పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు.