అధికారుల స్థాయిలో అవినీతి 50 శాతం తగ్గితే, మిగిలిన యాభైశాతం తగ్గించడానికి అన్ని రంగాలకు చెందిన అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ఫ్రీ నంబర్పై ప్రచార వీడియోలను విడుదల చేశారు. సీఎం జగన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని తెలిపారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులకు ఆయన సూచించారు.