పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించడానికి వారంలోగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ) సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఢిల్లీలో యూపీ సింగ్తో భేటీ అయ్యారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి నాలుగు అంశాలపై ఆర్ఈసీ వ్యక్తంచేసిన సందేహాలను నివృత్తి చేస్తూ సమగ్ర నివేదికను దాస్ అందజేశారు.