ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. తన వాయిస్ని డబ్బింగ్ చేసి తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏబీఎన్ ఛానల్లో కథనాలు వండివార్చారని ఆరోపించారు.