పచ్చ కుట్ర | TDP Eyes on 'Hailand' | Sakshi
Sakshi News home page

పచ్చ కుట్ర

Published Mon, Nov 19 2018 11:49 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విలువైన ఆస్తిని కొల్లగొట్టడానికి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్‌ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement