారిని అక్కడ అరెస్టు చేశారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. సిద్ధమ్మ వయోభారంతో పాటు అనారోగ్యంతో మంచంపైనే జీవనం సాగిస్తోంది. గత మూడు నెలలుగా రామచంద్రారెడ్డితోపాటు అన్నదమ్ములు అందరు ఒక్కొక్కరు ఒక నెల చొప్పున తల్లిని చూసుకునే విధంగా అంగీకారం చేసుకున్నారు. రామచంద్రారెడ్డి వద్ద సిద్ధమ్మ ఉండే సమయంలో ఆమెను ఎంత బాగా చూసుకున్నప్పటికి కొడుకు, కోడలు సరిగా చూసుకోలేదని కనిపించిన వారికి చెబుతూ వచ్చేది. దీంతో తల్లిపై తనయుడు కోపం పెంచుకున్నాడు. ఈనెల 4న రాత్రి సుమారు 12.50 గంటల ప్రాంతంలో సిద్ధమ్మ ముఖంపై గుడ్డతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి గొంతు నులిమి చంపేశాడు. తల్లి చనిపోయిన తర్వాత తన తల్లిది సహజ మరణం అని అన్నదమ్ములందరిని నమ్మించాడు. అందరితో కలిసి ఆమె కర్మకాండలను జరిపించాడు. నేర స్థలానికి ఎదురుగా ఉన్న యశోదమ్మ ఇంట్లో గల సీసీ కెమెరా పుటేజీలను చూస్తే, తన నేరం బయటపడుతుందని రామచంద్రారెడ్డి భయపడి బెంగళూరు ఎయిర్పోర్టు ద్వారా కువైట్కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్పోర్టు సెక్యూరిటీ కంట్రోల్కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. సమావేశంలో పెనగలూరు ఎస్ఐ వెంకటరమణ , సిబ్బంది పాల్గొన్నారు. ఆ అమ్మకు రోజూ చిత్రహింసలే పెనగలూరు : కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన మాతృమూర్తి సిద్దమ్మ బతికి ఉన్నన్ని రోజులు కొడుకులు, కోడళ్ల చేతిలో చిత్రహింసలకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం కాగా ఒక్కో కుమారుడు ఒక్కో నెల చూసుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే కొంతమంది కోడళ్ల వంతు వచ్చినప్పుడు వారుపెట్టే చిత్రహింసలు చూసి చుట్టు పక్కల వాళ్లు చలించిపోయేవారని తెలిసింది. ఒక కోడలు ఏకంగా కట్టె తీసుకుని ఆమెను కొట్టిన విషయం సీసీ పుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కసారి వృద్ధురాలు ఏడుస్తున్నా కొట్టిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిందితుడు రామచంద్రారెడ్డి -
మరో కన్ను చూస్తోంది..
విజయనగరం, సాలూరు: నేరస్తుల గుట్టురట్టు చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఒకప్పుడు ధనికులు జీవించే ప్రాంతాలు, గృహాల్లో మాత్రమే పరిమితంగా కనిపించేవి. అయితే ఇటీవల కాలంల నేరాలు ఎక్కువ కావడంతో నేడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే సాలూరు మున్సిపాలిటీలో దాదాపు మూడేళ్ల కిందటే నేరాల అదుపునకు పట్టణ పోలీసులు సీసీ కెమెరాలను పలుచోట్ల ఏర్పాటు చేశారు. మొదట తహసీల్దార్ కార్యాలయం జంక్షన్లో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల 26వ నంబరు జాతీయ రహదారిపై ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపైనే కాకుండా పట్టణంలో తిరిగే వాహనాలు, పాదచారులపై కూడా నిఘా పెట్టారు. పట్టణంలో నిలిపివేసిన లారీని కొంతమంది దొంగిలించి ఛత్తీస్గఢ్కు తరలించిన కేసును సీసీ కెమెరాల సహాయంతోనే పోలీసులు అతి తక్కువ కాలంలోనే ఛేదించారు. దీంతో పోలీసులు మరో అడుగు ముందుకేసి మరిన్ని సీసీ కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీలక్స్ సెంటర్, వేంకటేశ్వరకాలనీ, తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిన్నింటినీ సర్కిల్ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో అక్కడ నుంచే పోలీసులు ఆయా ప్రాంతాలను కంప్యూటర్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇటీవల సెల్ షాపులో జరిగిన చోరీ కేసులో కూడా సీసీ పుటేజీలు కీలకంగా మారాయి. మరో 68 సీసీ కెమేరాలు.. ప్రభుత్వం జాతీయ రహదారిపైనే కాకుండా ఇతర ప్రధాన రహదారులపై కూడా ప్రత్యేకంగా 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మేక్స్వెల్ సంస్థ సహకారంతో ఇక్కడ రికార్డయిన దృశ్యాలను నేరుగా అమరావతిలో మానటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వీటిసాయంతో రోడ్డు ప్రమాదాలకు బాధ్యులైన వారితో పాటు అక్రమ రవాణాలను కట్టడి చేయగలుగుతున్నారు. దర్యాప్తు వేగవంతం.. సీసీ కెమెరాల సహాయంతో చోరులు, ప్రమాదాలు చేసిన వారిని తొందరగా గుర్తించే వీలుంటుంది. సీసీ పుటేజీ కారణంగా దర్యాప్తు వేగవంతం అవుతుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్లు, దోడీలకు పాల్పడేవారు సులువుగా దొరికిపోయే అవకాశం ఉంది. – ఇలియాజ్ మహమ్మద్, సీఐ, సాలూరు -
సీసీ కెమెరాకు చిక్కిన చిరుత
కడ్తాల్ (కల్వకుర్తి), యాచారం (ఇబ్రహీంపట్నం): ఏడాది కాలంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని 4 మండలాల ప్రజలు, అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి గురువారం రాత్రి కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత లేగదూడను తింటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. యాచారం, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలో చిరుత రాత్రి పూట పశువులు, గొర్రెలు, మేకలపై దాడి చేసి చంపేసింది. అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసినా చిక్కలేదు. అయితే, ఇన్నాళ్లు పశువులపై దాడులు చేస్తున్నది చిరుతనా లేక హైనా జంతువా అనేది తెలియలేదు. పాదముద్రలను బట్టి చిరుత పులేనని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి కడ్తాల్ మండల పరిధిలోని గోవిందాయిపల్లిలో లేగదూడలపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు