ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్ జగన్ రావి మొక్కను నాటారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.