బిగించారు. గురువారం రాత్రి మరోమారు లేగదూడపై దాడి చేసి మాంసం తింటున్న చిరుత సీసీ కెమెరాల్లో కనిపించింది. సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుతపులిని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నది చిరుత పులేనని నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణ తన బృందంతో కలసి కడ్తాల్, యాచారం మండలాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. చిరుత నిత్యం 25 కిలోమీటర్లు సంచరిస్తూ వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడులు చేసి చంపుతోందని గుర్తించారు. గురువారం రాత్రి సీసీ కెమెరాలో కనిపించిన చిరుత 8 ఏళ్ల వయసుఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిరుతపులి ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఆయా మండలాల అటవీ ప్రాంతంలో 3 బోన్లు, 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని రేంజ్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. చిరుతపులి ఉన్నట్టు తేలడంతో ఆయా మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఇంటింటికీ సీసీ కెమెరాలు అవసరం
మన్సూరాబాద్: నల్లా మాదిరిగానే ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాలను నియంత్రించవచ్చునని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఎల్బీనగర్ చంద్రపురికాలనీలో రూ. 8.5 లక్షల వ్యయంతో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న 82 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాలు, మురికివాడల్లో స్వచ్ఛందసంస్థలు, కార్పొరేటర్ సంస్థల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు ప్రధాన రాహదారిపై ఇన్ఫోసిస్ సహకరంతో 182 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని వల్ల నేరాలు తగ్గుతాయని, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8వేల సీసీ కెమెరాలుండగా నేడు వాటి సంఖ్య 65వేలకు చేరుకుందని తెలిపారు. చంద్రపురికాలనీలో అక్రమపార్కింగ్ల సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డులోని బస్టెర్మినల్ను వనస్థలిపురంలోని హరణి వనస్థలి జాతీయ పార్కు సమీపంలోకి మార్చేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామన్నారు., దీంతో ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్రయాదగిరి, ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్రావు, ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నాయకులు కొప్పుల నర్సింహారెడ్డి, జక్కిడి మల్లారెడ్డి, రఘువీర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 27 (బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 16 వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 9,42,719 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,277 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. వీటిలో 1,277 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,277 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 24,508 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. 1,277 పరీక్ష కేంద్రాల్లో 40 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 32 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బోర్డు నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ అక్కడే ఉంటాయి. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాల బండిల్స్ విప్పే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంచనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నిమిషం నిబంధన అమలుచేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని పేర్కొన్నారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. అందులో పరీక్ష కేంద్రం ఫొటోతో పాటు గూగుల్ రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు. వెబ్సైట్లో హాల్టికెట్లు..: హాల్టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే కాలేజీలకు పంపించింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వడంలేదన్న ఫిర్యాదుల నేఫథ్యంలో వెబ్సైట్లోనూ హాల్టికెట్లను ఉంచింది. bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు వెళ్లవచ్చని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని అశోక్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేసే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - హాల్టికెట్ లేకుండా పరీక్షకు అనుమతించరు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే మాత్రం సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ విద్యా అధికారిని సంప్రదించాలి. - జవాబు పత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. బార్కోడ్, సబ్జెక్టు వివరాలను కూడా సరిచూసుకోవాలి. - మొబైల్స్, పేజర్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లు పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఒకవేళ వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు. - కాపీయింగ్, మాల్ప్రాక్టీస్, ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు. - పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే హైదరాబాద్లోని హెల్ప్లైన్ కేంద్రానికి (040–24601010, 040–24732369) ఫోన్ చేయవచ్చు.